Sunday, October 3, 2010

శరీరానికి సూర్యరశ్మి

అరగంట ఎండ తప్పనిసరి

ఎండ తగిలితే చర్మం పాడయిపోతుందని, కందిపోతుందని, నల్లబడిపోతుందని...ఇలా ఒకటేమిటి పది సాకులు చెప్పి ఎండ చూసి పారిపోతాం మనం. ఎండకు దూరంగా నీడపట్టునుంటే నిగనిగలాడొచ్చని కూడా చెబుతారు. ఇలా చేయడం వల్ల వచ్చే ప్రయోజనం ఎంతో తెలియదు గాని నష్టం మాత్రం పెద్ద ఎత్తునే ఉందంటున్నారు పరిశోధకులు.

ఎండకు భయపడి నీడనే కూర్చుంచే ఊబకాయం రావడం ఖాయమంటున్నారు. ప్రతి రోజు కనీసం ముప్పైనిమిషాలు మన ఒంటికి ఎండ తగలకపోతే మన శరీరానికి కావలసిన డి విటమిన్ అందదు. డి విటమిన్ అనేది శరీరానికి కాల్షియాన్ని గ్రహించే శక్తినిస్తుంది.

సూర్యరశ్మి తగలక ఒంట్లో డి విటమిన్ తయారవకపోతే మనలో కాల్షియం లోపిస్తుంది. ఫలితంగా శరీరం దృ«ఢత్వం కోల్పోతుంది. డి విటమెన్ లోపం వల్ల మధుమేహం, గుండె జబ్బులు కూడా త్వరగా వస్తాయని చైనాలో జరిగిన ఒక పరిశోధనలో తేలింది. వీటంన్నిటినీ ఎదుర్కొవాలంటే ఎండలో తిరగడమొక్కటే మార్గమంటున్నారు పరిశోధకులు.

No comments: