Sunday, October 31, 2010

విటమిన్‌‘బి’తో నిరాశ దరిచేరదు

vitamin-b12-deficiency
గుండెనొప్పికి గురైన వారు క్రమం తప్పకుండా విటమిన్‌ ‘బి’ టాబ్లెట్స్‌ వాడితే నిరాశ(డిప్రెషన్‌) ఛాయలు వారి దరిచేరే అవకాశం చాలా తక్కువుగా ఉంటుంది. అంతేకాకుండా మళ్లీ గుండెనొప్పి వచ్చే అవకాశాలు తక్కువుగా ఉన్నట్లు ఒక నూతన అధ్య యనంలో కనుగొ న్నారు. యూనివర్శిటీ ఆఫ్‌ వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా నేతృ త్వంలోని అంతర్జా తీయ పరిశోధకుల జట్టు ఈ విషయాన్ని స్పష్టంగా రుజువు చేయగలి గారు. డిప్రెషన్‌ నుంచి నిశ్చి తమైన కొన్ని విటమిన్లు మాత్రమే సంరక్షిస్తా యని గతంలో చేసిన పరి శోధనలు స్పష్టం చేస్తున్నాయి. గుండెపోటు నుంచి బయటపడి, ప్రతిరోజూ ఫోలిక్‌ యాసిడ్‌, విటమిన్‌ బి6, విటమి న్‌ బి12 టాబ్లెట్లను తీసుకునే వారిలో సగం మందికి డిప్రెషన్‌కు గుర య్యే అవకాశము లేకపోలేదు. ‘గుండెపోటు వచ్చిన వారు డిప్రెషన్‌కు లోనవటం సర్వ సాధారణం.ముగ్గురిలో ఒకరు దీని బారిన పడ తారు.


VITAMIN-B-COMPLEX-EU
మళ్లీ గుండెపోటు రాకుండా, డిప్రెషన్‌ దరిచేరకుండా ఉండేం దుకు ఈ పరిశోధన ఫలితాలు ఉపయోగపడతాయని’ పరిశోధకుల బృందానికి నాయకత్వం వహిస్తున్న ప్రొఫెసర్‌ ఆస్వాల్డ్‌ అల్‌మిదా పేర్కొన్నారు. ఎక్కువ మోతాదులో విటమిన్‌ ‘బి’ తీసుకునే గుండె రక్తనాళాల వ్యాధిగ్రస్తులు జాగ్రత్తగా ఉండాలని ఆయన హెచ్చరిం చారు. ఎందుకంటే అధిక గాఢత గల అమినో యాసిడ్లు వల్ల డిప్రె షన్‌ పెరిగే అవకాశముంది. ఒక్కొక్కసారి విటమిన్‌ ‘బి’ ఎక్కువుగా తీసుకుంటే గుండె రక్తనాళాల సం బంధిత సమస్యలు వచ్చే అవకాశము ఉంది. ఈ విటమిన్‌ టాబ్లెట్లు వాడే ముందు వైద్యుల సలహా తీసుకోవాలని సూచించారు. క్రమం తప్పకుండా ఆరేళ్ల పాటు విటమిన్‌ టాబ్లెట్లు వాడితే రక్తనాళమయ వ్యవస్థలో క్రమేపి మార్పులు సంభవించే అవకాశాలున్నాయి.

Friday, October 29, 2010

యోగాతో నిగనిగ

యోగా గురించి కొత్తగా చెప్పేదేముంది..? ఆ కాలంలో ఎంత ప్రాధాన్యం ఇచ్చేవారో కానీ ఇటీవలి కాలంలో మాత్రం అందరూ యోగా వెంట పడుతున్నారు. ఆధునిక జీవనశైలిలో ఎదురవుతున్న ఒత్తిళ్లను అధిగమించేందుకు యోగాకంటే పెద్ద ఔషధం లేదని విశ్వసించే వాళ్ల సంఖ్య రాను రాను పెరిగిపోతోంది.

ఇదే అభిప్రాయాన్ని మరింత శాస్త్రీయంగా రుజువుచేశారు ఉత్తరాఖండ్‌లోని ఐ.ఐ.టి. రూర్కీ పరిశోధకులు. యోగా చేస్తున్న వాళ్ల, యోగా చేయని వాళ్ల ఆరోగ్యాన్ని పరిశీలించారు. రెండు బృందాలలోని సభ్యుల గుండె పనితీరును అధ్యయనం చేశారు. పరిశోధనలో పాల్గొన్న వారందరికీ ఎలక్ట్రోకార్డియోగ్రామ్స్ (ఈసీజీ) తీశారు.

దాన్నించి తెలిసిందేమిటంటే- క్రమం తప్పకుండా యోగా చేస్తున్న వారి హృదయ ప్రకంపనలు చాలా ఆరోగ్యంగా ఉన్నాయి. శరీరంలోని రక్తనాళాలు చురుగ్గా పనిచేస్తున్నాయి. గుండె కవాటాలలో కొవ్వు చేరలేదు. యోగా చేయని వారి గుండె...? దాని పనితీరు అసంబద్ధంగా ఉందని తేల్చారు. 'ఆధునిక ఉద్యోగాల పనివేళలు కఠినంగా ఉండటంతో జీవనశైలి మారిపోయింది.

సమయంతో పోటీపడి పనిచేయక తప్పడంలేదు. దీంతో ఒత్తిడి పెరిగి గుండె ఆయుష్షు సన్నగిల్లుతోంది. అందుకే ప్రతి ఒక్కరు యోగాను జీవితంలో భాగంగా చేసుకోవాలిత' అని ఈ పరిశోధన చేసిన ఐ.ఐ.టి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన పరిశోధకులు రమేష్ కుమార్, వినోద్ కుమార్ చెప్పారు.

Monday, October 25, 2010

EATING FOR LIFE X EATING IS NOT LIFE


(Consult Doctor before going for this diet and get some lab test done
to make sure that you are right candidate for this program)




Breakfast:
(To be taken once you are hungry, but not in a casual way)

    1. Raw fruits: Mosambi, Orange (Any other cirtrus fruits) & papaya as much as you feel like. Apple, pineapple, pomegranate: one or limited.

    2. White egg only : Boiled/Bull’s eye/Omelette with vegetables- 2/3 as you feel like.

    3. Coffee/Tea: Black or with zero fat milk without sugar, “Equal” or other Sugar Free may be added- a big mug or in two medium portions (7:00 am & 9:00 am).

    4. If you wish you can have plain yogurt made of zero fat milk no addition of salt and sugar.
    10:00 AM - 11:00 AM



      1. ½ litre of Buttermilk made out of zero fat milk without sugar.
    Lunch:

    1. Plenty of vegetables (Unlimited): Raw/Half boiled/Cooked/Sambar (Have only vegetables out of that)/ Soaked in     buttermilk
    2. Green leaves
    3. White eggs
    4. Chicken/Fish (Grilled/Tandoori/Dry without much coatings with flour, avoid curry)


    3:00 – 6:00 PM:


    1.  ½ litre of Buttermilk made out of Zero fat milk without sugar.

    2. Coffee/Tea: Black or with zero fat milk without sugar, “Equal” may be added- a big mug or in two medium portions     (Not after     6:00 PM)




    Dinner: (Should be taken atleast 2 hrs before you go to sleep)

    1. Plenty of Vegetables (Umlimited):Raw/Half boiled/Cooked/Sambar (Have only    vegetables out of that)/ Soaked in     buttermilk

    2. Green leaves

    3. White eggs

    4. Chicken/Fish



    10:00 PM:


    1. Fruits (Citrus+Papaya)

    Things to Avoid

    1. Rice, Wheat and other cereals except tender maize

    2. Pulses: All dals except Redgram Tender

    3. Sugar, Jaggery, Honey

    4. Potato & other tubers (including carrot)

    5. Drinks : Coke & other aerated beverages (alcohol)

    6. Nuts: Cashew, Almonds,Groundnut, coconut

    7. Animal fats: Buffalo milk, Red meat, Prawns

    8. Fruits: Banana, Mango, Custard apple, Sapota, JackFruit, Grapes



    Tips to Follow:


    • Don’t eat until you are hungry, expecially breakfast.

    • Never drink fruits always eat fruits.

    • Drink plenty of water but not juices and aerated drinks

    • Use Fork & Knife never use hands.

    • Chew the food well atleast more than 10 times, never gulp in.

    • Complete the dinner atleast couple of hours before going to bed and try to pass urine before dinner and also drink enough water   to make sure you should be able to pass clear urine of good quantity before you go to bed.

    • Eat fibre containing food first. Protein containing food next, Drink plenty of water & give a short break. Finally if you are still feeling hungry then eat carbohydrates as less as possible, that too fried carbohydrates like Dosa/Poori. Take Complex Carbohydrates available in Fruits & Vegetables but not pure carbohydrates like Rice, Idly, Pongal.

    • If given a choice don’t go for boiled carbohydrates, go for fried  complex carbohydrates.

    • Always try to note the food i.e log book, whatever you consume either liquids, solids, snacks, sweets whatever, by going through this either you can find where you have committed a fault or else we can help in figuring out where you are going wrong without your knowledge.

    • Whenever you are going to have some thing (Liquids/Solids) see that the following four criteria should be fulfilled.

      1. High fibre

      2. High Protein

      3. Zero Carbohydrate

      4. Plenty of water.

    Things to Observe

    • Daily bowel movement once without much constipation systems.

    • One need to drink sufficient water to have urine 4-5 times & it should be white and clear.

    • Initial few weeks one may come across headache, irritability & weakness. But all these will vanish if you follow strictly.

    • In case of any fever or throat infection or antibiotics ingestion one should switch over to the normal routine diet with good amount of Carbohydrates and once you are out of problem try to restart/revert back to this diet. This diet is for ever not for few months or so, start with this only when you like this or when you are really convinced and committed to this program. If you follow irregularly you may gain more weight, please don’t do that.


    Orientation for the Gym / Exercise:


    • Just go for Walking, Jogging, Swimming with Aerobics for 45 mins to 2 hours. Don’t go for weight lifting or muscle pumping exercises.


    • At the most weights might require toning up the Triceps in the hands, Buttocks & Back of the thighs only.

    Sunday, October 24, 2010

    తల్లిపాలు తాగిన వారిలో రోగనిరోధక శక్తి అధికం

    తల్లిపాలే శ్రేయస్కరం
    శిశువుకు తల్లిపాలను మించిన ఆహారం లేదు. ప్రోటీన్లు, విటమిన్లతో కూడిన తల్లిపాలను తాగించినప్పుడే బిడ్డ ఆరోగ్యంగా పెరగగలుగుతుంది. కానీ కొందరు తల్లులు బ్రెస్ట్‌ ఫీడింగ్‌పై ఉన్న కొన్ని అపోహలతో పిల్లలకు పాలివ్వరు. దీంతో అటు శిశువు, ఇటు తల్లి కూడా అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని శిశువు పుట్టిన కొంతసేపటి నుంచే తల్లి పాలివ్వడం అన్ని విధాలా శ్రేయస్కరం.

    BreastFeedingనవమాసాలు మోసే తల్లి తన రక్తమాంసాలను పంచి ఇచ్చి శిశువుకు జన్మనిస్తుంది. తొమ్మిది నెల ల పాటు తల్లి గర్భంలో పెరుగుతూ వచ్చే బిడ్డకు ఆహారం అంతా తల్లి నుంచే వస్తుంది. అనంతరం శిశువుకు జన్మనిచ్చిన తల్లికి వెంటనే పాలు రావ డం ప్రారంభమవుతాయి. సృష్టి కార్యంలో ఈ ప్రక్రియ ఓ భాగంగా కొనసాగుతూ వస్తోంది.

    తల్లి పాలే ఆరోగ్యం...
    శిశువుకు జన్మనిచ్చిన కొంతసేపటి నుంచే తల్లి తన బిడ్డకు పాలివ్వడం ప్రారంభించడం శ్రేయస్క రం.సాధారణ కాన్పు జరిగిన వారు ఒకటి, రెండు గంటల్లోపే సిజేరియన్‌ జరిగిన వారికి నొప్పి తగ్గిన 4,5 గంటల్లోపే బిడ్డకు పాలివ్వవచ్చు. దీంతో బిడ్డ ఆరోగ్యంగా, అవసరమైన బరువుతో పెరగగలుగు తుంది.దీంతో పిల్లలకు విరోచనాలు సక్రమంగా జరగడమే కాకుండా ఎటువంటి ఆరోగ్య సమస్య లు ఎదురుకావు. తల్లి పాలు పిల్లకు తొందరగా జీర్ణమవుతాయి. తల్లిపాలల్లో ప్రోటీన్లు, విటమిన్లు, కార్బోహైడ్రేట్లు, మినరల్స్‌, కాల్షియం, పొటాషి యం తదితరాలు అవసరమైన మేరకు ఉంటాయి. ఫలితంగా బిడ్డ ఆరోగ్యంగా పెరుగగలుగుతుంది.

    తల్లి పాలు తాగే శిశువుకు ఎటువంటి ఇన్‌ఫెక్షన్లు రావు. కొందరు తల్లులకు సరిగ్గా పాలురావు. అటు వంటి వారు వచ్చినంత మేరకు తల్లి పాలిచ్చిన అనంతరం తక్కువ పడితే బాటిల్‌తో పాలు పట్ట వచ్చు.ఇక తల్లి అస్సలు పాలివ్వకపోతే శిశువుకు మోకాళ్లు వంకరతిరగడం వంటి సమస్యలు ఎదు రుకావచ్చు. శిశువు తల్లిపాలు తీసుకోవడంతో వైర స్‌ ఇన్‌ఫెక్షన్స్‌, అలర్జీ రాకుండా ఉంటాయి. ఈ పాలల్లో ప్రొటెక్టివ్‌ యాంటీబాడీస్‌ ఉంటాయి. దీం తో శిశువులో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. బిడ్డ ఆకలితో ఏడ్చిన వెంటనే సులభంగా తల్లి తన పాలివ్వవచ్చు. అదే డబ్బా పాలివ్వడానికి సమయం పడుతుంది.బ్రెస్ట్‌ ఫీడింగ్‌ చేస్తుంటే స్ర్తీలకు వెంటనే ప్రెగ్నెన్నీ రాకుండా ఉంటుంది. పాలివ్వడం మూ లంగా తల్లిలో యూటెరస్‌ తిరిగి మామూలు సైజు కు చేరుకుంటుంది.

    మానసికంగా సిద్ధం చేయాలి...
    మొదటి కాన్పు జరిగే గర్భిణులకు బిడ్డకు పాలి చ్చే విషయంలో ముందుగానే మానసికంగా సిద్ధం చేయాలి.7,8 నెలల గర్భంతో ఉన్నప్పుడే వారికి పుట్టిన వెంటనే శిశువుకు పాలివ్వాలని చెప్పాలి. దీ నివల్ల ఉన్న అపోహలను తొలగించేందుకు ప్రయ త్నించాలి. బిడ్డకు పాలిచ్చే బ్రెస్ట్‌ నిపుల్‌ను కరెక్ట్‌గా ఉండేటట్టు చూసుకోవాలి. నిపుల్‌ వెనక్కి ఉంటే పు ట్టిన బిడ్డ పాలు తాగేందుకు ఇబ్బందులు ఎదుర వు తాయన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని సరి చేయాలి. పాలిచ్చేటప్పుడు నిపుల్‌ చుట్టూ శు భ్ర పర్చుకోవాలని తల్లులకు చెప్పాలి.

    ఆరు నెలల వరకు తప్పనిసరిగా...
    breastfeeding-info-1తల్లి శిశువుకు ఆరు నెలల వరకు తప్పనిసరిగా పాలివ్వాలి. శిశువు ఆరోగ్యంగా ఉండాలంటే తొమ్మిది నెలలవరకు పాలివ్వడం శ్రేయస్కరం. ఇక అయిదు నెలల నుంచి పాలతో పాటు పండ్లు, పిల్లలకు ఇచ్చే ఇతర పోషకాహారాన్ని అందజేయ డం మంచిది. ఇక బిడ్డకు ప్రతి రెండు, మూడు గం టలకొకసారి తప్పనిసరిగా తల్లి పాలివ్వాలి. ఒక వేళ శిశువు గాఢ నిద్రలోఉంటే నాలుగు గంటల కైనా పాలివ్వాలన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. తల్లి బిడ్డకు కనీసం అయిదు నిమిషాలైన పాలి వ్వాలి. పెరుగుతూ ఉండే శిశువుకైతే 10,15 నిమి షాల పాటు పాలిస్తే మంచిది. కడుపునిండా పాలు తాగగానే పిల్లలు వెంటనే పడుకుంటారు.

    తల్లి పాలిచ్చినా ఇంకా ఏడుస్తుంటే బిడ్డకు పాలు సరిపో లేదన్న విషయాన్ని గమనించి బాటిల్‌తో పాలు తాగించాలి. సిజేరియన్‌ ఆపరేషన్‌ జరిగిన మగు వలు ప్రారంభంలో పడుకొని పాలిచ్చిన నొప్పి తగ్గిన తర్వాత కూర్చొని పాలివ్వాలి. కూర్చొని పిల్లలకు పాలిస్తేనే మంచి దన్న విష యాన్ని గమనించాలి. దీంతో శిశువు కడుపునిండా పాలు తాగగ ల్గుతాడు. పాలు తాగిన తర్వాత బిడ్డను భుజంపై వేసుకొని కొద్ది గా జో కొడితే పాలతో పాటు వెళ్లే గాలి మూలంగా వాంతులు రాకుండా ఉంటాయి. ఈ విధంగా చేస్తే శిశువుకు పాలు వెంటనే జీర్ణం అవుతాయి.

    వయస్సు పెరిగిన కొద్ది సమస్యలు...
    వయస్సు పెరిగిన తర్వాత డెలివరీ అయ్యే స్ర్తీలల్లో పాలు రావడం తగ్గుతుంది. ముఖ్యంగా 35 సంవత్సరాల తర్వాత కాన్పు జరిగే వారిలో ఈ సమస్య ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ముందుగా గర్భం ధరించడం శ్రేయస్కరం. పిల్ల లకు పాలివ్వడంలో ఎటువంటి టెన్షన్‌ పడకూ డదు. ప్రశాంతంగా పాలిస్తేనే తల్లి బిడ్డకు సక్రమం గా పాలివ్వగల్గుతుంది. కొందరు స్ర్తీలలో కొన్ని రకా ల ఆరోగ్య సమస్యలతో సరిగ్గా పాలు రావు. బిపి, గుండె సమస్యలు, మధుమేహం వంటి ఆరోగ్య సమస్యలు ఉన్న మహిళల్లో ఈ సమస్య ఉంటుం ది.

    పాలు సక్రమంగా రాని బాలింతలకు కాల్షి యం, ఇతర మందులను అందజేస్తా రు. ఈ మహిళలు ఎక్కువ క్యాలరీల తో కూడిన ఆహారాన్ని తీసుకోవాలి. ప్రోటీన్లు, విటమిన్లతో కూడిన ఆహా రంతో పాటు పాలు, బ్రెడ్‌, రొట్టెలు తీసుకోవాలి. తల్లికి తగినంత నిద్ర ఉండాలి. నీళ్లు బాగా తాగాలి. ఇవన్నీ సక్రమంగా ఉన్నప్పుడు తల్లి బిడ్డకు తగినంత పాలివ్వగల్గుతుంది. తల్లి పాలు కడుపు నిండా తాగిన పిల్లలు అవసరమైన బరువు పెరుగుతారు. కొందరు తమ బిడ్డకు ఎక్కువగా పాలిస్తారు. ఇది మంచిదికాదు. దీంతో శిశువుకు వాంతులు రావడం జరుగుతుంది.

    ఆరోగ్య సమస్యలకు వెంటనే వైద్యం...
    బ్రెస్ట్‌లో ఇన్‌ఫెక్షన్‌, గడ్డలు ఉన్నప్పుడు తల్లి బిడ్డకు సరిగా పాలివ్వలేదు. ఇటువంటి సమస్యలు ఉన్నప్పుడే వెంటనే డాక్టర్‌తో చికిత్స చేయించు కో వాలి. బిడ్డకు జలుబు ఉన్నప్పుడు ముక్కు పట్టేసి పాలు తాగడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. జలుబు ఉన్న పిల్లలకు వెంటనే వైద్యం చేయించా లి. తల్లిలో ఏదైనా ఇన్‌ఫెక్షన్‌ ఉంటే పాల ద్వారా అది బిడ్డకు సోకవచ్చు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇన్‌ఫెక్షన్‌కు వెంటనే డాక్టర్‌ను సంప్రదించి వైద్య చికిత్సలు చేయించుకోవాలి.
    తీవ్రమైన గుండె వ్యాధుతో బాధపడుతున్న తల్లులు బిడ్డకు పాలివ్వలేరు. ఇక డెలివరీ సమయంలో షాక్‌ తో సైకోస్‌గా మారిన వారు సైతం తమ పిల్ల లకు సక్రమంగా పాలివ్వలేరు. ఇటు వంటి వారు వెంటనే వైద్యం చేయించు కోవడం శ్రేయస్కరం.తల్లిపాలు ఎంత ఆరోగ్యకరమో ప్రభుత్వం కూడా ఇప్పుడు ప్రచారం చేస్తున్నది. మహిళలు అపోహలు వీడి బిడ్డలకు పాలిస్తే వారు భవిష్యత్తులో ఆరోగ్యవంతంగా ఉండగలుగుతారు. తల్లిపాలు తాగిన వారిలో రోగనిరోధక శక్తి అధికంగా ఉంటుంది.


    -డా. పద్మావతి

    Padmavathi
    - గైనకాలలజిస్ట్‌

    వృద్ధాప్యంలో వేధించే ఆస్టియోపోరోసిన్‌

    వయసులో ఉన్నప్పుడు సరైన ఆరోగ్యకరమైన జీవన శైలిని కొనసాగించనప్పుడు దాని ప్రభావం వృద్ధాప్యంపై పడుతుంది. వయసుతో పాటు వచ్చే సమస్యలకు తోడుగా ఆస్టియోపొరోసిస్‌ వంటి వ్యాధులు చుట్టుముడుతుంటాయి. అక్టోబర్‌ 20వ తేదీని ప్రపంచ ఆస్టియోపొరోసిస్‌ దినంగా పాటిస్తున్నాం.అంతర్జాతీయ ఆస్టియోపొరోసిస్‌ ఫౌండేషన్‌ 1997 నుంచి దీనిని జరుపుతుండగా 1998-99 నుంచి ప్రపంచ ఆరోగ్య సంస్థ కో స్పాన్సరర్‌ అయింది.

    ఆస్టియోపొరోసిస్‌ వల్ల అయ్యే తుంటి దగ్గర ఫ్రాక్చ ర్లు ప్రస్తుతమున్న 1.66 మిలియన్‌ నుంచి 2050 నాటికి 6.26 మిలియన్లకు పెరుగుతాయని వివిధ అధ్యయనాలు వెల్లడిస్తున్నా యి. ఒక్క భారత దేశంలోనే సుమారు 60 మిలియన్ల మంది ఈ వ్యాధితో బారిన పడుతున్నారు. ఇందుకుతోడుగా ఒక లక్ష మంది వరకూ తుంటి ఫ్రాక్చర్లకు గురవుతున్నారు.

    osteoవృద్ధాప్యం, వ్యాధులతో ఒకదానిని మించి ఒకటి ముందుకు పరుగులు తీస్తుంటాయి. ఆస్టియోపొరోసిస్‌ కూడా అటువంటి వృద్ధాప్య సమస్యే. ఎముక సాంద్రత తరిగిపోవడంతో ఫ్రాక్చర్‌లు అతి తొందరగా అయ్యే అవకాశం ఉంటుంది. ఈ వ్యాధి మధ్య వయస్సు, వృద్ధాప్యంలో కనిపించినప్పటికీ మహిళల్లో ఇది ఎక్కువగా కనుపిస్తుంది. ముఖ్యంగా మెనోపాజ్‌ దాటిన మహిళలలో తుంటి, వెన్నుముక, మణికట్టు ఫ్రాక్చర్లు అయ్యే అవకాశాలు పెరుగుతాయి. తుంటికి ఫ్రాక్చర్‌ అయినప్పుడు ఆసుపత్రిలో చేరడం, మేజర్‌ సర్జరీ అవసరం అవుతాయి. కొన్ని సందర్భాలలో ఈ వ్యాధి కారణంగా వ్యక్తి వేరే ఆధారం లేకుండా తనంతట తాను నడిచే శక్తిని కోల్పోతాడు. ఇది సుదీర్ఘకాలం కొనసాగవచ్చు లేదా మరణానికి కూడా దారి తీయవచ్చు.

    వ్యాధి లక్షణాలు:
    1. చేతులు, కాళ్ళు నొప్పులు 2. తీవ్రమైన కీళ్ళ నొప్పి 3. బలహీనత 4. నిద్రలేమి 5. నొప్పి శాశ్వతంగా ఉండడం 6. ఎముకలలో సూదులు గుచ్చినట్టుగా నొప్పి 7. పళ్ళు ఊడిపోవడం. 8. జుట్టు ఊడిపోవడం 9. గోళ్ళు పెళుసుబారిపోవడం 10. ఒంటిమీద ఉండే వెంట్రుకలు రాలిపోవడం 11. కంటిరెప్పలు రాలిపోవడం 12. పళ్ళు విరగడం 13. గోళ్ళు విరగడం 14. జాయిం ట్లలో తీవ్రమైన నొప్పి 15. ఎముకలు నొప్పి 16. జాయింట్ల నొప్పి 17. ఎముకలు బలంగా లేని భావన 18. గూని 19.నడక కుంటిగా మారడం 20. తల తిరగడం 21. కళ్ళు బైర్లు కమ్మడం 22. ఎముకలు బలహీనం కావడం 23. ఎముకలు క్షీణించడం 24. ఎముకలు తేలిక కావడం 25. నోరు పొడారిపోవడం 26.ఎనీమియా 27. అలసట 28. చర్మం పొడిబారడం 29. ప్రధాన జాయింట్లన్నీ వదులుకావడం 30.కండరాలు చిక్కిపోవడం 31. వాత వ్యాధి లక్షణాలు కనుపించడం.

    ఆస్టియోపొరోసిస్‌ వచ్చినప్పుడు ఆహారం ద్వారా మందుల ద్వారా ఎంత కాల్షియం ఇచ్చినప్పటికీ ఎము క ధాతువుకు పీల్చుకునే లక్షణం ప్రభావితమైనందున ఒంటపట్టదు. దీనితో ఎముక ధాతువులో కాల్షియం తరగిపోతుంది. జీవక్రియ అస్తవ్యస్తం కావడంతో ఎముక ధాతువులోని కాల్షియం ఛిద్రమైపోయి అయాన్ల బదిలీ వ్యవస్థ మార్పుకు గురవుతుంది.శరీరంలో కాల్షియంను పీల్చుకునే స్తరాలు రెండు ఉంటాయి. ఒకటి జీర్ణమైన ఆహారం రక్తంలో కలిసినప్పుడు, రెండవది ఎము క ధాతువులకు రక్త ప్రవాహం నుంచి లభించేది. ఇది సరిగా జరిగేందుకు పీల్చుకున్న కాల్షియం జీర్ణ ప్రక్రియలో ఏడు స్తరాలనూ దాటాలి. ఈ ప్రక్రియలోనే మినరల్‌ కాల్షియం జీవ ఏకీకరణ కాల్షియం అయాన్లగా పరివర్తన చెందుతుంది. ఇలా పరివర్తన చెందిన కాల్షియం అయాన్లను ఎముక ధాతువులు పీల్చుకొని వాటిని పటిష్ఠం చేస్తాయి.

    చికిత్స:
    ఆస్టియోపొరోసిస్‌ను నియంత్రించేందుకు ఆయుర్వేదంలో అద్భుతమైన చికిత్సలు ఉన్నాయి. వాతం కారణంగా సంభవించే ఈ వ్యాధికి స్నేహన (తైలమర్దనం), స్వేదన, మృదు శోధన, గోరువెచ్చటి నూనెతో మర్దన, ఎనీమా థెరపీ వంటి చికిత్సలను ఉపయోగిస్తారు. ఈ చికిత్స రెండు భిన్న రకాలుగా పని చేస్తుంది. 1. కాల్షి యం పూర్తి స్థాయిలో శరీరానికి ఒంటపట్టేలా చేయడం 2.వాతాన్ని కొన్ని రకాలైన ఆయుర్వేద తైలాలను తాగిం చడం ద్వారా తగ్గించడం.

    ఆహారం:
    ఆయుర్వేద సూత్రాల ఆధారంగా సంపూర్ణాహారం తీసుకోవడం ఎంత ముఖ్యమో వేరే చెప్పనవసరం లేదు.ఎముక ధాతువు స్థాయిలో మైక్రో న్యూట్రియంట్లను అందించడంలో ఆయుర్వేద సామర్ధ్యం సర్వ విదితమే. మాంసాహారం తీసుకునే వారు ఎక్కువగా తీసుకోవలసినది బోన్‌ సూప్‌ కాగా శాకాహారులు ములక్కాడ ఆకు, పువ్వు, కాడలను, అరటి దూట ఎక్కువగా తీసుకోవాలి.

    ఆస్టియొపొరోసిస్‌ రావడానికి వాతమే ప్రధాన కారణమైనందున రోజువారీ ఆహారంలో వాతాన్ని తగ్గించే పదార్ధాలు తీసుకోవాలి. ఆస్టియోపొరోసిస్‌ను అదుపు లో ఉంచడంలో నెయ్యి, పాలు, పాల ఉత్పత్తులు, మాంసపు సూపులు బాగా పని చేస్తాయి. అలాగే తాజా పళ్ళు, కాయగూరలు కూడా ఆ వ్యాధిని నిరోధించడానికి దోహదం చేస్తాయి.


    Dr. P.N.V.R. Prasad
    Asst. Professor
    Govt. Ayurvedic College
    Vijayawada
    Ph: 9666649665/ 9390957168

    అధిక బరువు... నష్టాలు

    స్థూలకాయులు అధిక బరువుతో కలిగే సమస్యల నుంచే కాకుండా మూత్రపిండాల వంటి శరీరాంతర్గత అవయవాల సంబంధిత వ్యాధులతో కూడా బాధపడే అవకాశాలున్నాయి.స్థూలకాయులకు మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశాలు అధికంగా ఉన్నట్లు వెల్లడైంది.
    మూత్రపిండాల్లో రాళ్లు
    obesityముఖ్యంగా మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా కనుపిస్తుంటుంది. సాధారణంగా పురుషులతో పోలిస్తే మహిళల్లో ఈ సమస్య 50 శాతం తక్కువే అయినప్పటికీ స్థూలకాయం గల మహిళల్లో సమస్య ఎక్కువగా ఉంటుంది. కొవ్వు అధికంగా ఉండడం వల్ల శరీరం ఇన్సులిన్‌కు తగిన రీతిలో స్పందించలేదు. దీని కారణంగా మూత్రంలో మార్పులు సంభవించి, మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశాలున్నాయని బోస్టన్‌లో ఉన్న బ్రిస్టన్‌లోని బ్రిగ్‌హామ్‌ అండ్‌ ఉమెన్స్‌ హస్పిటల్‌కు చెందిన డాక్టర్‌ ఎరిక్‌ టేలర్‌ స్పష్టం చేశారు. ఈ అంశంలో మరింత లోతుగా అధ్యయనం చేయాల్సి ఉన్నట్లు ఆయన అన్నారు.

    శరీరంలో కొవ్వు ఎక్కువగా పేరుకుపోవడంతో ఆ కణాలు క్రమంగా కాలేయంలోకి చేరుకోవడం ప్రారంభిస్తాయి.ఇలా కాలే యంలో కొవ్వులు పేరుకు పోవడాన్ని స్టీటోసిస్‌ అంటారు. కాలేయంలో కొవ్వు కణాలు పేరుకుపోయి కలిగే ఇన్‌ఫ్లమేషన్‌ను నాష్‌ నాన్‌ ఆల్కహాల్‌ ఫాటీ లివర్‌ డిసీస్‌ అని ఎందుకంటున్నారంటే ఆల్కహాల్‌ తాగేవాళ్ల లివర్‌ దెబ్బతిన్నట్టే ఈ సిండ్రోమ్‌లోనూ లివర్‌ దెబ్బతింటుంది.అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ నాన్‌ ఆల్కహాలిక్‌ ఫాటిలివర్‌ డిసీజ్‌ కనిపిస్తుంటుంది.

    Ayushఅధిక బరువు వల్ల శరీరంలో ఇన్సులిన్‌ రెసిసెటన్స్‌ పెరుగుతుంది. దాంతో ఎక్కువ మొత్తాలలో ఇన్సులిన్‌ ఇంజక్షన్‌ ద్వారా తీసు కుంటున్నా ఫలితాలు అంతగా ఉండవు. ఇలా అధిక బరువువల్ల మధుమేహంతో బాధపడుతుంటారు. మధుమేహం వ్యాధికాదు కాని డైజెస్టివ్‌ డిజార్డర్‌. దీని ప్రభావం క్రమంగా శరీరంలోని మూత్రపిండాలు, కాలేయంతో పాటు నరాలు కూడా దెబ్బతినడం తో నొప్పి తెలియదు. అందుకే సైటెంట్‌ హార్ట్‌ ఎటాక్స్‌ వస్తుంటాయి. బరువు పెరగడం, గుండె పోటుకు మధ్య ప్రత్యక్ష సంబం ధమే ఉంది.బరువు పెరగడం వల్ల అధిక రక్తపోటు కలుగుతుంది. లిపిడ్స్‌ స్థాయి పెరుగుతుంది. కొలెస్ట్రాల్‌ లిపిడ్స్‌ స్థాయి పెరుగుతుంది. కొలెస్ట్రాల్‌ అయిన హెడిఎల్‌ కొలెస్ట్రాల్‌ తగ్గుతుంది. కాబట్టి వీటన్నింటి ప్రభావం బరువు పెరిగే కొద్దీ ఎక్కువవుతుంది.

    పరిశోధనలను బట్టి ఆడ,మగ, ఇద్దరిలో బిఎంఐ 23-25 కన్నా ఎక్కువ ఉంటే కరోనరి హార్ట్‌ డిసీజ్‌...అంటే గుండెకు రక్తాన్ని సరఫరా చేసే నాళాలు పూడుకుపోయి గుండె పోటు వచ్చే అవకాశాలు 50 శాతం ఉన్నాయి.40-65 సంవతత్సరాల మధ్య వ యస్సు వాళ్లలో బిఎంఐ (బాడీ మాస్‌ ఇండెక్స్‌) 25-29 మధ్య ఉంటే గుండె పోటు వచ్చే అవకాశాలు 72 శాతం ఉంటాయి. అధిక బరువున్న వాళ్లలో హార్ట్‌ ఫెయిల్యూర్‌ అయ్యే అవకాశాలు ఎక్కువ. గుండె ముడుచుకుపోవడం వల్ల రక్తం శరీర భాగా లన్నీంటికీ వెళుతుంది.

    మనం ఒక కిలో బరువు పెరిగామంటే గుండె మీద రోజుకు మరో 30 కిలోమీటర్ల దూరం రక్తాన్ని నెటా ్టల్సిన భారం పడుతుంది. అంటే బరువు పెరిగిన కొద్దీ గుండె, మరింత గట్టిగా ముడుచుకోవలసి వస్తుంది. దాంతో బరువు పెరిగే కొద్దీ గుండె కండరాల మీద భారం పెరుగుతుంది. అవి తొందరగా అలసిపోయే ప్రమాదం ఉంది. మాములు బరువున్న వాళ్లల్లో కన్నా స్థూలకాయులలో అధిక రక్తపోటు వచ్చే అవకాశాలు మూడు రేట్లు అధికం.అధిక రక్తపోటున్న వాళ్లకు గుండెపోటే కాదు పక్షవాతం వచ్చే అవకాశాలు కూడా ఎక్కువే. డైలేటెడ్‌ కార్డియోమయోపతితో పాటు గుండె రిథమ్‌ తప్పడం లయ తప్పి కొట్టుకోవడం వల్ల అధిక బరువున్న వాళ్లలో మరణాలు సంభవిస్తాయి.

    ఊపిరితిత్తుల మీద అధిక బరువు ప్రభావం
    Ayush-finalగుండెమీద ఎక్కువ రక్తాన్ని పంప్‌ చేయాల్సిన బాధ్యత పడినప్పుడు ఆ ప్రభావం ఊపిరితిత్తుల మీద పడుతుంది. ఎందుకంటే గుండె పంప్‌ చేసిన రక్తమంతా శుభ్రపడడానికి, ఆక్సిజన్‌ తీసుకోవడానికి ఊపిరితిత్తులకు చేర్చాల్సి ఉంటుంది. దాంతో గురక లాంటివి ప్రారంభం కావచ్చు. ఇలాగే స్లీప్‌ అప్నియాలింటి ఇబ్బందులూ కలుగవచ్చు. నిద్రలో గొంతులోకి శ్వాసనాళాలు ముడు చుకుపోతాయి. ఇలాంటి పరిస్థితిని గుర్తించిన వెంటనే వాళ్లను లేపాలి.నిద్రలేవగానే శ్వాసకండరాలు మాములుగా అవుతాయి. ఇలా స్లీప్‌ ఆప్నియాలో ఒక రాత్రిలో చాలాసార్లు శ్వాస ఇబ్బంది కలగవచ్చు. మాటిమాటికి వాళ్లని లేపుతుండడంతో నిద్ర చాలక పగలూ కునికి పాట్లు పడే అవకాశం ఎక్కువ. అధిక బరువు వల్ల శ్వాస నాళాలలో ఊపిరితిత్తులో ఎన్నో సమస్యలు రావచ్చు.

    డా. కె.ఎస్‌. లక్ష్మి
    ఒబెసిటి సర్జన్‌, లక్డీకాపూల్‌,
    గ్లోబల్‌ హాస్పిటల్స్‌
    ఫోన్‌: 9849713853, 23244444

    ఆకర్షణీయమైన ముఖారవిందానికి సుగుణ చందనం


    * చందనం యాంటీ సెప్టిక్ ఔషధంగా పనిచేస్తుంది. ఇందులోని యాంటీ బాక్టీరియల్ గుణాలు కాలిన గాయాలను, తెగిన గాయాలను మాన్పుతాయి.
    * మొటిమలను తగ్గించడంలోనూ చందనం పాత్ర కీలకం. ఒక టీ స్పూన్ చందనం పొడిలో ఒక టీ స్పూన్ పసుపు, నీరు కలిపి పేస్టులా చేసి రాత్రి పడుకునే ముందు ముఖానికి ప్యాక్‌లా పెట్టుకుంటే మొటిమలు తగ్గిపోతాయి. ముఖం నిగారింపు సంతరించుకుంటుంది.

    * చందనం పొడిని రోజ్‌వాటర్‌తో కలిపి ఆ పేస్టును ముఖానికి, భుజాలకు, వీపు భాగంలో రాసుకుంటే అక్కడుండే మచ్చలు కొంతకాలానికి తగ్గిపోతాయి.
    *ఒక టీ స్పూన్ చందనం, పసుపు, నిమ్మరసం కలిపి చర్మంపై దురద, మంట ఉన్న చోట రాసుకుని, అరగంట తరువాత చల్లటి నీటితో కడిగితే ఆ దురద, మంట ఇట్టే మాయమైపోతాయి.
    * డ్రై స్కిన్ ఉన్న వారు ప్రతిరోజు చందనం నూనె రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. చందనం నూనెను మాయిశ్చరై జర్‌గా కూడా ఉపయోగించవచ్చు. ఈ నూనెను చందనం చెట్ల నుంచి తీస్తారు.
    *చందనం, పసుపు, పాలు కలిపి పేస్టులా చేసి కీటకాలు కుట్టిన చోట పెడితే మంట నుంచి ఉపశమనం లభిస్తుంది. * రోజూ చందనం పొడిని శరీరానికి రాసుకుంటే చెమట ఎక్కువగా పట్టడం తగ్గుతుంది.
    * చందనం కూలింగ్ ఎజెంట్‌గా కూడా పనిచేస్తుంది. తలనొప్పిగా ఉన్నప్పుడు చందనం పొడిని పేస్టులా చేసుకుని నుదుటిపైన రాసుకుంటే ఉపశమనం లభిస్తుంది.
    * చందనం జీర్ణవ్యవస్థ బాగా పనిచేసేలా చూస్తుంది. జీర్ణరసాలు ఉత్పత్తి అయ్యేలా పొట్ట కండరాలను ఉత్తేజితం చేస్తుంది. ఇన్‌ఫెక్షన్లు రాకుండా కాపాడుతుంది.
    * చందనంలో యాంటీ సెప్టిక్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకే సబ్బుల తయారీలోనూ, ఇతర బ్యూటీ ఉత్పత్తుల్లో నూ దీనిని విరివిగా ఉపయోగిస్తున్నారు.
    * చందనంతో తయారుచేసిన అగర్‌బత్తీలను ఇంట్లో వెలిగించుకోవడం మంచిది. చందనం పొగ రెస్పిరేటరీ సిస్టమ్‌ను యాక్టివ్ చేస్తుంది. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రను అందిస్తుంది.
    చందనం ఆస్ట్రింజెంట్‌గా కూడా పనిచేస్తు ంది. చర్మాన్ని, కండరాలను బిగుతుగా చేస్తుంది. పళ్లు దృఢంగా ఉండేలా చేస్తుంది.
    * చందనంలో ఉన్న యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు మూత్ర సంబంధ వ్యాధులను తగ్గిస్తాయి. మూత్రవిసర్జన సాఫీగా జరిగేలా చూడటంలోనూ చందనం పాత్ర కీలకం.
    * చందనం ఎక్స్‌పెక్టోరెంట్‌గా పనిచేస్తు ంది. జలుబు, దగ్గు, ఫ్లూ వంటి వైరల్ ఇన్‌ఫెక్షన్లను కూడా అరికడుతుంది.
    అందరూ రాసుకునే పేస్ట్‌లూ, పౌడర్లు ముఖంపైన, చర్మంపైన వాడటం కంటే వివేకవంతమైన, సులువైన ప్రత్యామ్నాయ మార్గం ఒకటి ఉంది. దీనిని కొత్త లక్స్ శాండల్ అండ్ క్రీమ్ అని పిలుస్తారు. అసమానమైన నాణ్యత నిండి ఉన్న ఇది, శాండల్(చందనం) మరియు చర్మాన్ని మృధువుగా చేసే మాయిశ్చరైజింగ్ క్రీమ్‌ల వంటి సహజమైన సౌందర్య అంశాలతో రంగరించబడింది.

    అందువల్ల, మెరిసే ఛాయకై ఇది నిర్దుష్టమైన రెసిపీ(చిట్కా) అని చెప్పవచ్చు. ఇది చర్మాన్ని శుభ్రపరిచి, పోషించి, తేమనిచ్చి, దానికి బంగారం కన్నా మరింత మెరిసే నిగారింపు నిస్తుంది.

    Wednesday, October 20, 2010

    నాట్య యోగం * నాట్యమే యోగం

    నాట్యం, యోగా వేర్వేరా? ఒకటేనా? ఒకే దానికి రెండు రూపాలా? ఒకటి శబ్దం లేకపోతే రక్తి కట్టదు. రెండోది శబ్దం ఉంటే ప్రయోజనం నెరవేరదు. ఒకటి ప్రదర్శన కళ. రెండోది వ్యక్తిగత సాధన. అయినా ఎన్నో భంగిమల్లో సారూప్యత. ఒకటి వస్తే రెండోది నేర్చుకోవడం సహజంగానే తేలిక.

    ఈ సారూప్యత, సాన్నిహిత్యం భరతముని రాసిన నాట్యశాస్త్రంలోనే ఉన్నాయంటారు కాళ్లకూరి ఉమా వైజయంతిమాల. ఆమె ఈ అంశంపై పరిశోధన చేసి పీహెచ్‌డీ సాధించారు. ఆ థీసిస్‌ను 'నాట్య యోగ' అనే పుస్తకంగా విడుదల చేశారు. అమెరికాలోని ఇల్లినోయిస్ వెస్‌లియాన్ విశ్వవిద్యాలయంలో నాట్యయోగాన్ని బోధిస్తున్న ఉమ- ఈ ప్రక్రియ విశిష్టతను వివరించారు. ఎంతో ఆసక్తి కలిగించే ఆ విశేషాలు ఆమె మాటల్లోనే..

    "మాది వరంగల్. మా నాన్నగారు ఎమ్.కె సోమయాజులు దగ్గర చాలామంది నృత్యం నేర్చుకుంటూ ఉండేవారు. వరంగల్‌లో తొలి నృత్య శిక్షణాలయం మాదే. మా అమ్మకి కూడా నాట్యమంటే చాలా ఇష్టం. నా ఐదవ ఏట నుంచే నృత్యం నేర్చుకోవటం మొదలుపెట్టా. పదో తరగతి పూర్తయ్యేసరికే- దేశవ్యాప్తంగా అనేక ప్రదర్శనలు ఇచ్చాను. జపాన్‌లో కూడా ఒక ప్రదర్శన ఇచ్చా. డిగ్రీ చదివే సమయానికి- వరంగల్‌లో 'నృత్యమాల' అనే పేరిట ఒక డ్యాన్స్ స్కూల్‌ను స్థాపించా. ఒక పక్క చదువు, మరో వైపు డ్యాన్స్. అదే జీవితంగా బతికాను. ఆ తర్వాత పెళ్లి చేసుకొని అమెరికా వెళ్లిపోయాను.

    నాట్యమే యోగం
    చిన్నప్పటి నుంచి నాకు నాట్యంలో పీహెచ్‌డీ చేయాలనే కోరిక ఉండేది. అప్పటి నుంచి నాట్యశాస్త్రానికి సంబంధించిన అనేక పుస్తకాలు చదివా. మాకు డ్యాన్స్‌తో పాటు యోగా కూడా నేర్పేవారు. ఆ సమయంలో- నాట్యం, యోగం ఒకటేనా అనే అంశంపై జిజ్ఞాస కలిగింది. నాట్య శాస్త్ర గ్రంధాలు చదువుతుంటే అనేక ఆసక్తికరమైన విషయాలు తెలిసాయి.

    నాట్యం, యోగం - ఈ రెండింటికి సంబంధించిన సమాచారం వేదాల్లోనూ, ఉపనిషత్తుల్లోనూ కనిపిస్తుంది. యోగము అంటే కలయిక అని అర్థం. పరమాత్మతో ఆత్మ మమేకం కావటమే యోగం. దానికి మార్గం యోగ సాధన.

    ఇక నృత్యం విషయానికి వస్తే - ధర్మం, అర్థం, కామం, మోక్షం మొదలైన పురుషార్థాలను అందించడానికి బ్రహ్మ నాట్యాన్ని సృష్టించాడని భరతముని నాట్యశాస్త్రం తొలి అధ్యాయంలో చెబుతాడు. నాట్యం చేసినా, చూసినా బ్రహ్మానందం సిద్ధిస్తుందని పేర్కొంటాడు. ఈ బ్రహ్మానందం, యోగశాస్త్రంలో చెప్పిన సమాధిస్థితి రెండూ ఒకటే. దీని ఆధారంగా చూస్తే నృత్యానికి, యోగాకు తుది లక్ష్యం భగవంతుడితో వ్యక్తి మమేకం కావటమే. ఈ రెండింటి లక్ష్యం ఒకటే అయినపుడు వీటి మధ్య సారూప్యత కూడా ఉండాలి.

    నేను చేసిన అధ్యయనంలో నృత్యానికి యోగానికి మధ్య అనేక అంశాలలో సారూప్యత కనిపించింది. వీటన్నింటినీ ఆలంబనగా చేసుకొని నాట్యయోగ ప్రక్రియను రూపొందించాను. ఉదాహరణకు యోగాసనాలు వేయటం వల్ల శరీరం మన అదుపులో ఉంటుంది. మనసుకు ఏకాగ్రత ఏర్పడుతుంది. నాట్యం వల్ల కూడా శరీరం అదుపులో ఉంటుంది. ఏకాగ్రత పెరుగుతుంది. యోగా వల్ల నాట్యం నేర్చుకొనేవారికి అనేక లాభాలు ఉంటాయి. ఆసనాలు వేయటం వస్తే నాట్యభంగిమలలో కచ్చితత్వం వస్తుంది.

    ఏకాగ్రతను సాధన చేయటం వల్ల - హావభావాలను అనుకున్న రీతిలో ప్రదర్శించగలుగుతారు. ఈ విధంగా భరతముని నాట్యశాస్త్రంలో చెప్పిన అంశాల ఆధారంగా నేను నాట్యయోగాను రూపొందించాను. ఇప్పటి దాకా ఈ నాట్యయోగా ఎందుకు ప్రాచుర్యంలోకి రాలేదనే అనుమానం కొందరికి కలగవచ్చు. క్రీ.పూ. రెండవ శతాబ్దంలో భరతముని నాట్యశాస్త్రాన్ని రాశాడు.

    ఆ మూల గ్రంధం ఇప్పుడు మనకు పూర్తిగా దొరకటం లేదు. ఆ తర్వాత అనేక మంది నాట్యశాస్త్రానికి సంబంధించిన గ్రంధాలను రాశారు. కాని వీటిలో నాట్యాన్ని, యోగాన్ని ఏకీకృతం చేస్తూ రాసినవి తక్కువే. అందువల్లనే నాట్యయోగానికి ఎక్కువ ప్రచారం లభించలేదు. నేను ఈ రెండింటిని అనుసంధానిస్తూ తెలుగు విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ చేశాను.

    శ్రద్ధ ఎక్కువే..
    నేను అమెరికాలోని ఇల్లినోయిస్ వెస్‌లియాన్ యూనివర్శిటిలో నాట్యయోగ అంశాన్ని విద్యార్థులకు బోధిస్తున్నా. దీనితో పాటు ప్రతి రోజు ఇంట్లో పాతిక మంది పిల్లలకు నృత్యం నేర్పుతున్నా. ఇక్కడ భరతనాట్యానికి మంచి ఆదరణ లభిస్తోంది. నాట్యశాస్త్రంలో అలంకరణకు విశేషమైన ప్రాధాన్యం ఉంది. విద్యార్థులకు నాట్యశాస్త్రంతో పాటు అలంకరణకు సంబంధించి అంశాలను కూడా బోధిస్తున్నా.''
    నటరాజస్వామి చేసే నృత్యంలో 108 నృత్య భంగిమలు(కరణాలు) ఉంటాయి. ఇందులో దాదాపు అరవై భంగిమలు యోగాసనాలతో పోలి ఉంటాయి. ఇందులో ఏ భంగిమైనా యోగాలో ముందుగా సాధన చేయడం వల్ల నృత్య భంగిమ వేసేప్పుడు సులువుగా ఉంటుంది. భంగిమ సులువుగా వేయడం వల్ల మనసుని సన్నివేశంపై నిమగ్నం చేయడం కూడా సులువవుతుంది. దీనికి సంబంధించి నాలుగు ఆసనాలు, నాలుగు కరణాలు ఇక్కడ ఇస్తున్నాం చూడండి.
    వీరభద్రాసనం
    ఈ ఆసనంలో కాళ్లు, చేతులు వెడల్పుగా చాపాలి. మూడవ వీరభద్రాసనం
    ఒంటి కాలిపై ముందుకు వంగి నిలబడాలి. అదే సమయంలో రెండు చేతులు జోడించి నమస్కరించాలి. ఇది చాలా కష్టమైన ఆసనం. నటరాజాసనం
    ఒంటి కాలిపై నిలబడి వెనకనుంచి పైకి ఎత్తిన కాలిని ఒక చేత్తో పట్టుకుని మరో చేతిని నేరుగా చాపాలి. అర్థ పద్మోత్తనాసనం
    ఒక కాలుపై నిలబడి మరో కాలిని మడుచుకోవాలి. అంటే ఒంటికాలిపై తపస్సు చేయడం అన్నమాట. ఉన్మత్తం
    ఒక విధమైనటువంటి గర్వాన్ని, ఉన్నతమైనటువంటి స్థితిని చూపించేటపుడు ఈ కరణాన్ని ఉపయోగిస్తారు. ఆక్షిప్త రేచితం
    అందమైన కదలికలు చూపించేప్పుడు ఈ కరణాన్ని వాడతారు. కష్టమైన భంగిమలోనే హావభావాలను చూపించాలి. తలవిలాసితం
    సూత్రధారులు కథని చెప్పేటపుడు ఈ కరణాన్ని ఉపయోగిస్తారు. సంభ్రాంతం
    హుందాతనాన్ని చూపించడానికి సంభ్రాంత కరణం వాడతారు.

    Tuesday, October 19, 2010

    ఆల్కహాల్ అనేది ఒక్క వ్యాధి మాత్రమే కాదు. ఇదొక సామాజిక దెయ్యం కూడా.

    ‘అంతా భ్రాంతియేనా’... అన్నది దేవదాసులోని పాట. అది దేవదాసులకు అక్షరాలా వర్తించే పాట అన్నది నిజం. మద్యం అలవాటున్న డోసుదాసులకు జీవితంలో వెలుగు ఉండదు. మద్యం తీసుకోవడం వల్ల లైంగిక సామర్థ్యం పెరుగుతుందన్నది ఒక భ్రమ. పిల్లలకు ఒక స్పూన్ బ్రాందీ తాగిస్తే అజీర్తి ఉండదని, పరిమితంగా తాగితే గుండెకు మంచిదని ఒక అపోహ. వీటితో పాటు మద్యానికి అలవాటు పడి ఒక్కసారిగా మానేయాలనుకున్నా... కొన్ని సమస్యలు. శరీరంపై చీమలు పాకినట్లు, గోడలపై పాములు పాకినట్లు భ్రమలు. ఇలాంటి భ్రాంతులు, భ్రమలు తొలగించి, ‘జీవితాన వెలుగు ఎంతో ఉంద’ని చెప్పేందుకే ఈ కథనం...

    అజయ్‌కి నలభై ఏళ్లు. ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం. భార్య, ఇద్దరు పిల్లలు... ఫ్రెండ్స్‌తో మందు పార్టీలో అర్ధరాత్రి దాకా కూర్చున్నాడు. వాహనంపై ఇంటికి బయల్దేరాడు. తను సవ్యంగానే డ్రైవింగ్ చేస్తున్నట్టుగా అతనికి అనిపిస్తోంది. కాని అప్పటికే రోడ్డు మీద వచ్చీ పోయే వాహనాల వాళ్లు అజయ్‌ని సరిగ్గా డ్రైవ్ చేయమని హెచ్చరిస్తున్నారు. తను ఇంత బాగా డ్రైవ్ చేస్తుంటే వీళ్లు ఎందుకు అలా అంటున్నారో అనుకుంటూనే డ్రైవ్ చేస్తున్నాడు అజయ్. వాహనం కొంతదూరం ప్రయాణించిందో లేదో ఎదురుగా వస్తున్న లారీని ఢీ కొట్టింది. ఆ ప్రమాదంలో అజయ్ అపస్మారక స్థితికి చేరుకున్నాడు.

    సూర్యారావు వయసు అరవై. తనకు ఇరవై ఏళ్ల వయసప్పటి నుంచి మద్యం తాగే అలవాటు ఉంది. అంటే దాదాపు నలభై ఏళ్లుగా మద్యం తాగుతున్నాడు. కూతురు ‘ఇక తాగొద్దు’ అని తన మీద ఒట్టు వేయించుకోవడంతో సడెన్‌గా తాగుడు మానేశాడు. అన్నాళ్లూ బాగానే ఉన్న సూర్యారావు విచిత్రంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. తనను ఎవరో తరుముతున్నట్టుగా, చంపబోతున్నట్టుగా ఉలిక్కి పడుతున్నాడు. శరీరంపై చీమలు పాకినట్టుగా ఊరికూరికే చేతులు, పాదాలు గీరుకుంటున్నాడు. సూర్యారావు ప్రవర్తన ఇంటిల్లిపాదీని హడలెత్తిస్తోంది.

    ఈ రెండు కేసులను పరిశీలిస్తే ఒకతను మద్యం సేవించిన తర్వాత ‘మత్తులో కూడా తను బాగానే ఉన్నాను కదా!’ అనుకున్నాడు. కాని శరీరం అదుపులో లేదు. ఫలితంగా ప్రమాదం సంభవించింది. రెండో కేసులో దాదాపు నలభై ఏళ్లపాటు రోజూ మద్యం తాగిన వ్యక్తి హఠాత్తుగా వ్యసనాన్ని మానుకోవడంతో అతని శరీరం అదుపు కోల్పోయింది.

    అకస్మాత్తుగా మానేస్తే అనేక భ్రాంతులు...
    రెగ్యులర్‌గా ఆల్కహాల్ తీసుకునేవారు అకస్మాత్తుగా మానేస్తే ‘ఆల్కహాల్ విత్‌డ్రావల్ సింప్టమ్స్’ కనిపిస్తాయి. అందులో భ్రాంతులు ప్రధానమైనవి. ఎవరూ మాట్లాడకపోయినా శబ్దాలు వినిపించడాన్ని ఆడిటరీ హ్యాలూసినేషన్స్ అంటారు. శరీరంపై చీమలు పాకినట్లు అనిపించడాన్ని టాక్టైల్ హ్యాలూసినేషన్స్ అంటారు. ఈ భ్రాంతికి గురయ్యే క్రమాన్ని ఫార్మికేషన్ అంటారు. అంతేకాదు గోడ మీద పాములు, జెర్రులు వంటి హానికరమైన జీవులు పాకినట్లు కనిపిస్తుంటాయి.

    దీన్ని విజువల్ హ్యాలూసినేషన్స్ అంటారు. మద్యం తాగి వాహనం నడిపేవారు తామ కదలికలు చురుగ్గానే ఉన్నాయని భావిస్తుంటారు. నిజానికి అది వాస్తవం కాదు. మద్యం ప్రభావం వల్ల తాము అనుకుంటున్నంత, తమ అంచనాకు తగినట్లుగా వారి కదలికలు ఉండవు. దాంతో తరచూ ప్రమాదాలు జరుగుతుండటం కూడా మామూలే. అలాగే తమను ఎవరో వెంబడిస్తున్నట్లు అనుమానిస్తుంటారు. తమకు హాని చేయడానికి తలపోస్తున్నట్లుగా భ్రమపడుతుంటారు. ఇలాంటివి జరగక పోయినా జరుగుతున్నట్లు భ్రాంతులకు లోనుకావడాన్ని డెల్యూషన్స్ అంటారు.

    గుండె ఆరోగ్యం - మద్యం
    రోజూ 30 ఎం.ఎల్ వైన్ తీసుకుంటే గుండె ఆరోగ్యానికి మంచిదని చెబుతుంటారు. కాని అదే అలవాటు పోను పోను మోతాదును పెంచేలా చేస్తుంది. అందుకని ముందుగానే ఇలాంటి వాటిని దరిచేరనీయకపోవడం మంచిది. గుండె ఆరోగ్యానికి రోజూ వ్యాయామం, సమతుల ఆహారం, డాక్టర్ సూచనలు పాటిస్తూ ఉండటం అన్ని విధాల మేలు.

    జలుబు, దగ్గు - మద్యం
    జలుబు, దగ్గు, జ్వరం, ఒళ్లు నొప్పులు రావడం సహజం. ఇలాంటప్పుడు బ్రాంది తీసుకుంటే రిలీఫ్‌గా ఉంటుందని, అవన్నీ తగ్గుతాయనుకోవడం పొరపాటు. వాతావరణంలో మార్పులు, శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గిపోవడం, ఆహారపు అలవాట్లు, రకరకాల వైరల్ ఇన్ఫెక్షన్ల కారణంగా ఇలాంటి ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. వీటికి ట్రీట్‌మెంట్ బ్రాంది ఎంత మాత్రమూ కాదు. వైద్యులు ఇచ్చిన మందులు, వారి సూచనలు మాత్రమే పనిచేస్తాయి.

