Friday, December 31, 2010

పసుపుతో ఆరోగ్యం * పసుపే ఆరోగ్యానికి పసిడి

* పాలు వేడిచేసి వాటిలో చిటికెడు పసుపు, మిరియాల పొడి కలిపి రాత్రి పడుకునే ముందు తాగితే దగ్గు తగ్గుతుంది.
* సువాసన భరితమైన మరువాన్ని పసుపులో కలిపి నూరి రాస్తే చర్మవ్యాధులు తగ్గుతాయి.
* పసుపు కొమ్ములను నూరి, నీళ్ళలో అరగదీసి గాని/ పసుపు పొడిని పేస్ట్‌లా నీళ్ళతో చాది గానీ కడితే సెగ్గడ్డలు - కరుపులు మెత్తబడతాయి. పుళ్లు మానుతాయి.
* వేపాకు, పసుపు కలిపి నూరి ఆ పేస్ట్‌ను రాసుకుంటే మశూచి పొక్కులు, గజ్జి, తామర మొదలైన చర్మవ్యాధులలో దురద, మంట, పోటు తగ్గుతాయి.
* పసుపు కలిపిన నీటిలో పరిశుభ్రమైన వస్త్రాన్ని ముంచి బాగా నాననిచ్చి, నీడన ఆరబెట్టి కాస్త తడి పొడిగా ఉంటుండగానే కళ్లు తుడుచుకుంటూ ఉంటే కంటి జబ్బులు తగ్గుతాయి.
* వేప నూనెలో పసుపు కలిపి వేడిచేసి, కురుపులకు- గాయాలకు, గజ్జి, చిడుము లాంటి చర్మరోగాలకు పై పూతగా రాసుకుంటే గుణం కనిపిస్తుంది.
* వేడి చేసిన నీటిలో తేయాకు, మినప పిండి, సెనగ పిండి, పసుపువేసి బాగా కలియతిప్పి, ఈ మిశ్రమాన్ని పొయ్యిమీద పెట్టి, రెండున్నర గ్లాసుల నీరు పోసి బాగా మరుగుతుండగా అట్టి ఆవిరిని పీలిస్తే ఉబ్బసం, ఇస్నోఫీలియా మటుమాయం అవుతుంది.
* మెత్తటి పసుపు, ఉప్పు బాగా కలిపి, దానినే టూత్ పౌడర్‌గా వాడితే దంతాల నొప్పి, నోటి దుర్వాసన, పుప్పిపళ్లు నివారింపబడతాయి.
* నిమ్మరసం, కీరాలను కొద్దిగా పసుపు కలిపి రాస్తున్నట్లయితే ఎండ తీవ్రత వల్ల నల్లబారిన చర్మం తిరిగి కాంతివంతంగా తయారవుతుంది.
* పసుపును స్నానానికి ముందు కొబ్బరినూనెతో కలిపి ముఖానికి రాసుకొని మృదువుగా మర్దనా చేయాలి. ఇలా చేయడంవలన చర్మరోగాలు రావు. ముఖం కాంతివంతంగా తయారవుతుంది.
* పసుపు, గంధం సమపాళ్లలో తీసుకొని పేస్ట్‌లాచేసి పెరుగువేసి కలిపి ముఖానికి రాసుకుని, ఆరిన తర్వాత చల్లటి నీటితో కడిగితే ముఖం కాంతివంతంగా తయారవుతుంది.
* దానిమ్మ, బత్తాయి, నిమ్మ తొక్కలు ఎండబెట్టి పొడిచేసి స్నానం చేసే ముందు పసుపుతో కలిపి శరీరంపై రుద్దుకుంటే చర్మరంధ్రాల్లో మురికిపోయి శరీరానికి నిగారింపు వస్తుంది.
* పసుపు, చందన పొడి, రోజ్‌వాటర్‌తో కలిపి పేస్ట్‌లాచేసి ముఖానికి పూసి, కొంత సేపటి తర్వాత కడగాలి. దీనివల్ల ముఖంపై వచ్చే పింపుల్స్ తగ్గుతాయి.
* రోజూ సాయంత్రం వేపాకు, పసుపు, సాంబ్రాణి, దిరిసెన ఆకులు కలిపి ఇంట్లో ధూపంవేస్తే దోమలనూ, కీటకాలనూ నిరోధించవచ్చు.
* చికెన్‌ఫాక్స్ (ఆట్లమ్మ) వ్యాధికి చందనం, పసుపు, తులసి, వేప మెత్తగా నూరి శరీరంపై ఒత్తుగా రాస్తూ ఉంటే ఉపశమనంగా ఉంటుంది.
* పసుపు కొమ్మును మెత్తగా పొడిచేసి, మజ్జిగలో కలిపి రోజూ ఒకసారి తాగితే దీర్ఘకాలిక చర్మవ్యాధులతోపాటు విరేచనాలు- కీళ్లనొప్పులు తగ్గుతాయి.
* పసుపు కలిపిన కొత్తిమీర ఆకుల రసాన్ని రోజూ రాత్రి నిద్రపోయేముందు ముఖానికి మాస్క్ మాదిరిగా పటిస్తుంటే మొటిమలు- మచ్చలు నివారించవచ్చు. చర్మం గరకుదనంపోయి మృదువుగా తయారవుతుంది.
* పసుపుతో అవిసె పూలు కలిపి బాగా దంచి మెత్తటి రసం తీసి ఔషధంగా రోజుకు రెండుమూడు బొట్లు చొప్పున వాడితే కండ్ల కలకకు ఉపశమనంగా ఉంటుంది.
* వేపాకు, పసుపు కలిపి నీళ్లలోవేసి మరిగించి కాళ్లకు చేతులకు రాయడంవల్ల కాళ్ల పగుళ్లు తగ్గుతాయి.
* చక్కెర కలిపిన పాలను వేడిచేసి, పసుపువేసుకుని సేవిస్తే జలుబుకు ఉపశమనంగా ఉంటుంది.
* చిన్న పసుపుకొమ్ము పొడిని నెయ్యితో కలిపి తీసుకుంటే దగ్గు తగ్గుతుంది.
* పసుపుకొమ్ము బెల్లంతో కలిపి నీటిలో నాననిచ్చి ఆ నీటిని తాగడం ద్వారా రొంపతో వచ్చే గొంతునొప్పి తగ్గుతుంది.
* వేపాకు, పసుపు కలిపిన మిశ్రమాన్ని చర్మవ్యాధులు ఉన్నచోట రాస్తే చర్మవ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
* టేబుల్ స్పూన్ పసుపును ఉల్లిపాయతో కలిపి వాపులు ఉన్నచోట రాస్తే తగ్గుతాయి.
* గంధం, పసుపును తీసుకుని తలకు పట్టుగా వేసుకుంటే తల నొప్పికి ఎంతో ఉపశమనంగా ఉంటుంది.
* ఇంగువ రెండు టీ స్పూన్లు తీసుకుని, పసుపువేసి రెండిటినీ పేపర్‌లో చుట్టి దాన్ని కాల్చి, వాసన పీల్చినట్లైతే మైగ్రేన్ తల నొప్పి తగ్గుతుంది.
* పది గ్రాములు పసుపు తీసుకుని దానిలో 50గ్రాములు పెరుగుతో కలిపి తీసుకుంటే కామెర్లు తగ్గుతాయి.
* గోరువెచ్చగా కాచిన నీటిని తీసుకుని దానిలో పసుపు, కొద్దిగా ఉప్పు వేసి ఈ మిశ్రమాన్ని రెండుమూడుసార్లు పుక్కిలిస్తే టాన్సిల్స్ తగ్గుతాయి.
* నీళ్ళతో పసుపుని మరిగించి బట్టలో వడకట్టి, ఈ వడకట్టిన నీటితో కళ్ళను శుభ్రపరచుకుంటే కళ్లల్లో పుసులు తగ్గుతాయి.
* కొంచెం నిమ్మరసంతో పసుపుని కలిపి కురుపులు ఉన్నచోట రాస్తే ఉపశమనంగా ఉంటుంది.
* పసుపు రోజూ వాడడంవల్ల సాధారణ మధుమేహం నుండి కుష్టు వ్యాధి వరకు అనేకానేక సాధారణ అనారోగ్యాలకు చక్కని ఔషధంగా ఉపయోగపడుతుంది.
* నీళ్ళలో పసుపుని కలిపి తాగితే కడుపులో వుండే నులి పురుగుల్ని హరిస్తుంది.
* పసుపు, సైంధవ లవణం, శొంఠి పొడిని అన్నంలో కలుపుకుని తింటే ఆకలి పెరుగుతుంది.
* పసుపు వాడడంవల్ల బ్లడ్‌ప్రెషర్ తగ్గుతుంది. గోరు చుట్టుకు పసుపును మందుగా వాడిచే ఎంతో ఉపశమనంగా ఉంటుంది.
* నోటి దుర్వాసనలకు, దంతాల వ్యాధులకు పసుపు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
* బ్రహ్మజెముడుతో పసుపు కలిపి పుండ్లు ఉన్నచోట రాస్తే తగ్గుతాయి.
* తుమ్మిపూలను మిరియాలు, బెల్లంతో చూర్ణం చేసి సేవిస్తే దగ్గు తగ్గుతుంది.
* గ్లాసుడు పాలు వేడిచేసి దానిలో తేనె వేసి తాగితే రాత్రిపూట వచ్చే దగ్గు తగ్గుతుంది. పాలల్లో తేనె, చిటికెడు పసుపు వేసి బాగా కాచి, ఆ పసుపు పాలు తీసుకున్నా దగ్గు, జలుబు తగ్గుతాయి.

వ్యాధులు - ఆయుర్వేద చిట్కాలు



* స్వచ్ఛమైన ఇంగువను నిమ్మరసంతో కలిపి నూరి కొద్దిగా వెచ్చచేసి దూదిని దానిలో ముంచి తడిపి పంటి నొప్పి వున్నచోట పెడితే పంటి నొప్పి తగ్గిపోతుంది.
* బిళ్ళగనే్నరు ఆకుల్ని, జామ ఆకుల్ని సమతూకంలో తీసుకుని ముద్దచేసి ఈ ముద్దని ఐదు చెంచాల వంతున ఉదయం సాయంత్రం 3 రోజులు తీసుకుంటే అతిసార వ్యాధి తగ్గుతుంది.
* వంద గ్రాముల వాము శుభ్రంచేసి ఎర్రగా వేయించి, మెత్తగా పొడిచేసి డబ్బాలో నిల్వ ఉంచుకొని గ్యాస్‌ట్రబుల్ ఉన్నప్పుడు ఒక చెంచా పొడిని నీళ్ళల్లోగాని, విడిగా గాని తీసుకుంటే ఎక్కువ త్రేన్పులు రాకుండా ఉంటుంది.
* ముల్లంగిని కూరగా చేసుకుని గానీ, దంచిన రసంగా గానీ తాగాలి. పల్లేరు సమూలంగా కషాయం చేసుకుని తాగితే మూత్ర సంచి సమస్యలు తగ్గుతాయి.
* మూత్రం కొంచెం కొంచెంగా వస్తే అల్లంముక్కలు తేనెతో గానీ, పంచదారతో గానీ కలుపుకుని తింటే యూనినరీ ఇన్‌ఫెక్షన్స్ తగ్గుతాయి.
* పచ్చి మెంతులు ఒక అరచెంచా ఉదయం, సాయంత్రం మింగాలి. పచ్చివి తినలేకపోతే పెరుగులో నానబెట్టుకుని తింటే మూత్ర పిండాల నొప్పి తగ్గుతుంది.
* గుప్పెడు వేపాకు, ఒక చెంచా పసుపు, ఒక చెంచా ఉప్పు దంచి కురుపుల మీద రుద్ది ఒక గంట తరువాత సున్నిపిండితో స్నానంచేస్తే గజ్జి కురుపులు తగ్గుతాయి.
* రెండు లేదా మూడు మిరియాలు బుగ్గన పెట్టుకొని మెల్లగా నములుతూ రసం మింగాలి. ఇలా రోజుకు ఐదునుండి ఏడు మిరియాలు నమిలితే దగ్గు తగ్గుతుంది.
* తెల్ల ఉల్లిపాయ రసం పది మి.లీ., అల్లం రసం పది మి.లీ. నిమ్మ రసం పది మి.లీ. తేనెతో కలిపి 50మి.లీ. తీసుకుంటే కాటరాక్ట్, గ్లూకోమా తగ్గుతుంది.
* తులసి రసం, అల్లం రసం రెండుమూడు చుక్కలు తీసుకుని కొంచెం తేనె కలిపి పిల్లలకిస్తే జ్వరం, జలుబు తగ్గుతాయి.
* త్రిఫల చూర్ణం, పసుపు, నీళ్ళు కలిపి పేస్టులా చేసి పడుకునే ముందు కాళ్ళు శుభ్రంగా కడుక్కొని మందుపెట్టాలి. పగుళ్ళు తగ్గేంతవరకు ఇలా చేస్తే కాళ్ళ పగుళ్ళు తగ్గుతాయి.
* అల్లం, జీలకర్ర నెయ్యిలో వేయించి, అందులో పటిక బెల్లం ముక్కలు వేసి కరగబెట్టాలి. పటిక బెల్లం కరిగాక ముక్కలుచేసి రోజూ ప్రొద్దున్న తీసుకుంటే పైత్యం తగ్గుతుంది.
* పండు జిల్లేడు ఆకుకు నీరు సున్నం రాసి, వెచ్చచేసి, రసం పిండి చెవిలో వేస్తే చెవి పోటు తగ్గుతుంది.
* అల్లం రసం, ఇంగువ కలిపి వెచ్చచేసి చెవిలో వేస్తే చీము కారడం తగ్గుతుంది. తాత్కాలికంగా వచ్చే చెవుడు కూడా తగ్గిపోతుంది.
* పెద్ద ఉల్లిపాయ, ఉప్పు కలిపి నూరి దానిని పండ్లకి వేసి రుద్దితే పండ్ల వెంట కారే రక్తం ఆగిపోతుంది.
* స్వచ్ఛమైన ఇంగువ నిమ్మ రసంతో నూరి కొద్దిగా వేడి చేసి, దూదిని దానిలో ముంచి తడిపి పంటి నొప్పి ఉన్నచోట పెడితే నొప్పి తగ్గుతుంది.
* గచ్చకాయ కాల్చిన మసి, పటిక, పోక చెక్కల మసి - మూడూ కలిపి చిగుళ్ళకి రుద్దితే చిగుళ్ళవాపు, చీము, నెత్తురు కారటం, నోటి దుర్వాసన తగ్గుతాయి.
* నేరేడు చెక్క చూర్ణం, కవిరి చూర్ణం (కాచు) సమానంగా కలిపి, కొద్దిగా ముద్దకర్పూరం కూడా కలిపి రాస్తే దంతాలకి సంబంధించిన సమస్త బాధలు తగ్గుతాయి.
* జాజికాయ చిన్న పలుకు దవడకి పెట్టుకుని కొంచెం కొంచెంగా నమిలి తినాలి. ఇది శరీరానికి వేడి చేస్తుంది. జాపత్రి చిన్న ముక్క తమలపాకులో వేసుకొని తింటే నోటి దుర్వాసన నివారణ అవుతుంది.
* లవంగం దవడకి పెట్టుకుని నమలాలి. పచ్చి పోకలు తమలపాకులో వేసుకుని తింటే నోటి దుర్వాసన తగ్గుతుంది.
* నేరేడు విత్తులు, గింజలు తీసేసిన కాకర కాయలు, నేలతంగేడు పూజ, పొడపత్రి, తిప్పతీగె, ఉసిరికాయ చూర్ణం చేసి రెండు పూటలా నోట్లో వేసుకొని, నీరు తాగితే మధుమేహం నియంత్రణలో ఉంటుంది.
* మందార పువ్వుల్ని కొబ్బరి నూనెలో వేసి మరగబెట్టి చల్లార్చి తలకు పెట్టుకుంటే జుట్టు ఊడకుండా ఉంటుంది.
* గుంటగలగరాకు దంచి, రసం తీసి ఒక వంతు కొబ్బరి నూనెలో కలిపి నీరు మరిగే వరకు ఉడకబెట్టాలి. చిటపట శబ్దం పోయి నూనె పైకి తేలేవరకు పొయ్యిమీద ఉంచాలి. సువాసనకి గంధకచ్చూరాలు కలుపుకుని, వాడడంవల్ల జుట్టు రాలదు. నల్లబడుతుంది. పెరుగుతుంది.
* వేపాకు రసం అరకప్పు, పెరుగు అరకప్పు, ఒక చెక్క నిమ్మకాయ రసం, మూడూ కలిపి తలకు పట్టించాలి. గంట తర్వాత కడిగితే చుండ్రు నివారణ అవుతుంది.
* వేపనూనె, కర్పూరం కలిపి రాస్తే తలలో పురుగు చచ్చి, కురుపులు మాడిపోతాయి, చుండ్రు తగ్గుతుంది.
* వంద గ్రాముల పెద్ద ఉల్లిపాయల్ని తీసుకొని వాటిని బాగా చితక్కొట్టి అర లీటరు నీళ్ళల్లో ఉడకబెట్టాలి. ఆ ఉడికిన నీళ్ళల్లో నాలుగోవంతు తీసుకొని పంచదార కలిపి తాగితే మూత్ర నాళంలో రాళ్ళు కరిగిపోతాయి.
* అల్లం, స్వచ్ఛమైన బెల్లం ఒక్కోటి 5గ్రాములు తీసుకుని రెండూ కలిపి రాత్రి పడుకోబోయేముందు నమిలి తింటే మలబద్ధకం పోతుంది.
* చందన అత్తరు (శాండల్ ఉడ్ ఆయిల్) పది చుక్కలు పంచదారతో కలిపి తింటే మూత్రపు మంట వెంటనే తగ్గిపోతుంది.

* ముద్దతామర ఆకుల్ని వేళ్ళతో సహా నూరి కురుపుల మీద కట్టాలి. చీము తగ్గి కురుపులు మానుతాయి.
* మెంతికూర చిన్నదిగాని, పెద్దదిగాని కూర చేసుకుని రోజూ కనీసం మూడు నెలలు తింటే రక్తహీనత తగ్గుతుంది.
* అశ్వగంధ వేర్లు తీసుకుని మెత్తగా నూరి ఒక చెంచా పొడిని అర కప్పు నీళ్ళల్లోగాని, పాలల్లోగాని కలుపుకుని తాగితే నడుం నొప్పి తగ్గుతుంది.
* నిమ్మ రసంలో పాలు కలిపి రాత్రి పూట రాసి, ఉదయం గోరువెచ్చని నీటితో కడిగితే మొహంమీద మచ్చలు పోతాయి.
* ఒక చెంచా కస్తూరి పసుపు మెత్తగా చేసి, నువ్వుల నూనెలో గాని, పల్లీనూనెలో గాని కలిపి రాసుకుంటే మొటిమలు తగ్గుతాయి.
* వేపాకు మెత్తగా నూరి శనగ గింజంత మోతాదులో మాత్ర చేసుకుని రోజుకు మూడుసార్లు మింగితే మొటిమలు తగ్గుతాయి.
* ఉసిరికాయ రసం పంచదారతో కలిపి పూటకు పది గ్రాముల వంతున రెండు పూటలు తీసుకుంటే కీళ్ళనొప్పులు తగ్గుతాయి.
* పుదీనా కట్టలు నాలుగు తీసుకుని, పది గ్రాముల మిరియాలు, పది గ్రాముల శొంఠి కలిపి మెత్తగా నూరాలి. శనగ గింజంత టాబ్లెట్లు చేసుకుని నీడలో ఆరబెట్టాలి. రోజుకు మూడు టాబ్లెట్లు మూడునెలలు తీసుకుంటే స్థూలకాయం తగ్గుతుంది.
* అశ్వగంధ ఆకుల్ని ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఒక పచ్చి ఆకుని నమిలి మింగాలి. ఇది బరువును తగ్గిస్తుంది.
* జీవన్‌ధార ఒక చుక్క తమలపాకులో వేసి తినాలి. కరక్కాయ బెరడు దవడకు పెట్టుకొని దాని రసం మింగితే జలుబు, దగ్గు తగ్గుతాయి.
* రావి చికురుటాకులు తొమ్మిదింటి రసం తీసుకుని, తేనెతో కలిపి తీసుకుంటే రెండుమూడు పూటల్లో జలుబు తగ్గుతుంది.
* జిల్లేడు పువ్వు ఒక తమలపాకులో పెట్టి నమిలి తినాలి. ఇలా ఉదయం, సాయంత్రం రెండుపూటలా మూడురోజులు తింటే జలి జ్వరం తగ్గుతుంది.
* తులసి ఆకు రసంతో కొంచెం అల్లం రసం గాని, లేక కొంచెం శొంఠి రసం గాని కలిపి, టీ స్పూన్ తేనె కూడా కలిపి తాగితే కడుపునొప్పి వెంటనే తగ్గుతుంది.
* దానిమ్మ గింజలు చప్పరించి తింటే ఏ వయసు వారికైనా వాంతులు ఆగిపోతాయి. వేవిళ్ళతో ఉన్న స్ర్తిలకి తక్షణం పనిచేస్తుంది.

