Saturday, September 18, 2010

ఆయురారోగ్యాల చిరునామా ప్రకృతి వైద్యం

మహాత్మాగాంధీ ‘ గ్రామస్వరాజ్‌’ ‘స్వాతంత్రోద్యమం’,‘అస్ప్రశ్యత’, ‘ఖాదీ’ వంటి ఎన్నో అంశాలను ప్రపంచం దృష్టికి తెచ్చినవారు. అట్లాగే ‘ప్రకృతి చికిత్స’కు వారే‘ అంబాసిడర్‌’గా ఉండి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. స్వయంగా మనుషులకే కాదు జంతువులకు కూడా ప్రకృతి చికిత్స అందజేసి సమకాలికులకు ఆదర్శ నాయకులయ్యారు.


housesద్రోణంరాజు వెంకటచలపతి శర్మ జర్మనీ భాషలో ఉన్న ప్రకృతి చికిత్సా విధానానికి సంబంధించిన పుస్తకాలను తెనిగించి ఆ చికిత్సను 1890లోనే మనకు పరిచయం చేశారు. ఆ తర్వాత 1933లో గుంటూరు జిల్లాలో ప్రకృతి ఆశ్రమాన్ని డా. వేగిరాజు కృష్ణంరాజు స్థాపించారు. అది 1944 నుంచి భీమవరంలో శ్రీ రామకృష్ణ ప్రకృతి ఆశ్రమం పేరిట స్థిరపడి శాఖోపశా ఖలుగా విస్తరించింది. ఇప్పుడు వేగిరాజు కుటుంబీకులైన డా.రవివర్మ, డా. కమలాదేవి, డా.గోపాలరాజు మొదలైనవారు సేవలందిస్తున్నారు.ప్రకృతి నుంచి దూరం జరిగే కొద్ది మనిషిలో వికృతి పెరుగుతుంది. ఈ వికృతి శరీరంలోనూ, మనసులోనూ చోటు చేసుకోవడంతో అనారోగ్యం మొదలవుతుంది. ప్రపంచ ఆరోగ్యసంస్థ ఆరోగ్యం అంటే ఏంటో నిర్వచించింది.కేవలం రోగం లేకపోవడం లేదా వైల్యం లేకపోవడమే ఆరోగ్యం అనిపించుకోదు. భౌతికంగా, సామాజికంగా కూడా సంపూ ర్ణంగా స్వస్థత కలిగి ఉండడమే ఆరోగ్యం.

Nasyaఈ నిర్వచనాన్ని ఆధారంగా చేసుకుని ప్రకృతి వైద్యవిధాన శాస్త్ర అంశాలను మేళవించి చాలా వరకు సంఘసేవా దృష్టితో ప్రజలకు సేవలందిస్తున్న అసలైన ఆరోగ్య కేంద్రాలు ప్రకృతి చికిత్సాలయాలు. గత కొని సంవత్సరాలుగా యోగా కూడా ఈ వైద్యవిధానంలో ఒక భాగమైంది.ముందులు వేయకుండా జబ్బులను నయం చేయడం వల్ల మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశం ప్రజలకు చాలా తక్కువ ఖర్చుతో వైద్యాన్ని ప్రకృతి చికిత్స అందుబాటులోకి తెచ్చింది. దీంతో ఇది ఒక జీవిత విధా నంగా మారింది. ఇది ఒక దేశానికో, జాతికో మతానికో పరిమితమైంది కాదు అంతర్జాతీయ చికిత్సా విధానంగా గుర్తింపు పొందింది. ఈ వైద్య చికిత్స క్రింది మూడు అంశాలు దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతుంది.

1.శరీరంలో పేరుకు పోయిన మలినాలు
2.శరీరంలోని రక్తం మలినం కావడం
3.శరీరంలోని ప్రాణశక్తి తగ్గిపోవడం

walkపై మూడు అంశాలను దూరం చేసే సహజ చికిత్సలను ప్రకృతి వైద్యం అందిస్తుంది. అలోపతి వైద్యవిధానం సూక్ష్మజీవుల మూలంగా జబ్బులు కలుగుతాయని చెప్తుంది. కాని శరీరంలో మలినాలు పేరుకుపోవడం మూలంగానే సూక్ష్మజీవులు ఏర్పడతాయని ప్రకృతి వైద్యం చెప్తుంది. వీటిని తొలగించే క్రమంలోనూ ప్రాణశక్తిని పెంచే మార్గంలోనూ ప్రకృ తిలోని పంచభూతాలను నీరు, మట్టి, సూర్యరశ్మి, వాయువు, ఆకాశం ...వినియోగంలోకి తెస్తుంది.

జలచికిత్స: ఎనిమా, తొట్టిస్నానం, ఆవిరిస్నానం, మొదలైన విధానాల ద్వారా కడుపులోని,ఇతరత్రా వున్న మలినాలను తొలగించే చికిత్స ఇది.

మట్టి చికిత్స: రోగికి కడుపుమీద శుభ్రమైన తడి మట్టి ఉన్న గుడ్డను పెట్టడం వల్ల కడుపులోని అవయవాల పనితనం పెరుగుతుంది. శరీర మంతా తలనుంచి అరికాళ్లదాకా శుభ్రమైన మట్టిని బురదగా మార్చి పూయడం మూలంగా శరీరంలోని వేడిని తీసివేయగలుగుతుంది.