    మానసిక జబ్బులలో..
    మొదటి రెండు పెగ్గులు తీసుకున్నప్పుడు శరీరం చాలా తేలికగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. కాని మోతాదు పెరిగిన కొద్దీ మెదడు డల్‌గా అయిపోతుంటుంది. నరాల వ్యవస్థ మీద ప్రభావం చూపడంతో తనపై తనకు, చుట్టుపక్కల ఏం జరుగుతోందో ధ్యాస ఉండదు. ఆల్కహాల్ ఇన్‌డ్యూస్ డిప్రెషన్, ఇన్‌డ్యూస్ యాంగ్జైటీ డిజార్డర్ వంటి సైకోసిస్ సమస్యలు వస్తాయి.

    గర్భవతులు - మద్యం
    ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పడు బీర్ తాగితే పిల్లలు ఎరగ్రా, తెల్లగా పుడతారని, నార్మల్ డెలివరీ అవుతుందని అనుకుంటారు. కాని అది తప్పు. పిల్లల రంగు ఎప్పుడైనా జెనిటికల్‌గా వస్తుంది. పైగా గర్భవతులు మద్యం తీసుకోవడం వల్ల పిల్లలు శారీరక, మానసిక లోపాలతో పుట్టే అవకాశాలు ఉంటాయి.

    యుక్తవయసులో...
    పియర్ ప్రెజర్ కారణంగా అంటే ‘స్నేహితులు తాగుతున్నారు కాదా! నేను తాగితే తప్పేంటి?’ అనో, సరదాకో ఫ్రెండ్స్ కోసమో మొదలుపెడుతుంటారు. ఈ అలవాటు సాధారణంగా 20, 25 ఏళ్ల నుంచి మొదలవుతుంది. కొన్ని రోజులకు మద్యం తీసుకోకపోతే చెమట్లు పట్టడం, చేతులు వణకడం, నోటికి ఏది తోస్తే అది మాట్లాడటం, అయోమయంగా ప్రవర్తించడం వంటివి చేస్తారు. దీంతో ఇన్ని రోజుల పాటు రాత్రివేళలలో తీసుకునే మద్యం పగటివేళకూ మారుతుంది. మొదట్లో ఒకటి, రెండు పెగ్గులతో మొదలైన అలవాటు నెమ్మదిగా పెరుగుతూ అధికమోతాదులో తీసుకుంటారు.

    బయటపడటానికి...
    * టీనేజ్ పిల్లలు ఇంటికి లేటుగా రావడం, దొంగతనం చేయడం, వారి నుంచి మద్యం వాసన రావడం వంటివి గమనిస్తే వదిలేయకుండా నిపుణులచే చికిత్స ఇప్పించాలి.
    * ఆల్కహాల్ తీసుకోవడం వల్ల నష్టాలు, కౌన్సిలింగ్ ద్వారా తెలియజేసి సదరు వ్యక్తిని మోటివేట్ చేయాలి.
    * రెగ్యులర్‌గా మద్యం తీసుకునే వ్యక్తి హఠాత్తుగా మానేస్తే కొన్ని సమస్యలు ఎదురవుతాయి. వీళ్లు ఆల్కహాల్ విత్‌డ్రావల్ స్టేట్‌లోకి వెళతారు. చేతులు, కాళ్లు స్వాధీనం తప్పడం, తను ఎక్కడ ఉన్నాడు, ఎలా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాదు. అయోమయంగా ఉండిపోతాడు. అతనికి వారం నుంచి పది రోజుల వరకు నిద్రపోయేందుకు సరిపడా మెడిసిన్ డోసును పెంచుతూ, తగ్గిస్తారు. దీనిని డిటాక్సిఫికేషన్ అంటారు.
    * హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయి సమాజంలోకి వెళ్లాక, మళ్లీ మద్యం తీసుకోకుండా ఉండటానికి, దానిని అవాయిడ్ చేయడానికి కౌన్సెలింగ్ ఇస్తారు.
    * డాక్టర్ సూచించిన విధంగా రెగ్యులర్‌గా హాస్పిటల్‌కు రావడం, మందులు వాడటం చేస్తుంటే పూర్తిగా ఈ వ్యాధి నుంచి బయటపడొచ్చు.
    * ఆల్కహాల్ అనేది ఒక్క వ్యాధి మాత్రమే కాదు. ఇదొక సామాజిక దెయ్యం కూడా. కాబట్టి దీనిని గుర్తించినప్పుడు సిగ్గుపడకుండా నిపుణుల సలహాలు తీసుకోవడం అవసరం.

    మద్యం తాగడం వల్ల లైంగిక సామర్థ్యం పెరుగుతుందని చాలామందిలో ఓ అపోహ. కాని మద్యం వంధ్యత్వానికి దారితీస్తుంది. సంతానోత్పత్తి సమస్యలకు ప్రధాన కారణం అవుతుంది.

    పిల్లలకు ఒక స్పూన్ బ్రాంది తాగిస్తే అజీర్తి సమస్య ఉండదని కొంతమంది భావిస్తుంటారు. కాని దీని కారణంగా పిల్లల్లో చిన్నప్పటి నుంచే మద్యం వ్యసనంగా మారే ప్రమాదం ఉంది. పైగా అది శారీరక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది.



    మధు మేహం

    Monday, October 18, 2010

    SEA BUCKTHORN

    Sea Buckthorn on the vine.
    Sea buckthorn (Hippophae rhamnoides) is one of the important natural resources of the mountainous regions of China and Russia. The plant grows naturally in sandy soil at an altitude of 1,200-4,500 meters (4,000-14,000 feet) in cold climates, though it can be cultivated at lower altitudes and into temperate zones. Recently it has been extensively planted across much of northern China, and in other countries, to prevent soil erosion and to serve as an economic resource for food and medicine products. For example, Canada has invested in planting sea buckthorn, originally brought over from Siberia in the 1930s, hoping to develop a good agriculture market; Saskatchewan has ideal growing conditions, yielding a high quality product.
    Aside from erosion control, the plant is primarily valued for its golden-orange fruits, which provide vitamin C, vitamin E, and other nutrients, flavonoids, oils rich in essential fatty acids, and other healthful components. The leaves are now also being used for making a beverage tea; they additional contain triterpenes. The following constituents are among those that have been found in the fruits:
    Constituents of Sea Buckthorn Fruit (per 100 grams fresh berries)
    Vitamin C 200-1,500 mg (typical amount: 600 mg)
    Vitamin E (mixed tocopherols) Up to 180 mg (equal to about 270 IU)
    Folic acid Up to 80 mcg
    Carotenoids, including beta carotene, lycopene, zeaxanthine; these contribute the yellow-orange-red colors of the fruit 30-40 mg
    Fatty acids (oils); the main unsaturated fatty acids are oleic acid (omega-9), palmitoleic acid (omega-7), palmitic acid and linoleic acid (omega-6), and linolenic acid (omega-3); there are also saturated oils and sterols (mainly β-sitosterol) 6-11% (3-5% in fruit pulp, 8-18% in seed); fatty acid composition and total oil content vary with subspecies
    Organic acids other than ascorbic (e.g., quinic acid, malic acid; ingredients similar to those found in cranberries) Quantity not determined; expressed juice has pH of 2.7-3.3
    Flavonoids (e.g., mainly isorhamnetin, quercetin glycosides, and kaempferol; these are the same flavonoids as found in Ginkgo biloba. 100-1,000 mg (0.1% to 1.0%)
    The flavonoids of sea buckthorn (mainly from fruit pulp; also in the leaves) and the oils of sea buckthorn (primarily in the seeds, but also in the fleshy part of the fruit) are the two items specially extracted for medicinal use. Thus, for example, a flavonoid extract product is commonly produced that contains 80% flavonoids, with 20% of residual oils, vitamin C, and other components. Sometimes the flavonoid extract is combined with an oil extract; for example, a flavonoid-oil capsule (made from flavonoid extract and oil extract blended together in a soft gelatin capsule) is produced for use in treating cardiovascular disease.
    In the oil fraction, the unsaturated fatty acids are of greatest interest; extracted oils have less of the flavonoids and almost none of the vitamin C of the fruit. The oil components from several samples have been analyzed as follows:
    Main Constituents of Sea Buckthorn Oils from Seed, Fruit Pulp (juice), and Fruit Residue After Removing Juice. Figures are in milligrams per 100 grams or in percent (as indicated for breakdown of fatty acid composition).
    Ingredient Seed Oil Pulp Oil Fruit Residue Oil
    Vitamin E 207 171 300-600
    Vitamin K 110-230 54-59 -
    Carotenoids 30-250 300-870 1280-1860
    Total acids 11 38 -
    Total flavonoids - - 550
    Total sterols 1094 721 -
    Oil Profile
    Unsaturated fatty acids 87% 67% 70%
    Saturated fatty acids 13% 33% 30%
    The fruit residue, which includes the outer peel, is rich in the colorful carotenoids and vitamin E; the seed has the highest level of the unsaturated fatty acids and sterols.

    HEALTH APPLICATIONS

    Sea buckthorn has been shown to have a potent antioxidant activity, mainly attributed to its flavonoids and vitamin C content (1). Both the flavonoids and the oils from sea buckthorn have several potential applications (2). There are five areas of research that have been focal points for their use: as an aid to patients undergoing cancer therapy; a long-term therapy for reduction of cardiovascular risk factors; treatment of gastrointestinal ulcers; internal and topical therapy for a variety of skin disorders; and as a liver protective agent (for chemical toxins) and a remedy for liver cirrhosis.
    Cancer therapy: Most of the work done in this area has been with laboratory animals. A group in India headed by HC Goel (at the Department of Radiation Biology, Institute of Nuclear Medicine and Allied Sciences, in Delhi) has published several reports on the potential of a hippophae extract (an alcohol extract, which would mainly contain the flavonoids) to protect the bone marrow from damage due to radiation; his group also showed that the extract may help faster recovery of bone marrow cells (3). In China, a study was done to demonstrate faster recovery of the hemopoietic system after high dose chemotherapy (with 5-FU) in mice fed the sea buckthorn oil (4). The seed oil has been found to enhance non-specific immunity and to provide anti-tumor effects in preliminary laboratory studies (5, 6).
    Cardiovascular diseases: In a double-blind clinical trial conducted in China (7), 128 patients with ischemic heart disease were given total flavonoids of sea buckthorn at 10 mg each time, three times daily, for 6 weeks. The patients had a decrease in cholesterol level and improved cardiac function; also they had less angina than those receiving the control drug. No harmful effect of sea buckthorn flavonoids was noted in renal functions or hepatic functions. The mechanism of action may include reduced stress of cardiac muscle tissue by regulation of inflammatory mediators (8). In a laboratory animal study, the flavonoids of sea buckthorn were shown to reduce the production of pathogenic thromboses (9). Some simple formulas based on sea buckthorn have been developed recently for treating cardiac disorders. For example, there is a liquid preparation of sea buckthorn flavonoids with carthamus (safflower) and licorice, called Ai Xin Bao (from the Shanxi Ai Xin Biological Technology Development Center), which is intended for use in treatment of coronary heart disease and sequelae of heart attack and stroke, through improving blood circulation and restoring cardiac function.
    Gastric ulcers: Hippophae is traditionally used in the treatment of gastric ulcers, and laboratory studies confirm the efficacy of the seed oil for this application (10, 11). Its functions may be to normalize output of gastric acid and reduce inflammation by controlling pro-inflammatory mediators.
    Liver cirrhosis: A clinical trial demonstrated that sea buckthorn extracts helped normalize liver enzymes, serum bile acids, and immune system markers involved in liver inflammation and degeneration (12). In addition, sea buckthorn oil protects the liver from damaging effects of toxic chemicals, as revealed in laboratory studies (13).
    Skin: An ingredient of the oil, palmitoleic acid, is a component of skin. It is considered a valuable topical agent in treating burns and healing wounds. This fatty acid can also nourish the skin when taken orally if adequate quantities of sea buckthorn or its oil are consumed; this is a useful method for treating systemic skin diseases, such as atopic dermatitis (14). The only other major plant source of palmitoleic acid is macadamia nuts; the oil is used to nourish the skin. Sea buckthorn oil is already widely used alone or in various preparations topically applied for burns, scalds, ulcerations, and infections. It is an ingredient in sunblock-hippophae oil has UV-blocking activity as well as emollient properties-and it is an aid in promoting regeneration of tissues (15). The fruit may also be used for benefiting the hair: the name hippophae, means shiny horse, and refers to the good coat developed by horses feeding off the plant.

    SEA BUCKTHORN RESOURCE DEVELOPMENT

    Sea Buckthorn has been developed into a major resource for China. The main organization overseeing and promoting its utilization is the China Research and Training Centre on Sea Buckthorn, which has given rise to the International Center for Research and Training on Sea buckthorn (ICRTS).
    Map of the Loess Plateau of northern China
    Many northern Chinese areas have become virtually treeless, even though they were once forested. Soil losses have been huge, and several previous attempts to grow various trees to hold down the soil have been unsuccessful. Sea buckthorn has turned out to be useful because it withstands severe weather and grows huge root systems in poor soil (and fixes nitrogen in the soil). Its planting and maintenance is encouraged by the local people who can earn income from harvesting the fruits (and other parts of the plant). It was noted by ICRTS that in the Loess Plateau of northern China (see map), annual topsoil losses are about 1,600 million tons. Downstream effects include an annual accumulation in the Yellow River of 400 million tons of sediments. Sea buckthorn now covers more than 200,000 hectares (500,000 acres) in the Loess Plateau. Of 360 bird species known to live in the region, 51 entirely depend on sea buckthorn as food and 80 are relatively dependent upon sea buckthorn. For many of the other animal species, sea buckthorn is an important source of food or provides shelter. The leaves and tender branches are a rich source of protein (11-22% by weight).
    A similar project was successfully developed in Mongolia where former attempts to use astragalus as the economic plant to stabilize the soil failed, while hippophae succeeded. Having confirmed that sea buckthorn was the most competitive species for the purpose of controlling water losses and soil erosion, a total of 67,000 hectares (166,000 acres) of sea buckthorn forest were planted in Jianping County of Liaoning Province. This helped to increase the vegetation cover from 4% in the 1950s to 34% in the 1990s. Run-off was reduced by 90% and soil erosion declined by 70%. Fodder, fuel wood, and berries contribute to local economic development (up to 3 tons of fresh berries can be collected on every acre of sea buckthorn forest). Several wild animal species have found a habitat in the sea buckthorn forest, including pheasant, hare, and fox. Altogether, China now has over 1.5 million hectares of sea buckthorn, 40% of it natural, the rest planted. There are over 200 processing plants for sea buckthorn in China.

    MANUFACTURE OF SEA BUCKTHORN PRODUCTS

    Following is a diagram of a processing method that can be used to separate useful components of the berries, yielding the key products of juice, dried fruit nutrients, and oil from the seeds and pulp; residues can be utilized as valuable animal feed. New technologies, involving supercritical carbon dioxide extraction, are now being used in China to efficiently produce the oil products.
    Processing method that can be used to separate useful components of sea buckthorn berries.

    By Subhuti Dharmananda, Ph.D., Director, Institute for Traditional Medicine, Portland, OR



    SEA BUCKTHORN PRODUCTS

    There are several sea buckthorn products on the market already. Examples are displayed below.
    Russian sea buckthorn oil in Russian packaging
    Russian sea buckthorn oil in Russian packaging
    Russian sea buckthorn oil in English packaging
    Russian sea buckthorn oil in English packaging
    Sea buckthorn tincture
    Sea buckthorn tincture
    Sea buckthorn lip balm
    Sea buckthorn lip balm
    Rhamno-fitt, an encapsulated buckthorn oil extract
    Rhamno-fitt, an encapsulated buckthorn oil extract
    Indulona, a topical cream
    Indulona, a topical cream
    Oral liquid with carthamus flower and licorice
    oral liquid with carthamus flower and licorice
    Aubrey Organics antioxidant serum
    Aubrey Organics antioxidant serum
    Aubrey Organics skin care products
    Aubrey Organics skin care products

    Sunday, October 17, 2010

    ఆరోగ్యానికి మేలు చేకూర్చే ఉసిరి

    usiri
    ఆరోగ్యాన్ని సంరక్షించడంలో ఉసిరి ఎంతగానో ఉపయోగ పడుతోంది. ఉసిరి ఎక్కువగా ఆయుర్వేద మందుల్లో వినియోగిస్తారు. ఉసిరిలో అధిక శాతం ప్రోటీన్లు ఉంటాయి. యాపిల్‌ కంటే మూడు రెట్ల ప్రోటీన్లు ఉసిరిలో ఉంటాయని వివిధ గ్రంథాల్లో పేర్కొన్నారు. దానిమ్మతో పోలిస్తే 27 రెట్లకు పైగా ఉసిరిలో పోషకాలున్నాయని వైద్యులు చెప్తుంటారు. ఉసిరిలో యాంటీవైరల్‌, యాంటి మైక్రోబియల్‌ గుణాలున్నాయి.రక్తప్రసరణను మెరుగుపరిచి శరీరం లో అధికంగా ఉన్న కొవ్వును నిరోధించడంలో ఉసిరి దివ్యాఔషధంలా పనిచేస్తుంది.అదేవిధంగా అలసటను దూరం చేయడంలో ఉసిరికి ఉన్న శక్తి ఇంకే పండ్లలో లభించదు.వంద గ్రాముల ఉసిరిలో 900 మి.లీ.గ్రాముల ‘సి’ విటమిన్‌, 7.05 నీరు, 5.09 శాతం చక్కెర పోషకాలున్నాయి.

    ఉసిరితో ఎంతో మేలు :
    • ఉసిరి కాలేయ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. జీర్ణ సంబంధ
      సమస్యలను తొలిగిస్తుంది.
    • ఉదరంలో రసాయనాలను సమతుల్యపరుస్తూ శరీరాన్ని చల్లబరుస్తుంది.
    • లైంగిక సామర్థ్యాన్ని పెంపొందించడంలో ఉసిరి కీలకంగా పనిచేస్తుంది.
    • హృద్రోగం, మధుమేహం రాకుండా నివారిస్తుంది.
    • మెదడు పనితీరును మెరుగుపరిచి జ్ఞాపకశక్తిని పెంచుతుంది.
    • విటమిన్‌ ‘సి’ శరీరాన్ని ఎండ వేడిమి నుంచి కాపాడుతుంది.
    • కేశ పోషణలో ఉసిరి ప్రాముఖ్యత చాలా ఉంది. చుండ్రు, కేశ సంబంధిత
    • ఇతర సమస్యలకు ఉసిరి ఎంతగానో ఉపయోగపడుతుంది.

    వృద్ధాప్యంలోనూ ఆరోగ్యంగా...

    ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకుంటే వృద్ధాప్యంలో అయినా చలాకీగా ఉండవచ్చు. అక్టోబర్‌ వృద్ధుల మాసం. ప్రతి సంవత్సరం ఈ నెల మొదటి తారీకును ప్రపంచ వయోధికుల లేదా వృద్ధుల దినంగా పాటిస్తున్నారు. ఆయుర్వేదం వృద్ధులు జీవించినంత కాలం ఆరోగ్యవంతం గా, వ్యాధులకు దూరంగా బతికేందుకు తోడ్పడుతుంది. ఈ శాఖను ఆయుర్వేదంలో జర చికిత్స అంటారు. అంటే వృద్ధాప్య థెరపీ. దీనికి రసాయన అనే మరో పర్యాయపదం కూడా ఉన్నది. అంటే వ్యాధి నిరోధక, స్వయం సంరక్షక చర్యలు అని అర్ధం. ఆయుర్వేదం ప్రకారం 70 ఏళ్ళు దాటిన సంవత్సరానికి వృద్ధాప్యం ప్రారంభమవుతుంది. కానీ నలభై దాటినప్పటి నుంచే వృద్ధాప్య లక్షణాలు ప్రారంభం కావడం నేటి అనుభవం. శక్తి, బలం క్షీణించి, జీవితాన్ని చురుకుగా గడపలేకపోతారు. ఈ దశలో వ్యక్తిని అలసట, నిస్సత్తువ ఆవరిస్తాయి. భౌతిక, మానసిక కార్యకలాపాలు కుంటుపడతాయి. జ్ఞాపకశక్తి, మేధస్సు క్షీణించడం ప్రారంభమై వ్యాధులు త్వరగా ప్రభావితం చేస్తుంటాయి.

    Happiesఆయుర్వేదం ప్రకారం రస, రక్త, మాసం, మేధస్‌, అస్థి, మజ్జ, శుక్ర ధాతులతో కూడినది మానవ శరీరం. శరీరంలో చోటు చేసుకునే మార్పుల వల్ల ఈ ధాతువులు క్షీణిస్తాయి. ఈ ధాతువులలో సారంతరగిపోవడంతో రోగనిరోధక శక్తి తగ్గి వ్యాధులు త్వరగా సంక్రమించే సున్నితమైన ఆరోగ్య పరిస్థితులు ఏర్పడతాయి. వృద్ధాప్యంలో ఈ ధాతువుల సామర్ధ్యాన్ని పెంచలేం కానీ వాటిని సంరక్షించి పునరుజ్జీవింపచేయవ చ్చు. రసాయన చికిత్స లాభాలను ఆయుర్వేద గ్రంథాలు సవివరంగా పే ర్కొంటాయి. జీవితాన్ని పొడిగించడం, జ్ఞాపకశక్తిని పెంచడం, ఇన్ఫెన్లు, వ్యాధులు రాకుండా నిరోధక శక్తిని, మనస్సును యవ్వన స్థితిలో ఉంచేం దుకు సాయపడడం, వ్యక్తి ఛాయతో పాటు గొంతును మెరుగుపరచడం ద్వారా సమాజంలో గౌరవనీయంగా జీవించేందుకు, సంపూర్ణ ఆరోగ్యా న్ని సాధించేందుకు ఈ ప్రత్యేక చికిత్స అభివర్ణిస్తుంది. ఆయుర్వేదం వృద్ధాప్య సమస్యలను గుర్తించడమే కాదు అటువంటివి సంభవించకుండా నిరోధించే చికిత్సలను రూపొందించింది.

    వృద్ధాప్య సమస్యలు:
    అశక్తత, నిస్సత్తువ, వ్యాధులు, మరణం పట్ల భయం అన్నవి వృద్ధాప్యంలో ప్రధానంగా కనుపించే సమస్యలు. వయోధికులలో కనుపించే ఇతర సమస్యలు-
    కేంద్ర నరాల వ్యవస్థ, మెదడు: పక్షవాతం, సయాటికా, అల్జీమర్స్‌ వ్యాధి, పార్కిన్సన్స్‌ వ్యాధి, మూర్ఛ, న్యూరోసిస్‌, సైకోసిస్‌, మానసిక సమస్యలు, నిద్రలేమి.
    గుండె, రక్త నాళాలు: ఆంజినా పెక్టోరిస్‌, హృదయదమని లోపాలు, హైపర్‌టెన్సివ్‌ గుండె జబ్బులు, గుండెపోటు, గుండెకు సంబంధించిన ఇతర సమస్యలే కాకుం డా జన్యుపరమైన, జీవక్రియా సంబంధ సమస్యలైన మైలాయిడ్‌ లుకేమియా.
    కాలేయం, పిత్తాశయ సమస్యలు: తీవ్రమైన హెపటైటిస్‌, పిత్తాశయంలో రాళ్ళు, సిరోసిస్‌.
    జీర్ణాశయ సమస్యలు: మలబద్ధకం, ఊబకాయం, చక్కెర వ్యాధి
    ఊపిరితిత్తులు: బ్రాంకైటిస్‌, ఎంఫిసీమా, ఆయాసం వంటి సమస్యలు
    కీళ్ళు: రుమెటాయిడ్‌ ఆర్థరైటిస్‌, ఆస్టియో ఆర్థరైటిస్‌, స్పాండిలైటిస్‌, ఆస్టియో పొరాసిస్‌, సొరియాటిక్‌ ఆర్థరైటిస్‌ వంటివి వచ్చే ప్రమాదం ఉంటుంది.
    మూత్రవాహిక: పురుషులలో ప్రోస్ట్రేట్‌ గ్రంధి పెరగడం, నెఫ్రైటిస్‌, చక్కెర వ్యాధి వల్ల రీనల్‌ సమస్యలు రావడం వంటిపలు సమస్యలు వస్తాయి.
    చర్మం, కండరాలు: సొరియాసిస్‌, హెర్పిస్‌, డెర్మటోసెస్‌, జుట్టు, గోళ్ళ వ్యాధులు, మోటార్‌ న్యూరాన్‌ వ్యాధివల్ల సంక్రమించే రోగాలు ఉంటాయి.
    వినాళగ్రంధి (ఎండోక్రైన్‌ గ్లాండ్స్‌): హైపో, హైపర్‌ థైరాయిడిజమ్‌, నపుంశకత్వం, స్ర్తీ, పురుషులలో మెనోపాజ్‌ సిండ్రోమ్‌ తదితర సమస్యలు.
    ఇంద్రియాలు : చత్వారం, గ్లకోమా, పాక్షిక లేదా పూర్తి చెవుడు, మెనీర్స్‌ సిండ్రోమ్‌, వెర్టిగో వంటివి సంభవిస్తాయి.
    సులువైన చర్యల ద్వారా వృద్ధాప్యాన్ని, దానికి సంబంధించిన వ్యాధులను నిరోధిం చడం సాధ్యమని ఆయుర్వేదం చెప్తుంది. సరళమైన, నిరాడంబర జీవనమే దాని రహస్యం. ఆయుర్వేదం ప్రకారం ఆహారం, నిద్ర, బ్రహ్మచర్యాలే వ్యాధిరహిత జీవితాన్ని గడిపేందుకు మూలమైన స్తంభాలు. మితాహారం శరీర జీవసంబంధ ప్రక్రియను క్రమబద్ధం చేస్తుంది.

    మితాహారం, నిరాడంబర జీవనశైలే వ్యాధి రహిత సుదీర్ఘ జీవితానికి మంత్రం. జీవనశైలి విషయంలో చేయాల్సినవి, చేయకూడనివి ఆయుర్వేదంలో నిర్దిష్టంగా పేర్కొన్నారు. అది ఒక ప్రత్యేకశాఖగా ఉంది.సంపూర్ణాహారాన్ని తీసుకొని, క్రమబద్ధమైన జీవితాన్ని గడుపుతూ తన మాటలలో, చేతలలో సమతులంగా ఉంటూ, కోరరానివి కోరకుండా, నిజాయితీగా, క్షమాబుద్ధితో పెద్దల ఎడల గౌరవంతో జీవించే వారికి ఎటువంటి వ్యాధులు సంక్రమించవు. పంచకర్మతో పాటుగా జీవన శైలిలో మార్పులతో పాటు అనేక ఆయుర్వేద మందుల తయారీని ఆయుర్వేద గ్రంథాలు వివరిస్తాయి.

    వృద్ధాప్య సంరక్షణలో ఉపయోగపడే మొక్కలు:
    ఆముదం: ఆముదం విరేచనకారి అని అందరికీ తెలుసు.అయితే వృద్ధాప్య సమస్యలను నిరోధించడం, చికిత్స చేయడంలో ఈ మొక్కకున్న ఉపయోగాలు కొద్ది మందికే తెలుసు.
    1. ఆముదం వేరును నాలుగు భాగాల నీళ్ళలో అది ఒక వంతు వచ్చే వరకు మరిగించి రోజూ తీసుకుంటే వృద్ధాప్యంలో వచ్చే వాత సంబంధ వ్యాధులను నిరోధించవచ్చు.
    2. 8-10 ఆముదం గింజలను పొట్టుతీసి 200 మిల్లీలీటర్ల పాలు, 50 గ్రాముల బెల్లం వేసి మరిగించి, ప్రతి రోజూ సాయంత్రం ఈ పాయసాన్ని తీసుకుంటే వృద్ధాప్య సంబంధమైన ఆర్థరైటిస్‌ సమస్యలను నివారించవచ్చు.
    3. గోధుమపిండిలో స్వచ్ఛమైన ఆముదాన్ని కలిపి చపాతీలు చేసుకొని తింటే డయాబెటిస్‌, ఆర్థరైటిస్‌ సమస్యలే కాక మలబద్ధకం కూడా తగ్గుతుంది.
    తామరపువ్వు: వృద్ధులకు అత్యంత ఉత్తమమైన టానిక్‌ ఇది. అనేక ప్రాంతాలలో ప్రజలు అందుకే తామర కాడలను కూరలాగా చేసుకుంటారు. తామరాకును విస్తరిగా ఉపయోగిస్తారు. ఇది కణాలను సంరక్షిస్తుందని జపాన్‌లో చేసిన పరిశోధనలలో రుజువైంది. తామర రేకులు కొలస్ట్రాల్‌ను తగ్గించడమే కాక గుండె, మెదడుకు రక్తప్రసరణను మెరుగు పరుస్తాయి.
    ఏలక్కాయి: వృద్ధాప్య సమస్యలకు సంబంధించిన అన్ని ఆయుర్వేద మందులలో దీనిని సాధారణంగా ఉపయోగిస్తారు. ఇది మంచి ఆంటాసిడే కాక వాయుహరి కూడా. జీర్ణక్రియను పెంచడమే కాక అసిడిటీ, కళ్ళె వంటి వ్యాధులలో ఉపశమనాన్ని ఇస్తుంది.
    ఉసిరికాయ: ఆరోగ్యాన్ని పెంపొందించే, వయసును నిరోధించే మూలిక ఇది. కొలెస్ట్రాల్‌ వల్ల వచ్చే గుండె వ్యాధుల, రక్త ప్రసరణ సమస్యల బారి నుంచి కాపాడుతుంది. చలికాలంలో అవసరమైన కేలరీ డైట్‌ సప్లిమెంట్‌ను అందిస్తుంది.
    తులసి: రోగనిరోధక శక్తిని పెంచడమే కాక చలికాలంలో వచ్చే జలుబు, దగ్గులను తగ్గిస్తుంది.
    కరక్కాయ: ఆయుర్వేదం ప్రకారం వ్యాధులను, వృద్ధాప్యాన్ని నిరోధించడంలో అత్యున్నతమైన మందు ఇది. కరక్కాయపొడి మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. ఇది అన్ని వయసుల వారూ తీసుకోవచ్చు. అలాగే పైల్స్‌ వంటి వ్యాధులను తగ్గించడంలో ఇది గొప్పగా పని చేస్తుంది.
    త్రిఫల: ప్రాచీన విజ్ఞానం ప్రకారం ఇది ఉత్తమమైన వయో నిరోధక చికిత్స. అయితే దీనిని వివిధ రుతువుల్లో వివిధ పదార్ధాలతో కలిపి తీసుకోవాలి.
    1. వర్ష రుతువులో - సైంధవ లవణంతో కలిపి
    2. శరత్‌ రుతువు - పంచదారతో కలిపి
    3. హేమంత రుతువు - శొంఠితో కలిపి
    4. శిశిర రుతువులో - పిప్పళ్ళతో కలిపి
    5. వసంత రుతువు - తేనెతో కలిపి
    6. గ్రీష్మ రుతువు - బెల్లంతో కలిపి
    తానికాయ: ఇది త్రిఫలాలలో ఒకటి. దీనిని మలబద్ధకం, విపరీతమైన కొలెస్ట్రాల్‌ ఉన్నప్పుడు, లివర్‌, స్ల్పీన్‌ సమస్యల్లోనూ, కంటి వ్యాధులు, బాలనెరుపుకు ఉపయోగిస్తారు.
    తిప్ప సత్తు:రోగనిరోధక శక్తిని కాపాడడంలో పెంచడంలో ఇది ప్రముఖమైనది. వాత తత్వం ఉన్నప్పుడు నెయ్యితో కలిపి, పిత్త తత్త్వంలో పటిక బెల్లం, కఫ తత్వం ఉన్నవారు తేనెతో కలిపి తీసుకోవాలి. గౌటీ ఆర్థరైటిస్‌లో ఆముదంతో కలిపి తీసుకోవాలి. మలబద్ధకం ఉన్నప్పుడు బెల్లంతో కలిపి, రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ ఉన్నప్పుడు అల్లం పొడితో కలిపి తీసుకోవాలి.
    మండూక పర్ణి: దీనిని మందుగా కన్నా కూడా ఆహారంగా మన దేశంలో ఎక్కువగా తీసుకుంటారు. దీనికి ఒత్తిడిని తగ్గించే, జ్ఞాపక శక్తిని పెంచే లక్షణాలు ఉన్నాయి. అల్జిమీర్స్‌ వంటి వ్యాధులలో ఉపయుక్తం.
    అతిమధురం: పిల్లలలో వచ్చే జలుబు, దగ్గులకు దీనిని చిట్కా వైద్యంగా వాడుతుంటారు. నోటి అల్సర్లకు ఇది మంచి మందు. వృద్ధాప్యంలో శ్వాసకోశ సమస్యలకు మంచి మందని చరకుడు అభిప్రాయపడ్డాడు.
    గలిజేరు: ఇది గ్రామాలలో దొరికే మూలిక. దీనిని ఆహారంగా తీసుకోవచ్చు. దీనివేర్లలో పొటాషియం నైట్రేట్‌ అధికంగా ఉంటుంది. మూత్ర నాళ సంబంధ సమస్య, కొన్ని గుండె సంబంధ వ్యాధు చికిత్సలో ఉపయోగపడుతుంది.
    పిప్పళ్ళు: ఇది జీర్ణప్రక్రియకు ఉపయోగపడుతుంది. ఆర్థ్రైటిస్‌, మలబద్ధకం వంటి వాటిలో ఉపశమనాన్ని ఇస్తుంది.
    జీడి గింజలు: ఇది అత్యుత్తమ పునరుజ్జీవనిగా ఉపయోగపడుతుంది. దీనిలో కాన్స ర్‌ నిరోధక శక్తిని ఇటీవలి అధ్యయనాలు వెల్లడించాయి. టిష్యూల నిర్మాణంలో, వాటిని ఆరోగ్యంగా ఉంచడంలో ఉపయోగపడటం వల్ల దాని గింజలను వృద్ధాప్య సంబంధిత సమస్యలను నివారించేందుకు సూచిస్తారు.
    వృద్ధాప్యంలో వచ్చే కీళ్ళ నొప్పులను తగ్గించేందుకు ఇంట్లోనే చేసుకుని వాడదగ్గ కషాయం:
    మెంతులు: 100 గ్రా, జీలకర్ర : 50 గ్రా, మిరియాలు - 05 గ్రా
    మూడింటిని కొద్ది నేతిలో వేయించి పొడి చేసుకొని ఉంచుకోవాలి. ఒక చెంచా పొడిని తీసుకొని ఒక గ్లాసు పాలలో వేసి దానిని కొద్ది సేపు మరగించి రోజుకు ఒకటి రెండు సార్లు తీసుకోవాలి. ఒక వారం రోజులలోనే తేడా కనుపిస్తుంది. ఉపశమనం కలిగే వర కూ ఎన్ని రోజులైనా దీనిని తీసుకోవచ్చు.

    Saturday, October 16, 2010

    ఆరోగ్యానికి అవసరమైన ఉత్తమ ప్రయోజనాలు టీలో దండిగా .........

    చాయ్... సాటిలేదురా భాయ్

    టీ వల్ల పెద్దగా ఉపయోగం ఏముంటుంది... అని మనలో చాలా మంది అనుకుంటూ ఉంటారు. అదొక అలవాటని కొందరి అభిప్రాయం. కానీ, ఆరోగ్యానికి అవసరమైన ఉత్తమ ప్రయోజనాలు టీలో దండిగా ఉన్నాయని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. రోజుకో కప్పు చాయ్ తాగితే డాక్టర్‌కు దూరంగా ఉండవచ్చని పలు సర్వే ఫలితాలు రుజువు చేస్తున్నాయి.

    మిగతా ఆహార పదార్థాల కంటే టీలో ఫ్లేవనాయిడ్స్ అధికంగా ఉండడమే ఈ ప్రయోజనాలకు కారణం. సగటున ఒక కప్పుటీలో 130 మిల్లీగ్రాముల ఫ్లేవనాయిడ్స్ లభిస్తాయి. రోజులో 415 మి.గ్రా ఫ్లేవనాయిడ్స్‌ను తీసుకోవడం ద్వారా నాడుల సక్రమంగా పనిచేస్తాయని పరిశోధకులు పేర్కొంటున్నారు.

    అంతేకాదు రక్తనాళాలు వ్యాకోచించేందుకు ఈ ఫ్లేవనాయిడ్స్ తోడ్పడతాయి. దీనివల్ల గుండె ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. ఒత్తిడి, అలసటను తగ్గించడంతోపాటు రోగనిరోధక వ్యవస్థను టీ ఉత్తేజపరుస్తుంది. శరీరంలో నీటిశాతాన్ని సమతుల్యంగా ఉంచడంలో కూడా ఇది ముఖ్యపాత్ర పోషిస్తుంది.

    ఇక బ్లాక్, గ్రీన్ టీలలో సాధారణ టీ కంటే ఆరోగ్య ప్రయోజనాలు అధికంగా ఉంటాయని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. మరికెందుకు ఆలస్యం ప్రతిరోజూ చాయ్‌ను ఇష్టంగా తాగేయండి.

    Tuesday, October 5, 2010

    తొక్కే కదా అని తీసేస్తే..! వద్దండి బాబూ ... తొక్కను వదిలేయకుండా తినేయండి.

    ఆపిల్ పండు తినేటప్పుడు తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా? వద్దండి బాబూ. ఆపిల్ తొక్కలో క్యాన్సర్ కణాలను చంపే పన్నెండు రకాల పదార్థాలు ఉన్నాయట. కొర్నెల్ యూనివర్సిటీ పరిశోధకులు నిర్వహించిన పరిశోధనల్లో ఈ విషయం వెల్లడయింది. ఆపిల్ తొక్కలో ఉన్న పదార్థాలను ట్రైటర్‌పెనాయిడ్ అని అంటారు.

    ఇవి కాలేయం, పెద్ద పేగు, రొమ్ము క్యాన్సర్ కణాలను చంపడం లేక పెరగకుండా చేయడం చేస్తాయి. ఎర్రటి ఆపిల్‌పండ్ల నుంచి సేకరించిన తొక్కలపై జరిపిన పరిశోధనలో ఇది రుజువయింది. అంతేకాకుండా ఆపిల్స్‌లో ఫైటో కెమికల్స్, ఫ్లేవానయిడ్స్, ఫెనోలిక్ ఆసిడ్స్ ఉన్నాయి. వీటన్నింటిలోనూ యాంటీక్యాన్సర్ గుణాలున్నాయి. సో..ఇక నుంచి తొక్కను వదిలేయకుండా తినేయండి.

    Monday, October 4, 2010

    డయాబెటిస్, అధిక రక్తపోటు నియంత్రణలో మాత్రల కంటే బీన్స్ బెటర్ .......

    మీరు డయాబెటిస్, అధిక రక్తపోటుతో బాధపడుతున్నారా? వాటి నియంత్రణకు రోజూ మాత్రలు వేసుకుంటున్నారా? అయితే మీకు ఈ విషయం తెలియదన్నమాట. డయాబెటిస్‌ను, రక్తపోటును నియంత్రణలో ఉంచడంలో మాత్రల కంటే బీన్స్ నయమని వెల్లడయింది..

    రోజూ బీన్స్ తీసుకోవడం వల్ల డయాబెటిస్, అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటాయని పరిశోధనల్లో తేలింది. పన్నెండు వారాల పాటు ఆరకప్పు ఉడికించిన బీన్స్ తీసుకున్న ఆరోగ్యవంతుల కొలెస్టరాల్ సైతం 8శాతం మేర తగ్గింది. ఫాస్టింగ్ గ్లూకోజ్ లెవెల్స్, ఇన్సులిన్ లెవెల్స్, ఎ1సి లెవెల్స్ పై బీన్స్ ప్రభావం చాలా ఉంటోంది.

    బ్లడ్ షుగర్‌ను నియంత్రించడంలో వీటి పాత్ర చాలా ఎక్కువ. అంతేకాకుండా బీన్స్‌లో సాల్యుబుల్ ఫైబర్ పాళ్లు చాలా ఎక్కువ. కాబట్టి మీ మెనూలో బీన్స్ ఉండేలా చూసుకుని డయాబెటిస్‌కు, అధికరక్తపోటుకు చెక్‌పెట్టండి.

    మద్యం అనే ద్రవం కడుపును ముంచేయడం ఖాయం!!!

    కాలేయం పాడయ్యిందంటే... మొదట అడిగే మాట మద్యం అలవాటు
    ఉందా అని. కడుపులో పుండ్లు పడ్డాయంటే అనుమానించేది... మద్యం
    తీసుకుంటుంటారా అని. కాలేయాన్ని, కడుపును అంత నేరుగా ప్రభావితం
    చేస్తుంది మద్యం. ఇతరత్రా అవయవాల మీద పరోక్ష ప్రభావమేమో గాని...
    నోట్లోంచి కడుపులోకి మద్యం జారగానే అటు ప్రత్యక్ష దుష్ర్పభావాలూ,
    పరోక్ష ప్రభావాలూ రెండూ కడుపు మీదే. తాగగానే నోట్లోనైనా అది పెద్దగా
    ఉండకపోవచ్చేమోగాని... కడుపులోకి జారగానే అక్కడ కాసేపు ఉంటుంది
    కాబట్టి అంతటి బలమైన ప్రభావం! దాంతో పోషకాలు అందకపోవడం,
    విషపదార్థాలు ఉత్పత్తి అవడం, బరువు తగ్గడం, కాలేయం దెబ్బతినడం,
    రోగనిరోధకశక్తి తగ్గడం వంటి అనేక దుష్ఫలితాలు!! ఉపద్రవంతో కొంప
    మునిగినట్టు... మద్యం అనే ద్రవం కడుపును ముంచేయడం ఖాయం!!!


    మద్యం అలా కడుపు (అన్నకోశం)లోకి వెళ్లీ వెళ్లగానే దాని దుష్ర్పభావం మొదలవుతుంది. అన్నకోశంలోకి వెళ్లగానే అక్కడ రెండు విధాలుగా దాని ప్రభావం చూపుతుంది. ఒకటి దాని నిర్మాణం మీద. రెండోది దాని విధులపైన. తొలుత అన్నకోశం నుంచి ఆల్కహాల్ రక్తంలో కలవడం ప్రారంభమవుతుంది. చాలా భాగం జీర్ణప్రక్రియకి గురి కాకుండానే రక్తంలో కలుస్తుంది. మద్యం నేరుగా చాలాసేపు అన్నకోశంలో ఉండటం వల్ల అక్కడి మృదువైన పొరలు (మ్యూకోజా) దెబ్బతింటాయి. అక్కడి మ్యూకోజాపై అది దీర్ఘకాలం పాటు ఉండటం వల్ల జీర్ణకోశం పై భాగంలో అనేక మార్పులు వస్తాయి. ఫలితంగా అప్పటికప్పుడు తగిలే దెబ్బతో పాటు దీర్ఘకాలికంగా ఉండే దుష్పరిణామాలు సైతం ఉంటాయి.

    అన్నకోశంలోని మ్యూకోజాతో పాటు ఇతరత్రా కణజాలాన్ని మద్యం దెబ్బతీయడం వల్ల జీర్ణప్రక్రియ జరిగే క్రమంలో మార్పు వస్తుంది. జీర్ణక్రియ సమర్థంగా జరగకపోవడం ఫలితంగా శరీరానికి అందాల్సిన అవసరమైన పోషకాలు అందకపోవడం వంటి పరిణామాలు సంభవించవచ్చు. పైగా నిత్యం ఆల్కహాల్ తీసుకుంటూ ఉండటం వల్ల మ్యూకోజాపై రోజూ ప్రభావం పడి అక్కడ పుండ్లు, కురుపులు పడవచ్చు.

    నోట్లోకి నీళ్లు వస్తుండటం, ఆహారం ఛాతీపై అంటుకున్నట్లుగా ఉండటం, నోట్లోకి పుల్లటి తేన్పులు వస్తుండటం వంటి లక్షణాలు ఆల్కహాల్ తీసుకునేవారిలో కనిపించే తొలి లక్షణం. మనం తీసుకునే ఆహారం నోట్లోంచి గొంతులోకి అన్నవాహికలోకి రాగానే అన్నవాహిక చివర ఉన్న స్ఫింక్టర్ కారణంగా అన్నకోశం (స్టమక్)లోనే ఉండిపోతుంది. అయితే మద్యం వల్ల ఆ స్ఫింక్టర్ తాను పట్టి ఉంచే సామర్థ్యాన్ని కోల్పోయి రిలాక్స్ అవుతుంది. ఫలితంగా గుండెల్లో మంట, కడుపులోంచి నోట్లోకి యాసిడ్ వచ్చి పుల్లగా అనిపించడం జరుగుతాయి. దాంతో పాటు చిన్న పేగులు, పెద్ద పేగుల్లోని కదలికలు మందగించవచ్చు. దాంతో తిన్నపదార్థాల కదలిక జరగాల్సినంత వేగంగా జరగక అవసరమైన పోషకాలు అందవు.

    పాంక్రియాస్‌పై కూడా ప్రభావం.
    పాంక్రియాస్ అన్నది జీర్ణప్రక్రియలో పాలుపంచుకునే మరో కీలక అవయవం. ఇది రక్తంలో గ్లూకోజ్ పాళ్లను నియంత్రణలో ఉంచే ఇన్సులిన్ హార్మోన్‌ను స్రవిస్తుంది. జీర్ణక్రియలో కొవ్వులు, ప్రోటీన్లు, పిండిపదార్థాలు జీర్ణమయ్యేలా దోహదపడుతుంది. మద్యం వల్ల ఈ అవయవం కూడా దెబ్బతిని తీవ్రమైన పాంక్రియాటైటిస్‌కు దారితీయవచ్చు. దానివల్ల కడుపులో నొప్పి, వాంతులు, ఊపిరి అందకపోవడం, కడుపులో ఇబ్బంది లాంటివి కనిపించవచ్చు. ఎప్పుడో ఒకసారి తాగేవారు మితం లేకుండా సేవించడం వల్ల ఈ సమస్య రావచ్చు. ఇలా పాంక్రియాటైటిస్ వచ్చిన వారిలో 15 శాతం మందిలో అది ప్రాణాంతకం కావచ్చు. ఇలాంటి సమయాల్లో వచ్చే నొప్పి కడుపు నుంచి మొదలై వీపుకు వ్యాపించవచ్చు. ఈ సమస్య వచ్చినప్పుడు కొవ్వులు సరిగా జీర్ణం కాకపోవడంతో మలం జిగటగా అనిపించవచ్చు.

    1-దశ
    మైల్డ్ ఫ్యాటీ లివర్


    కాలేయంలోని కాలేయ కణాల స్థానంలో క్రమంగా కొవ్వు పేరుకోవడాన్ని ఫ్యాటీ లివర్ అంటారు. మద్యం తీసుకునేవాళ్లకు వచ్చే వ్యాధుల్లో ఇది తరచూ కనిపిస్తుంది. ఈ క్రమంలో కాలేయం కొద్దిగా ఉబ్బుతుంది (లివర్ ఎన్‌లార్జిమెంట్). దాంతో పొట్ట పైభాగంలో కుడి వైపున కొద్దిగా ఇబ్బంది ఉన్నట్లు అనిపిస్తుంది.

     
    2-దశ
    ఆల్కహాలిక్ హెపటైటిస్


    కాలేయ కణాలు ఒక్కొక్కటీ మరింతగా దెబ్బతినడం వల్ల లివర్‌లో మంటతో కూడిన వాపు (ఆక్యూట్ ఇన్‌ఫ్లమేషన్) రావచ్చు. దాంతో బయటకు కూడా కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. జ్వరం, కామెర్లు వంటివి బయటికి కనిపించే లక్షణాలు. దీంతో పాటు తెల్లరక్తకణాల పెరుగుదల, కాలేయం ఎరబ్రారడం (టెండర్ లివర్), రక్తనాళాలు సాలీడు కాళ్లలా చర్మం కింద ఉబ్బుగా కనిపించడం వంటివి కనిపిస్తాయి. మన శరీరంలోని మిగతా అవయవాల కంటే కాలేయానికి తనను తాను చక్కబరుచుకునే సామర్థ్యం చాలా ఎక్కువ. అందుకే ఈ దశ వచ్చాకనైనా మద్యం మానేస్తే అన్నీ చక్కబడి క్రమంగా కాలేయం మునుపటి ఆరోగ్యాన్ని పుంజుకుంటుంది.

    3-దశ
    ఆల్కహాలిక్ సిర్రోసిస్


    కాలేయంలోని సాధారణ లివర్ కణజాలం (టిష్యూ) అంతా దెబ్బతిని కేవలం పని చేయని నిష్ర్పయోజనమైన కణజాలం మిగిలిపోయే దశ ఇది. దీన్ని లివర్ సిర్రోసిస్ అంటారు. ఈ దశలో కాలేయం తన సాధారణ ఆకృతిని కోల్పోతుంది. అంతేకాదు... అది కుంచించుకుపోతుంది. దాంతో పేగుల నుంచి కాలేయానికి వచ్చే రక్తనాళాల్లో ఒత్తిడి పెరుగుతుంది. దీన్ని పోర్టల్ హైపర్‌టెన్షన్ అంటారు. దీని వల్ల ఆహార నాళంలోని రక్తనాళాలు (సిరలు) సైతం ఉబ్బి ఒక్కోసారి అవి చిట్లే అవకాశం ఉంది. అలాంటప్పుడు ఒక్కోసారి రక్తపు వాంతులు కావడం లేదా మలంలో రక్తం కనిపించవచ్చు. మలంలో రక్త స్రావం కావడం వల్ల మలం నల్లగా వస్తుంది.

    కాలేయంపై దుష్ర్పభావం ఎందుకు..?

    శరీరంలోకి ఏవైనా విషపదార్థాలు ప్రవేశించగానే వాటిని విరిచేసి వాటి ప్రభావాన్ని నిర్మూలించే విధులను కాలేయం నిర్వహిస్తుంది. మద్యం ఒక రకమైన విషం (టాక్సిన్) కావడం వల్ల దాన్ని విరిచి వేసేందుకు కాలేయం ప్రయత్నిస్తుంటుంది. అయితే ఈ పనిలో కాలేయం తాను నిత్యం చేయాల్సిన దానికంటే ఎక్కువగా మరింత ఎక్కువగా పనిచేస్తుంది. ఇక అలవాటుగా మద్యం తాగేవారిలో ఈ విషయాలను విరిచేసే పనిని అదేపనిగా చేస్తుండటం వల్ల కాలేయంపై భారం పడుతుంది. కాలేయంపై పడే దుష్ర్పభావాన్ని మూడు దశలుగా విభజించవచ్చు.

    మద్యం తీసుకునేవారిలో పొట్ట వస్తుండటం సాధారణంగా చూసేదే. మద్యం తీసుకున్న తర్వాత చాలా మందిలో కనిపించే పరిణామం ఇది. మరీ పెరిగినప్పుడు బెలూన్‌లో నీళ్లు నింపి కదిలిస్తే కదిలినట్లుగా పొట్టలో నీరు చేరి కదులుతూ ఉంటుంది. మద్యం అలవాటు పెరిగినప్పుడు ఇది జరుగుతూ ఉంటుంది. దీన్నే ‘అసైటిస్’ అంటారు. ఇది కూడా మద్యం వల్ల వచ్చే అనర్థమే.

    చికిత్స...
    కాలేయ సమస్యలకు మద్యం మానడంతోనే చికిత్స మొదలైనట్లు లెక్క. నిజానికి అదే పెద్ద చికిత్స అన్నమాట.

    మొదటిదశ ఫ్యాటీ లివర్‌కు, రెండోదశ ఆల్కహాలిక్ హెపటైటిస్‌కు మద్యం నుంచి దూరంగా ఉండటం ప్రధానం.

    కాలేయం దాదాపు 75 శాతం చెడిపోయినా తాను నిర్వహించే విధులలో ఎక్కడా లోపం కనిపించనివ్వదు. తనను తాను రిపేర్ చేసుకుంటుంది. ఇక అది మూడో దశకు వచ్చిందంటే మళ్లీ తిరిగి మునుపటి ఆరోగ్యాన్ని పొందడం చాలా కష్టం. ‘సిర్రోసిస్’ అనే దశకు చేరుకుంటే కేవలం కాలేయ మార్పిడి తప్ప మరో అవకాశం లేదని తెలుసుకోవాలి.

    కొంతమందికి ఎండోస్కోపీ ప్రక్రియ ద్వారా చికిత్స అవసరం. మరికొందరికి అవసరాన్ని బట్టి శస్తచ్రికిత్స చేయాల్సి ఉంటుంది.

    ఆహారం మానేయకుండానే శరీరాన్ని నాజూగ్గా ఉంచుకోవచ్చు ......

    చిక్కిన అందం
    ఈ రోజుల్లో ఎక్కడ చూసినా అధికబరువుతో బాధపడేవారి సంఖ్య అంతకంతకూ ఎక్కువరుుపోతోంది. పాపం కొంతమంది ఆడవారు డైటింగ్‌ పేరిట పోషకాహారం కూడా తీసుకోకుండా ఉన్న కొద్దిపాటి అందానికి కూడా దూరం అరుుపోతున్నారు. వైద్యులను సంప్రదించకుండానే వాళ్లంతట వారే నిర్ణయాలు తీసేసుకుని వారంలో ఒక రోజో లేక రెండు రోజులో ఆహారం తీసుకోకుండా ఉంటే బరువు తగ్గిపోతామనే అపోహలో ఉంటారు కొందరు. ఖాళీ కడుపుతో ఆహారం తీసుకునేటప్పుడు అంతకు ముందు రోజు ఉపవాసం ఉన్నామనే భావనతో కొందరు ఎక్కువగానే తినేస్తుంటారు. దీనితో ఊబకాయం సమస్య తలెత్తుతోంది. అరుుతే ఆహారం మానేయకుండానే కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా శరీరాన్ని నాజూగ్గా ఉంచుకోవచ్చని చెబుతున్నారు వైద్యులు.

    ఎక్కువ మంది బంధువులు, మిత్రులు ఉన్నవారు వాళ్లింటికి తరచుగా వెళ్లడం వలన వారు పెట్టే అమితాహారాన్ని తీసుకుని మొహమాటంతో కాదనలేక ఏది పడితే అది తినేస్తుంటారు. కొందరు అలా కూడా ఊబకాయం సమస్య పెరిగిపోతోంది.

    చిరుతిళ్లు :
    article-కొందరు ఆహారాన్ని పూర్తి స్థాయిలో తగ్గించేసి చిరుతిళ్లకు ప్రాధాన్యం ఇస్తుం టారు. అసలు ఆహారం కన్నా ఈ చిరుతిళ్లే ఎక్కువ చేటు తెస్తాయి. సాధారణంగా ఆడవారు ఇళ్లల్లో టీవీ సీరియల్‌ చూస్తున్నప్పుడు చిరుతిళ్లు ఎక్కువగా తినేస్తుంటారు. వాటిల్లో ఉండే ఆయిల్‌ వలన కొలెస్ట్రాల్‌ శాతం కూడా పెరిగిపోతుంటుంది. అలాగే కొం దరు గురువారాలని, శనివారాలని ఆహారం తినేయడం మానేశాం అను కుంటుంటారు. ఆ మర్నాడు తీసుకునే ఆహారం అంతకు ముందు రోజుకన్నా ఎక్కువ తీసేసుకుంటుంటారు. ఆహారంలో అధిక కేలరీలు, తక్కువ కేలరీలు ఇచ్చేవి ఉంటాయి.

    ఎంత తినాలి :
    అధిక కేలరీలు ఇచ్చేవాటిని నియమానుసారం, కొద్దిపాటి మోతాదు తీసుకుంటే సరిపోతుంది. ఉదాహరణకు ఉదయం అల్పాహారం తీసుకునేటప్పుడు ఇడ్లీ తీసుకుంటుంటారు కొందరు. అలా తీసుకునే ఇడ్లీలలో కేలరీలు అధికశాతం ఉండటంతో కేవలం నాలుగు లేక ఐదు ఇడ్లీలతో మళ్లీ నాలుగు లేక ఐదు గంటలు ఎలాంటి ఆహారం తీసుకోకుండా ఉండవచ్చు. హోటళ్లు, దాబాలు, రెస్టారెంట్లకని వారానికి ఒకరోజు ఫ్యామిలీతో హాయిగా గడిపేస్తుంటారు కొందరు. రోజువారి నియమాలను పక్కన పెట్టేసి కొవ్వు శాతం ఎక్కువ, ఆయిల్‌ పర్సంటేజ్‌ ఎక్కువ ఉన్న ఫుడ్డును తీసుకుని మోయలేని శరీర బరువును స్వయంగా వాళ్లే కొనితెచ్చుకుంటుంటారు కొందరు.

    కాస్త నడక మంచిది :
    ఎక్కడికి వెళ్లాలన్నా వాహనం లేనిదే బయ టకు కదలలేని పరిస్థితి. అందుకని వీలయితే ఎక్కువగా నడవడానికి ప్రయత్నిస్తుండాలి. లేకపోతే కనీసం సైకిల్‌ తొక్కుకుంటూ దగ్గరలో ఉన్న మార్కెట్‌కు, సెంటర్‌కు వెళ్లివస్తుండాలి. శరీ రకండరాలకు తగిన వ్యాయామం లేకపోవడంతో ఊబకాయం మరింతగా పెరిగిపోయి చూసేవాళ్లకు కూడా అసహ్యంగా కనిపిస్తాము. వెనకటి కాలంలో అయితే ఎంత దూరం అయినా సరే నడుచుకుంటూ వెళ్లి వచ్చే వారు. తగినంత శారీరక వ్యాయామం ఉండేది. పైగా ఇళ్లల్లో కూడా రోటి పచ్చళ్లు చేసుకునేవారు. ఇడ్లీ, దోశల పిండి కూడా స్వయంగా రుబ్బు కునేవారు. ఇప్పుడంతా ఎలక్ట్రానిక్‌ యుగంలో అన్నీ ఇన్‌స్టెంట్‌ ఫుడ్‌లకు అలవాటుపడిపోయి సులభ మార్గాలు వెతుక్కుంటున్నాము. తగిన శారీరక వ్యాయామం లేక ఊరికే ఊబకాయం పెరిగిపోయి నేడు ప్రపంచస్థాయిలో అనేక మంది బాధపడుతున్నారు.

    ఎక్కువ ఆకలి వేస్తే :
    సాధారణంగా ఆహారం తీసుకున్న తర్వాత కనీసం మూడు లేక నాలుగు గంటలు ఎటువంటి ఆహారం తీసుకోక పోవడం మంచిది. అంతగా మరీ గంటకే ఆకలి అనిపిస్తే ఏదైనా పండ్లు, జ్యూస్‌లు తీసుకోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే మన శరీరం ఎత్తు, బరువును బట్టి మనం తీసుకునే ఆహారం ఉండాలి.

    కొద్ది పాటి వ్యాయామం :
    hiroinశారీరక వ్యాయామం చేసేటప్పుడు, జాగింగ్‌, మార్నింగ్‌ వాకింగ్‌ చేసేటప్పుడు ఎంత శాతం కేలరీలు ఖర్చ వుతాయో తెలుసుకుని వాటిని సరిగ్గా పాటించగలిగితే ఊబకాయాన్ని దూరం చేయవచ్చు. అలాగే తీసుకునే ఆహారం సాత్వికంగా ఉండి, ఆయి ల్‌, కొవ్వు శాతం తక్కువ ఉండేలా జాగ్రత్త వహించాలి. సాధారణంగా ఆడ వారు పెళ్లి కాకముందు డైటింగ్‌కు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. అదే పెళ్లికాగానే ఏది పడితే అది తినేస్తుంటారు. దీనితో పెళ్లి కాని వారి కన్నా ...పెళ్లయిన వారిలోనే అధికశాతం ఊబకాయం సమస్య తలెత్తుతోంది. ఊబకాయంతో అవస్థలు పడేవారికి వ్యాధి నిరోధక శక్తి తక్కువ స్థాయిలో ఉంటుంది. అధిక బరువు ఉన్నవాళ్లు ఆకలి వేసిందనిపిస్తే... నీరు తాగడం మంచిది. నియమబద్ధంగా కేలరీలు ఉన్న ఆహారాన్ని తీసుకుంటే ఊబ కాయం సమస్య కాదు.