* ఎర్ర మందారం పూలను రెండు గ్లాసుల నీళ్ళలో వేసి ఉడికించి ఒక గ్లాసు నీరు వచ్చేవరకు మరిగించి, వడకట్టి, కషాయం తీసి సీసాలోకి తీసుకుని, రోజూ తలకి పెట్టుకొని రెండు గంటల తర్వాత తల స్నానం చేస్తే పేనుకొరుకుడు తగ్గుతుంది.
* గుంటగలగరాకు దంచి రసం తీసి ఒక వంతు కొబ్బరి నూనెతో కలిపి నీరు మరిగించి ఉడకబెట్టి, చిటపట శబ్దంపోయి నూనె పైకి తేలేవరకు పొయ్యిమీద ఉంచి, సువాసనకి గంధకచ్చూరాలు కలిపి, దీనిని వాడడంవల్ల జుట్టు రాలదు, నల్లబడుతుంది, పెరుగుతుంది.
* మెంతులు (పచ్చివి) మెత్తగా పొడి చేసి, తలకి సరిపోయే పొడిని రాత్రి నీళ్ళల్లో నానబెట్టి, అందులో నిమ్మరసం, పెరుగు కలిపి తలకు పట్టించి గంటసేపు వుండి, తల స్నానంచేస్తే చుండ్రు తగ్గుతుంది.
* కలబంద నుండి గుజ్జుతీసి మెత్తగా చేసి, గుజ్జుని తలకి పట్టించి గంట తర్వాత తల స్నానం చేస్తే చుండ్రు నివారణ అవుతుంది.
* బిళ్ళగనే్నరు ఆకులను, జామ ఆకుల్ని సమానంగా తీసుకుని ముద్దచేసి ఈ ముద్దని ఐదు చెంచాల వంతున ఉదయం సాయంత్రం మూడురోజులు తీసుకుంటే అతిసార వ్యాధి తగ్గుతుంది.
* చల్లటి ఒక కప్పు ఆవుపాలు తీసుకుని అందులో ఒక చెక్క నిమ్మరసం కలిపి వెంటనే తీసుకుంటే అర్షమొలలు తగ్గుతాయి.
* వంద గ్రాముల పెద్ద ఉల్లిపాయల్ని తీసుకుని వాటిని బాగా చితక్కొట్టి అర లీటరు నీటిలో ఉడకబెట్టాలి. ఆ ఉడికిన నీళ్ళల్లో నాలుగోవంతు తీసుకుని పంచదార కలిపి తాగితే మూత్ర నాళంలో రాళ్ళు కరిగిపోతాయి.
* అశ్వగంధ వేర్లు తీసుకుని మెత్తగా నూరి ఒక చెంచా పొడిని అరకప్పు నీటితో గాని పాలతో గాని కలుపుకుని తాగితే నడుంనొప్పి తగ్గుతుంది.
* జిల్లేడు పువ్వు, పసుపు సమానంగా తీసుకుని నూరి అందులో కొంచెం ఆముదాన్ని వేసి మడమకి రాత్రిపూట కట్టి ఉదయం తీసేస్తే మడమ నొప్పి తగ్గుతుంది.
* శొంఠి మిరియాలు సమానంగా తీసుకుని, రెండింటిని దోరగా వేయించి చూర్ణంచేసి పూటకి ఐదు గ్రాములు తేనెతో కలిపి రోజూ మూడు పూటలా 10 రోజుల్లో కీళ్ళ నొప్పులు తగ్గుతాయి.
* సింహనాద గుగ్గిళ్ళు అనే టాబ్లెట్లను రోజుకు మూడు చొప్పున మూడునెలలు వాడితే మోకాళ్ళ నొప్పి తగ్గుతుంది.
- పంతుల సూర్యలోవరాజు

వ్యాధులు - నివారణోపాయాలు

* ఉల్లిబింజర ఆకులు తుంచినప్పుడు వచ్చే రసంలో దూదిని ముంచి చెవిలో పెడితే చెవి పోటు, నొప్పికి ఉపయుక్తంగా ఉంటుంది.
* ఆముదం ఆకులను ముద్దగా నూరి తేనెతోకలిపి రోజుకు రెండుసార్లు చొప్పున ఐదు రోజులు వేసుకోవాలి. పెద్ద ఉసిరికాయ సైజులో రెండు గోళీలు ఉదయం, రెండు గోళీలు సాయంత్రం తీసుకుంటే పచ్చకామెర్లు తగ్గుతాయి.
* రావి చెక్క కొద్దిగా ఒక గ్లాసు నీళ్ళలో ఉడికించి కషాయం తీయాలి. చల్లారిన కషాయాన్ని రాత్రికి అలాగే వుంచి పరగడుపున తాగాలి. ఇలా మూడురోజులు తాగాలి. నేల ఉసిరి మందుతోపాటు రావిచెక్క కషాయం తాగితే పచ్చకామెర్లు తగ్గుతాయి.
* మంచి ఇంగువను నిమ్మరసంతో నూరి కొద్దిగా వేడి చేసి దూదిని దానిలో ముంచి తడిపి పంటి నొప్పి వున్నచోట పెడితే పంటి నొప్పి తగ్గుతుంది.
* గచ్చకాయ కాల్చిన మసి, పటిక, పోకచెక్కల మసి- ఈ మూడింటిని కలిపి చిగుళ్ళకి రుద్దితే చిగుళ్ళ వాపులు, చీము, నెత్తురు కారటం, నోటి దుర్వాసన తగ్గుతాయి.
* మెంతులు రెండు చెంచాలు, లేత వేప చిగురు, కాకరకాయ, బోగన్‌విల్లా లేత చిగుర్లు (ఎనిమిది లేక పది) తింటే మధుమేహం అదుపులో ఉంటుంది.
* నేరేడు విత్తులు, గింజలు తీసేసిన కాకరకాయలు, నేలతంగేడు పూత, పొడిపత్రి, తిప్పతీగె, ఉసిరికాయలను చూర్ణం చేసి రెండుపూటలా నోట్లో వేసుకొని నీటిని తాగితే మధుమేహం అదుపులో ఉంటుంది.
* ఒక కాకరకాయ, ఒక కీర కాయ, ఒక టమోటా పండు, పది తెల్ల బిళ్లగనే్నరు పూలు, పది వేప చిగుళ్ళు కలిపి కొంచెం నీళ్ళు కలిపి రసం తీసి, ఒక సీసాలో పోసుకుని ఫ్రిజ్‌లో భద్రపరచి పరగడుపున ఒక చెంచా రసం తాగితే షుగర్ పేషెంట్లకు ఇది దివ్య ఔషధం.
* గుప్పెడు యూకలిప్టస్ ఆకుల్ని దంచి గుజ్జుచేసి నుదుటిమీద అంటించుకొని మెత్తటి గుడ్డతో కట్టుకొని, గంటసేపు పడుకుంటే తలనొప్పి పోతుంది.
* పెద్ద ఉసిరికాయంత అల్లం, రెండు పసుపుకొమ్ములు కలిపి దంచి దానికి ఒక కాయ నిమ్మరసం, మూడు చెంచాల ఆముదం కలిపి గోరువెచ్చ చేయాలి. తలకి పట్టువేసి గుడ్డతో గట్టిగా కట్టి గంటసేపు నిద్రపోతే తలనొప్పికి ఉపయుక్తంగా ఉంటుంది.
* తులసి రసాన్ని నాలుగుచుక్కలు తీసుకుని ఎడమవైపు నొప్పి వస్తే కుడి ముక్కులో, కుడివైపు నొప్పి వస్తే ఎడమవైపు ముక్కులో వేసుకుని గంటసేపు పడుకుంటే పార్శ్వపు నొప్పి తగ్గుతుంది.

-సూర్యలోవరాజు


Tuesday, December 28, 2010

చిగుళ్లతోనే చిద్విలాసం!

ఉదయం, రాత్రి పడుకోబోయే ముందు పళ్లు తోముకోవడం చాలా అవసరం. అయితే బ్రష్ చేసుకోవడం వల్ల దంతాలు పూర్తిగా శుభ్రం కావు. పళ్ల మధ్య ఉండే అతి సన్నని సందులలోకి, దవడ చివరలో ఉండే పన్ను దాకా బ్రష్ వెళ్లకపోవచ్చు. అందువల్ల పళ్ల సందులను దారాలతో శుభ్రం చేయడం (ఫ్లాసింగ్), మౌత్‌వాష్ ద్రావణంతో నోరు పుక్కిలించడం (రిన్సింగ్) వంటివి చేయాలి. ప్రతి ఆరుమాసాలకు ఒకసారి దంతవైద్యున్ని సంప్రదించాలి.
దంతాలు బలంగా ఉండాలంటే చిగుళ్లు ఆరోగ్యంగా ఉండాలి. చిగురు దెబ్బతింటే దంతం నిలబడదు. చిగుళ్లకు ఇన్‌ఫెక్షన్ సోకితే అందులోని హానికారక బ్యాక్టీరియా గుండె జబ్బులకు దారితీయవచ్చు. అందుకే చిగుళ్ల విషయంలో నిర్లక్ష్యం చేయకూడదంటున్నారు దంత వైద్యులు.
దంతంలో పైకి కనిపించే పొర పింగాణి. దాని లోపల డెంటిన్ అనే పొర ఉంటుంది. పంటిలోపల రక్తప్రసారం జరిగే భాగానికి పల్ప్ అని పేరు. దంతాన్ని ఆనుకుని ఉండే తొలి చిగురును జింజైవా అంటారు. ఆ పైన ఉండే దంత మూలానికి ఆధారంగా ప్యారడాంటల్ లిగమెంట్ ఉంటుంది. జింజైవా ఇన్‌ఫెక్షన్లకు గురైనపుడు నిర్లక్ష్యం చేస్తే ఇన్‌ఫెక్షన్లు లిగమెంట్ దాకా వెళతాయి. దీనివల్ల పునాదులు దెబ్బతిన్న గోడల మాదిరిగా దంతాలు రాలిపోతాయి.

డెంటల్ ప్లాక్

ఉదయం నిద్రలేవగానే దంతాలపై కనిపించే పలుచని పొరను ప్లాక్ అంటారు. దీనిమీద బ్యాక్టీరియా చేరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బ్యాక్టీరియా చేరిన ఆ ప్లాక్‌ను ఎప్పటికప్పుడు శుభ్రం చేయకపోతే అది క్రమంగా గట్టిపడి పచ్చగా (క్యాల్కులస్)దంతాల మీద నిలిచిపోతుంది. ఇందులోని బ్యాక్టీరియా దంతక్షయానికి కారణమవుతుంది.
దంతాల ఒరిపిడి(అక్లూషన్) పుట్టుకతోనే కొందరికి దంతాలు పొడవుగా ఉంటాయి. దీనివల్ల పై పళ్లకు, కింది పళ్లకు మధ్య ఉండే ఖాళీ తగ్గిపోతుంది. దంతాలు నిరంతరం ఒరుసుకుంటాయి. మరికొందరిలో నిద్రలో పళ్లు కొరికే అలవాటు ఉంటుంది. పళ్లలో జరిగే ఈ నిరంతర ఒరిపిడి కారణంగా చిగుళ్లు దెబ్బతింటాయి.
రూట్‌కెనాల్ చికిత్స

ఏదైనా ప్రమాదంలో పన్ను విరిగి డెంటిన్ దెబ్బతిన్నప్పుడు లోపల ఉండే రక్తకణాలు ఇన్‌ఫెక్షన్లకు లోనవుతాయి. అయితే ఒక్కోసారి ప్రమాదం జరిగిన వెంటనే కాకుండా కొన్ని వారాల తరువాత ఇన్‌ఫెక్షన్ల సమస్య మొదలవుతుంది. పంటి రంగు మారడం, అతివేడి లేక అతిచల్లదనానికి దంతాలు లాగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు ఉంటే లోపల ఉండే రక్తనాళాలు చనిపోయాయని గ్రహించాలి. వెంటనే వైద్యున్ని సంప్రదిస్తే దెబ్బతిన్న భాగాన్ని తొలగించి ఆ ఖాళీని ఒక ప్రత్యేకమైన సిమెంట్‌తో నింపుతారు. దీన్నే రూట్‌కెనాల్ చికిత్స అంటారు. పిప్పి పళ్ల విషయంలోనూ ఈ చికిత్స అవసరమవుతుంది.

పదార్థాల నిలువలు

దంతాల నిర్మాణం అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు, దంతాల మధ్య సందులు ఉన్నప్పుడు తిన్న పదార్థాలు వాటిలో నిలిచిపోతాయి. ఆ పదార్థాలను పూర్తిగా శుభ్రం చేయనప్పుడు అవి కూడా బ్యాక్టీరియాలకు నిలయమవుతాయి. పిప్పి పళ్లలో ఏర్పడే రంధ్రాలను సిమెంట్‌తో నింపుతారు. ఈ ఫిల్లింగ్స్ అవసరానికి మించి కాస్త ఎత్తుగా వేసినపుడు వాటి మీద కూడా ఆహారపదార్థాలు నిలిచిపోయే అవకాశం ఉంటుంది. పొగతాగడం వల్ల కూడా చిగుళ్లు దెబ్బతిని బ్యాక్టీరియా చేరుతుంది.

ఇతర వ్యాధులు

మధుమేహం, ల్యుకేమియా, హీమోఫీలియా, «థైరాయిడ్ గ్రంథి అతిగా పనిచేయడం, సి-విటమిన్ లోపించడం వల్ల చిగుళ్ల నుంచి రక్తస్రావం కలుగుతుంది. విటమిన్ డి లోపించినపుడు దంతాల్లో పెళుసుదనం, విటమిన్ కె లోపంతో చిగుళ్లలో రక్తస్రావం ఏర్పడుతుంది.
చిగురు వాపు (జింజైవా)

చిగురు ముందు భాగం తొలుత ఇన్‌ఫెక్షన్లకు గురవుతుంది. ఈ స్థితిలో అప్పుడప్పుడు కొద్దిపాటి రక్తస్రావం ఉంటుంది. ఆ తరువాత చిగురు ఉబ్బి మెత్తగా మారుతుంది. ఆ భాగమంతా ఎర్రగానూ మెరుస్తూ కనిపిస్తుంది. దీనివల్ల చిగురుకు, పన్నుకు మధ్య ఒక ఖాళీ ఏర్పడుతుంది. దీన్ని ప్యారడాంటల్ సమస్య అంటారు. అక్కడ బ్యాక్టీరియా చేరిపోయి ఖాళీ మరింత పెద్దదవుతుంది. రక్తప్రసారం తగ్గిపోతుంది. నిర్లక్ష్యం చేస్తే చీము చేరిపోయి చిగురు తన పట్టుకోల్పోతుంది. పంటికి ఆధారంగా ఉండాల్సిన చిగురు దెబ్బతినడంతో పన్ను ఊగడం మొదలవుతుంది.

బ్యాక్టీరియా దంతాన్ని తినేస్తుంది. దీనివల్ల దంతం విరిగిపోయే అవకాశం ఏర్పడుతుంది. పంటిలోని రక్తనాళాలు ఇన్‌ఫెక్షన్లకు లోనైనపుడు అది ఇతర అవయవాలకు పాకే అవకాశం కూడా ఉంటుంది. ప్రత్యేకించి ఇన్‌ఫెక్షన్లు గుండెపైన ఉండే ఎండోథెలియమ్ అనే పొరను దెబ్బతీస్తాయి. దీనితో గుండె నొప్పి మొదలయ్యే అవకాశం ఉంది. దీన్ని ఇన్‌ఫెక్టివ్ ఎండ్‌కార్‌డైటిస్ అంటారు.

జాగ్రత్తలు

ఉదయం, రాత్రి పడుకోబోయే ముందు పళ్లు తోముకోవడం చాలా అవసరం. అయితే బ్రష్ చేసుకోవడం వల్ల దంతాలు పూర్తిగా శుభ్రం కావు. పళ్ల మధ్య ఉండే అతి సన్నని సందులలోకి, దవడ చివరలో ఉండే పన్ను దాకా బ్రష్ వెళ్లకపోవచ్చు. అందువల్ల పళ్ల సందులను దారాలతో శుభ్రం చేయడం (ఫ్లాసింగ్), మౌత్‌వాష్ ద్రావణంతో నోరు పుక్కిలించడం(రిన్సింగ్) వంటివి చేయాలి. ప్రతి ఆరుమాసాలకు ఒకసారి దంతవైద్యున్ని సంప్రదించాలి. దీనివల్ల సమ్యస్యను తొలిదశలో గుర్తించడం సాధ్యమవుతుంది. తద్వారా మెరుగైన ఫలితాలను రాబట్టుకునేందుకు వీలవుతుంది.

చికిత్స

దంతాల మీద చేరిపోయిన హానికారక పదార్థాలను తొలగించడం(ప్రొఫెలాక్సిస్)జరుగుతుంది. పళ్లు లోపలి వరకు దెబ్బతిని రంధ్రాలు ఏర్పడి అందులో బ్యాక్టీరియా నిండినపుడు అక్కడ శుభ్రం చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత ఖాళీలను ఎముకపొడితో (సిమెంట్) నింపాల్సి ఉంటుంది. దీన్ని ప్లాప్ సర్జరీ అంటారు.
రూట్‌కెనాల్ చికిత్స

బ్యాక్టీరియా కారణంగా దంతంలోని రక్తకణాలు దెబ్బతింటున్న తొలిదశలో నొప్పి ఉంటుంది. అయితే ఆ రక్తకణాలు మొత్తంగా చనిపోయిన తరువాత నొప్పి ఉండదు. నొప్పి లేకపోవడం వల్ల సమస్య పూర్తిగా తగ్గిపోయిందని అనుకుంటారు. కానీ పన్ను లోపలి భాగం పూర్తిగా దెబ్బతింటుంది. చివరకు పన్ను విరిగిపోయే స్థితి ఏర్పడుతుంది. అంతకంటే కాస్త ముందు వైద్యున్ని సంప్రదిస్తే చికిత్స చేయవచ్చు. ఎక్స్‌రే ద్వారా పంటిని పరిశీలించి రక్తకణాలు పూర్తిగా దెబ్బతిన్న భాగాన్ని శుభ్రం చేసి సిమెంట్‌తో నింపాల్సి ఉంటుంది. దీన్ని రూట్‌కెనాల్ చికిత్స అంటారు. ఈ చికిత్స ద్వారా పన్ను విరిగిపోయే ప్రమాదం తప్పుతుంది.

ఆహారం

చిగుళ్లను రక్షించడంలో విటమిన్ సి పాత్ర చాలా కీలకం. నిమ్మ, దానిమ్మ వంటి పళ్లను తరచుగా తీసుకోవడం, లేక డాక్టర్ సలహా మేరకు విటమిన్ సి మాత్రలు వేసుకోవడం చేయాలి.
దంత నిర్మాణాన్నికాపడటంలో కాల్షియం, విటమిన్ డి కూడా ముఖ్యమే. ఉదయం వేళ కొంత సమయాన్ని సూర్యరశ్మిలో గడపటం, పాలు, గుడ్లు రోజు వారి మెనూలో ఉండేలా చూసుకోవాలి.
రక్తసంబంధమైన లోపాలు రాకుండా ఉండటం కోసం ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఆరోగ్యమైన చిగుళ్లు మీ సొంతమవుతాయి.

చర్మవాధ్యులకు '' నాన్‌వెజ్ '' తైలాలు

ఔషద మొక్కల మిశ్రమంతో తయారు చేసిన తైలాలే కాకుండా జంతు శరీర భాగాలను కలిపి చేసే తైలాలు కూడా ఆయుర్వేదంలో ఎన్నో ఉన్నాయి. వీటిలో కుట్లు వేయకుండానే గాయాలను మాన్పే శక్తివంతమైనవి కూడా ఉన్నాయి. ప్రమాదాలు లేదా శస్త్ర చికిత్సల వల్ల అయిన గాయాలు, డె ర్మటైటిస్, ఎగ్జిమా, సోరియాసిస్, దెబ్బలవల్ల ఏర్పడిన పుండ్లు, వెరికోస్ అల్సర్ల వంటివి ఈ తైలాలతో చాలా త్వరగా మానిపోతాయి.
అలాగే చర్మం ముడతలు, మొటిమల కారణంగా ఏర్పడే సన్నని గుంటలు ఇలా ఎన్నో రకాల సమస్యల నివారణలో ఆయుర్వేద తైలాలు గొప్పగా తోడ్పడతాయి. అలాంటి కొన్ని తైలాల వివరాలు మీకోసం...

తిలల (నువ్వులు) నుండి తీసిన నూనెలను తైలాలు అనడం పరిపాటి. అయితే ఆ తరువాత తిలల వంటి ఇతర నూనె గింజల నుండి తీసిన తైలాలను కూడా తైలాలుగానే పిలవడం మొదలయ్యింది. తైలాలకు ఔషధ మొక్కల కల్కాన్ని కలిపి తైలపాక విధిలో తయారుచేసిన నూనెల్ని కూడా తైలాలుగానే గుర్తిస్తున్నారు. ఇవన్నీ ఆయుర్వేద తైలాలుగా బాగా ప్రసిద్ధి పొందాయి.

అయితే ఔషధ మొక్కలు కాకుండా కొన్ని జంతువుల భాగాలు తీసుకుని నూనెల గింజల నుండి తీసిన నూనెను కలిపిగానీ లేదా కలపకుండా గానీ కొన్ని తైలాలను తయారు చేస్తారు. అందులో భాగంగా ఈము పక్షి కొవ్వు, కాడ్ చేప లివర్ ఇలాంటివి తీసుకుని తైలపాక విధానం లేకుండా తైలాలు తయారు చేస్తారు. ఇందుకు భిన్నంగా అండతైలం (గుడ్డు నూనె), మూషికా తైలాలను మాత్రం తైలపాకవిధిలో తయారు చేస్తారు.

ఈము తైలం

ఈము ఒక ఆస్ట్రేలియన్ పక్షి పేరు. ఈ పక్షి వీపు పైన ఉండే కొవ్వును కరిగించడం ద్వారా ఈ తైలాన్ని తయారు చేస్తారు. ఈ తైలంలో విటమిన్-ఇ ఎక్కువగా ఉంటుంది.
ఉపయోగాలు:

* ఈ తైలంతో డ్రెస్సింగ్ చేస్తే ప్రమాదాలు లేదా శస్త్ర చికిత్సల వల్ల అయిన గాయాలు చాలా త్వరగా మానిపోయే అవకాశం ఉంది. గాయాలతో ఏర్పడిన మచ్చలు, అలాగే కీలాయిడ్స్‌ను నిరోధించడంలోనూ ఈ తైలాలు ఎంతో తోడ్పడతాయి. * క్రిమి, కీటకాలు కుట్టడం వల్ల కలిగే నొప్పి, దురద, మంట వాపులు ఈ తైలం రాస్తే తగ్గుముఖం పడతాయి. * డెర్మటైటిస్, ఎగ్జిమా, సోరియాసిస్ వ్యాధుల్లో చర్మం పైనున్న తేమ తగ్గి పొలుసులుగా రాలుతూ ఉంటుంది. పైగా వాపు, దురద కూడా ఉంటాయి. ఆ భాగాల్లో ఈ తైలాన్ని రోజూ రాస్తే మాయిశ్చరైజర్‌లా పనిచేసి చర్మంలోని తేమ ఇగిరిపోకుండా ఉంటుంది.
* గాయాలు కండరాల లోతుల్లోకి వె ళ్లినప్పుడు కొందరిలో గాయం పైకి కనిపించకపోవచ్చు. కానీ, కమిలినట్లు నల్లబడుతుంది. అలాంటి వాటి పైన ఈ తైలం రాస్తే వారంలోపే తగ్గిపోతుంది.
* ఈ తైలంతో మర్ధన చేస్తే చర్మ ముడతలు తగ్గిపోతాయి. ప్రత్యేకించి కొందరిలో వచ్చే అకాల వృద్దాప్య లక్షణాలకు ఈ తైలం సంజీవని లాంటి ది.
* శరీరం బరువు పెరగడం వల్లగానీ, గర్భధారణ వల్లగానీ ఏర్పడే స్ట్రెచ్ మార్క్స్ రాకుండా నివారించడంలోనూ ఈ తైలం బాగా ఉపయోగపడుతుంది.
* మొటిమలను తగ్గించడంలోనూ, మొటిమల కారణంగా ఏర్పడే పలుచని గుంటలను నివారించడంలోనూ ఈ తైలంతో చేసే ఫేషియల్స్ ఉపయోగపడతాయి.
చేపనూనె:

'కాడ్' అనే చేప లివర్ నుండి తీసిన కాడ్ లివర్ ఆయిలే చేపనూనెగా ప్రసిద్ధి పొందింది. ఈ తైలంలో విటమిన్-ఎ, డిలతో పాటు ఎస్సెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి.
ఉపయోగాలు

* ఎగ్జిమా, సోరియాసిస్ వంటి చర్మం పొడిబారే వ్యా«ధులకు ఈ తైలం క్యాప్సూల్స్ బాగా ఉపయోగపడతాయి. వీటితో పాటే క్రీముగా చర్మంపై పూతగా వాడితే దురదలు తగ్గుతాయి.
* ఇందులోని విటమిన్లు యాంటిఆక్సిడెంట్స్‌గా పనిచేస్తూ చర్మాన్ని కాపాడ తాయి.
గుడ్డు సొన నూనె

విరివిగా దొరికే అవకాశం ఉన్నందున ఈ తైలం తయారీకి కోడిగుడ్లనే ఉపయోగిస్తారు. ఈ తైలంలోనూ ఎస్సెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి.
ఉపయోగాలు:

చి కాలిన గాయాలకు, దెబ్బ తగలడం వల్ల ఏర్పడిన పుండ్లకు, వెరికోస్ అల్సర్లకు ఈ తైలంతోవేసే పూత ఎంతో ఉపశమనాన్ని ఇస్తుంది. గాయాలు చాలా త్వరగా కూడా మానతాయి.
చి ఈ తైలానికి తగు నిష్పత్తిలో కొబ్బెరినూనె లేదా నువ్వుల నూనె కలిపి తలకు పట్టిస్తే జుట్టు రాలడం తగ్గుతుంది. మూషికా తైలం ఎలుక మాంసానికి నువ్వుల నూనె చేర్చి తయారు చేసే తైలమిది.
ఉపయోగాలు:
* ఈ తైలంతో డ్రెస్సింగ్ చేస్తే కండరాలు తెగి వాలిపోయేటంతటి పెద్ద గాయాలు కూడా చాలా త్వరగా మానతాయి. * ఈ తైలం రాచపుండ్లు మానడంలోనూ బాగా తోడ్పడుతుంది.
* చర్మం పైన ముడతలు తగ్గడానికి, జారిన అవయవాలు (ప్రొలాప్స్ యుటెరస్/ రెక్టమ్) బిగువు పొందడానికి కూడా ఈ తైలం బాగా ఉపయోగపడుతుంది.

డాక్టర్ చిలువేరు రవీందర్
అసిస్టెంట్ ప్రొఫెసర్,
డాక్టర్ బిఆర్‌కెఆర్ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల, హైదరాబాద్,
ఫోన్: 9848750720.

క్యాన్సర్ దరిచేరకుండా ఉండాలంటే...! * చిన్న చిన్న జాగ్రత్తలు

క్యాన్సర్... తొలిదశలోనే గుర్తిస్తే నయమయ్యే వ్యాధే అయినా నిర్లక్ష్యం వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఎక్కువ శాతం మంది క్యాన్సర్ బాధితుల్లో వంశపారపర్యం, ఆహారపు అలవాట్లే ప్రధాన కారణమని పలు అధ్యయనాల్లో వెల్లడయిన సంగతి తెలిసిందే. మరి దీన్ని ఎదుర్కొనే మార్గమే లేదా? అంటే చిన్న చిన్న జాగ్రత్తలు పాటించడం ద్వారా క్యాన్సర్ వచ్చే అవకాశాలను తగ్గించుకోవచ్చని పరిశోధకులు అంటున్నారు.

అమెరికన్ క్యాన్సర్ రీసెర్చ్, వరల్డ్ క్యాన్సర్ రీసెర్చ్ ఫండ్‌లు నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడయింది. బరువు, ఆహారం, వ్యాయామం... ఈ మూడు మనిషి ఆరోగ్యంగా ఉండటానికి తోడ్పడతాయి. ఎటువంటి అనారోగ్య సమస్యలు దరి చేరకూడదంటే ఆరోగ్యకరమైన బరువు ఉండటం చాలా అవసరం. అంతేకాకుండా ప్రతిరోజు అరగంటపాటు వ్యాయామం చేయాలి. సమయానికి భోజనం చేయాలి.

పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. నూనెలో వేయించిన పదార్థాలకు, ఫాస్ట్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి. ఈ రకమైన మార్పులతో క్యాన్సర్ వచ్చే అవకాశాలను చాలా వరకు తగ్గించుకోవచ్చని అధ్యయనంలో తేలింది. వీటికి తోడుగా పోగాకు ఉత్పత్తులకు పూర్తిగా దూరంగా ఉండాలి. అప్పుడే క్యాన్సర్ రాకుండా కాపాడుకోవచ్చని అధ్యయనంలో పాలుపంచుకున్న శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

శిశువులపై ఆహార ప్రభావం

గర్భిణిలు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని పెద్దలందరూ చెబుతుంటారు. దీన్ని నిర్ధారిస్తూ ఎన్నో పరిశోధనా ఫలితాలు వెలువడ్డాయి కూడా. అయితే గర్భిణులు తీసుకునే ఆహార పదార్థాల రుచులు పుట్టబోయే శిశువుల మెదడు ఆకారాన్ని నిర్దేశించడంతోపాటు వారి ఆసక్తులపై ప్రభావం చూపిిస్తాయని తాజా సర్వే ఒకటి పేర్కొంటోంది.

గర్భిణిలు తీసుకునే ఆహారాన్ని బట్టే భవిష్యత్తులో శిశువులు ఆహార పదార్థాలను ఇష్టపడడం ఉంటుందని ఈ అధ్యయనంలో వెల్లడైంది. ఎంత పోషకాహారం తీసుకుంటే శిశువుల తెలివితేటలు అంతగా వృద్ధి చెందుతాయని ఈ అధ్యయనంలో పాల్గొన్న యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో న్యూరోసైంటిస్ట్ డిగోరెస్ట్రెపో పేర్కొంటున్నారు. ఈ అధ్యయనంలో భాగంగా గర్భంతో ఉన్న ఎలుకలను మూడు మూడు బృందాలుగా చేశారు.

ఒక బృందానికి రుచులులేని సాధారణ ఆహారం, మరో బృందానికి అన్నిరకాల రుచులను, మూడో బృందానికి ఘాటు రుచులున్న ఆహారాన్ని ఇచ్చారు. అవి ప్రసవించిన తర్వాత వాటి పిల్లలు తీసుకునే ఆహారాన్ని పరిశీలించగా అవి తల్లి గర్భంతో ఉన ్నప్పుడు తీసుకున్న ఆహారాన్ని పోలిఉండడం గమనించారు. అంటే గర్భిణులుగా ఉన్న సమయంలో తీసుకునే ఆహారం బిడ్డ ఇష్టాఇష్టాలను నిర్ధేశిస్తుందని ఈ అధ్యయనం వెల్లడిస్తోంది.

పసికందులు అంధులైతే....

మనదేశంలో ప్రతి నాలుగు నిమిషాలకు ఒకరు చొప్పున పిల్లలు అంధత్వానికి గురవుతున్నారు. ఆ లెక్కన ప్రస్తుతం మన దేశంలో రెండు లక్షలా డెబ్బై వేల మంది చిన్నారులు అంధులుగా ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి. రెండేళ్లలోపే అంధత్వానికి గురైన పిల్లల్లో సుమారు 50 శాతం మంది 5 ఏళ్ల లోపే చనిపోతున్నారు. నిజానికి అంధత్వాన్ని కలిగించే ఈ సమస్యల్లో 70 శాతం దాకా నివారించడం సాధ్యమయ్యేవే. చిన్న వయసులోనే కంటి సమస్యలను గుర్తించి అవసరమైన వైద్య, శస్త్ర చికిత్సలు అందించకపోతే అది అంధత్వానికి దారి తీస్తుంది. అందుకే ముందస్తు జాగ్రత్తలే పిల్లలను అంధత్వ ముప్పునుంచి తప్పిస్తాయంటున్నారు, నేత్ర వైద్య నిపుణురాలు డాక్టర్ మాధవి.
శుక్లాలతో పుట్టిన పిల్లలను చూసి జాలిపడతారు. లేదా ఉన్నంతలో ఏదో ఆర్థిక సహాయం చే స్తారు. అంతేగానీ, వెంటనే వైద్యపరీక్షలు చేయించడం గానీ, మందులతోనో లేదా శస్త్ర చికిత్సల ద్వారానో పరిస్థితి చక్కబడే అవకాశాల గురించి ఆలోచించడమో చాలా మంది చేయరు. ఫలితంగా పరిస్థితి చక్కబడే అవకాశం కూడా జారిపోయి, వారు శాశ్వత అంధులుగా మారే స్థితికి దారి తీస్తుంది.

కొంత మంది పిల్లలు కార్నియా లోపం కారణంగా పుట్టుకతోనే అంధులవుతారు. అయిన వాళ్లంతా ఆ స్థితిని ఎవరూ ఏమీ చేయలేర న్నట్లు వదిలేసి ఊరుకుంటారు. నిజానికి కార్నియా మార్పిడి చికిత్సతో కొంత మేరకైనా వారికి తిరిగి చూపు అందించే అవకాశాలు ఉంటాయి. నేత్ర వైద్య విభాగంలో వచ్చిన అధునాతన చికిత్సల గురించిన అవగాహన లేకపోవడమే సమాజంలో మన దేశంలో లక్షలాది మంది పిల్లలు జీవితమంతా అంధులుగానే ఉండిపోయే పరిస్థితి ఎదురవుతోంది.

పిల్లల్లో వచ్చే విటమిన్-ఎ లోపాలు, మశూచికం, రుబెల్లా, ఆఫతాల్మిక్ నియోనెటోరియం వంటి సమస్యలను నివారించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక శుక్లాలు, నీటికాసులు (గ్లకోమా), కార్నియా అంధత్వం, మెల్లకన్ను, రెటినోపతి ఆఫ్ ప్రిమెచ్యురిటీ, రెటినో బ్లాస్టోమా, మరికొన్ని దృష్టిలోపాలు వీటిని వైద్య చికిత్సలతో తొలగించడం సాధ్యమవుతుంది. కానీ, ఈ విషయం తెలియక కంటి సమస్యలను అవేవో శాప ఫలితాలు అన్నట్లు అలా వదిలేయడం వల్ల ఎంతో మంది పిల్లలు కనుచూపు నోచుకోకుండా కాలం వెళ్లదీయాల్సి వస్తోంది.

ఎలా తెలుస్తాయి ?

సాధారణంగా ఆరు మాసాల వయసు నుంచే పిల్లలు తల్లిని గుర్తు పడుతుంటారు. పరిశీలనగా అన్ని వైపులా చూడటం కూడా చేస్తుంటారు. ఆ లక్షణాలేమీ కనిపించకపోతే ఆ పిల్లల్లో కంటికి సంబంధించి ఏదైనా సమస్య ఉన్నట్లు భావించాలి. తరుచూ కనురె ప్పలు కొట్టుకోవడం, కనుగుడ్లు అదేపనిగా తిప్పుతూ ఉండడం, రంగు వస్తువులను చూపినా వాటిమీద దృష్టి పడకుండా మరోవైపు చూడటం, కళ్లు మరీ పెద్దవిగా ఉండడం వంటివి కూడా కంటి సమస్యలు ఉన్నట్లు అనుమానించే అంశాలే.

అయితే తలిదండ్రులకు ఈ విషయాల మీద అనుమానం కలిగినా వయసు పెరుగుతూ ఉంటే ఇవన్నీ వాటంతట అవే పోతాయి అనుకునే వారే ఎక్కువ. కానీ, ఆ లక్షణాలు ఆ తరువాత ఒక తీవ్రమైన సమస్యకు గురిచేస్తాయనే అవగాహన లేక పోవడమే ఇందుకు కారణం. పిల్లల్లోని ఈ అసహజ లక్షణాలను ముందే గుర్తించి మందులో లేదా శస్త్ర చికిత్సలో అందిస్తే ఆ తరువాత పిల్లలు చూపు కోల్పోయే పరిస్థితి రాకుండా నివారించవచ్చు.

విటమిన్-ఏ లోపాలు:

పిల్లల్లో కార్నియా సమస్యతో వచ్చే అంధత్వానికి విటమిన్-ఏ లోపమే ప్రధాన కారణం. ఈ లోపం వల్ల ముందుగా రేచీకటి సమస్య వస్తుంది. బాగా అలవాటైన ప్రదేశంలో కూడా పిల్లలు రాత్రిపూట తడబడుతున్నా, పదే పదే వస్తువులను గమనించక వాటిని పడదోస్తున్నా అది రేచీకటి సమస్యగా గుర్తించాలి.

కంటిలో తడి ఆరిపోవడం, తెల్లగుడ్డుపైన బూడిద రంగు మచ్చలు ఏర్పడటం ఉంటాయి. చివరి దశలో కార్నియా దెబ్బతిని అంధత్వం వస్తుంది. నివారణగా ప్రతి ఆరుమాసాలకు ఒకసారి 200000 ఐయు విటమిన్-ఎ ఇస్తూ ఉండాలి. పాలు ఇచ్చే తల్లులకు ప్రసవం నుంచి తగిన మోతాదులో విటమిన్-ఏ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే మశూచి టీకాలు కూడా ఇప్పించడం ద్వారా కార్నియా సమస్యను నియంత్రించవచ్చు.

కళ్లకలక (ఆఫతాల్మిక్ నియోనెటోరియం) కొంత మంది పిల్లలు 10 రోజుల వయసులోనే కళ్లకలక సమస్యకు గురవుతుంటారు. గర్భిణులు బ్యాక్టీరియా, వైరస్ ఇన్‌ఫెక్షన్లకు గురైనప్పుడు ఆ సమస్య కడుపులో ఉన్న శిశువుకు కూడా సోకుతుంది. ఫలితంగా పుట్టిన శిశువు కళ్లల్లో పుసులు కట్టడం, కళ్లలోంచి ఒక జిగురు పదార్థం స్రవించడం కనిపిస్తుంది.

వెంటనే వైద్యం అందకపోతే కంటి కార్నియా దెబ్బతిని అంధత్వం రావచ్చు. అందుకే గర్భిణిగా ఉన్నప్పుడు గానీ, ప్రసవ సమయంలో గానీ, తల్లులు ఇన్‌ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడటం చాలా ముఖ్యం. అలాగే పుట్టిన పాప కళ్లు పరీక్షించి కళ్లకలక ఉంటే కళ్లను శుభ్రపరుస్తూ పొవిడీన్ ఐయాడీన్ ద్రావకం చుక్కలను కంటిలో వేయాలి.

రుబెల్లాతో జాగ్రత్త...

మూడు నుంచి ఆరుమాసాల గర్భంతో ఉన్నప్పుడు తల్లులు రుబెల్లా అనే వైరల్ ఇన్‌ఫెక్షన్లకు గురైతే బిడ్డ పలురకాల రుగ్మతలతో పుడుతుంటారు. ముఖ్యంగా పుట్టుకతో వచ్చే గుండెలోపాలు, చెవిటితనం, మానసిక వైకల్యం, రోజులు గడిచే కొద్దీ దంతాల లోపాలు, కంటి శుక్లాలు, గ్లకోమా, రెటీ నా పరమైన వ్యాధులు కూడా ఈ పిల్లలకు రావచ్చు. ఈ స్థితిని నివారించడానికి యుక్తవయసులో ఉన్న యువతులకు రుబెల్లా టీకాలు తప్పనిసరిగా ఇప్పించాలి.

అపోహలూ ఎక్కువే...

పిల్లల్లో కంటి సమస్యలు ఎన్ని ఉన్నా వయసు పెరిగితే వాటంతట అవే త గ్గిపోతాయనుకోవడం, కళ్లు ఎరుపెక్కితే తల్లి చనుబాలు పోయడం, కొన్ని సందర్భాల్లో కంట్లో ఆకు పసర్లు, ఇతర మూలికా మందులు వేయడం, గర్భిణిగా ఉన్నప్పుడు అవసరమైన మందులు, టీకాలే వీ తీసుకోకపోవడం, మేనరిక వివాహాలు ఇవన్నీ పిల్లల్లో కంటి సమస్యలను పెంచి చివరికి వారి చూపునే హరిస్తున్నాయి.

పిల్లల్లో శుక్లం

ప్రతి రెండు వేల మంది పిల్లల్లో ఒక రు పుట్టుకతోనే శుక్ల సమస్యకు గురయ్యే వీలుంది. కొంతమంది పిల్లలకు పుట్టుకతో గానీ, కొంత వయసు వచ్చిన తరువాత గానీ ఒక కంట్లో లేదా రెండు కళ్లల్లో శుక్లాలు రావచ్చు. ఇందుకు గల కారణాల్లో బిడ్డ గర్భంలో ఉన్నప్పుడు తల్లి ఇన్ ఫెక్షన్లకు గురికావడం, జన్యుపరమైన కార ణాలు, కంటికి బలంగా దెబ్బ త గలడం వంటివి ప్రధానమైనవి.

ఈ వ్యాధి సోకినప్పుడు కనుపాప నల్లగా కాకుండా తెలుపు రంగులోకి మారుతుంది. ఈ పిల్లల్లో వెలుతురు చూడలేకపోవడం, చూపు నిలబెట్టలేకపోవడం, కనుగుడ్డును అతిగా తిప్పడం, ఎక్కువగా కళ్లు చిట్లించి చూడటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ స్థితిలో శస్త్ర చికిత్స ద్వారా శుక్లాన్ని తీసివేయడం ఒక్కటే పరిష్కారం. శుక్లాల కారణంగా పిల్లల్లో చేసే శస్త్ర చికిత్స, పెద్దవారిలో చేసే శస్త్ర చికిత్స ఈ రెండు వేరు వేరు.

రెండేళ్ల లోపు పిల్లలకు ఈ శస్త్ర చికిత్స చేసినప్పుడు వారికి ఐదేళ్లు వచ్చేదాకా లావుపాటి అద్దాలు వాడాల్సి ఉంటుంది. రెండవ సారి శస్త్ర చికిత్స చేసి కంట్లో అద్దం అమర్చాక సాధారణ అద్దాలే సరిపోతాయి. అయితే ఒకసారి ఈ శస్త్ర చికిత్స జరిగిన పిల్లలను జీవితాంతం నేత్రవైద్యుని పర్యవేక్షణలో ఉంచడం చాలా అవసరం.

గ్లకోమా (నీటికాసులు)

ఈ వ్యాధి సోకే వారిలో పెద్ద వారే ఎక్కువగా ఉంటారు. అయితే పిల్లల్లోనూ ప్రతి 10 వేల మందికి ఒకరు చొప్పున ఈ వ్యాధి బారినపడుతుంటారు. గ్లకోమాతో కంటిలో ఒత్తిడి పెరిగి, అక్కడున్న నరం దెబ్బ తిని అంధత్వం వస్తుంది. ఈ వ్యాధి సోకిన పిల్లల్లో కనుపాప పెద్దదవుతుంది. వెలుతురు చూడలేకపోవడం, కంట్లోంచి నీరు కారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కంటిలోని ఒత్తిడిని తగ్గించడానికి శస్త్ర చికిత్స ఒక్కటే పరిష్కారం. ఆ తరువాత కూడా ఒత్తిడి తగ్గకపోతే మరోసారి శస్త్రచికిత్స చేయవలసి రావచ్చు. లేదా మందులు వాడవలసి రావచ్చు. ఏమైనా గ్లకోమా ఉన్న వారు జీవితాంతం డాక్టర్ పర్యవేక్షణలో ఉండడం చాలా అవసరం.

మెల్ల

మెల్ల ఉన్నప్పుడు ఒక క న్ను సమాంతరంగా ఉండదు. అందుకే రెండు కళ్లనుంచి మెదడుకు చేరే ప్రతిబింబాలు కూడా సమంగా ఉండవు. మెదడు స్పష్టంగా ఉన్న ప్రతిబింబాన్ని పరిగణనలోకి తీసుకుని మసకగా ఉండే రెండవ ప్రతిబింబాన్ని నిర్లక్ష్యం చేస్తుంది. అలాగే ఇంకొంత కాలం గడిస్తే మెల్లకంటి చూపు మరింత తగ్గి చివరికి అంధత్వానికి దారి తీస్తుంది. ఈ స్థితిని యాంబిలోపియా అంటారు.

మెల్ల కన్ను ఉన్నప్పుడు ఆరేళ్ల లోపే గుర్తించి తగిన వైద్య చికిత్సలు చేయవలసి ఉంటుంది. మెల్ల నివారణలో కంటి కండరాలను సరిచేయడానికి శస్త్ర చికిత్స కూడా అవసరమవుతుంది. మెల్లను పూర్తి స్తాయిలో తొలగించడానికి కొందరికి రెండవసారి కూడా శస్త్ర చికిత్స చేయవలసి రావచ్చు. శస్త్ర చికిత్స తరువాత దృష్టిలోపాలకు కళ్లజోడు కూడా వాడవలసి ఉంటుంది.

కంటి చూపు వృద్ధికి...

కొంత మంది పిల్లల్లో మందులతోగానీ, శస్త్ర చికిత్సల వల్ల గానీ చూపును మెరుగుపరిచే అవకాశాలు ఉండవు. అలాంటి వారిలో అప్పటికి ఇంకా మిగిలి ఉన్న చూపును మెరుగుపరిచే ఆధునిక చికిత్సలు కొన్ని ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. పిల్లల ప్రస్తుత కంటి చూపును అంచనా వేసి కొన్ని రకాల బూతద్దాలు, టెలిస్కోపులు, ప్రత్యేకమైన కళ్లజోడు, కొన్ని ప్రత్యేకమైన లైట్ల ద్వారా పిల్లల చూపును మెరుగు పరిచే అవకాశాలు ఉన్నాయి.

అయితే అప్పటికే అంధత్వం కారణంతా బ్రెయిలి లిపికి అలవాటు పడితే ఈ పరికరాలను ఉపయోగించడానికి అంతగా ఇష్టపడరు. అందుకే చిన్న వయసులోనే పిల్లల అంధత్వాన్ని అంచనా వేసి అందుబాటులో ఉన్న సదుపాయాలను వినియోగించుకుంటే ప్రయోజనం ఉంటుంది. పుట్టుకతో వ చ్చిన అంధత్వాన్ని పూర్తిగా జయించలేకపోయినా, ప్రయోజనకరమైన కంటిచూపును పొందే అవకాశాలు ఉన్నాయి. "ఆలస్యం...అమృతం...విషం'' అన్న నానుడి పిల్లల కంటి సమస్యల విషయంలో నూటికి నూరు పాళ్లు నిజం.


-డాక్టర్ జి.మాధవి
కన్సల్టెంట్ ఆప్తమాలజిస్టు,
మెడికల్ డైరెక్టర్, గౌతమి ఐ ఇనిస్టిట్యూట్, రాజమండ్రి,
ఫోన్ : 9502136068

డిస్క్‌ప్రొలాప్స్‌తో ఎన్ని ఇక్కట్లో...

శరీర వ్యవస్థలో వెన్నెముక ఒక మూలస్తంభం లాంటిది. ఆ మూల స్తంభం దెబ్బ తింటే ఎటూ కదల్లేక నేల మీద వాలిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అసలు ఈ సమస్యలు రాకుండా జాగ్రత్త పడటమే ఉత్తమం. ఒకవేళ ఆ సమస్యలు వస్తే, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వైద్య చికిత్సలు తీసుకోవడం చాలా అవసరం. లేదంటే శరీరం శాశ్వతంగా మూలనపడే ముప్పు ఏర్పడుతుందంటున్నారు నిపుణులు.

* వెన్ను పలు విభాగాల సమ్మేళనం. వెన్నుముకకు తోడుగా కండరాలు, లిగమెంట్లు, డిస్కులు ఉంటాయి. వెన్నెముక సులభంగా వంగడానికి డిస్కులు, లిగమెంట్లు తోడ్పడతాయి. మెడనుంచి న డుము వరకు ఉండే ఈ వెన్నెముకలో 33 పూసలు ఉంటాయి. వెన్నెముకలోని ప్రతి రెండు పూసలను బంధిస్తూ లిగమెంట్లు ఉంటాయి. పూసల మధ్య రబ్బరు కుదురు లాంటి ఒక పదార్థం ఉంటుంది.

దీనికే డిస్క్ అని పేరు. వెన్నెముక పొడవునా లేదా వెన్నుపాము (స్పైనల్ కార్డ్) ఉంటుంది. దీంట్లోంచి అసంఖ్యాకమైన నరాలు వెళుతుంటాయి. మెడభాగం నుంచి వె ళ్లే నరాలు చేతుల్లోకి వెళతాయి. న డుము నుంచి వెళ్లే నరాలు కాళ్లలోకి వెళతాయి. వీటిలో కొన్ని నరాలు మూత్రకోశం, మలవిసర్జక భాగంతో పాటు లైంగిక భాగాల్లోకీ వెళతాయి. వెన్నుపూసల మధ్య ఉండే డిస్కు దెబ్బ తినడం శరీరంలోని ఒక పరిణామం.

శరీరంలోని కదలిక లకు ఒక ప్రధాన కేంద్రంగా ఉండడం వల్ల సర్వైకల్, లుంబార్ భాగాల్లోని డిస్క్‌లే ఎక్కువగా దెబ్బతింటూ ఉంటాయి. అంటే ఉన్న స్థానం నుంచి పక్కకు జరుగుతాయి ఈ స్థితినే డిస్క్ ప్రొలాప్స్ అంటారు. శరీరంలో వెన్నుపాము ఒక మూలస్తంభం లాంటిది. దానికి ఇరువైపులా, ఉదరభాగంలోనూ కండరాలు ఉంటాయి. నిరంతరం శరీర శ్రమ చేసివారిలో ఈ కండరాలు బలిష్టంగా ఉంటూ వెన్నుపూసలకు సహాయంగా ఉంటాయి.

ఈ శరీర శ్రమేదీ లే ని వారిలో కండరాలు బలహీనమై శరీర భారమంతా వెన్నుపాము మీదా అలాగే డిస్కుల మీదా పడుతుంది. ఆ ఒత్తిడికి లోనైన డిస్కు తన స్థానం నుంచి పక్కకు జరుగుతుంది. ఈ స్థితినే డిస్క్ ప్రొలాప్స్ అంటారు. ఈ స్థితిలో పక్కకు జరిగిన డిస్కు పక్కనున్న నాళాల మీద వాలిపోతుంది. ఆ తరువాత వచ్చే సమస్యల అన్నిటికీ ఇదే మూలం. డిస్కు నాళాల మీద వాలిన వెంటనే నొప్పి రావడం మొదలువుతుంది.

సాధారణంగా డిస్క్ ప్రొలాప్స్ సమస్యలకు గురయ్యే వారిలో ఎక్కువగా వృద్దులే ఉంటారు. అయితే శరీర శ్రమ బాగా తగ్గిపోవడం వల్ల ఇటీవలి కాలంలో యుక్తవయస్కులు కూడా ఈ సమస్యకు లోనవుతున్నారు. డిస్కుల్లో సహజంగానే కొంత ద్రవం ఉంటుంది. డిస్కుల్లో వెన్నుపూసను పట్టి ఉంచే బిగువు ఈ ద్రవం వల్లే కలుగుతుంది.. అయితే వయసు పైబడే కొద్దీ ద్రవం క్రమంగా తగ్గిపోయి డిస్కు మెత్తబడుతుంది. ఆ తరువాత వెన్నుపూసకు ఆధారంగా ఉండలేక డిస్కు తన స్తానం నుంచి కొంత పక్కకు జరిగి నరాల మీద వాలిపోతుంది. వెన్ను నొప్పి కారణాల్లో ఇదీ ఒకటి.

* డిస్కు సమస్యలకు స్థూలకాయం మరో ప్రధాన కారణం. బరువు పెరిగే కొద్దీ డిస్కుల మీద భారం పెరిగి అవి బయటికి అంటే త మ సహజ స్థానం నుంచి పక్కకు జరుగుతాయి.
* పని భారాన్ని అన్ని అవయవాల మీద సమంగా వేయకుండా ఆ ఒత్తిడి అంతా వెన్నెముక మీదే పడేలా చేయడం మరో కారణం.అలాగే శక్తిని మించిన బరువులు ఎత్తడం, ఏ శిక్షణా లేకుండానే హై జంప్, లాంగ్ జంప్, హెవీ వెయిట్ లిఫ్టింగ్‌లు, ఎక్కువ దూరం రన్నింగ్ చేయడం, రోజంతా వంగి పనిచేయడం డిస్కు ప్రొలాప్స్ కు దారి తీసే మరికొన్ని ఇతర కారణాలు. అలాగే వయాగ్రా లాంటి కృత్రిమ ప్రేరకాలు కూడా డిస్కు సమస్యలకు కారణమవుతాయి.

ఇవే కాకుండా ఏదైనా ప్రమాదంలో వెన్నుపూసల మీద బలంగా దెబ్బ తగలడం, మనం ప్రయాణిస్తున్న వాహనాలు గోతుల్లో పడిపోవడం కూడా ఈ సమస్యలను తెచ్చిపెడతాయి. కొందరిలో టిబి ఇన్‌ఫెక్షన్లు కూడా వెన్నుపూసను దెబ్బ తీసే ప్రమాదం ఉంది. పక్కకు జరిగిన డిస్కు నరాల మీద పడిపోయినప్పుడు నొప్పి మాత్రమే కాకుండా కొన్ని సార్లు పక్షవాతం కూడా రావచ్చు.

డిస్క్ దెబ్బతింటే...

మెడ భాగంలో మొదలయ్యే సర్వైకల్ స్పాండిలోసిస్ సమస్యతో మెడతో పాటు చేతి నరాల్లోనూ నొప్పివస్తుంది. నడుము భాగంలోని డిస్కులు పక్కకు జరిగిన వారికి పడుకుని లేదా కూర్చుని ఉంటే ఏమీ అనిపించదు. కానీ, లేచి కొద్ది దూరం నడవగానే వెన్నునొప్పి మొదలవుతుంది. కాళ్లల్లో నొప్పితో పాటు నరం ఒత్తిడికి గురవుతున్న చోట తిమ్మిరి వస్తుంది. నడకలో ఇబ్బందులు మొదలవుతాయి ఈ స్థితినే సయాటికా అంటారు.

చికిత్సలేమిటి?

ఎంఆర్ఐ పరీక్షలోనే దాదాపు 50 మందిలోని డిస్క్ ప్రొలాప్స్ సమస్య కనిపిస్తుంది. నిజానికి డిస్క్ ప్రొలాప్స్‌తోనే సమస్య కాదు. ప్రొలాప్స్ తరువాత నొప్పి వస్తేనే దాన్ని సమస్యగా భావించాలి. నొప్పి లేనప్పుడు పక్కకు జరిగిన డిస్కులు వాటికవే తిరిగి తమ సహజ స్థానానికి వచ్చే అవకాశం ఉంది. వాస్తవానికి 90 శాతం డిస్కు సమస్యలు మందులతోనే నయమవుతాయి.

మిగతా ఆ 10 శాతం మందికే శస్త్ర చికిత్స అవసరమవుతుంది. కాళ్లల్లో బలహీనతగానీ, తిమ్మిరిగానీ లేకుండా కే వలం నొప్పి మాత్రమే ఉంటే మందులు, ఫిజియోథెరపీతో సమస్య ముగిసిపోతుంది. కొందరిలో మందులు వాడుతున్నా తిమ్మిర్లతో పాటు కాళ్లు లేదా చేతులు బలహీనపడుతూ నొప్పి భరించలేని స్థితికి చేరుతుంది. తమ ఉద్యోగ, వ్యాపారాలేవీ చేసుకోలేని స్థితికి కూడా కొందరు వచ్చేస్తారు. అలాంటి వారికి శస్త్ర చికిత్స తప్పనిసరి అవుతుంది.

సాధారణంగా డిస్కు ఏదో ఒక పక్కకు జరగడమే చూస్తాం. కానీ, అరుదుగా కొందరిలో డిస్కు మద్యలో దెబ్బ తింటుంది. ఇది మరీ తీవ్ర సమస్య. ఈ సమస్యతో లైంగిక శక్తి దెబ్బ తింటుంది. చివరికి మలమూత్ర విసర్జనలు కూడా ఆగిపోతాయి, ఈ స్థితిలో తక్షణమే శస్త్ర చికిత్స చేయవలసి ఉంటుంది. ఆలస్యం చేస్తే ఇది ప్రాణాపాయానికి కూడా దారి తీయవచ్చు.

నివారణేమిటి ?

రోజూ పొట్ట, మెడ కండరాలను పటిష్టపరిచే వ్యాయామాలు చేస్తే నడుము భాగంలో వచ్చే లుంబార్ స్పాండిలోసిస్ గానీ, మెడ భాగంలో వచ్చే సర్వైకల్ స్పాండిలోసిస్ సమస్యలు గానీ రాకుండానే కాపాడుకోవచ్చు. నిజానికి మన రోజు వారి కార్యకలాపాలన్నిలోనూ శరీరాన్ని ముందు వైపు వంచే ఉంచుతాం.
ఈ స్థితిని బ్యాలెన్స్ చేసేందుకు శరీరాన్ని వెనుకకు వంచే సాధన లేవీ చాలా మంది చేయరు. అందుకే విధిగా శరీరాన్ని ముందుకు వ ంచే ఫ్లెక్షన్ వ్యాయామాలతో పాటు వెనక్కు వంచే ఎక్స్‌టెన్షన్ వ్యాయామాలు కూడా రోజూ చేస్తే డిస్కు సమస్యలను చాలా వరకు దూరంగా ఉంచవచ్చు.

పంచదార కళ్లు * డయాబెటిస్ వల్ల కంటిపై పడే ప్రభావాలు, వాటి లక్షణాలు, నివారణ, చికిత్స

చక్కెర నోటికి తీపి గానీ... కళ్లకు మాత్రం చేదే. చక్కెర వ్యాధి ప్రభావం ఎంత చేదుగా ఉంటుందో తెలిసిన విషయమే. అన్ని అవయవాలపై దుష్ర్పభావం చూపించే ఆ వ్యాధికి కన్ను మినహాయింపేమీ కాదు. అన్ని అవయవాల్లాగే కన్ను కూడా డయాబెటిస్‌కు ప్రభావితమవుతుంది. చక్కెరను నియంత్రించుకోకపోతే అది డయాబెటిక్ రెటినోపతి అనే సమస్య మొదలు అనేక రుగ్మతలకు దారి తీయవచ్చు. వాటిని నిర్లక్ష్యం చేస్తే చూపునే కోల్పోవాల్సిన పరిస్థితికి దారితీయవచ్చు. అందుకే... చక్కెర వ్యాధి సూచనలు కనిపించగానే కంటిపై ఆ వ్యాధి ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా ఉండాలి. డయాబెటిస్ వల్ల కంటిపై పడే ప్రభావాలు, వాటి లక్షణాలు, నివారణ, చికిత్స లాంటి అనేక అంశాలను తెలుసుకోడానికే ఈ కథనం...

ప్రతి అవయవానికి పోషకాలు అందించే బాధ్యత రక్తానిది. ఈ రక్తం రక్తనాళాల్లో ప్రవహిస్తుంటుంది. ఈ నాళాల చివరన ఉండే అత్యంత సూక్ష్మమైన నాళాలను రక్తకేశనాళికలు (క్యాపిల్లరీస్) అంటారు. దీర్ఘకాలంగా రక్తంలో చక్కెర పాళ్లు ఎక్కువగా ఉండేవారిలో కేపిల్లరీస్ దెబ్బతింటాయి. రక్తంలో పెరిగే గ్లూకోజ్ పాళ్ల వల్ల ఈ రక్తనాళాల చివర్లలో అడ్డంకులు (బ్లాకేజ్) ఏర్పడవచ్చు. ఫలితంగా ఆ అవయవానికి రక్తం అందకపోవచ్చు. దాంతో ఆ అవయవం శాశ్వతంగా చచ్చుబడే ప్రమాదం ఉంది. కంటిలో ఉండే రక్తనాళాల చివరల్లోనూ ఇలాంటి బ్లాక్స్ రావడం సంభవిస్తే చూపు దెబ్బతినే అవకాశాలు ఉంటాయి.

డయాబెటిస్ వల్ల వచ్చే వ్యాధులివి...
డయాబెటిక్ రెటినోపతి

డయాబెటిక్ క్యాటరాక్ట్

గ్లకోమా నర్వ్ పాల్సీ ఆప్టిక్ న్యూరోపతి

కనురెప్పకు తరచూ వచ్చే ఇన్ఫెక్షన్

కనురెప్పలు వాలిపోవడం

కంటిలోపల ఉండే పొర కంజెంక్టివాకు వచ్చే ఇన్ఫెక్షన్లు

కార్నియాకు వచ్చే సమస్యలు.

డయాబెటిక్ రెటినోపతి... ఏదైనా వస్తువును చూసినప్పుడు దాని ప్రతిబింబం కంటిలోపల ఉండే ఒక తెరపై పడుతుంది. ఆ తెరపై పడే ప్రతిబింబం వల్లనే మనం చూడగలమన్నది తెలిసిందే. ఈ తెరనే ‘రెటీనా’ అంటారు. అన్ని అవయవాల్లాగే ఈ రెటీనాకు కూడా అత్యంత సూక్ష్మమైన నాళాల ద్వారా రక్తం సరఫరా అవుతుంటుంది. చక్కెర వ్యాధి వల్ల ఈ రక్తనాళాలు దెబ్బతిని రెటీనాకు రక్తం సరిగ్గా అందక చూపు దెబ్బతినే పరిస్థితిని ‘డయాబెటిక్ రెటినోపతి’ అంటారు. దీని వల్ల శాశ్వతంగా చూపు కోల్పోవాల్సిన పరిస్థితి రావచ్చు. ప్రపంచవ్యాప్తంగా అంధత్వానికి చాలా ఎక్కువగా ఉన్న కారణాల్లో ఇది ప్రధానమైనది.

 
‘డయాబెటిక్ రెటినోపతి’ ఎవరెవరిలో ఎక్కువ...
దీర్ఘకాలంగా చక్కెర వ్యాధి ఉన్నవారికి

చక్కెరను అదుపు చేసుకోకుండా నిర్లక్ష్యంగా ఉండేవారికి

డయాబెటిస్‌తో పాటు అధిక రక్తపోటు ఉన్నవారికి

డయాబెటిస్‌తో పాటు కొలెస్ట్రాల్ పాళ్లు, రక్తంలో కొవ్వుల పాళ్లు ఎక్కువగా ఉన్నవారికి

కిడ్నీ సమస్యలు ఉన్నవారికి

గుండె జబ్బులు ఉన్నవారికి

పొగతాగేవారికి... వీళ్లందరిలో డయాబెటిక్ రెటినోపతి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ.

గమనిక : షుగర్ పూర్తిగా నియంత్రణలో ఉన్నా రెటినోపతి వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి చక్కెర వ్యాధి ఉన్నవారు క్రమం తప్పకుండా కంటి వైద్యనిపుణులను తరచూ సంప్రదించడం అవసరం.

తస్మాత్ జాగ్రత్త...
డయాబెటిక్ రెటినోపతితో బాధపడే వారిలో, చూపు కోల్పోయే వారిలో - తమకు ఈ దుష్ర్పభావం పడబోతుందన్న విషయం దాదాపు సగానికి మందికి పైగా తెలియనే తెలియదు. ఒక్కోసారి కంటికి చేసే సాధారణ (రొటీన్) పరీక్షల్లో ఈ విషయం బయటపడుతుంది. అందుకే డయాబెటిస్ ఉన్నవారు తరచూ కంటి పరీక్షలు చేయించుకుంటూ ఉండటం మంచిది.

డయాబెటిక్ రెటినోపతి కేసుల్లో ఏం జరుగుతుంది?
డయాబెటిస్ ఉన్నవారిలో కంటిలోని అత్యంత సూక్ష్మమైన రక్తనాళాల చివరలు ఉబ్బుతాయి. ఇలా రెటినాకు చెందిన రక్తనాళాల చివరలు ఉబ్బడాన్ని ‘మైక్రో అన్యూరిజమ్’ అంటారు. ఇవి ఉబ్బి ఉబ్బి ఒక్కోసారి చిట్లి రక్తస్రావం కావచ్చు. ఇలా రక్తస్రావం కావడాన్ని ‘డాట్ అండ్ బ్లాట్ హ్యామరేజ్’ అంటారు. కొన్నిసార్లు కంటిలోని ద్రవాలు లీక్ కావచ్చు. అలా జరిగితే దాన్ని ‘మాక్యులార్ ఎడిమా’ అంటారు. అప్పుడు రెటీనా నుంచి కొత్త రక్తనాళాలు ఆవిర్భవించవచ్చు. దీన్నే ప్రొలిఫిరేటివ్ డయాబెటిక్ రెటినోపతి అంటారు. ఇలా కొత్తరక్తనాళాలు పుట్టుకురావడమే కంటికి ప్రమాదకరం అవుతుంది.

నేత్రవైద్యులు ఇందుకోసం చేసే పరీక్షలివి
ఫండస్ ఎగ్జామినేషన్

ఫండస్ ఫ్లోరోసిన్ యాంజియోగ్రఫీ

ఓసీటీ (ఆప్టికల్ కొహెరెన్స్ టోమోగ్రఫీ)

అల్ట్రా సౌండ్ ‘బి’ స్కాన్

చికిత్స
డయాబెటిస్ రెటినోపతీకి అందుబాటులో ఉన్న చికిత్స ప్రక్రియలు
1. వైద్యపరంగా అందించే చికిత్స
2. లేజర్ ఫోటోకోయాగ్యులేషన్
3. శస్తచ్రికిత్స (విట్రెక్టమీ)

1. వైద్యపరంగా చేయాల్సిన చికిత్స:
రక్తంలోని గ్లూకోజ్‌ను నియంత్రించడానికి చికిత్స చేయాలి.

రక్తంలో కొవ్వులను నియంత్రించడానికి చికిత్స (కొలెస్ట్రాల్ తగ్గించడానికి)

యాంటీప్లేట్‌లెట్ ఏజెంట్స్ (రక్తం పలచబరచడానికి మందులు)

బీ కాంప్లెక్స్ ఔషధాలు ఇవ్వాలి.

3. శస్తచ్రికిత్స:
రెటినోపతి వల్ల వచ్చే దుష్ర్పభావాలు దీర్ఘకాలం పాటు కొనసాగుతూ ఉంటే అప్పుడు అక్కడ గడ్డకట్టిన రక్తాన్ని తొలగించడానికి విట్రెక్టమీ ఆపరేషన్ అవసరం కావచ్చు.

డయాబెటిక్ క్యాటరాక్ట్...
డయాబెటిస్‌తో శరీరంలోని జీవక్రియ (మెటబాలిజమ్) ల్లో మార్పుల వల్ల కొందరిలో కంటిలో త్వరగా క్యాటరాక్ట్ రావచ్చు. దీనివల్ల చూపు స్పష్టంగా కనిపించకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి వారిలో ఫ్యాకో ఎమల్సిఫికేషన్ వంటి ప్రక్రియలతో కంటి ముందు ఉంటే లెన్స్ మార్చి కృత్రిమ లెన్స్‌ను అమర్చాల్సి ఉంటుంది.

గ్లకోమా...
కంటిలో ఉండే ద్రవాలలో ఒత్తిడి పెరిగి అది కంటి నరం మీద పడటాన్ని గ్లకోమా అంటారు. ఈ ఒత్తిడి వల్ల క్రమంగా కంటిచూపు కోల్పోయే ప్రమాదం ఉంది. యాంటీ గ్లకోమా చుక్కల మందు కంట్లో వేయడం ద్వారా దీన్ని నివారించవచ్చు. అయితే దీన్ని జీవితకాలం వాడాల్సి ఉంటుంది. కొంతమందికి శస్తచ్రికిత్స ద్వారా కూడా గ్లకోమాను నయం చేసే అవకాశాలు ఉంటాయి.

ఆప్టిక్ న్యూరోపతి...
కంటిలో కనిపించే ప్రతిబింబాన్ని ‘ఆప్టిక్ నర్వ్’ మెదడుకు చేరవేయడం వల్లనే మనకు చూపు కనిపిస్తుంటుందన్న విషయం తెలిసిందే. కొన్నిసార్లు ఈ నరం దెబ్బతినడం వల్ల కంటి చూపు అకస్మాత్తుగా దెబ్బతింటుంది. ఈ నరం దెబ్బతిన్న విషయాన్ని ఫండస్ పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు. ఇలాంటి సందర్భాల్లో కంటి వైద్యులు, న్యూరోఫిజీషియన్ ఆధ్వర్యంలో చికిత్స ఇవ్వాల్సి ఉంటుంది.

చూపును దీర్ఘకాలం పదిలంగా కాపాడు కోవడం కోసం కంటి పరీక్షలు తరచూ చేయించడం అవసరం. డయాబెటిస్ ఉంటే అది మరింత అవసరమని గుర్తుంచుకోవాలి.

2. లేజర్ ఫోటోకోయాగ్యులేషన్
లేజర్ కిరణాల సహాయంతో చేయాల్సిన ఈ చికిత్స వల్ల కంటిలో రక్తస్రావాన్ని తగ్గించడం కొత్తగా ఏర్పడే రక్తనాళాలను నివారించడం సాధ్యమవుతుంది. ఈ చికిత్స ప్రక్రియలో కొన్నిసార్లు ఒకటి కంటే ఎక్కువ సార్లు ఈ చికిత్స చేయాల్సిన అవసరం రావచ్చు. ఒకసారి చికిత్స చేశాక జీవితకాలం పాటు క్రమం తప్పకుండా వైద్యపరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది.

ఎన్నాళ్లకోమారు..?
డయాబెటిస్ ఉన్నవారు ఏడాదికి ఒకసారి కంటి పరీక్షలు చేయించాలి.

డయాబెటిక్ రెటినోపతి ఉన్నవారు ప్రతి ఆర్నెల్లకు ఓ మారు పరీక్షలు చేయించాలి.

డయాబెటిక్ రెటినోపతి తీవ్రంగా ఉంటే ప్రతి మూడు నెలలకోమారు పరీక్షించుకోవాలి.

నివారణ...
డాక్టర్లు చెప్పినవిధంగా మంచి పోషకాలు, పీచుపదార్థాలు ఎక్కుడా ఉండే ఆహారాన్ని క్రమబద్ధంగా తీసుకోవడం.

ఆరోగ్యకరమైన జీవన శైలిని పాటించడం

వ్యాయామం

క్రమం తప్పకుండా రక్తంలో గ్లూకోజ్ పాళ్లను పరీక్షించుకుంటూ దాన్ని నియంత్రించుకోవడం

పొగతాగే అలవాటును పూర్తిగా మానివేయడం.

Monday, December 27, 2010

శరీరానికే తెలివి ఎక్కువ!

ప్రపంచానికి మన దేశం అందించిన ఆధ్యాత్మిక గురువుల్లో యూజీ కృష్ణమూర్తి ఒకరు. దాదాపు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లోను పర్యటించిన యూజీ- తనదైన శైలిలో భారతీయ ఆధ్యాత్మికతను ప్రచారం చేశారు. ఆయన చివరి రోజుల్లో తన శిష్యులతో జరిపిన సంభాషణల సమాహారమే- 'ద బయాలజీ ఆఫ్ ఎన్‌లైటెన్‌మెంట్'. జీవితం పట్ల ఆసక్తికి, అనురక్తి, జిజ్ఞాసను పెంపొందించే ఈ సంభాషణలలోని కొన్ని ఆసక్తికరమైన భాగాలు.....

పాల్ (శిష్యుడు): సరైన ఆహారం అంటే ఏమిటి?

యూజీ: శరీరానికి ఆహారం కావాలి. 'సరైన ఆహారం' అనే నిబంధన పెడితే, ఆహారాన్ని తీసుకోవటంపై నియంత్రణను విధించినట్లే. మన కడుపు దేనినైనా అరిగించుకోగలదు. అయితే మెదడు దానిని నియంత్రించటానికి ప్రయత్నించటం వల్ల అనేక సమస్యలు ఏర్పడుతున్నాయి.

పాల్: నిజంగానా..?

యూజీ: చాలాసార్లు మనం ఆహారాన్ని ఆనందం కోసం తింటాం. శరీరం కోసం తినం. ఆ విధంగా మనం అలవాటు పడ్డాం. జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ విషయం మీకే అర్థమవుతుంది. మీకు బాగా నచ్చిన ఆహారాన్ని తినద్దు. అప్పుడు మెదడులో ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయో గమనించండి. తినటానికి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోటం ఒక పని మాత్రమే. ఆహారాన్ని గుర్తించటం, దాని రుచిని ఆస్వాదించటం ఇవన్నీ వేర్వేరు పనులు.

ఇవన్నీ ఒక దానితో మరొకటి ముడిపడి ఉంటాయి. ఆహారం తినేటప్పుడు అనేక రకాల విషయాల గురించి ఆలోచిస్తుంటే- ఆహారాన్ని ఆస్వాదించలేం. అది అందించే తృప్తిని పొందలేం. మన కడుపుకు అందాల్సిన రక్తం మెదడుకు బదిలీ అవుతుంది. అందువల్లే మన పూర్వీకులు- తినే సమయంలో ఆలోచించటం కాని మాట్లాడటం కాని చేయవద్దంటారు..

మన శరీరానికి ఎలా పనిచేయాలో తెలుసు. దానికి కూడా తెలివితేటలు ఉన్నాయి. అయితే అది పనిచేయటానికి మనం అనుమతించాలి. ప్రతి సారి అడ్డం పడకూడదు. పరిణామక్రమంలో అభివృద్ధి చెందిన మానవుల తెలివితేటలు- శరీరపు తెలివితేటల ముందుకు ఎందుకు పనికిరావు. తనని తాను ఎలా రక్షించుకోవాలో శరీరానికి తెలుసు. కాబట్టి తినకూడని పదార్థమేదీ అది తినదు. ఎప్పుడైనా మనం అలాంటిది తిన్నా శరీరం దానిని బయటకు తోసివేస్తుంది.

పాల్: కొన్ని రకాల ఆహారాలను త్యజించటం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయంటారు.. యూజీ: భారతదేశంలో చాలామంది పాటించే ఒక ఆచారం ఉంది. కొంతమంది తమకు బాగా ఇష్టమైన పదార్థాన్ని అక్కడ వదిలేసి వస్తారు. నాకు తెలిసిన ఒక పెద్ద గురువు ఉన్నాడు. ఆయన భగవద్గీత ప్రవచనాలు చెబుతూ ఉంటాడు. ఆయన కాశీకి వెళ్లి - తనకు నచ్చని పదార్థాలు వదిలేసి వచ్చేశాడు. ఇలాంటి వాళ్లు కూడా ఉంటారు. చాలా సార్లు మనం ఇతరులను అనుకరిస్తూ ఉంటాం.

కాశీకి వెళ్లి ఏదో ఒకటి వదిలేయాలన్నారు కాబట్టి వదిలేసి వచ్చేస్తాం. దీని వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. చాలా సార్లు బుద్ధుడు చెప్పాడు కాబట్టి ఆ పని చేస్తున్నాం.. జీసస్ చెప్పాడు కాబట్టి ఈ పని చేస్తున్నాం అంటూ ఉంటారు. అసలు భావం తెలియకుండా చేసే పనుల వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. దీని వల్ల ప్రపంచమంతా అనుచరులు మాత్రమేతయారు అవుతారు. మళ్లీ వారి మధ్య ఘర్షణలు ఏర్పడతాయి...

పాల్: అసలు దేవుడు ఉన్నాడా?

యూజీ: ఈ ప్రశ్నను నాకు నేనే వేసుకుంటూ ఉంటాను. నాకు సమాధానం అయితే దొరకలేదు. భయం వల్ల మనకు మనం దేవుడిని సృష్టించుకుంటాం. అందువల్ల దేవుడు ఉన్నాడా? లేడా అనేది అసలు సమస్య కాదు. 'దేవుడు' అనే ఆకారాన్ని సృష్టించుకోవటం వల్ల మనం ఎంత ఆనందంగా ఉన్నాం అనే విషయమే ప్రధానం. అందుకే భారత దేశంలో 33 కోట్ల దేవుళ్లు ఉన్నారంటారు. 33 కోట్ల మంది ప్రజలు-తమ కోసం దేవుళ్లను సృష్టించుకున్నారన్నమాట.

ఈ సమాధానాన్ని నమ్మితే- దేవుడు ఉన్నాడా? లేదా? అనే వాదనలకు అసలు అర్థమే ఉండదు. అయితే అప్పుడు మనంతట మనం సృష్టించుకున్న దేవుడిని మనం ఎందుకు నమ్మాలి? అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. భయం వలనే దేవుడిని మనం సృష్టించుకున్నాం అనే విషయాన్ని అర్థం చేసుకుంటే- మిగిలిన విషయాల్లో దేవుడి ప్రమేయం ఉండదు.

యోగా గురించి..

మన శరీరంలో 64 ప్రాంతాల్లో నాడులు ఉంటాయి. మన మణికట్టు దగ్గర ఉన్న నాడినే డాక్టర్లు పరీక్షిస్తారు. కాని శ్వాసకు సంబంధించిన వ్యాయామ సూత్రాలను నేర్చుకుంటే-ఈ నాడులు కొట్టుకోవటాన్ని మనం గమనించగలుగుతాం. ఇదే విధంగా ఆధ్యాత్మిక అంశాలను మనం శారీరకంగా కూడా గమనించవచ్చు. ఉదాహరణకు హిందువులు - 'ఓమ్' అనే నాదాన్ని జపిస్తారు.

దీనిని జపించినప్పుడు మనం శ్వాస తీసుకొనే పద్ధతి పూర్తిగా మారిపోతుంది. దీనినే కొన్ని వేల సార్లు జపించినప్పుడు మనకు తెలియకుండానే శ్వాస తీసుకొనే పద్ధతిలో మార్పు వస్తుంది. అలౌకికమైన ఆనందం వస్తుంది. అందువల్లే ఓంకారాన్ని కొన్ని వేల సార్లు జపించమని చెబుతూ ఉంటారు. అయితే ఓంకారాన్ని జపించటం వెనక ఉన్న మర్మాన్ని మాత్రం ఎవరూ చెప్పరు.. 
పాల్: యోగా వల్ల మన భావోద్వేగాలను అదుపులో పెట్టుకోగలమా? యూజీ: లేదు. యోగా వల్ల శరీరమే అదుపులోకి వస్తుంది. మంచి స్థితిలో ఉంటుంది. మనం జీవించటానికి ఆహారం ఎలా తింటామో ఇది కూడా అంతే.....

పాల్: అయితే ఉన్నత స్థితికి చేరుకోవటానికి యోగ ఉపయోగపడుతుందంటారా..? యూజీ: యోగానే కాదు. ఏ వ్యవస్థా ఆ స్థితిని చేరుకోవడానికి ఉపయోగపడదు. ముందు శరీరాన్ని అదుపులో ఉంచుకోవాలి. క్రమశిక్షణతో వ్యవహరించాలి.

శరీరం అదుపులోకి వచ్చిన తర్వాత ప్రాణాయామం చేయాలి. ఆ తర్వాత మన చుట్టూ ఉన్న స్థితిని ప్రశ్నించాలి. ఆ తర్వాత ధ్యానం చేయాలి. ధ్యానం అన్నింటికన్నా చివరది. మొదటిది కాదు. అయితే కొందరి సిద్ధాంతం ప్రకారం ఇవన్నీ ఒకే సారి చేయాలి. ఈ సిద్ధాంతం గురించి నాకు తెలియదు. తెలుసుకోవాలనే ఆసక్తి కూడా లేదు.

Sunday, December 26, 2010

బ్లాక్ హెడ్స్‌కు దూరంగా...

ముఖాన్ని అందవిహీనంగా మార్చేవాటిలో బ్లాక్‌హెడ్స్ ప్రధానమైనవి. సెబాషియస్ అనే గ్రంథి నూనె పదార్థాన్ని(సెబమ్) అధికంగా విడుదల చేయడం వల్ల ఇవి ఏర్పడతాయి. చర్మానికి రంగునిచ్చే పిగ్మెంట్ ఎక్కువైనా ఈ సమస్య వస్తుంది. వెంటనే తగిన చికిత్స తీసుకుంటే వీటిని నివారించుకోవడమే కాకుండా అందాన్ని కాపాడుకోవచ్చు.

కారణాలు

* చర్మంలో జీవక్రియలు సక్రమంగా జరగడానికి వీలుగా సెబాషియస్ గ్రంథి నూనె పదార్థాన్ని విడుదల చేస్తుంది. ఈ నూనె ఉత్పత్తి ఎక్కువైనప్పడు దానికి చర్మంలోని మలిన పదార్థాలు కూడా తోడయ్యి బ్లాక్‌హెడ్స్, వైట్‌హెడ్స్‌గా ఏర్పడతాయి.
* చర్మంలో బ్లాక్‌హెడ్స్ ఏర్పడడానికి దుమ్ముకూడా ఒక కారణం. చర్మంలో పేరుకున్న దుమ్ము కారణంగా బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. దీనికి నూనెకూడా జత కావడంతో బ్లాక్‌హెడ్స్ ఏర్పడతాయి. .
ట బ్లాక్‌హెడ్స్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ గిల్లకూడదు. దీనివల్ల పరిస్థితి మరింత విషమిస్తుంది. గిల్లడం వల్ల చర్మంపై ఉన్న బ్యాక్టీరియా చర్మంలోపలికి చొచ్చుకుపోయి మరింత హాని చేస్తుంది.
నివారణ చిట్కాలు

* ముల్లంగి విత్తనాలను పేస్ట్‌లాచేసుకుని దాన్ని నీళ్లతో కలిపి ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాలపాటు ఆరనిచ్చి తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగేయాలి. *మూడు నాలుగు కప్పుల నీటిని వేడిచేసి వాటికి రెండు టీ స్పూన్ల సోడా బైకార్బోనేట్ కలపాలి. ఓ టవల్‌ను ఈ నీటిలో ముంచి ముఖంపై ఉంచుకోవాలి. ఇలా ఐదారుసార్లు చేయాలి. ఇప్పుడు ఒక స్పూన్ పెరుగులో ఒక టీ స్పూన్ బియ్యం పిండిని కలుపుకుని బ్లాక్‌హెడ్స్ ఉన్నచోట రుద్దుకోవాలి. ఆరిన తర్వాత చల్లటి నీటితో కడిగే స్తేసరి.

* గంధపు చెక్క పొడికి రోజ్‌వాటర్ కలిపి ఆ పేస్ట్‌తో ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. ఆరిన తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి. ఈ విధంగా చేయడం వల్ల బ్లాక్‌హెడ్స్ త గ్గడంతోపాటు చర్మం చల్లగా ఉంటుంది.
*నాలుగు టేబుల్ స్పూన్ల బేకింగ్‌సోడాకు ఒక టీ స్పూన్ డెడ్‌సీ సాల్ట్, రెండు స్పూన్ల నీటిని కలుపుకోవాలి. దీంతో చర్మాన్ని రుద్దుకుంటే మంచి ఫలితం ఉంటుంది. * ఓట్‌మీల్ పౌడర్‌కు రోజ్‌వాటర్ కలుపుకుని ఆ పేస్ట్‌ను వేళ్లతో ముఖానికి రాసుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడుక్కుంటే సరిపోతుంది.
* సాధారణ చర్మతత్వం ఉన్నవారు ముల్తానీ మట్టికి రోజ్ వాటర్ కలుపుకుని చర్మంపై రాసుకోవాలి. దీనివల్ల బ్లాక్‌హెడ్స్ తగ్గిపోవడమే కాకుండా చర్మం నున్నగా అవుతుంది.
* మెంతి ఆకులను పేస్ట్‌లా దాన్ని చర్మంపై రాసుకోవాలి. 15 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగేయాలి. ప్రతిరాత్రి పడుకునే మందు ఇలా చేస్తే కొన్ని రోజుల్లోనే బ్లాక్‌హెడ్స్ తగ్గిపోతాయి. .
ట పెరుగులో నల్లమిరియాల పొడివేసి బాగా కలిపి దాన్ని ముఖానికి రాసుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడుక్కుంటే సరిపోతుంది.
* తాజా కొత్తిమీర ఆకుల నుంచి తీసిన రసం ఓ టేబుల్‌స్పూన్, పసుపు అర టీ స్పూన్ తీసుకుని ఈ మిశ్రమాన్ని పడుకునే ముందు రాసుకోవాలి. ఉదయం లేచిన వెంటనే కడుక్కోవాలి. ఇలా ఓ వారం చేస్తే మంచి ఫలితాలు కన్పిస్తాయి.
* ద్రాక్షపండ్ల గుజ్జును బ్లాక్‌హెడ్స్ ఉన్న ప్రాంతంలో రాసుకోవాలి. ఆరిన తర్వాత గోరువెచ్చటి నీటితో కడుక్కుంటే సరిపోతుంది.
* ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని, ఒక టేబుల్ స్పూన్ దాల్చినచెక్క పొడిని కలుపుకుని పడుకునే ముందు ముఖానికి రాసుకుని ఉదయాన్నే కడిగేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
* ఓ పావు కప్పు వేడినీటిలో ఒక టేబుల్ స్పూన్ ఎప్సమ్ సాల్ట్, మూడు చుక్కల అయోడిన్ వేసి చల్లారేవరకు అలానే ఉంచాలి. తర్వాత ఆ మిశ్రమంలో దూదిని ముంచి బ్లాక్‌హెడ్స్‌పై రాసుకోవాలి.
* పొట్లకాయ గుజ్జును ముఖానికి రాసుకోవడంవల్ల మొటిమలు, ముడతలు, వైట్‌హెడ్స్, బ్లాక్‌హెడ్స్ రాకుండా ఉంటాయి.

శాకాహారంతో లోటేమిటి? * శాకాహారంలో లభించే పోషకాలు .....

శాకాహారం జీర్ణమయినంత సులభంగా మాంసాహారం జీర్ణం కాదు. ఎదిగే వయసు పిల్లల్లో పౌష్టికాహారం అవసరం కొంత ఎక్కువగా ఉంటుంది. ఆ తరువాత వయసులో కేవలం శరీరాన్ని నిలబెట్టుకోవడానికి మాత్రమే పోషకాలు అవసరమవుతాయి. నిజానికి శాకాహారంలో లభించే పోషకాలు ఎవరికైనా సరిపోతాయి.
ఏమిటిలా చిక్కిపోతున్నావ్? అని ఎవరైనా ప్రశ్నిస్తే, గుడ్లా? మాంసమా? చిక్కిపోక ఏం చేస్తాం? అంటూ ఎదురుప్రశ్న వేస్తుంటారు. చిక్కిపోవడానికి గల అసలు కారణాల గురించి ఏ మాత్రం ఆలోచన ఉండదు. ఆకుకూరలు, కాయగూరలు తినడమే అసలు లోపం అన్నట్లుగా వారి ధోరణి ఉంటుంది. నిజానికి మనిషికి అవసరమైన అన్ని పోషకాలు, ప్రొటీన్లు శాకాహారంలోనూ సంపూర్ణంగా లభిస్తాయంటున్నారు నిపుణులు.

సిసలైన పౌష్టికాహారం అంటే మాంసాహారమేనన్న అభిప్రాయం ఉంది. అందుకే మాంసాహారానికి అధిక ప్రాధాన్యం ఇస్తారు. అంతిమంగా ఈ ఆహారపు అలవాట్లు జీర్ణకోశ సమస్యలకు దారి తీస్తాయి. శాకాహారం జీర్ణమయినంత సులభంగా మాంసాహారం జీర్ణం కాదు. ఎదిగే వయసు పిల్లల్లో పౌష్టికాహారం అవసరం కొంత ఎక్కువగా ఉంటుంది. ఆ తరువాత వయసులో కేవలం శరీరాన్ని నిలబెట్టుకోవడానికి మాత్రమే పోషకాలు అవసరమవుతాయి. నిజానికి శాకాహారంలో లభించే పోషకాలు ఎవరికైనా సరిపోతాయి. మాంసాహారం మీద ప్రీతితో అంతే మోతాదులో తీసుకుంటూ పోతే అవి జీర్ణం కావు. ఆకలి మందగించడంతో పాటు కడుపులో మంట, తేన్పులు, మలబద్ధకం వంటి సమస్యలు తలెత్తుతాయి.

పౌష్టికాహారం పేరిట అదేపనిగా మాంసాహారం, గుడ్లు తీసుకుంటే వాటిని అరిగించుకోవడానికి జీర్ణకోశంపైన అనవసరపు భారం పడుతుంది. శరీరంలోని జీవశక్తి అదనంగా ఖర్చవుతుంది. శరీరతత్వంలో కొన్ని చెడు పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆకలి మందగించడం, కడుపులో మంట, తేన్పులు, మలబద్ధకం వంటి సమస్యలు మొదలవుతాయి. మాంసాహారం, గుడ్లు పూర్తిగా మానకోవాలని కాదు. ఒక పరిమితిలో వాటిని తీసుకోవచ్చు. అయితే, మాంసాహారం నుంచి మాత్రమే కావలసిన పోషకాలు లభిస్తాయనుకోవడం సరికాదు. శాకాహారం నుంచి కూడా అవసరమైన ప్రొటీన్లతో పాటు పోషకపదార్థాలన్నీ లభిస్తాయి. పెద్దవారికి ఇవి అవసరానికంటే ఎక్కువే.

మొలకెత్తిన పెసర్లు, శనగలు

వీటి నుంచి ప్రొటీన్లు, ఇతర పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. తరుచూ వీటిని ఉపాహారంగా (బ్రేక్‌ఫాస్ట్) తీసుకోవడం వల్ల ఎంతో మేలు చేస్తాయి. మొలకెత్తిన గింజల్లో ప్రొటీన్లతో పాటు లవణాలు, విటమిన్లు ఎక్కువ మొత్తంలో లభిస్తాయి.పైగా వీటిని జీర్ణించుకోవడంలో శరీరానికి ఎక్కువ శక్తి కూడా ఖర్చు కాదు. మొలకెత్తించే విధానం గింజలను నీటిలో నాలుగు నుంచి ఆరు గంటల పాటు నానబెట్టాలి. ఆ తరువాత వాటిని తడిగుడ్డలో మూట కట్టి ఒక గిన్నెలో పెట్టి మూత పెట్టాలి. కొంచెం గాలి తగిలేలా మూత కాస్త తెరిచి పెట్టాలి. సాధారణంగా 12 నుంచి 16 గంటల వ్యవధిలో ఇవి మొలకెత్తుతాయి. చలికాలంలో అయితే 24 గంటల దాకా పట్టవచ్చు.

నానబెట్టిన వేరుశనగలు

శరీరానికి కావలసిన ఎన్నో పౌష్టిక విలువలు, ప్రొటీన్లను వీటి ద్వారా పొందవచ్చు. వేరుశనగ గింజలను పన్నెండు గంటలపాటు నానబెట్టాలి. ఆ తరువాత నీరు తీసివేయాలి. ఇలా చేయడం వల్ల అందులోని హానికారక అంశాలన్నీ తొలగిపోతాయి. ఈ వేరుశనగలను బెల్లంతో కలిపి తీసుకుంటే ఎంతో శక్తి లభిస్తుంది.
సలాడ్

క్యారెట్, కీర, బీట్‌రూట్, ఉల్లి, క్యాబేజీ, క్యాప్సికమ్‌లను చిన్న చిన్న ముక్కలుగా తరగాలి. అప్పుడప్పుడు పచ్చి బఠాణి, రుచి కోసం కొంచెం ఉప్పు, మిరియాల పొడి కలుపుకోవచ్చు. టమాటకు బదులుగా నిమ్మరసం కలుపుకోవచ్చు. సలాడ్ తినడానికి చాలా ముందు ఉప్పు కలిపి పెడితే నీరంతా బయటకు వచ్చేస్తుంది. ఆ తరువాత ఒకరకమైన వాసన వస్తుంది. కాబట్టి తినే సమయంలో మాత్రమే ఉప్పు కలుపుకోవాలి. రాత్రిపూట ఆహారంతో పాటు తీసుకుంటే చాలా మంచిది.

పప్పు, ఆకుకూరలు

పప్పులో ప్రొటీన్లు చాలా ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఆకుకూరలో, ఇనుము, లవణాలు అధికంగా ఉంటాయి. రక్తహీనతను ఆకుకూరలు బాగా అరికడతాయి. నీరసం, అలసట తగ్గుతుంది. రక్తహీనత తగ్గడంతో పాటు రక్తస్రావ సమస్యలు కూడా నయమవుతాయి. వీటితో పాటు నానబెట్టిన ఎండు ద్రాక్ష, అత్తిపండు, నానబెట్టిన బాదం, నల్లరకం ఎండు ఖర్జూరం తీసుకోవడం శ్రేయస్కరం.

జాగ్రత్తలు

* తరచు వేపుడు పదార్థాలు, మైదా వంటలు, ఊరగాయలు తినడం మానేయాలి.
* ఉప్పు సగం టీ స్పూన్‌కు మించకుండా ఉండాలి.
* అవసరం ఉన్న వాళ్లు డాక్టర్‌ను సంప్రదించి రెండు లేక మూడు స్పూన్‌ల నెయ్యి వాడవచ్చు.
* సమయానికి భోజనం చేయాలి. రాత్రి భోజనం ఎనిమిది గంటల కంటే ముందే ముగించాలి.
* నిద్రా సమయానికి, రాత్రి భోజనానికి మధ్య కనీసం రెండు గంటల వ్యవధి ఉండాలి.
* రాత్రి ఆహారంలో 50 శాతం పచ్చి కూరగాయలు, పళ్లు తీసుకోవాలి.
* అధిక బరువు, మధుమేహం, అధిక రక్తపోటు ఉన్నవారు రాత్రి ఆహారంలో అన్నం కాకుండా గోధుమ పుల్కాలు, జొన్న రొట్టె తినడం మంచిది. * 35 ఏళ్లు దాటిన వారు వారానికి ఒక రోజు ఉపవాసం చేయడం ఆరోగ్యకరం. ఉపవాసం అంటే ఏమీ తినకుండా ఉండడం కాదు. వండని పదార్థాలు తీసుకోవడం, పళ్లు, పళ్ల రసాలు, మొలకెత్తిన గింజలు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ లాంటివి తప్పనిసరిగా తీసుకోవాలి.

నీళ్లెప్పుడు తాగాలి?

ప్రతిరోజు మూడు లీటర్ల నీళ్లు తాగాలి. అజీర్తి, మలబద్ధకం, అర్షమొలలు, గాల్‌బ్లాడర్, కిడ్నీలో రాళ్లు ఏర్పడటం వంటి సమస్యలు అధికంగా నీరు తీసుకోవడం వల్ల తొలగిపోతాయి. భోజనానికి అరగంట ముందు, అరగంట తరువాత మాత్రమే నీరు తాగాలి. భోజన సమయంలో జీర్ణప్రక్రియ కోసం కేవలం ఒకటి రెండు గ్లాసుల నీరు తీసుకోవచ్చు. భోజనం చేస్తున్నప్పుడే అమితంగా నీరు తాగడం వల్ల ఎంతో నష్టం ఉంటుంది. ఆహార పదార్థాలు జీర్ణం కావడానికి కొన్ని జీర్ణరసాలు తయారవుతుంటాయి.

భోజనసమయంలో లేక భోజనం చేసిన వెంటనే నీరు తాగడం వల్ల జీర్ణరసాలు పలుచబారతాయి. దీనివల్ల తిన్న ఆహార పదార్థాలు జీర్ణం కాకుండా పోతాయి. కొంత మంది రోజుకు 5 నుంచి 6 లీటర్ల నీరు తాగుతుంటారు. దీనివల్ల నీటిని తిరిగి బయటకు పంపడంలో కిడ్నీలపై అనవసరపు భారం పడుతుంది. శరీరానికి అవసరమయ్యే నీరు మూడు లీటర్లే. ఆ పరిమితిని పాటించడమే ఆరోగ్యకరం.

Saturday, December 25, 2010

BRAIN DAMAGING HABITS

BRAIN DAMAGING HABITS 

1. No Breakfast 

People who do not take breakfast are going to have a lower blood sugar level. This leads to an insufficient supply of nutrients to the brain causing brain degeneration. 


. Overeating=2 0 

It causes hardening of the brain arteries, leading to a decrease in mental power. 


3. Smoking 

It causes multiple brain shrinkage and may lead to Alzheimer disease. 


4. High Sugar consumption 

Too much sugar will interrupt the absorption of proteins and nutrients causing malnutrition and may interfere with brain development. 


5. Air Pollution 

The brain is the largest oxygen consumer in our 20 body. Inhaling polluted air decreases the supply of oxygen to the brain, bringing about a decrease in brain efficiency. 


. Sleep Deprivation 

Sleep allows our brain to rest.. Long term deprivation from sleep will accelerate the death of brain cells.. 


7. Head covered while sleeping 

Sleeping with the head covered increases the concentration of carbon dioxide and decrease concentration of oxygen that may lead to brain damaging effects. 

8. Working your brain during illness 

Working hard or studying with sickness may lead to a decrease in effectiveness of the brain as well as damage the brain. 


9. Lacking in stimulating thoughts 

Thinking is the best way to train our brain, lacking in brain stimulation thoughts may cause brain shrinkage. 


10. Talking Rarely 

Intellectual conversations will promote the efficiency of the brain 

The main causes of liver damage are: 

1. Sleeping too late and waking up too late are main cause. 

2. Not urinating in the morning. 

. Too much eating. 

4. Skipping breakfast. 

5. Consuming too much medication. 

6. Consuming too much preservatives, additives, food coloring, and artificial sweetener. 

7. Consuming unhealthy cooking oil. 

As much as possible reduce cooking oil use when frying, which includes even the best cooking oils like olive oil. Do not consume fried foods when you are tired, except if the body is20very fit. 


8. Consuming raw (overly done) foods also add to the burden of liver. 

Veggies should be eaten raw or cooked 3-5 parts. Fried veggies should be finished in one sitting, do not store.

We should prevent this without necessarily spending more. We just have to adopt a good daily lifestyle and eating habits. Maintaining good eating habits and time condition are very important for our bodies to absorb and get rid of unnecessary chemicals according to 'schedule.' 
Because: 
Evening at 9 - 11pm: is the time for eliminating unnecessary/ toxic chemicals (detoxification) from the antibody system (lymph nodes). This time duration should be spent by relaxing or listening to music. If during this time a housewife is still in an unrelaxed state such as washing the dishes or monitoring children doing their homework, this will have a negative impact on health.
Evening at 11pm - 1am : is the detoxification process in the liver, and ideally should be done in a deep sleep state.
Early morning 1 - 3am : detoxification process in the gall, also ideally done in a deep sleep state.

Early morning 3 - 5am : 
detoxification in the lungs. Therefore there will sometimes be a severe cough for cough sufferers during this time. Since the detoxification process had reached the respiratory tract, there is no need to take cough medicine so as not to interfere with toxin removal process.

Morning 5 - 7am : 
detoxification in the colon, you should empty your bowel.
Morning 7 - 9am : absorption of nutrients in the small intestine, you should be having breakfast at this time. Breakfast should be earlier, before 6:30am, for those who are sick. Breakfast before 7:30am is very beneficial to those wanting to stay fit. Those who always skip breakfast, they should change their habits, and it is still better to eat breakfast late until 9 - 10am rather than no meal at all.
Sleeping so late and waking up too late will disrupt the process of removing unnecessary chemicals. Aside from that, midnight to 4:00 am is the time when the bone marrow produces blood. Therefore, have a good sleep and don't sleep late. 

The top five cancer-causing foods are: 


1.. Hot Dogs 

Because they are high in nitrates, the Cancer Prevention Coalition advises that children eat no more than 12 hot dogs a month. If you can't live without hot dogs, buy those made without sodium nitrate. 
2. Processed meats and Bacon 

Also high in the same sodium nitrates found in hot dogs, bacon, and other processed meats raise the risk of heart disease. The saturated fat in bacon also contributes to cancer. 

3. Doughnuts 

Doughnuts are cancer-causing double trouble. First, they are made with white flour, sugar, and hydrogenated oils, then fried at high temperatures. Doughnuts, says Adams , may be the worst food you can possibly eat to raise your risk of cancer. 

4. French fries 

Like doughnuts, French fries are made with hydrogenated oils and then fried at high temperatures. They also contain cancer- causing acryl amides which occur during the frying process. They should be called cancer fries, not French fries, said Adams . 

5. Chips, crackers, and cookies 

All are usually made with white flour and sugar. Even the ones whose labels claim to be free of trans-fats generally contain small amounts of trans-fats.

Friday, December 24, 2010

మంచి కొలెస్ట్రాల్ పెరిగేదెలా?

నానాటికీ పెరిగిపోతున్న గుండె జబ్బులూ, పక్షవాత సమస్యలు మానవాళిని కలవరపెడుతున్నాయి. కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడంతో పాటు శరీర శ్రమలేకపోవడమే ఈ స్థితికి ప్రధాన కారణంగా ఉంటున్నాయి. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచే దిశగా ప్రయత్నాలు కొనసాగించడమే ఈ సమస్యలకు పరిష్కారం. సమస్యకు గురయ్యాక అందులోంచి బయటపడేందుకు యాతన పడేకన్నా రాకుండా నివారించుకోవడమే ఉత్తమం అంటున్నారు నిపుణులు. 
ఆ వివరాలు  మీకోసం..

కొలెస్ట్రాల్ అనగానే బెంబేలె త్తిపోతాం కానీ, అందులో మంచి కొలెస్ట్రాల్ కూడా ఉంది. అది మనకు మంచే చేస్తుంది. సమస్య అంతా చెడు కొలెస్ట్రాల్‌తోనే. కొలెస్ట్రాల్ ను ఉత్తత్తి చేయడం అన్నది శరీరంలోని ఒక సహజ ప్రక్రియ. అలా సహజంగానే దాదాపు 60 నుంచి 70 శాతం కొలెస్ట్రాల్ మన శరీరంలోనే ఉత్పత్తి అవుతుంది. ఇది కాక 30 నుంచి 40 శాతం కొలెస్ట్రాల్ మనం తీసుకునే ఆహార పదార్థాల్లోంచి తయారవుతుంది. నిజానికి శరీరంలో సహజంగా ఉత్పత్తి అయ్యే ఆ 70 శాతం కొలెస్ట్రాలే ఎక్కువ. అలాంటిది ఆహార పదార్థాల ద్వారా కూడా అధికంగా కొలెస్ట్రాల్ తయారయితే పరిస్థితి ప్రమాదానికి చేరువైనట్లే.

ఎందుకీ అతి ?

ఆహార పదార్థాలతో ప్రమేయం లేకుండానే కొందరిలో సహజంగానే అవసరానికి మించి కొలెస్ట్రాల్ తయారవుతూ ఉంటుంది. దీనికి జన్యుపరమైన మూలాలే ప్రధాన కారణం. తల్లిదండ్రుల్లో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉత్పత్తి అయ్యే లక్షణం ఉంటే అది వారి పిల్లల్లోనూ ఉంటుంది. దానికి తోడు ఆహారపు అలవాట్లు, శరీర శ్రమ లేకపోవడం, జీవ న శైలి ఇవన్నీ ఇతర కారణాలుగా ఉంటాయి. పుట్టినప్పటి నుంచీ దాదాపు 20 ఏళ్లు వచ్చేదాకా కొలెస్ట్రాల్ 100 నుంచీ 130 మిల్లీ గ్రాముల దాకా ఉంటుంది. అందుకే ఆ దశలో కొలెస్ట్రాల్ మూలంగా ఉండే ఏ గుండె జబ్బులూ రావు. చాలా మందిలో 20 ఏళ్లు దాటాకే కొలెస్ట్రాల్ పెరుగుతూ ఉంటుంది. పెద్ద వారిలో 200 మిల్లీ గ్రాముల దాకా వెళ్లవచ్చు.

ఎలా తెలుస్తుంది ?

రక్తంలో కొలెస్ట్రాల్ మోతాదు పెరిగిపోతున్నప్పుడు మామూలుగా అయితే ఏ లక్షణాలూ కనిపించవు. రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ అడ్డుపడి, వాటి వైశాల్యం తగ్గిపోయి రక్తప్రసరణలో అంతరాయంగా మారిన తరువాతే సమస్య తెలుస్తుంది. ఒక్కోసారి గుండెపోటో లేదా పక్షవాతమో వ చ్చేదాకా ఏమీ తెలియకపోవచ్చు. అందుకే అప్పుడప్పుడు కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవడం శ్రేయస్కరం.

కొలిచేదెలా ?

కేవలం రక్తపరీక్ష ద్వారానే కొలెస్ట్రాల్ పరిమాణాన్ని తెలుసుకోవచ్చు. 20 ఏళ్లు దాటిన వారంతా ఒకసారి లిపిడ్ ప్రొఫైల్ పరీక్ష చేయించుకోవాలి. కొలెస్ట్రాల్ సాధారణ పరిమాణంలోనే ఉన్నట్లు రిపోర్టు వస్తే ఆ తరువాత ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఈ పరీక్ష చేయించుకుంటూ ఉంటే చాలు. ఒకవేళ ఏవైనా వ్యత్యాసాలు కనిపిస్తే ఏటా ఒకసారి చేయించుకోవడం తప్పనిసరి. ఇలా ఏటా పరీక్షలు చేయించుకుంటూ ఉంటే ఇప్పుడున్న 75 శాతం గుండె జబ్బులు చాలా వరకు తగ్గుముఖం పడపడతాయి.

* సాధారణంగా 25 లేదా 30 ఏళ్ల లోపు వారిలోనే కండరాలు పెరుగుతాయి. వ్యాయామం చేసే వారైతే ఆ తరువాత కూడా కొంతమేరకు కండర కణజాలంలో ఉండే పీచుపదార్థం (సెల్ ఫైబర్) పెరుగుతుంది. వ్యాయామాలు చేయనివారిలో 30 ఏళ్ల తరువాత ఎవరైనా బరువు పెరుగుతున్నారూ అంటే ఆ పెరిగేది కొవ్వు మాత్రమే. బాగా వ్యాయామం చేసే వారు ఎక్కువ క్యాలరీలు ఉండే ఆహారం తీసుకుంటారు. ఆ తరువాత ఎప్పుడైనా వీరు వ్యాయామం చేయడం మానేస్తే అదే క్రమంలో తీసుకునే క్యాలరీలు కూడా తగ్గించుకోవాలి. అలా తగ్గించకపోతే తీసుకున్న ఆహారంలో ఎక్కువ భాగం కొవ్వుగా మారుతుంది. అది కొలెస్ట్రాల్‌గా రక్తంలో చేరిపోతుంది.

* శరీరంలోని ఏ భాగంలో కొలెస్ట్రాల్ చేరిపోతే ఆ భాగంలో రక్తనాళాలు సన్నబడతాయి. మెదడు రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ నిలువైతే పక్షవాతం వస్తుంది. గుండె రక్తనాళాల్లో అడ్డుపడితే గుండెపోటు వస్తుంది. కిడ్నీకి వెళ్లే రక్తనాళాల్లో అడ్డుపడితే కిడ్నీ దెబ్బ తినడంతోపాటు రక్తపోటు కూడా పెరుగుతుంది. కాళ్లలోని రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ నిలువైతే కాళ్ల జబ్బులు వస్తాయి.

నివారించేదెలా ?

* ఆహారంలో నూనె పదార్థాలు బాగా తగ్గించాలి. పిజ్జా, బర్గర్, ఇతర ఫాస్ట్‌ఫుడ్స్ తినడం బాగా తగ్గించాలి. * గడ్డకట్టని నూనెల కన్నా గడ్డకట్టే నూనెలు ఎక్కువ ప్రమాదకరం. ప్రత్యేకించి నెయ్యి, వనస్పతి వంటి వాటిలో కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఆహారంలో వాటిని తగ్గించాలి.
* శాకాహారులు కొందరు తమకు ఈ కొలెస్ట్రాల్ సమస్యలే ఉండవన్న భ్రమలో ఉంటారు. నిజానికి అతిగా నూనెలు వాడే వారు శాకాహారులైనా అంతే ప్రమాదాన్ని ఎదుర్కొంటారు.
* కూరగాయలను సహజంగా అంటే సలాడ్స్‌గా తీసుకున్నప్పుడు ఏ సమస్యలూ ఉండవు. కానీ, వాటిని వండినప్పుడే సమస్యలు వస్తాయి. అందుకే నూనె వాడకాన్ని మొత్తంగా నివారించలేకపోయినా అతి తక్కువ నూనెతో వంట చేయడం మేలు చేస్తుంది. అయితే ఒక్కోరకం నూనెలో ఒక్కో లోపం ఉంటుంది. అందుకే నిరంతరం ఒకే నూనెను వాడకుండా వేరు వేరు నూనెలు వాడటం మేలు.
* మాంసాన్ని కాల్చిగానీ, నీటిలో ఉడికించి గానీ తినడం చాలా ఉత్తమం. అలా కాకుండా బాగా నూనెల్లో ఉడికించడంలోనే అసలు ప్రమాదం మొదలవుతుంది. రొయ్యల్లో తప్ప మిగతా చేపల్లో కొవ్వు పదార్థాలు తక్కువగా ఉంటాయి. అందుకే చేపలకు ప్రాధాన్యత నివ్వడం మేలు.
వ్యాయామంతో...

చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డిఎల్)తగ్గడమే కాకుండా వ్యాయామంతో మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డిఎల్) పెరుగుతుంది. అందుకే మానవ శాస్త్రం వ్యాయామానికి ఎంతో ప్రాధాన్యతనిస్తుంది. ప్రతి నిత్యం వాకింగ్ చేసే వారు గుండె జబ్బులకు చాలా దూరంగా ఉంటారు. అవసరమైన అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నా జన్యుకారణాలతో కొందరిలో చెడు కొలెస్ట్రాల్ పెరగవచ్చు అలాంటి వారు డాక్టర్‌ను సంప్రదించి కొలెస్ట్రాల్‌ను తగ్గించే మాత్రలు వేసుకోవాలి.

వీటిని జీవితకాలమంతా వేసుకున్నా ఏ దుష్ప్రభాలూ ఉండవు. ఇవే కాకుండా తీసుకున్న ఆహారం ద్వారా వచ్చే కొలెస్ట్రాల్‌ను రక్తం గ్రహించకుండా చేసే మందులు కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. డాక్టర్‌ను సంప్రదించి ఎప్పటికప్పుడు అవసరమైన వైద్య సలహాలూ, చికిత్సలూ తీసుకుంటూ ఉంటే జీవిత కాలమంతా కొలెస్ట్రాల్ సమస్యలను అడ్డుకోవచ్చు.

పెనుమానం * మానసిక జబ్బులలో ‘అనుమానం’ ఒక లక్షణం

‘వీడు నా కొడుకేనా!’ ఓ భర్తకు భార్య శీలం మీద ‘అనుమానం.’
‘నేను కాకుండా నీకు ఇంకొకరున్నారు. అందుకే ఆఫీస్ నుంచి లేట్‌గా వస్తున్నావు’
ఓ భార్యకు భర్త మీద ‘అనుమానం.’
‘పిల్లాడు కాలేజీకి వెళ్లాడు, జాగ్రత్తగా ఇంటికి చేరతాడా?’
ఓ తల్లికి కొడుకు క్షేమంపైన ‘అనుమానం.’
‘గ్యాస్ కట్టేశానో, లేదో... లీకై పేలిపోతుందేమో!’
ఇంటి నుంచి బయటకు వచ్చాక భయం వల్ల కలిగే ‘అనుమానం.’
‘నా డబ్బు కొట్టేయడానికి అందరూ కుట్రపన్నుతున్నారు.’ ఇదొకరకం ‘అనుమానం.’
ఉదయం లేచిన దగ్గర నుంచి ఈ ‘అనుమానాల’కు సంబంధించిన ఎన్నో కథనాలు వింటుంటాం. కళ్లారా చూస్తుంటాం. మనిషికి ఎదుటివారిపైన, చివరకు తనపైన తనకే అనుమానం ఎందుకు మొదలవుతుంది? ఈ జబ్బు ఏ పరిస్థితులకు దారి తీస్తుంది. సింపుల్‌గా అనిపించే ఈ క్రిటికల్ కండిషన్ గురించి పూర్తి వివరాలు తెలిపే కథనం.


దగ్గు, జ్వరానికి ఇవీ అని చెప్పలేని కారణాలు ఉన్నట్టే ‘అనుమానం’ అనే జబ్బుకు అంతకన్నా ఎక్కువ కారణాలు ఉన్నాయి. కొన్ని మానసిక జబ్బులలో ‘అనుమానం’ ఒక లక్షణంగా పేర్కొంటారు. వందలో వందమందికి ఉండే అనుమానాలు రకరకాలు...


యాంగ్జైటీ డిజార్డర్...

భర్త ఆఫీస్‌కి చేరగానే ఫోన్ చేయాలన్నది మధుమతి రూల్. కాని వెళ్లి గంటయినా ఫోన్ రాలేదు. కంగారు గా తనే ఫోన్ చేసింది. ఫోన్ రింగవుతోంది, కాని ఎన్నిసార్లు చేసినా ఎత్తడం లేదు. ‘ఏమై ఉంటుంది?’ ముందు అనుమానం, తర్వాత భయం... ఆవరించాయి. టీవీ ఆన్ చేసింది, ఎక్కడైనా ట్రాఫిక్ జామ్ ఉందా అని. తర్వాత యాక్సిడెంట్ అయినట్టు బ్రేకింగ్ న్యూస్ ఏమైనా వస్తుందా! అని టీవీకే కళ్లప్పగించింది. అక్కడి నుంచి ఆమెలో తీవ్రమైన ఆందోళన... భర్తకు జరగరానిదేదో జరిగిపోయిందని, ఎవరైనా ఆఫీస్ వరకు తోడురమ్మని ఏడుస్తూ చుట్టుపక్కల వారిని వేడుకుంటుంది... కాని అసలు విషయం ఏంటంటే భర్త మీటింగ్ హడావుడిలో ఉండి క్షేమంగా ఆఫీస్‌కి చేరానన్న విషయం ఆమెకు ఫోన్ చేసి చెప్పలేకపోయాడు. ఇది ఆ ఒక్కరోజే కాదు... ఇంచుమించు రోజూ ఇలాంటి సంఘటన ఉంటూనే ఉంది. భర్త, పిల్లలు కాలు బయటపెడితే తిరిగి వాళ్లు ఇంటికి వచ్చేంత వరకు ఆమె కనీసం మంచినీళ్లు కూడా ముట్టదు.

అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్...
సుధాకర్ ఉద్యోగవిరమణ చేశాడు. శుభ్రత పట్ల అతనికి ఎనలేని శ్రద్ధ. ఈ విషయంలో అందరిచేత ప్రశంసలు అందుకునే సుధాకర్ ప్రవర్తన ఈ మధ్య మరీ విపరీతంగా మారింది. చేతులు మురికిగా ఉన్నాయని కడుక్కొని, శుభ్రంగా తుడుచుకుని వచ్చి కూర్చుంటాడు. పేపర్ పట్టుకొని అటు పక్కగా పెట్టాక చేతులకు ఏదో అంటినట్టుగా ఉంది అనుకుని మళ్లీ వెళ్లి సబ్బుతో రుద్ది రుద్ది కడుగుతాడు. తర్వాత మంచినీళ్లు తాగి గ్లాసు పక్కన పెట్టి, గ్లాసుకున్న మురికి చేతులకు అంటినట్టుగా ఉందని సబ్బుతో రుద్ది రుద్ది మళ్లీ చేతులు కడుక్కుంటాడు. అలా అతను ప్రతి అయిదు నిమిషాలకోసారి చేతులు మళ్లీ మళ్లీ కడుక్కుంటూనే ఉన్నాడు. కొన్నాళ్లకు ఈ అదేపనిగా ‘కడగడం’ వల్ల చేతులపై ఉన్న చర్మం ఎరబ్రారి పుండ్లు అవడం మొదలయ్యాయి. నొప్పితో బాధపడుతున్నప్పటికీ ఈ జాడ్యం అతన్ని వదలడం లేదు. చేసిన పనినే ‘సరిగ్గా చేశానో! లేదో!’ అనే అనుమానం వచ్చి మళ్లీ మళ్లీ చేయడాన్ని అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అంటారు. ‘అనుమానం’లో ఇది ఒక తరహా లక్షణం.

ప్యాథలాజికల్ జెలసీ...
భర్త పరాయి స్ర్తీతో తిరుగుతున్నాడని నమిత అతన్ని రోజూ సాధిస్తోంది. ఆఫీస్‌కు వెళ్లినప్పుడు అతనికి తెలియకుండా ఫాలో అవుతుంది. అతను ఆఫీస్ నుంచి రావడం ఐదు నిమిషాలు ఆలస్యం అయినా ‘ఎవరి దగ్గరికో వెళ్లి ఉంటారు’ అంటుంది. ఏదైనా పెర్‌ఫ్యూమ్ వాసన వస్తుందేమో... అని ఇంటికి రాగానే దగ్గరగా వెళ్లి డ్రెస్ వాసన చూస్తుంది. అతనికి సంబంధించిన వస్తువులన్నీ చెక్ చేస్తుంటుంది. డిటెక్టివ్ ఏజెన్సీలను కలిసి తన భర్త ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో ఫ్రూఫ్‌లతో సహా ఇమ్మంటుంది. భార్య ప్రవర్తన వల్ల ఇంట్లో మనశ్శాంతి కరువైందని ఇంటికి రావడమే మానేశాడు భర్త. ముప్పై ఏళ్ల నమిత పరిస్థితి ఇలా ఉంటే..

అరవై ఏళ్ల ప్రతాప్ ఇటీవలే ఉద్యోగ విరమణ చేశాడు. ఇల్లు కట్టాడు. పిల్లలు వారి వారి జీవితాల్లో సెటిల్ అయిపోయారు. ఏ చీకూ చింతా లేదు. ఈ మధ్య అతని ఇంటి పక్క పోర్షన్‌లోకి ఒకప్పటి తన కొలీగ్ కుటుంబం చేరడంతో అతనిలో ఎన్నడో పాతుకుపోయిన అనుమానం ఒకటి బయటకు వచ్చింది. పదిహేనేళ్ల క్రితం తనింటికి అతను వచ్చినప్పుడు భార్య అతనికి వంగి టీ అందించిందని, ఆ రోజు ఆమె అలా అతనికి సిగ్నల్ ఇచ్చిందని, కొన్నేళ్లుగా వీరిద్దరి మధ్య సంబంధం నడుస్తోందని, ఆ సంబంధాన్ని పెంచుకోవడానికే అతను తన ఇంటి పక్కన చేరాడని ఆమెతో రోజూ గొడవ పెట్టుకుంటున్నాడు. ఆలు మగల మధ్య వివాహేతర సంబంధాలు ఉన్నట్టు అనుమానాలు రేకెత్తడాన్ని ప్యాథలాజికల్ జెలసీ అంటారు.


పారనాయిడ్ స్క్రిజోఫీనియా...
‘లోకమంతా నా మీద కక్ష కట్టింది. అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు. నేను చెడిపోవడమే వాళ్లకు కావాల్సింది. నన్ను ఎవరో వెంబడిస్తున్నారు. నన్ను చంపాలని చూస్తున్నారు. నా ఆస్తిని అందరూ దోచుకుపోవాలనుకుంటున్నారు. ప్రభుత్వమే నాకు అన్యాయం చేయాలనుకుంటోంది. ఉపగ్రహాల ద్వారా నన్ను వారి అధీనంలోకి తెచ్చుకోవాలని కుట్ర పన్నుతోంది.’ ఈ తరహా ఆలోచనా విధానాలలో తీవ్రమైన అనుమానాలు కలుగుతుంటాయి. అనుమానాలలో ఇది తీవ్రమైన జబ్బు.
హైపో కాండ్రియాక్...
‘తలనొప్పి వచ్చినట్టుగా అనిపించగానే, బ్రెయిన్ ట్యూమర్ అయి ఉంటుందా?’ అనే అనుమానం తొలుస్తుంది. ‘ఛాతిలో నొప్పి, అమ్మో! ఇది డెఫినెట్‌గా గుండెజబ్బే..,’ ‘నడుం నొప్పి, బాబోయ్! కిడ్నీలు ఫెయిల్ అయ్యాయేమో,’ కడుపులో నొప్పి, క్యాన్సర్ కాదు కదా!...’ చిన్న చిన్న అనారోగ్యసమస్యలకు అనుమానం వల్ల పెద్ద పెద్ద జబ్బులను అంటగట్టుకొని భయపడుతుంటారు. ఎదుటివారు ‘అలా అయి ఉండదులే’ అంటే, మీకేం తెలుసు, దేనినైనా ‘కీడెంచి మేలెంచు’ అన్నారు పెద్దలు అంటుంటారు.

ఈ తరహా ప్రవర్తనలు ఎదుటివారికి చిరాకు, కోపాన్ని తెప్పించడం సహజం. అలాగని వీరి నుంచి దూరం అవ్వాలి అనుకోకుండా చికిత్సామార్గాలతో సాధారణ స్థితికి తీసుకురావచ్చు.

చికిత్స
‘అనుమానం’ తీవ్రంగా ఉన్నవాళ్లను డాక్టర్ వద్దకు వెళ్దామంటే వారి అహం దెబ్బతింటుంది. తమకు లేని జబ్బు ఏదో ఆపాదిస్తున్నారని కుంగిపోవడం, వాదనకు దిగే అవకాశం ఉంటుంది. దీని వల్ల ఇతర సమస్యలు ఉత్పన్నం అవుతాయి. అందుకని ‘అనుమానం’తో సఫర్ అవుతున్న వ్యక్తులను మంచి మాటలతో వైద్యుల దగ్గరకు తీసుకెళ్లాలి. వైద్యులు కూడా సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు కౌన్సెలింగ్ అంటూ వెళ్లకుండా ముందుగా మందులు సజెస్ట్ చేయాలి. తీవ్రత తగ్గాక కౌన్సెలింగ్, కాగ్నెటివ్ థెరపీ ద్వారా ఆలోచనా విధానంలో మార్పులు తీసుకురావచ్చు.

‘అనుమానం’ ఎందుకు?

మెదడులో జరిగే న్యూరో కెమికల్ ఇమ్‌బ్యాలెన్స్.

తనదైనదేదో తనకు కాకుండా పోతుందనే ఇన్‌సెక్యూరిటీ. అతి ప్రేమ.


ఎదుటివారిపైన నమ్మకం లేకపోవడం.


ఆల్కహాల్, పొగ తాగడం, కొన్ని రకాల మత్తు పదార్థాలకు బానిస కావడం.


త లకు చిన్న చిన్న దెబ్బలు తగిలి బ్రెయిన్ దెబ్బతినడం.


చిన్న నాటి నుంచి ప్రేమ లేకుండా పెరిగిన వాతావరణం.


{బెయిన్‌కు ఇన్ఫెక్షన్లు సోకడం.


అమితమైన ఆందోళన.


ఇలా రకరకాల కారణాల వల్ల ‘అనుమానం’ అనేది వ్యక్తిలో ఓ భాగం అయిపోతుంటుంది.


ఈ జబ్బు నుంచి బయటపడాలంటే...

అనుమానం అప్పుడప్పుడు వస్తున్నా, మాటలతో ఎదుటివ్యక్తిని సముదాయించగలుగుతున్నాం అనుకుంటే జబ్బుగా పరిగణించనక్కర్లేదు. కాని ఈసమస్య డైలీ లైఫ్‌ని ఇబ్బంది పెట్టేదిగా ఉంటే, అవతలి వ్యక్తి రోజూ నరకం చూడాల్సి వస్తుంటే మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. అనుమానం అనే జబ్బు వదిలించుకోవాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాలి.

రోజూ మనసుకు సాంత్వన చేకూర్చే అభిరుచులను పెంపొందించుకోవాలి.


మాటలంటున్నప్పుడు జబ్బు వల్లే ఇలా చేస్తున్నారనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. వారి మాటల్ని వినీ విననట్టు ఉండాలి. అనుమానించదగ్గ టాపిక్ రాగానే డైవర్ట్ చేయాలి.


ప్రతి దానికి అనుమానిస్తారని విసుక్కోవడం, కోప్పడటం, కొట్టడం లాంటివి చేయకూడదు.

అనుమానించదగ్గ పనులను మళ్లీ మళ్లీ చేయకూడదు. భాగస్వామిలో నమ్మకాన్ని పెంచేలా మన ప్రవర్తన ఉండాలి.


ఆల్కహాల్, స్మోకింగ్, మత్తు పదార్థాల వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలి.


‘అనుమానం’ వల్ల చుట్టూ ఉన్న మనుషులు ఇబ్బంది పడుతున్నారు అని గమనించినప్పుడు తప్పనిసరిగా డాక్టర్‌ని సంప్రదించాలి.

స్మూత్ వింటర్!

చలికాలం వస్తే చాలు... మరో భయమూ గడగడలాడించేస్తుంది.
ఇది చలి వల్ల వచ్చే వణుకు కాదు...
చర్మానికి కలిగే హానిని తలచుకుని ఈ ఆందోళన.
మామూలు టైమ్‌లో ఉండే మెరుపు తగ్గిపోయి చర్మం నిస్తేజంగా మారుతుంది.
బాగా పొడిబారిపోయి కాస్త గోరు గీరుకున్నా చారికలు పడిపోయి అసహ్యంగా కనిపిస్తుంది. ‘వింటర్’తో పాటు వచ్చే చర్మ సమస్యలకు ‘స్మూత్’ పరిష్కారమే ఈ ముందుజాగ్రత్త.


చలికాలంలో వాతావరణం చల్లగా, పొడిగా ఉంటుంది. దానికి తోడు చల్లటిగాలులు. అందువల్ల చర్మంలోని తేమ, సహజసిద్ధమైన నూనెలు తగ్గిపోతాయి. ఫలితంగా చర్మం పొడిబారి, దురద మొదలవుతుంది. మంటపుడుతుంది. గీరితే పొట్టు రాలుతుంది. చలికాలంలో ఈ సమస్య అందరికీ వస్తుంది. కాకపోతే ఇప్పటికే చర్మ సమస్యలు ఉన్నవాళ్లకి, కొన్ని రకాల మందులు వాడుతున్నవారికి ఎక్కువ. పెదవులు కూడా త్వరగా పొడిబారి, పగులుతూ ఉంటాయి. అజాగ్రత్త చేస్తే ఒక్కోసారి రక్తం కూడా వస్తుంటుంది. ఈకాలంలో జుట్టు కూడా పొడిబారి, కాంతి తగ్గి, బలహీనపడి, ఎక్కువగా ఊడుతుంటుంది.


వింటర్ ఎగ్జియోరోసిస్: ఈ సమస్య చేతులకి, కాళ్లకు ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. చర్మం బాగా పొడిబారి, దురద మొదలవుతుంది. వీళ్లు తరచూ మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ వాడాలి.

ట్యానింగ్: చలిగా ఉంది కదా! అని ఎక్కువసేపు ఎండలోనే ఉండటం వల్ల పొడిబారిన చర్మం కమిలిపోతుంది.

అటోపిక్ డెర్మటైటిస్: ఈ స్కిన్ డిసీజ్ ఏడాది లోపు పిల్లల్లో బుగ్గలు, చేతులు, కాళ్ల మీద మొదలవుతుంది. చర్మం ఎరగ్రా, పొడిబారి దురద వస్తుంది. తరచూ ముక్కుకారడం, డస్ట్ అలెర్జీ, ఆస్తమాసమస్యలు ఉంటాయి. జాగ్రత్తలు తీసుకోకపోతే ఎగ్జిమా శరీరమంతా స్ప్రెడ్ అయిఎరిథ్రోడెర్మస్‌గా మారుతుంది. వీరు డాక్టర్ సలహా మేరకు మందులు వాడటం అవసరం.

సోరియాసిస్: 30 -40 ఏళ్ల మధ్య వయస్కులు, వయసు పైబడిన వారిలో ఈ సమస్య ఎక్కువ. మోకాళ్లు, మోచేతులు, వీపు మీద ఎరన్రి ప్యాచెస్ వస్తుంటాయి. చర్మం మందంగా మారి, పొట్టు రాలుతూ ఉంటుంది. తలలో కూడా తెల్లటి పొట్టు రాలుతూ ఉంటుంది. గోళ్లు, కీళ్ల సమస్యలు ఉంటాయి.

రోసాసియ: ఈ చర్మ సమస్య ఉన్నవాళ్లకు బుగ్గలు, ముక్కు, తల ముందుభాగం మీద ఎరగ్రా కందిపోయి ఉంటుంది. ఇది యాక్నెనా, పింపులా అని కన్‌ఫ్యూజ్ అవుతుంటారు. ఇది ఆల్కహాల్, మసాలాలు ఎక్కువ తీసుకునేవాళ్లకు వస్తుంది.

యాక్నె, పింపుల్స్: చలికాలంలో చర్మం పొడిబారి మృతకణాలు పెరుగుతాయి. ఇవి చర్మం రంధ్రాలని మూసుకుపోయేలా చేస్తాయి. ఫలితంగా బ్యాక్టీరియా ఆకర్షించి మొటిమలు ఎక్కువ అవడానికి ఆస్కారం ఉంది.

ఆస్టియోటిక్ ఎగ్జిమా: ఈ సమస్య వృద్ధులకు వస్తుంది. పొలం ఎండి బీటలు వారినట్టు చర్మం కూడా అలా కనిపిస్తుంటుంది.

కాగ్నైటల్ డిజార్డర్
ఈ సమస్య పుట్టుకతోనే మొదలవుతుంది. చర్మం అంతా పొడిబారి చేపల పొలుసుల్లాగ ఊడిపోతూ ఉంటుంది. ఇది ఒక్కొక్కసారి చాలా సివియర్ ప్రాబ్లమ్ అవుతుంది. ఈ పిల్లలకు పుట్టిన దగ్గర నుంచే చికిత్స ఇవ్వాల్సి ఉంటుంది.
అభ్యంగన స్నానంతో అందం, ఆరోగ్యం...
శీతల వాతావరణంలో చర్మానికి లభించే రక్తప్రసరణ మందగిస్తుంది. అందువల్ల చర్మానికి కావలసిన పోషకపదార్థాలు తక్కువవుతాయి. ఫలితంగా చర్మం పొడి బారుతుంది. అలెర్జ్జీలు, ఎగ్జిమాలు సునాయాసంగా వస్తుంటాయి. అనంతరం ఇన్‌ఫెక్షన్లు ఆవహిస్తాయి.
చర్మ ఆరోగ్య సూత్రాలు: రోజూ ఉదయం పూట కనీసం రెండు లీటర్ల నీళ్లు తాగాలి. రోజు మొత్తంలో 4-5 లీటర్ల నీళ్లు తాగడం ఆరోగ్యదాయకం.

తగినంత వ్యాయామం చేయడం ద్వారా శరీరానికి చెమట వచ్చేట్టు చేయాలి. తలకు కూడా చెమట పడితే వ్యాయామం పూర్తిగా చేసినదానికి చిహ్నం.
అభ్యంగనం: ఇది చర్మానికి చేసే తైలమర్దనం. నువ్వుల నూనె లేదా ఆవనూనె మర్దనాకు మంచిది. ఆ తర్వాత నలుగు కోసం సున్నిపిండి వాడాలి. పెసరపిండి నాలుగుపాళ్లు, వరిపిండి ఒకపాలు తీసుకొని తగినన్ని నీళ్లలో కలిపి ముద్దగా చేయాలి. పెసరపిండికి బదులు శనగపిండిని కూడా వాడుకోవచ్చు.
స్వేదకర్మ: వేడినీటి ఆవిరితో శరీరానికి చెమట పట్టేట్టు చేయాలి. దీనినే స్టీమ్ బాత్ అంటారు. పావుగంట పాటు ప్రభాత సూర్యకిరణాలు తాకేట్టు ఎండలో కూర్చుంటే మంచిది.

ఔషధాలు: పసుపు, బావంచాలు, అగరు (మొక్క బెరడులోని చేవ) ద్రవ్యాలను సమపాళ్లలో మెత్తగా పొడి చేసి నలుగుకు వాడితే చాలా మంచిది.
ముస్తా (తుంగముస్తలు), కరక్కాయ, మంజిష్ఠ ద్రవ్యాలు కలిపి నలుగుకు వాడుకోవచ్చు.

బొప్పాయి పండు ముద్ద, క్యారట్, కీరా గుజ్జు, పాల మీగడలలో ఏదైనా ఒకదానిలో కొంచెం నిమ్మరసం కలిపి చర్మంపై లేపనం చేస్తే నల్లని, గోధుమరంగు మచ్చలు తగ్గుతాయి. చర్మం మృదువుగా తయారవుతుంది. ముడతలు కూడా తగ్గుతాయి.

రోజూ రాత్రి పది గ్రాముల త్రిఫలా చూర్ణాన్ని నీళ్లలో కలిపి తాగితే మృదువుగా విరేచనం అవటమే కాకుండా, చర్మపు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కరక్కాయ, తానికాయ, ఉసిరికాయలను త్రిఫలాలు అంటారు.

శారిబాద్యాసవ/ ఖదిరారిష్ట/ మహామంజిష్టాది: ఈ మూడు ద్రావకాలలో ఏదైనా ఒకటి నాలుగు చెంచాలు తీసుకొని సమానంగా నీళ్లు కలిపి, రెండు పూటలా తాగితే, రక్తం శుద్ధి అవుతుంది. ఫలితంగా చాలా చర్మ రోగాలకు నివారణగా పనిచేస్తుంది.

కుంకుమపువ్వు (శాఫ్రన్):
దీనితో చేసిన నూనె పై పూతకి మంచిది. 200 మి.గ్రా కుంకుమ పువ్వును గ్లాసు పాలతో కలిపి తాగితే చర్మకాంతి మెరుగవుతుంది.

ఆహారం: పులుపు, ఉప్పు, కారాలు తగ్గించాలి. ఆకుకూరలు, మునక్కాయ, తాజా పండ్లు తీసుకోవడం మంచిది. రోజూ ఒక ఉసిరికాయ తినటం శ్రేష్ఠం.

గమనిక:
అలెర్జీ కలిగించే ఆహారపదార్థాలు తీసుకోకూడదు. అలాగే కొన్ని రసాయనక్రిములు, ఔషధాలు, వేడి ఎక్కువగా ఉన్న సూర్యరశ్మి, సబ్బులకు దూరంగా ఉండటం వల్ల చర్మానికి కలిగే హానిని నివారించుకోవచ్చు.


చలికాలం - చర్మ జాగ్రత్తలు

స్నానం చేసే అరగంట ముందు ఆలివ్ లేదా కొబ్బరి నూనెతో శరీరానికి మసాజ్ చేసుకోవాలి. స్నానానికి మాయిశ్చరైజింగ్ సబ్బులు వాడాలి. చర్మ సమస్యలు ఉన్నవారు స్నానం చేసే నీటిలో 10 చుక్కలు నూనె వేసుకొని చేస్తే ఇంకా మంచిది.

స్నానం చేసి, తడి తుడుచుకున్న వెంటనే డీప్ మాయిశ్చరైజింగ్ క్రీమ్ రాసుకోవాలి. ఈ క్రీమ్ రోజుకు 3- 4 సార్లు వాడితే మంచిది.

చలికాలంలో కొందరు స్నానానికి చాలా వేడి నీళ్లు వాడతారు. వేడినీళ్లు చర్మంలో ఉన్న సహజసిద్ధమైన నూనెలను తీసేసి, ఇంకా పొడి చేస్తుంది. అందుకని స్నానానికి ఎక్కువ వేడినీళ్లు వాడకూడదు.

సమతుల ఆహారం చర్మాన్ని పొడిబారనివ్వదు. రోజూ ఎనిమిది గ్లాసుల మంచినీరు తప్పకుండా తీసుకోవాలి. నీళ్లు తక్కువగా తీసుకుంటే చర్మం త్వరగా పొడిబారుతుంది.

బయట ఎక్కువగా తిరిగేవాళ్లు ముఖానికి చేతులకు సన్‌స్క్రీన్ లోషన్ రాసుకోవాలి. ఎందుకంటే ఈ కాలంలో ట్యానింగ్ సమస్య ఎక్కువ.

ముఖానికి క్లెన్సర్లు ఈ కాలంలో వాడకూడదు. ఇవి చర్మాన్ని ఇంకా పొడిబారేలా చేస్తాయి.

పాదాలకు, చేతులకు కాటన్ గ్లౌజ్ వేసుకుంటే వెచ్చగా ఉండి, ఎక్కువ పొడిబారనివ్వవు.

తల స్నానానికి 2 గంటల ముందు మాడుకు నూనెతో మసాజ్ చేసుకోవాలి. నూనె కండిషనర్‌గా పనిచేస్తుంది. పొడి జట్టు వాళ్లయితే షాంపూ ఉపయోగించిన తర్వాత కండిషనర్ వాడాల్సి ఉంటుంది.

జుట్టు తడి ఆరబెట్టడానికి ఈ కాలంలో బ్లో డ్రయ్యర్లు వాడకూడదు. ఇవి జుట్టుకు మరింత హాని చేస్తాయి. బయటకు వెళితే జుట్టును సిల్క్ స్కార్ఫ్‌తో కవర్ చేసుకోవడం మంచిది.

శిరోజాలకు కలరింగ్‌లు, ఐరనింగ్‌లు చేయించుకోకూడదు. ఎందుకంటే వీటి వల్ల జుట్టులోని తేమ తగ్గి వెంట్రుకలు ఎక్కువగా ఊడిపోతాయి.

పెదాలు:  పెట్రోలియమ్ జెల్లీ లేదా లిప్ బామ్‌ని తరచూ పెదాలపై రాస్తూ ఉండాలి. ఇంట్లో ఉన్నప్పుడు తరచూ వెన్న రాసుకుంటే మంచిది.