రంగుచికిత్స/ భిన్న వర్ణ చికిత్స:
scan పటకంలో నుంచి సూర్యుని కిరణాలు ఏడు రంగులుగా విడుదల అవుతాయి. వీటిలో ఒక్కో రంగుకు ఒక్కో శక్తి ఉంటుంది.ఎరుపు రంగు శక్తినిస్తుంది. గుండెకు బలాన్నిస్తుంది. నీలంరంగు నాడీ మండలాన్ని ప్రేరేపిస్తుంది.బిపిని తగ్గిస్తుంది. ఆకుపచ్చరంగు పిట్యూటరీ గ్రంథిని క్రమబద్ధం చేస్తుంది. మానసికమైన డిప్రెషన్‌ను తగ్గిస్తుంది. తెలుపురంగు రుతువులు మారి నపుడు వచ్చే జబ్బుల మీద పనిచేస్తుంది. మంచి నిద్రకు దోహదపడుతుంది. పసుపు రంగు రక్తాన్ని శుభ్రపరుస్తుంది. జీర్ణశక్తిని పెంచుతుంది. ఆల్ట్రా వయోలెట్‌ కిరణాలు విట మిన్‌ డిని అందజేస్తాయి.కొలెస్ట్రాల్‌ తగ్గిస్తుంది. బిపిని తగ్గిస్తుంది. ఇన్‌ఫ్రారెడ్‌ కిరణాలు కీళ్లనొప్పులను తగ్గిస్తాయి. రక్దప్రసరణను క్రమబద్ధం చేస్తాయి.

మర్ధన చికిత్స: శిరస్సునుంచి అరికాలు దాకా తైలమర్థనం చేయడం ద్వారా శరీరంలోని నొప్పులు తగ్గుతాయి. పట్టుకున్న నరాలు కీళ్లు వదులవుతాయి. కండరాలకు బలం చేకూరుతుంది. అంతేకాదు రక్త ప్రసరణ క్రమబద్దమై మలినాలు విడుదలకు దోహదం చేస్తుంది. సాధారణంగా మర్థన చికిత్సతో పాటు ఆవిరిస్నానం చేయిస్తారు. దీంతో శరీరం లోని మలినాలు చెమట ద్వారా బయటకు వస్తాయి. దీన్ని స్వేదన చికిత్స అంటారు.

వమనక్రియ:
bead వమన క్రియను వారానికి ఒకసారి చేయిస్తుంటారు. ఐదారు గ్లాసుల ఉప్పు నీటిని తాగించి వమనం చేయించడం ద్వారా కడుపులోనూ ఇతరాత్రా వున్న మలినాలు కఫం, బయటకు వచ్చేస్తాయి. పైత్యం తగ్గుతుంది. దీంతో పాటుగా జలనేతి ప్రక్రియను చేప డతారు. నీటిని ఒక రంధ్రం నుంచి పంపి మరోరంధ్రం ద్వారా బయటకు వచ్చేట్టు చేస్తారు. దీనివల్ల ముక్కుకు సంబంధించిన సమస్యలు తగ్గుతాయి.

ఉపవాసం: సహజంగా ప్రతి మనిషిలో ప్రాణశక్తి వుంటుంది. మాలిన్యాలు, ఇతర కారాణాలు దాన్ని సూర్యున్ని మేఘం లాగా కప్పెస్తాయి. అందువల్ల ప్రకృతివైద్య విధానంలో ఉపవాసం ద్వారా ఆ అడ్డంకులను పక్కన నెట్టి ప్రాణశక్తిని మేల్కోలుపు తారు.

ఆహారచికిత్స: ప్రకృతి వైద్యంలో మనం తీసుకునే ఆహారానికి ఉన్నతస్థానం ఉంది. ఆహారం అన్నది రోగం రాకుండా నివారించేందుకు ఉన్న రోగాన్ని తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది.

పంచకర్మ చికిత్స: మానసిక వత్తిడిని కంప్యూటర్‌ సంబంధించిన ఉద్యోగులకు ఏర్పడే సమస్యల నివారణకు శిరోధార చికిత్సను అందజేస్తారు.

ఫిజియోథెరపి: కీళ్లనొప్పులు, ఇతరాత్రా జబ్బులకు ఫిజియోథెరపి విధానాలను కూడా ప్రకృతి వైద్యం ఆమోదిస్తుంది. పై చికిత్సలకు చౌకధరలకు అందజేసే ప్రకృతి చికిత్సాలయం హైదరాబాదులోని రాజేంద్రనగర్‌ పరి సరాలలో నెహ్రూ జూ పార్కుకు 3 కిలోమీటర్ల దూరంలో బెంగళూరు హైవేకు వందగజాల దూరంలో ఉంది. ఇది కస్తుర్బా ప్రకృతి చికిత్స యోగ సంస్థ 1964 నుంచి సేవలందిస్తోంది. గాంధేయ విశ్వాసాలలో పనిచేసే సర్వోదయ ట్రస్ట్‌ పది ఎకరాల ప్రశాంత వాతావరణంలో దీన్ని ఏర్పరిచింది. ఇది 60 పడకలున్న వైద్యాలయం. బయటి రోగులకు కూడా చికిత్స అందజేస్తారు. ఇంట్లో ఉంటూనే ప్రకృతి వైద్య చికిత్సా పద్ధతులను అనుసరించి జీవించడానికి వీలుగా మార్గదర్శకత్వం వహి స్తారు. జనరల్‌ వార్డులతో పాటు ఎ/సి రూములు కూడా అందు బాటులో ఉన్నాయి. ఈ సంస్థ అధికబరువు,బి,పి, షుగరు, కీళ్లనొప్పులు, మెడ, నడుమునొప్పులు, ఎసిడిటి, మల బద్ధకం, సైనసైటిస్‌, ఆస్తమా, పక్షవాతం, చర్మవ్యాధులు, మానసిక వ్యాధులు మొదలగు వాటికి చికిత్సలు అందిస్తుంది.

chari
- డా. జె.వి.ఎన్‌. చారి
ఎన్‌డి(ఉస్మానియా), సిఎచ్‌ఓ

No comments: