Friday, December 31, 2010

వ్యాధులు - ఆయుర్వేద చిట్కాలు



* స్వచ్ఛమైన ఇంగువను నిమ్మరసంతో కలిపి నూరి కొద్దిగా వెచ్చచేసి దూదిని దానిలో ముంచి తడిపి పంటి నొప్పి వున్నచోట పెడితే పంటి నొప్పి తగ్గిపోతుంది.
* బిళ్ళగనే్నరు ఆకుల్ని, జామ ఆకుల్ని సమతూకంలో తీసుకుని ముద్దచేసి ఈ ముద్దని ఐదు చెంచాల వంతున ఉదయం సాయంత్రం 3 రోజులు తీసుకుంటే అతిసార వ్యాధి తగ్గుతుంది.
* వంద గ్రాముల వాము శుభ్రంచేసి ఎర్రగా వేయించి, మెత్తగా పొడిచేసి డబ్బాలో నిల్వ ఉంచుకొని గ్యాస్‌ట్రబుల్ ఉన్నప్పుడు ఒక చెంచా పొడిని నీళ్ళల్లోగాని, విడిగా గాని తీసుకుంటే ఎక్కువ త్రేన్పులు రాకుండా ఉంటుంది.
* ముల్లంగిని కూరగా చేసుకుని గానీ, దంచిన రసంగా గానీ తాగాలి. పల్లేరు సమూలంగా కషాయం చేసుకుని తాగితే మూత్ర సంచి సమస్యలు తగ్గుతాయి.
* మూత్రం కొంచెం కొంచెంగా వస్తే అల్లంముక్కలు తేనెతో గానీ, పంచదారతో గానీ కలుపుకుని తింటే యూనినరీ ఇన్‌ఫెక్షన్స్ తగ్గుతాయి.
* పచ్చి మెంతులు ఒక అరచెంచా ఉదయం, సాయంత్రం మింగాలి. పచ్చివి తినలేకపోతే పెరుగులో నానబెట్టుకుని తింటే మూత్ర పిండాల నొప్పి తగ్గుతుంది.
* గుప్పెడు వేపాకు, ఒక చెంచా పసుపు, ఒక చెంచా ఉప్పు దంచి కురుపుల మీద రుద్ది ఒక గంట తరువాత సున్నిపిండితో స్నానంచేస్తే గజ్జి కురుపులు తగ్గుతాయి.
* రెండు లేదా మూడు మిరియాలు బుగ్గన పెట్టుకొని మెల్లగా నములుతూ రసం మింగాలి. ఇలా రోజుకు ఐదునుండి ఏడు మిరియాలు నమిలితే దగ్గు తగ్గుతుంది.
* తెల్ల ఉల్లిపాయ రసం పది మి.లీ., అల్లం రసం పది మి.లీ. నిమ్మ రసం పది మి.లీ. తేనెతో కలిపి 50మి.లీ. తీసుకుంటే కాటరాక్ట్, గ్లూకోమా తగ్గుతుంది.
* తులసి రసం, అల్లం రసం రెండుమూడు చుక్కలు తీసుకుని కొంచెం తేనె కలిపి పిల్లలకిస్తే జ్వరం, జలుబు తగ్గుతాయి.
* త్రిఫల చూర్ణం, పసుపు, నీళ్ళు కలిపి పేస్టులా చేసి పడుకునే ముందు కాళ్ళు శుభ్రంగా కడుక్కొని మందుపెట్టాలి. పగుళ్ళు తగ్గేంతవరకు ఇలా చేస్తే కాళ్ళ పగుళ్ళు తగ్గుతాయి.
* అల్లం, జీలకర్ర నెయ్యిలో వేయించి, అందులో పటిక బెల్లం ముక్కలు వేసి కరగబెట్టాలి. పటిక బెల్లం కరిగాక ముక్కలుచేసి రోజూ ప్రొద్దున్న తీసుకుంటే పైత్యం తగ్గుతుంది.
* పండు జిల్లేడు ఆకుకు నీరు సున్నం రాసి, వెచ్చచేసి, రసం పిండి చెవిలో వేస్తే చెవి పోటు తగ్గుతుంది.
* అల్లం రసం, ఇంగువ కలిపి వెచ్చచేసి చెవిలో వేస్తే చీము కారడం తగ్గుతుంది. తాత్కాలికంగా వచ్చే చెవుడు కూడా తగ్గిపోతుంది.
* పెద్ద ఉల్లిపాయ, ఉప్పు కలిపి నూరి దానిని పండ్లకి వేసి రుద్దితే పండ్ల వెంట కారే రక్తం ఆగిపోతుంది.
* స్వచ్ఛమైన ఇంగువ నిమ్మ రసంతో నూరి కొద్దిగా వేడి చేసి, దూదిని దానిలో ముంచి తడిపి పంటి నొప్పి ఉన్నచోట పెడితే నొప్పి తగ్గుతుంది.
* గచ్చకాయ కాల్చిన మసి, పటిక, పోక చెక్కల మసి - మూడూ కలిపి చిగుళ్ళకి రుద్దితే చిగుళ్ళవాపు, చీము, నెత్తురు కారటం, నోటి దుర్వాసన తగ్గుతాయి.
* నేరేడు చెక్క చూర్ణం, కవిరి చూర్ణం (కాచు) సమానంగా కలిపి, కొద్దిగా ముద్దకర్పూరం కూడా కలిపి రాస్తే దంతాలకి సంబంధించిన సమస్త బాధలు తగ్గుతాయి.
* జాజికాయ చిన్న పలుకు దవడకి పెట్టుకుని కొంచెం కొంచెంగా నమిలి తినాలి. ఇది శరీరానికి వేడి చేస్తుంది. జాపత్రి చిన్న ముక్క తమలపాకులో వేసుకొని తింటే నోటి దుర్వాసన నివారణ అవుతుంది.
* లవంగం దవడకి పెట్టుకుని నమలాలి. పచ్చి పోకలు తమలపాకులో వేసుకుని తింటే నోటి దుర్వాసన తగ్గుతుంది.
* నేరేడు విత్తులు, గింజలు తీసేసిన కాకర కాయలు, నేలతంగేడు పూజ, పొడపత్రి, తిప్పతీగె, ఉసిరికాయ చూర్ణం చేసి రెండు పూటలా నోట్లో వేసుకొని, నీరు తాగితే మధుమేహం నియంత్రణలో ఉంటుంది.
* మందార పువ్వుల్ని కొబ్బరి నూనెలో వేసి మరగబెట్టి చల్లార్చి తలకు పెట్టుకుంటే జుట్టు ఊడకుండా ఉంటుంది.
* గుంటగలగరాకు దంచి, రసం తీసి ఒక వంతు కొబ్బరి నూనెలో కలిపి నీరు మరిగే వరకు ఉడకబెట్టాలి. చిటపట శబ్దం పోయి నూనె పైకి తేలేవరకు పొయ్యిమీద ఉంచాలి. సువాసనకి గంధకచ్చూరాలు కలుపుకుని, వాడడంవల్ల జుట్టు రాలదు. నల్లబడుతుంది. పెరుగుతుంది.
* వేపాకు రసం అరకప్పు, పెరుగు అరకప్పు, ఒక చెక్క నిమ్మకాయ రసం, మూడూ కలిపి తలకు పట్టించాలి. గంట తర్వాత కడిగితే చుండ్రు నివారణ అవుతుంది.
* వేపనూనె, కర్పూరం కలిపి రాస్తే తలలో పురుగు చచ్చి, కురుపులు మాడిపోతాయి, చుండ్రు తగ్గుతుంది.
* వంద గ్రాముల పెద్ద ఉల్లిపాయల్ని తీసుకొని వాటిని బాగా చితక్కొట్టి అర లీటరు నీళ్ళల్లో ఉడకబెట్టాలి. ఆ ఉడికిన నీళ్ళల్లో నాలుగోవంతు తీసుకొని పంచదార కలిపి తాగితే మూత్ర నాళంలో రాళ్ళు కరిగిపోతాయి.
* అల్లం, స్వచ్ఛమైన బెల్లం ఒక్కోటి 5గ్రాములు తీసుకుని రెండూ కలిపి రాత్రి పడుకోబోయేముందు నమిలి తింటే మలబద్ధకం పోతుంది.
* చందన అత్తరు (శాండల్ ఉడ్ ఆయిల్) పది చుక్కలు పంచదారతో కలిపి తింటే మూత్రపు మంట వెంటనే తగ్గిపోతుంది.

* ముద్దతామర ఆకుల్ని వేళ్ళతో సహా నూరి కురుపుల మీద కట్టాలి. చీము తగ్గి కురుపులు మానుతాయి.
* మెంతికూర చిన్నదిగాని, పెద్దదిగాని కూర చేసుకుని రోజూ కనీసం మూడు నెలలు తింటే రక్తహీనత తగ్గుతుంది.
* అశ్వగంధ వేర్లు తీసుకుని మెత్తగా నూరి ఒక చెంచా పొడిని అర కప్పు నీళ్ళల్లోగాని, పాలల్లోగాని కలుపుకుని తాగితే నడుం నొప్పి తగ్గుతుంది.
* నిమ్మ రసంలో పాలు కలిపి రాత్రి పూట రాసి, ఉదయం గోరువెచ్చని నీటితో కడిగితే మొహంమీద మచ్చలు పోతాయి.
* ఒక చెంచా కస్తూరి పసుపు మెత్తగా చేసి, నువ్వుల నూనెలో గాని, పల్లీనూనెలో గాని కలిపి రాసుకుంటే మొటిమలు తగ్గుతాయి.
* వేపాకు మెత్తగా నూరి శనగ గింజంత మోతాదులో మాత్ర చేసుకుని రోజుకు మూడుసార్లు మింగితే మొటిమలు తగ్గుతాయి.
* ఉసిరికాయ రసం పంచదారతో కలిపి పూటకు పది గ్రాముల వంతున రెండు పూటలు తీసుకుంటే కీళ్ళనొప్పులు తగ్గుతాయి.
* పుదీనా కట్టలు నాలుగు తీసుకుని, పది గ్రాముల మిరియాలు, పది గ్రాముల శొంఠి కలిపి మెత్తగా నూరాలి. శనగ గింజంత టాబ్లెట్లు చేసుకుని నీడలో ఆరబెట్టాలి. రోజుకు మూడు టాబ్లెట్లు మూడునెలలు తీసుకుంటే స్థూలకాయం తగ్గుతుంది.
* అశ్వగంధ ఆకుల్ని ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఒక పచ్చి ఆకుని నమిలి మింగాలి. ఇది బరువును తగ్గిస్తుంది.
* జీవన్‌ధార ఒక చుక్క తమలపాకులో వేసి తినాలి. కరక్కాయ బెరడు దవడకు పెట్టుకొని దాని రసం మింగితే జలుబు, దగ్గు తగ్గుతాయి.
* రావి చికురుటాకులు తొమ్మిదింటి రసం తీసుకుని, తేనెతో కలిపి తీసుకుంటే రెండుమూడు పూటల్లో జలుబు తగ్గుతుంది.
* జిల్లేడు పువ్వు ఒక తమలపాకులో పెట్టి నమిలి తినాలి. ఇలా ఉదయం, సాయంత్రం రెండుపూటలా మూడురోజులు తింటే జలి జ్వరం తగ్గుతుంది.
* తులసి ఆకు రసంతో కొంచెం అల్లం రసం గాని, లేక కొంచెం శొంఠి రసం గాని కలిపి, టీ స్పూన్ తేనె కూడా కలిపి తాగితే కడుపునొప్పి వెంటనే తగ్గుతుంది.
* దానిమ్మ గింజలు చప్పరించి తింటే ఏ వయసు వారికైనా వాంతులు ఆగిపోతాయి. వేవిళ్ళతో ఉన్న స్ర్తిలకి తక్షణం పనిచేస్తుంది.

* ఎర్ర మందారం పూలను రెండు గ్లాసుల నీళ్ళలో వేసి ఉడికించి ఒక గ్లాసు నీరు వచ్చేవరకు మరిగించి, వడకట్టి, కషాయం తీసి సీసాలోకి తీసుకుని, రోజూ తలకి పెట్టుకొని రెండు గంటల తర్వాత తల స్నానం చేస్తే పేనుకొరుకుడు తగ్గుతుంది.
* గుంటగలగరాకు దంచి రసం తీసి ఒక వంతు కొబ్బరి నూనెతో కలిపి నీరు మరిగించి ఉడకబెట్టి, చిటపట శబ్దంపోయి నూనె పైకి తేలేవరకు పొయ్యిమీద ఉంచి, సువాసనకి గంధకచ్చూరాలు కలిపి, దీనిని వాడడంవల్ల జుట్టు రాలదు, నల్లబడుతుంది, పెరుగుతుంది.
* మెంతులు (పచ్చివి) మెత్తగా పొడి చేసి, తలకి సరిపోయే పొడిని రాత్రి నీళ్ళల్లో నానబెట్టి, అందులో నిమ్మరసం, పెరుగు కలిపి తలకు పట్టించి గంటసేపు వుండి, తల స్నానంచేస్తే చుండ్రు తగ్గుతుంది.
* కలబంద నుండి గుజ్జుతీసి మెత్తగా చేసి, గుజ్జుని తలకి పట్టించి గంట తర్వాత తల స్నానం చేస్తే చుండ్రు నివారణ అవుతుంది.
* బిళ్ళగనే్నరు ఆకులను, జామ ఆకుల్ని సమానంగా తీసుకుని ముద్దచేసి ఈ ముద్దని ఐదు చెంచాల వంతున ఉదయం సాయంత్రం మూడురోజులు తీసుకుంటే అతిసార వ్యాధి తగ్గుతుంది.
* చల్లటి ఒక కప్పు ఆవుపాలు తీసుకుని అందులో ఒక చెక్క నిమ్మరసం కలిపి వెంటనే తీసుకుంటే అర్షమొలలు తగ్గుతాయి.
* వంద గ్రాముల పెద్ద ఉల్లిపాయల్ని తీసుకుని వాటిని బాగా చితక్కొట్టి అర లీటరు నీటిలో ఉడకబెట్టాలి. ఆ ఉడికిన నీళ్ళల్లో నాలుగోవంతు తీసుకుని పంచదార కలిపి తాగితే మూత్ర నాళంలో రాళ్ళు కరిగిపోతాయి.
* అశ్వగంధ వేర్లు తీసుకుని మెత్తగా నూరి ఒక చెంచా పొడిని అరకప్పు నీటితో గాని పాలతో గాని కలుపుకుని తాగితే నడుంనొప్పి తగ్గుతుంది.
* జిల్లేడు పువ్వు, పసుపు సమానంగా తీసుకుని నూరి అందులో కొంచెం ఆముదాన్ని వేసి మడమకి రాత్రిపూట కట్టి ఉదయం తీసేస్తే మడమ నొప్పి తగ్గుతుంది.
* శొంఠి మిరియాలు సమానంగా తీసుకుని, రెండింటిని దోరగా వేయించి చూర్ణంచేసి పూటకి ఐదు గ్రాములు తేనెతో కలిపి రోజూ మూడు పూటలా 10 రోజుల్లో కీళ్ళ నొప్పులు తగ్గుతాయి.
* సింహనాద గుగ్గిళ్ళు అనే టాబ్లెట్లను రోజుకు మూడు చొప్పున మూడునెలలు వాడితే మోకాళ్ళ నొప్పి తగ్గుతుంది.
- పంతుల సూర్యలోవరాజు

No comments: