Showing posts with label అందం - ఆరోగ్యం. Show all posts
Showing posts with label అందం - ఆరోగ్యం. Show all posts

Friday, April 6, 2012

ఉచితంగా ఆరోగ్యం

‘ఖర్చు పెట్టి మందులను మాత్రమే కొనగలం. ఆరోగ్యాన్ని కొనలేం’ అన్నది ఒక నానుడి. కానీ ఆరోగ్యాన్ని ఉచితంగానే పొందవచ్చు. మనం రోజూ చేసే పనులతోనే ఒక్క పైసా ఖర్చు కాకుండానే ఆరోగ్యంగా ఉండవచ్చు. కాకపోతే కొద్దిపాటి వ్యాయామం, మంచి బ్రేక్‌ఫాస్ట్, క్రమం తప్పకుండా వేళకు నిద్రపోవడం వంటి కొన్ని మార్గదర్శకాలు పాటించాల్సి ఉంటుందంతే. ఇవన్నీ ఫ్రీగా లభించేవే. ఈ నెల 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఉచితంగానే ఆరోగ్యాన్ని ఎలా పొందవచ్చో తెలిపేదే ఈ కథనం.
మనం పనిచేస్తే ఆరోగ్యకరమైన రీతిలో శక్తి ఖర్చవుతుంది. కానీ మనం పనిచేయకపోయినా మన కండరాలు దెబ్బతింటాయని మీకు తెలుసా? మనం ఎలాంటి శారీరక శ్రమ చేయకుండా బెడ్ రెస్ట్ తీసుకుంటూ ఉంటే రోజుకు ఎనిమిది గ్రాముల చొప్పున కండరాల్లోని ప్రోటీన్ ఖర్చవుతుంది. శారీరక శ్రమ లేనివారిలో ప్రతి వారం 1.54 గ్రాముల మేరకు ఎముకను కోల్పోతాం. కొన్ని రోజుల పాటు అదేపనిగా రెస్ట్ తీసుకుంటే 10-15 శాతం రక్తంలోని ప్లాస్మాను కోల్పోతాం. దీన్ని అధిగమించాలంటే ఖర్చు చేయాల్సింది డబ్బు కాదు... కేవలం కాస్త శారీరక శక్తినే. రోజుకు 40 నిమిషాలు కేటాయించి రోజూ నడకలాంటి వ్యాయామం చేస్తే మనం కోల్పోయే కండరాలను, ఎముకలను (మజిల్ లాస్ అండ్ బోన్ లాస్)ను అరికట్టవచ్చు. మనం రోజూ ఉపయోగించే లిఫ్ట్‌కు బదులు మెట్లపై నడవడం, కాస్తంత సమీపంలోనే ఉన్న ప్రదేశాలకు వాహనాలు వాడకపోవడం వంటివి చేస్తే చాలు. దీనితో పాటు సరైన నిద్ర, తప్పనిసరిగా వేళకు బ్రేక్‌ఫాస్ట్, వేళకు మంచి ఆహారం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి.

ఆరోగ్యం కోసం శారీరక శ్రమ అవసరం. దానికోసం గుర్తుపెట్టుకుని పాటించాల్సిన అంశాలివి...

వాకింగ్ అన్నిటికంటే ముఖ్యమైన వ్యాయామం.

జాగింగ్, రన్నింగ్ వంటివి మొదలుపెట్టే ముందర వాకింగ్ తప్పనిసరిగా చేయాలి.


{పతిరోజూ 40 నిమిషాలు వాకింగ్ చేస్తూ అలా వారంలో కనీసం ఐదుసార్లు పాటించాలి.


వాకింగ్‌లో వేగం ప్రతి గంటకు మూడు కిలోమీటర్ల నుంచి ఏడు కిలోమీటర్ల వరకు ఉండవచ్చు.


వాకింగ్ ఏ వేళలో చేసినా పరవాలేదు. ఉదయం వేళల్లో అయితే మంచిది.


వాకింగ్ చేస్తే తప్పనిసరిగా చెమట పట్టాలనే నియమం లేదు.


జబ్బుతో ఉన్నప్పుడు వాకింగ్ చేయడం మంచిది కాదు.

 నడక మొదలుపెట్టాక ఆపడం మంచిది కాదు. ప్రతిరోజూ చేయాలి. ఎందుకంటే ఒకసారి నడక మొదలు పెట్టాక అడపాదడపా మానేస్తుంటే శరీరం దానికి అడ్జస్ట్ కావడం అన్నది కష్టమై శరీరంమీద చాలా ఒత్తిడి పడుతుంది.

పరగడపున వాకింగ్ కంటే ఏదైనా తేలికపాటి శ్నాక్ తీసుకుని వాకింగ్ చేయడమే మంచిది.


స్మోకింగ్, ఆల్కహాల్ వంటి అలవాట్లు ఉంటే క్రమం తప్పకుండా వాకింగ్ చేయడం వల్ల అవి కూడా తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే మీరు ఆరోగ్యాన్ని పెంచుకుంటున్న స్పృహ మిమ్మల్ని ఆ అలవాట్లకు దూరంగా ఉంచుతుంది.


మంచి బ్రేక్ ఫాస్ట్: మనం ఒక రోజులో ఖర్చు పెట్టే శక్తిలో మూడింట ఒకవంతు మనం ఉదయం తీసుకునే ఆహారం (బ్రేక్ ఫాస్ట్) తోనే వస్తుంది. రోజూ బ్రేక్‌ఫాస్ట్ తినడం వల్ల కేవలం శక్తిని పొందడం మాత్రమే కాదు... మన ప్రవర్తనలోనే మార్పు వస్తుంది.


ఉదాహరణకు
మనలో చిరాకుపడే తత్వం తగ్గుతుంది.

దేనిమీదనైనా దృష్టి కేంద్రీకరించగలిగే శక్తి పెరుగుతుంది.


అవసరాన్ని బట్టి తదేకంగా పనిచేయగలిగే శక్తి మెరుగవుతుంది.


దానితో పాటు మన బరువుకు తగినట్లుగా వేళకు మంచి ఆహారం తీసుకోవాలి.


దీనితో పాటు మన ఆహార అవసరాలకు తగినట్లుగా అవసరమైనన్ని క్యాలరీల ఆహారమే తీసుకోవాలి.



నిద్ర బాగా పట్టాలంటే...

బెడ్‌రూమ్ ప్రశాంతంగా ఉండేలా చూసుకోండి. ఎక్కువ వేడిగానూ, ఎక్కువ చల్లగానూ ఉండకూడదు. నిద్ర వేళ ఎక్కువగా లేకుండా చూసుకోవాలి.

సాయుంత్రం వేళల్లో కాఫీలు, టీలను, కెఫిన్ ఉండే కూల్‌డ్రింక్స్ తీసుకోకూడదు.


రాత్రిపూట గోరువెచ్చని నీటితో స్నానం చేయూలి.


ప్రతి రోజూ నిర్ణీత వేళకే నిద్రకు ఉపక్రమించాలి.


నిద్రకు ముందు  టీవీలో ఉద్వేగం కలిగించే దృశ్యాలున్న సినిమాలూ, సీరియుళ్లు చూడొద్దు.


రాత్రి బాగా నిద్ర పట్టాలంటే పగలు కనీసం అరగంట సేపరుునా పగటి వెలుగులో (డే లైట్) గడపాలి. వుసక వెలుగు రూమ్‌లలో గడిపేవారికి రాత్రివేళల్లో సరిగా నిద్రపట్టదు.


నిద్రకు ముందు ఆహ్లాదకరమైన మ్యూజిక్ వినాలి.


గోరు వెచ్చని పాలు తాగాలి. పాలలో ట్రిప్టోఫ్యాన్ అనే అమైనో ఆసిడ్ ఉంటుంది. దాని వల్ల బాగా నిద్ర పడుతుంది.


నిద్రకు ముందు  పుస్తకాలు చదవడం వంటివి చేయువద్దు. పుస్తకం చదువుతూ ఉంటే అలా మనకు తెలికుండానే నిద్రపడుతుందని చాలా మంది అనుకుంటారు. కానీ... నిజానికి అలా దృష్టి పూర్తిగా చదవడంలో నిమగ్నమైపోతే నిద్రకు దూరమయ్యే సందర్భాలే చాలా ఎక్కువ.


పొగతాగే అలవాటును పూర్తిగా మానుకోండి.


నిద్రకు ముందు ఆల్కహాల్ అస్సలు తీసుకోకూడదు. కొందరిలో ఆల్కహాల్ నిద్ర పట్టడానికి దోహదం చేసినా అది గాఢనిద్ర దశలోకి వెళ్లనివ్వదు. అందుకే మద్యం తాగి నిద్రలోకి జారుకున్న తర్వాత నిద్రలేచాక రిఫ్రెషింగ్ ఫీలింగ్ ఉండదు.


నిద్ర...
ఎప్పుడూ మనలను ఆరోగ్యకరంగా ఉంచే మన మెదడుకు తగినంత విశ్రాంతి కావాలంటే మంచి నిద్ర అవసరం. మంచి నిద్రవల్ల వయసుతో వచ్చే కొన్ని వ్యాధులను నివారించవచ్చు.

Saturday, November 12, 2011

ఫ్రెష్‌గా ఉండండి ఇలా...

 http://gerry.ws/files/2008/10/beautiful-face-by-tony.jpg
ముఖ సౌందర్యం, వర్చస్సు ఎక్కువగా, శరీర ఆరోగ్యం మీదే ఆధారపడి ఉంటాయి. అయితే ఆరోగ్యం బాగానే ఉన్నా, వాతావరణ కాలుష్యాల వల్ల కూడా కొందరి ముఖం మీద కొన్ని మచ్చలు, మరకలూ ఏర్పడవచ్చు. వీటిని నివారించడంలో తులసి గొప్ప ఔషధంగా పనిచేస్తుంది. కడుపులోకి తీసుకునే తులసి రసం, రక్తశుద్ధికి దివ్యంగా పనిచేస్తుంది. అలాగే, ముఖం మీద లేపనంగా వాడితే మచ్చలు, మరకలు పోయి ముఖం అందంగా కాంతివంతంగా మారుతుంది. బ్యాక్టీరియాను నశింపచేసే లక్షణం ఉన్నందున,ఆరోగ్య పరిరక్షణలో అనాదిగా తులసికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఉదయం వేళ కాసేపు తులసి ముందు కూర్చుని ఆ వాసనను బలంగా పీలిస్తేనే రక్తశుద్ధి అవుతుందని ఆయుర్వేదం చెబుతుంది. అలాంటిది కడుపులోకి నేరుగా ఆ రసాన్ని, లేదా ఆకు ముద్దను తీసుకుంటే ఇక చెప్పేదేముంది!http://www.kacha-stones.com/images/Tulasi1.gif
* ఎండు తులసి ఆకు పొడిని పౌడర్‌లా రోజూ ముఖానికి పట్టిస్తే, ముఖం సౌందర్యవంతంగానూ, కాంతివంతంగానూ మారుతుంది. ఈ పొడి ముఖం మీద ఉండే పలుచనివే కాదు గాఢమైన మచ్చల్ని కూడా తొలగిస్తుంది.

* రోజూ కొన్ని తులసి ఆకుల్ని, నమలి తినేస్తే, రక్త శుద్ధి ఏర్పడుతుంది. అలాగే తులసి పొడికి కొన్ని నీటి చుక్కలు కలిపిగానీ, పచ్చి తులసి ఆకులను నూరి గానీ, ఒక పేస్ట్‌లా ముఖానికి పట్టిస్తే, అక్కడున్న గుంటల్లో నిలిచిపోయిన అతి సూక్ష్మమైన మలినాలు సైతం తొలగిపోయి వర్చస్సు పెరగడంతో పాటు ముఖం, సహజ లావణ్యాన్ని సంతరించుకుంటుంది.

*ముఖం తాజాగా ఉండడానికి , ఏదైనా పాత్రలో కాసిని మంచి నీళ్లు తీసుకుని, అందులో సగం నిమ్మకాయ రసాన్ని పిండాలి. అందులో ఓ పిడికెడు తులసి ఆకులు, పిడికెడు మెంతెం ఆకులు వేసి కాసేపు మరగించాలి. జత్తును టవల్‌తో కట్టేసుకుని ముఖానికి మాత్రమే ఆ ఆవిరి పట్టాలి. కొన్ని నిమిషాల తరువాత చన్నీళ్లతో ముఖం కడిగేసుకుంటే ముఖం తాజాగా మెరిసిపోతుంది.
http://www.dyeli.com/wp-content/uploads/2010/07/face-skin1.jpg
* ముఖం మీద నల్లటి మచ్చలు ఉన్నవారు, నిమ్మరసం లేదా అల్లం రసం కలిపిన తులసి పేస్టును ముఖానికి పట్టించి అది ఎండిపోయిన దాకా అలాగే ఉంచాలి. ఇలా ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం చేస్తే మచ్చలు తొలగిపోవ డంతో పాటు ముఖం కాంతి వంతంగా, అందంగా  మారుతుంది.
*తులసి, మెంతి ఆకులతో చేసినడికాక్షన్ రోజూ తీసుకుంటే శరీరంలో నూతనోత్తేజం వస్తుంది.

Saturday, October 22, 2011

మెరిసే చర్మానికి...

బొప్పాయి పండు తింటే కంటికి మంచిది, గుండెకి బలం అని అందరికీ తెలుసు. కాని చర్మసౌందర్యానికి కూడా బొప్పాయి బోలెడు మేలు చేస్తుంది. బొప్పాయి పండు ఇంట్లో ఉన్నప్పుడు ఏం చేయాలో ......

* ముఖంపై ఉండే బ్లాక్‌హెడ్స్‌ని తొలగించడంలో బొప్పాయి గుజ్జు చాలా ఉపయోగపడుతుంది. ఒక గిన్నెలో రెండు టేబుల్ స్పూన్ల పచ్చిపాలు, రెండు టేబుల్ స్పూన్ల బొప్పాయి గుజ్జు, ఒక టేబుల్ స్పూను శెనగపిండి వేసి బాగా కలిపి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. దీని వల్ల బ్లాక్‌హెడ్స్ తొలగిపోవడమే కాకుండా చర్మం మెత్తగా తయారవుతుంది.

* ప్రతి రోజు ముఖం శుభ్రంగా కడుకున్నాక ఓ నాలుగు బొప్పాయి పండు ముక్కలతో ముఖంపై రుద్దితే నిర్జీవంగా ఉన్న చర్మం కాంతివంతంగా అవుతుంది.

* దీనితో పాటు మీరు తినే పండ్లలో ఎక్కువగా బొప్పాయి ఉండేలా చూడండి. దీని వల్ల కళ్లు ఆరోగ్యంగానే కాదు, కాంతివంతంగా కళకళలాడుతూ ఉంటాయి.

Tuesday, July 19, 2011

వంటిల్లే మీ బ్యూటీ పార్లర్‌

కాలం మారింది. నేడు భౌతికమైన సౌందర్యానికీ ప్రాముఖ్యత పెరిగింది. అందుకే సౌందర్య సాధనాలను ఉత్పత్తి చేసే కంపెనీలు లాభాల బాటను వదలడం లేదు. అయితే ఈ ఖరీదైన, రసాయన ఆధారిత ఉత్పత్తుల కన్నా సహజమైన, మన చర్మానికి హాని చేయని ఉత్పత్తులు మనకు అందుబాటులోనే ఉంటాయి. అవి మన వంటింట్లోనే దొరుకుతాయి. కాకపోతే ఏది ఎందుకు ఉపయోగించాలో, దాని వల్ల లాభమేమిటో తెలుసుకుంటే చాలు...

క్లెన్సర్లు:
BA-1పాలు, చెరకు, ద్రాక్ష పండ్లు ముఖాన్ని శుభ్ర పరచడంలో అత్యుత్తమంగా పని చేస్తాయి.అలాగే ఆలివ్‌ ఆయిల్‌ను, ఆవనూనెను మేకప్‌ను తొలగిం చేందుకు వినియోగించవచ్చు.మొటిమలు బాగా వస్తుంటే స్ట్రాబెర్రీలను వినియోగించ వచ్చు. ఇందులో సహజంగా ఉండే సలిసైలిక్‌ ఆసిడ్‌ చర్మం లోని అధిక జిడ్డును పీల్చి వేసి చర్మాన్ని శుభ్ర పరుస్తుంది.

స్క్రబ్స్‌:
ఓట్స్‌ను కచ్చపచ్చాగా దంచి ఉపయోగిస్తే అది అన్ని రకాల చర్మాలకు మంచి క్లెన్సర్‌లాగానూ, స్క్రబ్‌లానూ పని చేస్తుంది.కమల, నారింజ తొక్కులు, బాదం పప్పు వంటివి కూడా మంచి స్క్రబ్‌లుగా పని చేస్తాయి.
అలాగే అక్రూట్‌ పొడి, తేనె, నిమ్మరసం ఒక టీ స్పూన్‌ చొప్పున తీసుకొని కలిపి ఉపయోగిస్తే చర్మానికి ఎంతో మేలు జరుగుతుంది.

మాయిశ్చరైజర్లు:
BA-3చర్మం ఎండిపోయినట్టు ఉంటే బాగా పండిన అరటిపండు, బొప్పాయిని చిదిమి, అందులో గుడ్డును కలపడం వల్ల చర్మానికి తగినంత మాయిశ్చర్‌ అందుతుంది. అలాగే, గసగసాలు, బఠాణీలు వంటి వాటిల్లో సహజ నూనెలు ఉం టాయి. వాటిని పేస్ట్‌లా చేసి ముఖానికి పట్టించడం వల్ల మంచి మెరు పు వస్తుంది. డల్‌గా ఉండే చర్మానికి పెరుగు కూడా మంచి మందు.జిడ్డోడే చర్మానికి గుడ్డులో ఉండే తెల్లసొన చాలా మంచి ఆహారం లాంటిది. మెంతులు, కం దులు కలిపి పేస్ట్‌లా చేసి ముఖానికి పట్టిస్తే జిడ్డును నియంత్రించి, మాయిశ్చరైజ్‌ కూడా చేస్తుంది.

ఆస్ట్రింజెంట్‌/ టోనర్‌:
దోసకాయ, పైనాపిల్‌, నిమ్మరసం వంటివన్నీ సహజమైన ఆస్ట్రింజెం ట్లగా పని చేస్తాయి.

మంచి ఫలితాల కోసం:
BA-4ఇంట్లో సౌందర్య పోషణ చేసుకునే ముందుగా ముఖానికి ఆవిరిపడితే చర్మ రంధ్రాలు తెరుచుకొని సహజ ఉత్పత్తులో ఉండే పోషకాలను చ ర్మం మరింత బాగా పీల్చుకుంటుంది. ముఖం నున్నగా, పట్టులా మృదువుగా ఉండాలంటే షవర్‌ చేసే సమయంలో బేకింగ్‌ సోడాను శరీరం మొత్తానికి పట్టించాలి. ముఖం మీద బ్లాక్‌ హెడ్స్‌ను తొలగించేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. కొంతమంది బాహుమూలాల్లో, అరికాళ్ళల్లో చెమట ఎక్కువగా పట్టి దుర్వాసన వస్తుంటుంది. అటువంటివారు వెనిగర్‌ను, నీటిని సమపాళ్ళలో తీసుకుని డియోడరెంట్‌కి బదులుగా దానిని వాడాలి.

పసుపు చేసే మేలు ఎంతటిదో వేరే చెప్పనవసరం లేదు. దానిలో ఉండే యాంటీసెప్టిక్‌ గుణాలతో పాటు కళ్ళ చుట్టూ ఉండే నలుపు, ఉబ్బులు, పాదాలలో పగుళ్ళు, పిగ్మెంటేషన్‌, ముడతలు తగ్గించి ముఖానికి మంచి మెరుపును ఇస్తుంది. ఎండ కారణంగా నల్లబడిన చర్మానికి ఆలివ్‌ ఆయిల్‌ ఎంతో మేలు చేస్తుంది. గోరు వెచ్చని ఆలివ్‌ నూనెలో గోళ్ళను ముంచి కాసేపు ఉంచడం ద్వారా అవి బలంగా, ఆరోగ్యంగా కనుపిస్తాయి. మనకు అందుబాటులో ఉండే వస్తువులను ఉపయోగించుకొని అందాన్ని కాపాడుకోవడం వల్ల ఎటువంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ కూడా ఉండవంటున్నారు నిపుణులు.

Friday, July 8, 2011

అందమైన కురుల కోసం ఆహారంలో కొన్ని మార్పులు

జుత్తు పొడవుగా ఉన్నా పొట్టిగా ఉన్న ఒత్తుగా ఉండాలని కోరుకోని మహిళలు ఉండరు. పెరిగిపోతున్న కాలుష్యం, ఆధునిక జీవన శైలి కారణంగా అనేకమంది జుత్తు చిన్న వయసులోనే పల్చబడడమే కాదు రంగు కూడా మారిపోతున్నది. నెత్తి మీద దువ్వెన పెడితే తుట్టెలు తుట్టెలుగా వెంట్రుకలు ఊడొస్తుంటే బెంగపడిపోతుంటారు మహిళలు. అయితే ఊరికే బెంగపడకుండా తమ ఆహారపు అలవాట్లను ఒకసారి పరిశీలించుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. ఆహారంలో కొన్ని మార్పులను చెప్తున్నారు.

కారెట్లు...
carrots 
విటమిన్‌ ఎ అధికంగా ఉండే కారెట్లను తీసుకోవడం వల్ల కేవలం కంటికే కాదు జుత్తకు కూడా మంచిదంటున్నారు నిపుణులు. మాడు ఆరోగ్యంగా ఉంటే నల్లగా మెరిసే, బలమైన జుత్తు పెరుగుతుందిట. ప్రోటీన్లు, పళ్ళు, కాయగూరలు, పప్పులు, చేపలు, కొవ్వు తక్కువగా ఉన్న పాల ఉత్పత్తులు ఇవన్నీ కూడా జుత్తు ఆరోగ్యంగా పెరగడానికి దోహదం చేస్తాయి.

ఎండుద్రాక్షలు...
prunes 
జుత్తు ఎండిపోయినట్టు గడ్డిలా ఉండి, పల్చబడిపోయి, రంగు వెలిసిపోయినట్టు ఉంటే లేదా తెగ ఊడిపోతుంటే అందుకు కారణం శరీరంలో ఐరన్‌ శాతం తగ్గిపోవడమే. ఎండు ద్రాక్షలలో ఐరన్‌ శాతం ఎక్కువగా ఉండడమే కాక జుత్తు క్వాలిటీ పెరిగేలా చేస్తుంది. దీనితో పాటుగా ఆకుకూరలు, బీట్‌రూట్‌లు కూడా ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.

పచ్చి బఠాణీలు...
_green-peas 
పచ్చి బఠాణీలలో యాంటీ ఆక్సిడెంట్లు తక్కువగా ఉన్నా, నిర్దిష్టమైన విటమిన్‌ లేదా మినరల్స్‌ ఎక్కువగా లేకపోయినా వాటిలో విటమిన్లు, మినరల్స్‌, ఐరన్‌, జింక్‌, బి గ్రూప్‌ విటమిన్లు సమతులంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యవంతమైన జుత్తుకు మంచివి.

ఓట్స్‌...
oats-photos 
ఓట్లలో ఫైబర్‌ అధికంగా ఉం టుంది. ఇది గుండెకు సంబం ధించిన ఆరోగ్యాన్ని సంరక్షించి, విసర్జనను క్రమబద్ధం చేస్తుంది. ఫైబర్‌తో పాటుగా జింక్‌, ఐరన్‌, ఒమేగా 6 ఫ్యాటీ ఆసిడ్లు అధికంగా ఉంటాయి. వీటన్నింఇనీ పాలి అన్‌ శాచ్యురేటెడ్‌ ఫ్యాటీ ఆసిడ్లని అంటారు. ఒమేగా 6 కొవ్వు ఆమ్లాలు చర్మ ఆరోగ్యానికి, జుత్తు పెరగడానికి దోహదం చేస్తుంది. ఇది కేవలం ఆహారం ద్వారానే లభ్యమవుతుంది కనుక బ్రేక్‌ఫాస్ట్‌లో ఓట్‌మీల్‌ ఉండేలా చూసుకోవడం మంచిది.

చిన్న రొయ్యలు...
shrimp 
చిన్న రొయ్యలలో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి.ఇందులో ఉండే విటమిన్‌ బి12, ఐరన్‌, జింక్‌ జుత్తు ఊడిపోకుం డా కాపాడుతుంది. రెడ్‌ మీట్‌ను అతి గా తీసుకోవడం మాని అందుకు ప్రత్యామ్నాయంగా వీటిని ఎంచుకోవచ్చు.

గుడ్లు...
egg 
ఒతైన నల్లని ఆరోగ్యవంతమైన జుత్తు కోసం కోడిగుడ్లను ఉంచుకోవడం మంచిది. ప్రోటీన్లు, విటమిన్‌ బి 12, ఐరన్‌, జింక్‌, ఒమేగా 6 ఆమ్లాలు అధికంగా ఉంటాయి. విటమిన్‌, మినరల్‌ లోపాలు ఉన్నప్పుడు జుత్తు ఆరోగ్యంగా కనుపించదు. గుడ్లలో ఉండే బయోటిన్‌ (విటమిన్‌ బి7) అనే పదార్ధం జుత్తు ఊడిపోవడాన్ని తగ్గిస్తుంది.

కొవ్వు తక్కువ పాలు, పెరుగు...

కొవ్వు తక్కువగా ఉన్న పాలు, పెరుగులలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఇది జుత్తు పెరగడానికి దోహదం చేస్తుంది. దీనితో పాటుగా హైక్వాలిటీ ప్రోటీన్లైన వే, కేసిన్‌లు ఇందులో ఉంటాయి.

Friday, May 27, 2011

వంటిల్లే బ్యూటీపార్లర్


జుట్టున్నమ్మ ఏ కొప్పు పెట్టినా అందమే... కొప్పు పెట్టుకునేంత జుట్టు లేకపోయినా అందంగా ఉండొచ్చంటున్నారు ఫ్యాషన్ ప్రియులు. కేశాలంకరణ అనగానే పాపిటబిళ్ల, సూర్యచంద్రులు, జడ గంటలు గుర్తుకువస్తాయి. ఇప్పుడా మాట అంటే ఏ కాలంలో ఉన్నారు మీరు? అని అంటారు నేటి తరం అమ్మాయిలు. ఎందుకంటే...కేశాలకు కొత్త కళను తెచ్చే రకరకాల ఆభరణాలు మార్కెట్‌లో మెరిసిపోతున్నాయి. డిజైనర్లు పాత ఆభరణాలకి కొత్త రూపాన్నిచ్చి అమ్మాయిల మనసుల్ని దోచుకుంటున్నారు. హెయిర్‌బ్యాండ్, కొప్పుకు పెట్టుకునే పువ్వులు, కిరీటం డిజైన్లు, చంపసరాలు, చెంపలపై వేలాడే పాపిటబిళ్లలు...ఇలా రకరకాల ఆకారాలతో రంగురంగుల హెయిర్ జ్యువలరీ ప్రస్తుతం ఫ్యాషన్ వరల్డ్‌లో మెరుస్తోంది. అందులో కొన్ని డిజైన్లు ఇక్కడ చూడండి.
ప్రతిసారీ బ్యూటీపార్లర్ చుట్టూ తిరగకుండా, క్రీములు రుద్దకుండా వాడిన వెంటనే ఫలితమిచ్చే సౌందర్య సాధనాలు మన ఇంట్లోనే ఉన్నాయి. వాటి వాడకం, ఉపయోగం గురించిన వివరాలే ఇవి...

పెరుగు

ఎండ వేడికి నల్లకప్పేసిన చర్మానికి పెరుగు మంచి మెడిసిన్‌లా పనిచేస్తుంది. ఎండ వల్ల కమిలిపోయిన చర్మంపై పెరుగు పూసుకోవాలి. అయితే జిడ్డు చర్మం, సున్నిత చర్మతత్వం ఉన్న వాళ్లు, యాక్నె ఉన్న వాళ్లు పెరుగు వాడకూడదు. ఎందుకంటే ఇందులో ఉండే బ్యాక్టీరియా యాక్నె పెరిగేందుకు దోహద పడుతుంది. అందుకని నిమ్మరసం, గ్లిజరిన్‌లు సమ భాగాలుగా తీసుకుని ముఖానికి రాసుకోవాలి వాళ్లు. ఇరవై నిమిషాల తరువాత చల్లటి నీటితో కడిగేయాలి. ఇలా చేస్తే ట్యాన్ పోవడమే కాకుండా చర్మం రంగు తేలుతుంది.

నిమ్మరసం

నిమ్మరసం ఆమ్ల గుణాన్ని కలిగి ఉంటుంది. అందుకని జుట్టు రంగు మార్చుకోవాలనుకుంటే మూడు కప్పుల నీళ్లలో, పావుభాగం నిమ్మరసం కలిపిన మిశ్రమాన్ని జుట్టుపై పోసుకుంటే హెయిర్ కలరింగ్ ప్రొడక్ట్‌ల కంటే బాగా పనిచేస్తుంది.

కీరదోసకాయ

అలసిపోయి, ఉబ్బిపోయిన కళ్లు కాంతివిహీనంగా కనిపిస్తుంటే బాగా నిద్రపోతే సరిపోతుంది. కాని అది వీలుకానప్పుడు కీరదోసకాయ ముక్కల్ని గుండ్రంగా కోసుకుని కళ్ల పై ఓ 20 నిముషాల పాటు ఉంచాలి.

బంగాళా దుంప
బంగాళా దుంప తురుము కంటికింద ఉండే నల్లటివలయాలను మాయం చేస్తుంది. బంగాళా దుంపల్లో కాటెకొలేజ్ ఉంటుంది. ఇది సౌందర్య సాధనంగా పనిచేసి చర్మంపై ఉండే నలుపును తగ్గించేస్తుంది. పచ్చి బంగాళాదుంపను తురిమి రసం తీసి కంటికింద రాసుకోవాలి. పదిహేను నిముషాల తరువాత చల్లటి నీళ్లతో కడిగేయాలి. తేడా మీకే కనిపిస్తుంది.

టీ బ్యాగ్స్

అలసిన కళ్లు కాంతివంతంగా కనిపించాలంటే మరో టెక్నిక్ టీబ్యాగ్స్. టీబ్యాగ్స్‌ను గోరువెచ్చటి నీటిలో కొన్ని నిమిషాల పాటు నానపెట్టి ఆ తరువాత వాటిని రెండు కళ్లపై 20 నిమిషాల పాటు ఉంచాలి. టీబ్యాగ్స్ కళ్లకే కాకుండా కాళ్లకు కూడా బాగా పనిచేస్తాయి. కొందరి పాదాలు ఎంత శుభ్రం చేసుకున్నా దుర్వాసన వస్తుంటాయి. ఇటువంటి వాళ్లు నాలుగైదు టీ బ్యాగులను లేదా మూడు స్పూన్ల తేయాకు పొడిని నీళ్లలో వేసి ఉడికించాలి. గది ఉష్ణోగ్రత వరకు వచ్చిన తరువాత ఈ నీళ్లలో కొన్ని చల్లటి నీళ్లు కలపాలి. అందులో పాదాలను 30 నిమిషాల పాటు నానపెట్టాలి. పాదాలు ఆరిన తరువాత మెడికేటెడ్ ఫుట్ పౌడర్‌ను వేసుకోవాలి. సమస్య మరీ తీవ్రంగా ఉందనిపిస్తే ఈ పద్ధతిని రోజుకి రెండుసార్లు పాటించాలి. దుర్వాసన రావడం తగ్గిన తరువాత వారానికి రెండుసార్లు చేస్తే చాలు.

కమలా పండు రసం

ఇందులో ఉండే విటమిన్-సి మంచి టోనర్‌గా పనిచేస్తుంది. ఈ రసంతో మసాజ్ చేస్తే సబ్బు వల్ల కూడా పోని దుమ్ము, జిడ్డు వదిలిపోతాయి. టోనర్ తయారీకి అరచెక్క కమలా పండును ఒకటిన్నర స్పూను నిమ్మరసం, పావుకప్పు నీళ్లు కలిపి మెత్తగా అయ్యేవరకు మిక్సీ చేయాలి. ఆ తరువాత ఇందులో దూదిని నానపెట్టి ఆ దూదిని ముఖంపై మృదువుగా రుద్దాలి.

పెరుగు, శెనగపిండి, పసుపు

ఈ మూడు కలిపి వాడితే చర్మం రంగు నిగారింపు వస్తుంది. మూడు స్పూన్ల పెరుగులో ఒక స్పూను శెనగపిండి, చిన్న స్పూను పసుపు వేయాలి. గట్టిగా మెత్తటి పేస్ట్‌లా చేసిన ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 20 నిమిషాల తరువాత చల్లటి నీటితో కడిగేయాలి.

వెనిగర్

చుండ్రు తొలగించేందుకు ఇది బాగా ఉపయోగపడుతుంది. కొద్దిగా మాల్ట్ వెనిగర్ తీసుకుని మాడుపై మసాజ్ చేయాలి. పావుగంట లేదా ఇరవై నిమిషాల తరువాత హెర్బల్ షాంపూతో కడిగేయాలి. చుండ్రు సమస్య ఎక్కువగా ఉంటే వారానికి మూడుసార్లు ఈ పద్ధతి ఫాలో అవ్వాలి. ఇలా రెండు వారాల పాటు చేస్తే చుండ్రు మటుమాయం అవుతుంది.

తేనె - ఆలివ్ ఆయిల్

మంచి హెయిర్ కండిషనర్‌గా పనిచేస్తుంది ఇది. రెండు స్పూన్ల తాజా తేనెను ఒక స్పూను ఆలివ్ నూనెలో కలపాలి. ఈ మిశ్రమాన్ని చేతి మునివేళ్లతో తీసుకుని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు మర్దనా చేయాలి. మాడులోకి ఈ మిశ్రమం బాగా ఇంకేంత వరకు అంటే దాదాపు ఇరవై నిమిషాల తరువాత హెర్బల్ షాంపూతో తలస్నానం చేయాలి.

బ్లాక్ టీ బ్యాగ్స్ - కొత్తిమీర ఆకులు
పెదవుల్ని మృదువుగా, అందంగా ఉంచుతాయి ఇవి. ఒక బ్లాక్ టీ బ్యాగును గోరు వెచ్చటి నీటిలో నానపెట్టాలి. తరువాత దాన్ని పెదవులపై ఉంచి పది నిమిషాల పాటు నెమ్మదిగా ఒత్తుతూ ఉండాలి. అవసరమనుకుంటే ఇంకా ఎక్కువసేపు కూడా చేయొచ్చు. బ్లాక్ టీలో ఉండే టానిన్ వల్ల పెదవులు మృదువుగా, అందంగా తయారవుతాయి. ఇదే కాకుండా కొత్తిమీర ఆకులు కూడా పెదవులకు బాగా పనిచేస్తాయి. పెదవులపై కొత్తిమీర రసాన్ని రుద్దితే గులాబీ రంగు సంతరించుకుని, మృదువుగా అవుతాయి.

Thursday, March 17, 2011

అడుగుల్లో వొలికే అందం...!

చలికాలమే కాదు.. ఎండాకాలంలోనూ పాదాలను కాపాడుకోవాల్సిన అవసరం చాలా వుంది. ఎండకు కమిలి పోవడం.. నల్లగా మారడం.. వంటివి ఇప్పుడు తరచూ జరుగుతుంటాయి. అటువంటి సమయాల్లో పాదాలకు ట్రీట్‌మెంట్‌ తప్పనిసరి. దీనిని ఇంట్లోనే చేసుకోవచ్చు కూడా. ముఖ్యంగా పెడిక్యూర్‌ చేసుకుంటూ వుండాలి అని సౌందర్య నిపుణులు చెబుతున్నారు.

pedicureపాదాలను శుభ్రం చేసుకోవడానికి ముందుగా నెయిల్‌ బ్రష్‌, నెయిల్‌ క్లిప్పర్స్‌, పూమిస్‌ స్టోన్‌, మసాజ్‌ క్రీమ్‌, నెయిల్‌ వార్నిష్‌, ఒక చిన్న టబ్‌ తీసుకోవాలి.పాదాలను ఆరోగ్యంగా ఉంచడానికి ఇప్పుడు చేయబోయేది పెడిక్యూర్‌. పాదాలకి కావల్సినంత మసాజ్‌, టోనింగ్‌ దీని వల్ల లభిస్తుంది రక్తసరఫరా పెరుగుతుంది. దాంతో పాదాలు దృఢంగా ఉంటాయి.

పెడిక్యూర్‌ చేయడానికి...
పెడిక్యూర్‌ చేయడానిి ఒక టబ్‌లో గోరువెెచ్చని నీళ్లు తీసుకోవాలి. ఈ నీళ్లలో షాంపూ, సగం నిమ్మకాయ, ఏదైనా నూనె, చిటికెడు ఉప్పు వేయాలి. ఇప్పుడు 20 నిమిషాలు ఈ టబ్‌లో కాళ్లు పెట్టి కూర్చోవాలి. అంతన్నా ముందు పాదాల గోర్లపై ఉన్న నెయిల్‌ పాలిష్‌ను రిమూవర్‌ సహాయంతో తొలగించాలి. పాదాలను నీళ్లలో పెట్టిన తర్వాత మడమలు, అరికాళ్లను ప్యూమిస్‌ స్టోన్‌తో లేదా గరుకుగా ఉండే సున్నిపిండి వంటివాటితో రుద్ది శుభ్రం చేయాలి.

గోళ్లను మాలిష్‌ చేస్తూ...
pedicure1గోళ్ల చుట్టు పక్కల ఉన్న చర్మాన్ని చర్మం వెనుక భాగానికి బాగా తోయాలి. గోళ్లను కట్టర్‌తో జాగ్రత్తగా కత్తిరించి ఒక షేప్‌ ఇవ్వాలి. ఈ సమయంలో గాయపడకుండా చూసుకోవాలి. ఆ తరువాత ఏదైనా మంచి నూనె లేదా క్రీముతో గోళ్లను, పాదాలను మాలిష్‌ చేయాలి.ఇష్టమైతే పాదాలు శుభ్రం చేసుకోడానికి నెలలో ఒకసారి బ్లీచ్‌ లేదా వారంలో ఒకసారి స్క్రబ్‌ చేయవచ్చు. ప్రతిరోజూ స్నానం చేసిన తర్వాత మాయిశ్చరైజర్‌ను పాదాలపై అప్లై చేయాలి. ఇలా చేస్తే పెళుసుదనం తగ్గి గోళ్లు మెరుపు కనిపిస్తూ ఆరోగ్యంగా దృఢంగా ఉంటాయి.

శోభి మచ్చలు తుడిచేయండి

శోభకూ... శోభికీ తేడా ఆ ‘ఇ’కారమే. ఆ - ‘ఇ’కారంతోనే అందంగా కనిపించే చర్మం వికారమవుతుంది. శోభి మచ్చలు హాని చేయవు. కానీ వికారంగా కనిపించేలా చేస్తాయి. చాలామట్టుకు వాటంతట అవే తగ్గుతాయి. కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం తగ్గకుండా ఇబ్బంది పెడతాయి. కొన్ని సూచనలు, మరికొన్ని జాగ్రత్తలు పాటిస్తే అసలు మచ్చలు రాకుండా చూసుకోవచ్చు. వచ్చినా తేలిగ్గా తగ్గించుకోవచ్చు. అలా మచ్చ రాకుండా తీసుకోవాల్సిన ‘ముందుజాగ్రత్త’లు ...

శోభి లేదా తెల్లమచ్చలు అనేది చర్మానికి వచ్చే అతి సామాన్యమైన వ్యాధి. ఇది చాలా సందర్భాల్లో దానంతట అదే తగ్గిపోయినా... ఒక్కోసారి ఎక్కువరోజులు ఉంటుంది. ఇది చర్మం పైపొరమీద వచ్చే ఒక రకమైన ఫంగల్ ఇన్‌ఫెక్షన్. సాధారణంగా పెద్ద వయసు వారిలోను, మధ్యవయస్సు వారిలోను కనిపిస్తుంది. దీనికి ఆడమగ భేదం లేదు. చర్మం మీద రంగులో మార్పులు వచ్చే కారణంగా దీనిని వెర్సికలర్ అని, తెలుగులో శోభి లేదా తెల్లమచ్చలు అని అంటారు.
ఎవరిలో ఎక్కువ...!
తేమ ఎక్కువగా ఉండే ప్రాంతాలలో, వేడి వాతావరణంలో ఉండేవారిలో

స్టెరాయిడ్లు తీసుకునేవారిలో

పౌష్టికాహార లోపం ఉన్నవారిలో

ధినిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో (ఈస్ట్, చర్మం మీద ఫంగస్ మొదలైనవి రాకుండా వ్యాధినిరోధక వ్యవస్థసరిగా రక్షణ కల్పించ లేకపోయినప్పుడు)

గర్భవతులలో

చెమటపట్టే శరీరధర్మం ఉన్నవారిలో

జిడ్డు చర్మం ఉన్న వారిలో

హార్మోన్ల అసమతౌల్యత ఉన్నవారిలో... ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది.

కొందరిలో వంశపారంపర్యంగా వస్తుంది. అంతేకాక ఆరోగ్యవంతులకు కూడా ఒక్కోసారి ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. అయితే పెద్దగా కంగారుపడవలసిన అవసరం లేదు.

కారణాలు: చర్మం లోపల ఉండే మెలసీజియా ఫర్‌ఫర్ అనే ఫంగస్ వల్ల ఈ వ్యాధి వస్తుంది. ఇది చర్మం మీద ఉండే నూనెలను, మృతకణాలను ఆహారంగా తీసుకుంటుంది. ఈ ఫంగస్ మాత్రం అందరి చర్మంలోనూ ఉన్నా కొంతమందిలో మాత్రం ఇబ్బందులకు గురి చేస్తుంది. దీని ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు కొందరి శరీరం మీద మచ్చలు వస్తాయి. వాతావరణం తేమగా, వేడిగా ఉన్నప్పుడు ప్రధానంగా వేసవిలో ఈ వ్యాధి కనిపించడానికి అవకాశం ఉంది. అయితే వాస్తవానికి ఇది ఫలానా కారణంగా వస్తుందని ఇప్పటికీ నిర్ధరించలేదు.

తెల్లమచ్చలు కనిపించడం వల్ల నలుగురిలో కి వెళ్లడానికి కొంత ఇబ్బందిగా అనిపించడం సాధారణం. ఈ వ్యాధిలో చర్మం సహజరంగును కోల్పోయి, మచ్చలు కనిపిస్తాయి. ఈ మచ్చలు ముదురు ఎరుపు, లేత గోధుమ, తెలుపు వర్ణాలలో ఉంటాయి. ఒక్కోసారి ఈ మచ్చలున్న చోట దురదగా అనిపించి చికాకుగా అనిపించవచ్చు. అయినప్పటికీ దీనివల్ల ఇబ్బంది ఉండదు. ఎక్కువ చెమట పట్టడం, అధికవేడి కారణంగా ఈ దురదలు రావచ్చు. ఈ మచ్చలు సాధారణంగా వీపు, భుజాలు, చేతులు, ఛాతీ, మెడ ప్రాంతాలలో కనిపిస్తాయి. అప్పుడప్పుడు ముఖం మీద కూడా కనిపిస్తాయి. చిన్నపిల్లలలో ఈ లక్షణాలు ముఖం మీద కనిపిస్తాయి. చర్మం మీద ముదురురంగు మచ్చలు ఏర్పడినప్పుడు, ఆ ప్రాంతంలో చర్మం సహజరంగు కోల్పోవడం సర్వసాధారణం.


వాతావరణం బాగా వేడిగా ఉన్నప్పుడు దాని ప్రభావం ఈ మచ్చల మీద ఎక్కువగా ఉంటుంది. ఈ మచ్చల తీవ్రత ఒక్కొక్కరిలో ఒక్కో విధంగా ఉంటుంది. కొందరిలో తెల్ల రంగులో చిన్న చిన్న చుక్కలుగా కనిపిస్తే, మరికొందరిలో ఇవి ఎక్కువగా ఉంటాయి. అవి చూడటానికి సహజంగానే అనిపించినప్పటికీ ఒక్కోసారి సమస్యాత్మకంగా ఉంటాయి.

చికిత్స, నివారణ: ఈ సమస్యను చాలా తేలికగా నివారించవచ్చు. చికిత్స చాలా సులభం. ఈ మచ్చలు తొందరగా తగ్గిపోవడానికి అనేక మార్గాలున్నాయి. వేడి నీటితో స్నానం చేయడం, వ్యాయామం చేయడం వంటి చిట్కాలు పాటించడం వల్ల ఈ మచ్చలు త్వరగా తగ్గుముఖం పడతాయి. అయితే చర్మపురంగు యథాస్థితికి రావడానికి మాత్రం చాలారోజులు పడుతుంది. వాతావరణం సాధారణస్థితిలోకి అంటే అధిక ఉష్ణోగ్రత నుంచి సాధారణ ఉష్ణోగ్రత స్థాయికి వచ్చేసరికి రంగులో మార్పు వస్తుంది. అదృష్టవశాత్తూ, శోభి లేదా తెల్లమచ్చలు అంటువ్యాధి కాదు. ఒకవేళ ఈ వ్యాధి వచ్చినప్పటికీ కొద్దిరోజులకే తగ్గిపోతుంది.

ఈ వ్యాధి సోకిన వారందరికీ చికిత్స ఒకేలా ఉండదు. అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని చికిత్స సూచిస్తారు. ఆరోగ్యానికి సంబంధించిన పూర్తి వివరాలు, వ్యాధి సోకిన వ్యక్తికి సంబంధించిన మెడికల్ హిస్టరీ... వంటి వాటిని ఆధారం చేసుకుని చికిత్స ఉంటుంది. అన్ని రకాల ఇన్ఫెక్షన్ల నివారణకి తేమ వాతావరణం అనేది తప్పనిసరి. వాటితోటు శరీరంలో సహజంగా ఉండే నూనెలు కూడా దీనిని తగ్గించడానికి ఉపయోగపడతాయి.


కొందరు శోభిని చూసి తామర (రింగ్‌వార్మ్) గా భ్రమపడుతుంటారు. తామర వ్యాధి సోకిన భాగంలో మచ్చకు చుట్టూ అంచులు స్పష్టంగా కనపడతాయి. అలాగే దురద కూడా ఉంటుంది. వీటినే కొందరు విటిలిగో, పిటీరియాసిస్ ఆల్బా, సోరియాసిస్‌గా కూడా భ్రమపడుతుంటారు. అందువల్ల డెర్మటాలజిస్టులు ‘కెఓహెచ్’ పరీక్ష ద్వారా ఇది ఏ రకమైన చర్మవ్యాధి అనేది నిర్ధరించి, దానికి తగిన చికిత్స సూచిస్తారు.


ఇన్‌ఫెక్షన్ తగ్గాక కూడా శరీరపు రంగు యథాస్థితికి రావడానికి కొన్ని నెలలు పడుతుంది. ఇది మళ్లీ మళ్లీ రాకుండా ఉండటానికి తగు జాగ్రత్తలు పాటించడం మంచిది. ఎక్కువచెమట పట్టకుండా చూసుకుంటూ, కెటొకోనటోల్ ఉండే పౌడర్‌ను కొన్ని నెలలు వాడితే మంచిది. ఈ సూచనలు పాటించి అందమైన, ఆరోగ్యకరమైన చర్మాన్ని మీ సొంతం చేసుకోండి.

జాగ్రత్తలు
ఈ వ్యాధి రాకుండా నివారించడానికి కొన్ని జాగ్రత్తలను తప్పనిసరిగా తీసుకోవాలి. అవి...

చర్మాన్ని నిరంతరం శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి

శరీరం మీద అధిక తేమ ఉండకుండా జాగ్రత్తపడాలి

గోరువెచ్చని నీటితో కాని, కొద్దిగా వేడిగా ఉన్న నీటితో కాని స్నానంచేయాలే కాని వేడివేడి నీటితో స్నానం చేయకూడదు. మరుగుతున్న నీటితో స్నానం చేయటం వలన చర్మం చిట్లినట్టుగా అయ్యి లోపల ఉండే నూనె పదార్థాలు ఉత్తేజితమయ్యి, నూనె గ్రంథులు ఏర్పడి, అధిక నూనెను బయటకు విడుదల చేస్తాయి. దీని వల్ల చర్మం మీద ఉన్న ఫంగస్ రెట్టింపవుతుంటుంది

ఎక్కువ చెమట పట్టకుండా జాగ్రత్తపడాలి

శరీరం మీద నూనె కాని నూనెకు సంబంధించిన పదార్థాలను కాని పూయకూడదు

బిగుతుగా, గాలిచొరకుండా ఉండే వస్ర్తాలను ధరించకూడదు.
మందులు
ఫంగస్ చర్మపు పైపొర మీద ఉంటుంది కనుక, చర్మానికి పై పూతగా వాడే మందులు బాగా పనిచేస్తాయి. ఒకవేళ ఈ మచ్చలు ఎక్కువగా ఉంటే, యాంటీ ఫంగల్ మందులను కడుపులోకి తీసుకోవలసి ఉంటుంది. మందులు వాడాక ఈ మచ్చలు తగ్గినట్టు అనిపించినప్పటికీ, కొంతకాలం తరవాత మళ్లీ వచ్చే అవకాశం ఉంటుంది. కనక ఈ ఫంగస్ పూర్తిగా తగ్గడానికి మందులు వాడడం తప్పనిసరి.

లులిఫిన్ వంటి యాంటీ ఫంగల్ క్రీమ్‌ను ఉపయోగించవచ్చు. దీనిని సుమారు పదిరోజుల పాటు రోజుకి ఒకసారి చొప్పున మచ్చలున్న చోట అప్లై చేయవలసి ఉంటుంది. అలాగే క్లోట్రిమాజోల్, కెటొకోనజోల్ వంటి క్రీమ్స్‌ను రెండు వారాలపాటు రోజుకి రెండుసార్లు చొప్పున వాడవచ్చు. ఒకవేళ ఇన్‌ఫెక్షన్ అధికంగా ఉంటే, ఓరల్ ట్యాబ్లెట్లను తీసుకోవలసి ఉంటుంది. ఏ మందులనైనా నిపుణులైన డెర్మటాలజిస్టు సలహా, సూచనల మేరకు తీసుకోవలసి ఉంటుంది.

Thursday, January 27, 2011

బ్యూటీ సీక్రెట్స్‌...

beauty-secrets
  • మీగడలో పసుపు కలిపి రోజూ చర్మానికి రాయండి. పదినిమిషాల తర్వాత మెత్తగా, నెమ్మదిగా అక్కడ మసాజ్‌ చేయాలి.
  • నిమ్మ, తులసి ఆకుల రసం సమపాళ్ళలో లిపి రోజూ రెండుసార్లు ముఖానికి పట్టించండి.
  • బంగాళాదుంపల రసం తీసి ముఖానికి రాసుకోండి. అర్ధగంట వరకూ అలాగే ఉంచండి. వారానికి రెండు,మూడు సార్లు ఇలా చేయడం వల్ల టాన్‌ తగ్గుతుంది.
  • పచ్చిపాలలో పసుపు కలిపి దానిలో దూది పింజల్ని నాన బెట్టండి. తర్వాత ఆ పాలు ఫ్రిజ్‌లో ఉంచండి. రోజూ ఒక దూది పింజను తీసుకుని నల్లని చర్మం పై రుద్దుతూ చక్కగా శుభ్రం చేసుకుంటూ ఉండాలి. పచ్చిపాలు,పసుపు మిశ్రమం చర్మంలో నునుపు కలిగించడంతోపాటు నలుపు రంగును దూరం చేస్తుంది.
  • శనగపిండి, నెయ్యి, పసుపు పేస్టులా తయారుచేసి చర్మంపై రాయాలి. కొద్దిగా ఆరాక చేత్తో మృదువుగా గుండ్రంగా మసాజ్‌ చేయాలి. ఇలా చేస్తే మీ పొడిబారిన చర్మం పై ఉన్న మురికి తొలగిపోతుంది. దీనితో పాటు నలుపు తగ్గిపోయి ఛామన చాయతో కాంతి వంతంగా ఉంటుంది.
  • ప్రతి రోజూ చర్మానికి తేనె పూతగా రాయాలి.
  • స్నానం చేయడానికి పది పదిహేను నిమిషాల ముందు శరీరానికి శనగపిండి, పచ్చిపాలు పసుపు కలిపిన మిశ్రమాన్ని పట్టించాలి. ఆ తర్వాత స్నానం చేయాలి.
    SUPERMODEL
  • గంధం పొడిని, పసుపు, రోజ్‌వాటర్‌ మిశ్రమాన్ని ముఖానికి పట్టించండి.
  • బాదం పాలు ముఖానికి పట్టించండి. రాత్రంతా ఉంచుకుంటే ఇంకా మంచిది.
    నానబెట్టిన బాదం పప్పుల్ని పచ్చిపాలలో కలిపి పేస్టులా చేయాలి. ఈ పేస్టును ముఖం మీద కనీసం ప్రతిరోజూ ఒక గంటసేపు ఉంచు కోవాలి.రాత్రిపూట దీన్ని రాసుకుని పడుకుంటే ఇంకా మంచిది.
  • బక్కెట్‌ నిండా నీళ్లు తీసుకుని దాన్లో రెండు నిమ్మకాయలు పిండాలి. ఆ రసం నీళ్ళలో బాగా కలిసాక ఆ నీళ్ళతో స్నానం చేయాలి. దీనిని కొన్ని నెలలవరకూ కొనసాగిచాలి.
  • నలుపు రంగు పుట్టుకతో వచ్చినా లేక తర్వాత కాలంలో ఏ కారణంగానైనా వచ్చినా పైన తెలిపిన చిట్కాల్ని ప్రయోగించాలి.

Wednesday, January 26, 2011

అందమైన చిరునవ్వుకు కృత్రిమ దంతాలు

చక్కని చిరునవ్వుకే కాదు.. ఆరోగ్యంపైన కూడా ప్రభావం చూపిస్తాయి దంతాలు. కోల్పోయిన దంతాల స్థానంలో కృత్రిమ దంతాలను అమర్చగలగడం దంతవైద్యరంగంలో మంచి పరిణామం. ఎంతోకాలంగా అందుబాటులో ఉన్న ఇంప్లాంటేషన్ చికిత్స అందించడంలో కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. వీటికి పరిష్కారంగా వచ్చాయి బేసల్ డెంటల్ ఇంప్లాంట్స్.

స్విట్జర్లాండ్‌కి చెందిన డాక్టర్ ఇధావో రూపొందించిన ఈ కృత్రిమ దంతాలను మన రాష్ట్రంలో మొదటిసారిగా అందుబాటులోకి తెచ్చారు డాక్టర్ మహేందర్ ఆజాద్. మాక్సిలోఫేషియల్ సర్జరీ, ఇంప్లాంటేషన్ చికిత్సలలో మూడు దశాబ్దాలకు పైగా అనుభవాన్ని గడించిన డాక్టర్ మహేందర్ ఆర్మీలో పనిచేసి రిటైరయ్యారు. హైదరాబాద్‌లో గత పదేళ్లుగా సేవలందిస్తున్న ఆయన కృత్రిమ దంతాల గురించి అందిస్తున్న విశేషాలు...

నెలరోజుల్లో నా పెళ్లి ఉంది డాక్టర్.. ఈలోగా ఊడిపోయిన పళ్ల స్థానంలో కొత్త దంతాలు పెట్టేయండి.... అంటూ వచ్చింది వినీల. దంతాలు పుచ్చిపోవడంతో దవడ భాగంలో రెండు పళ్లను తీసేశారు ఆమెకు. వాటి స్థానంలో కృత్రిమ దంతాలు పెట్టించుకోవాలనుకుంటోంది. కృత్రిమ దంతాలు అమర్చాలంటే సుమారు ఓ సంవత్సరం పడుతుందంటున్నారు ఫ్రెండ్స్. పెళ్లిని వాయిదా వేసుకునే పరిస్థితి లేదు. ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు డాక్టర్ చెప్పిన మాట ఆమెకు అమృతంలా తోచింది. అదే... బేసల్ డెంటల్ ఇంప్లాంట్స్.

*** కృత్రిమ దంతాలను అమర్చే చికిత్సలు అందుబాటులోకి వచ్చి ముప్పయ్యేళ్ల పైగానే అయింది. డెంటల్ ఇంప్లాంట్స్‌ను తయారుచేసే కంపెనీలు కూడా రకరకాల మోడల్స్‌లో ఆధునిక పద్ధతుల్లో తయారుచేస్తూనే ఉన్నాయి. అయినా సరే డెంటల్ ఇంప్లాంటేషన్ (కృత్రిమ దంతాలను అమర్చడం)లో చాలా లోపాలు, కష్టాలు తీరనేలేదు. ఈ లోపాలన్నింటికీ పరిష్కారం చూపేవే బేసల్ డెంటల్ ఇంప్లాంట్స్.

ఇంప్లాంటేషన్ ఎలా?

దంతం అంటే మనకు పైకి కనిపించేది మాత్రమే కాదు. దాని రూట్ చిగుళ్ల దగ్గర ఉన్న ఎముకలో ఉంటుంది. ఇక్కడి నుంచే దంతానికి కావలసిన పోషకాలు అందుతాయి. ఈ ఎముక రెండు భాగాలుగా ఉంటుంది. దంతం వైపు ఉండేదాన్ని అల్వియోలార్ ఎముక అనీ, దాని కింద ఉండేదాన్ని బేసల్ ఎముక అనీ అంటారు. దంతం దెబ్బతిన్నప్పుడు ఈ రూట్ భాగాన్ని కూడా తీసేస్తారు. సహజమైన దంతం స్థానంలో అమర్చే ఇంప్లాంట్‌లో మూడు భాగాలుంటాయి. దీనికి కూడా సహజమైన దంతంలాగా రూట్ ఉంటుంది.

కానీ అది ప్లాటినమ్‌తో తయారుచేయబడింది. దీని కింది భాగం చూడటానికి ఒక స్క్రూలాగా ఉంటుంది. ఈ స్క్రూ పైన ఉండే భాగంలో లోపల అంతా ఖాళీగా ఉంటుంది. ఈ ఖాళీ భాగంలో ఇంప్లాంట్ మూడో భాగాన్ని చొప్పిస్తారు. దాని పైన మనకు పైకి కనిపించే కృత్రిమ దంతం ఉంటుంది. ఇంప్లాంట్ స్క్రూను అల్వియోలార్ ఎముకకి రంధ్రం చేసి దానిలోకి బిగిస్తారు. ఈ ప్రక్రియ మొత్తం చేయడానికి సుమారు సంవత్సర కాలం అవసరం అవుతుంది. ఇంత కష్టపడి ఇప్పటి వరకు అనుసరిస్తున్న ఈ ఇంప్లాంట్స్ విషయంలో చాలా సమస్యలు ఉన్నాయి.

ఏమిటా లోపాలు?

చిగుళ్ల వ్యాధి వల్లగాని, ఇతరత్రా సమస్యల వల్ల గానీ దంతాన్ని తీసివేసినప్పుడు వెంటనే కృత్రిమ దంతాన్ని అమర్చడం సాధ్యం కాదు. దంతం అనారోగ్యానికి గురయినప్పుడు దానితో పాటు అల్వియోలార్ ఎముక కూడా దెబ్బతింటుంది. దాని గాయం మానడానికి కనీసం 3 నుంచి 4 నెలల సమయం పడుతుంది. అందువల్ల 3 లేదా 4 నెలల తరువాత గానీ ఇంప్లాంటేషన్ చేయడానికి వీలుపడదు. స్క్రూను బిగించే అల్వియోలార్ ఎముక బేసల్ బోన్ కన్నా సున్నితమైనది. కాబట్టి కృత్రిమ దంతం త్వరగా వదులయ్యేందుకు అవకాశం ఉంటుంది.

దంతం పాడయినప్పుడు అల్వియోలార్ ఎముక కూడా దెబ్బతినడం వల్ల కృత్రిమ దంతానికి అవసరమైనంత ఎముక ఉండదు. దానివల్ల కూడా అమర్చిన దంతం తిరిగి వదులయ్యేందుకు ఆస్కారం ఉంటుంది.

స్క్రూ బిగించిన తరువా ఇంప్లాంటేషన్ ప్రక్రియ కొనసాగడానికి 4 నుంచి 6 నెలలు ఆగాల్సి ఉంటుంది. స్క్రూ ఎముకలో సర్దుకోవడానికి అంత టైం పడుతుంది.

తరువాత శాశ్వత దంతాన్ని అమర్చడానికి తిరిగి 10నెలల వ్యవధి అవసరం అవుతుంది. కానీ పేషెంట్ మాత్రం దంతాన్ని తీసివేయగానే వెంటనే కృత్రిమ దంతాన్ని అమర్చేయమని అడుగుతుంటారు. అయితే ఇప్పటివరకు అందుబాటులో ఉన్న స్క్రూ ఇంప్లాంట్స్ వల్ల మాత్రం సుమారు సంవత్సర కాలం పడుతుంది.

బేసల్ ఇంప్లాంట్స్

ఇప్పుడు కొత్తగా వచ్చిన కృత్రిమ దంతాలు సంప్రదాయ ఇంప్లాంట్స్‌తో వచ్చే సమస్యలకు పరిష్కారం చూపిస్తాయి. స్విట్జర్లాండ్‌కి చెందిన డాక్టర్ ఇధావో బేసల్ ఇంప్లాంట్స్‌ని రూపొందించారు. పేరులో ఉన్నట్టుగానే ఈ ఇంప్లాంట్స్‌ని అల్వియోలార్ ఎముకకు బదులుగా బేసల్ బోన్‌లో అమరుస్తారు. అందువల్ల ఇవి వదులయ్యే అవకాశమే ఉండదు.

దంతాలను తీసివేసిన వెంటనే వీటిని అమర్చడం సాధ్యమవుతుంది. చిగుళ్ల వ్యాధి లేదా ఇన్‌ఫెక్షన్ వల్లగానీ దంతాలను కోల్పోవాల్సి వచ్చిన సందర్భంలో కూడా బేసల్ ఇంప్లాంట్స్‌ని అమర్చవచ్చు. వీటిలో స్క్రూకి బదులుగా రింగ్ లాంటి నిర్మాణం ఉంటుంది. ఈ రింగు ఎముక వ్యాసానికి అనుగుణంగా ఉంటుంది. కాబట్టి దంతం అటూ ఇటూ జరిగిపోకుండా సరిగ్గా ఫిట్ అవుతుంది.

దీన్ని బేసల్ బోన్‌లో అమరుస్తారు కాబట్టి అల్వియోలార్ ఎముక పూర్తిగా దెబ్బతిన్నా ఇంప్లాంటేషన్ సాధ్యమవుతుంది. పై దవడ వైపు దంతం అనారోగ్యానికి గురయినప్పుడు ఎముక కూడా చాలావరకు దెబ్బతింటుంది. సంప్రదాయ ఇంప్లాంట్స్ అయితే ఇలాంటప్పుడు సైనస్ ఎఫెక్ట్ కాకుండా సైనస్ లిఫ్ట్ అనే పద్ధతి ద్వారా దీన్ని అమర్చేవారు. కానీ బేసల్ ఇంప్లాంట్స్ విషయంలో సైనస్ లిఫ్ట్ చేయనవసరం లేదు. ఏ వయసువారైనా భేషుగ్గా వీటిని పెట్టించుకోవచ్చు.

ఇంప్లాంటేషన్ ఎప్పుడు?

- దంతాలు దెబ్బతినడానికి ప్రధాన కారణం నోరు, దంతాలు సక్రమంగా శుభ్రం చేసుకోకపోవడమే. దీనివల్ల దంతాలు, చిగుళ్లు దెబ్బతిని పంటిని పూర్తిగా తీసేయాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. ఇలాంటప్పుడు ఇంప్లాంటేషన్ ద్వారా కృత్రిమ దంతాలను అమరుస్తారు.
- చిగుళ్ల వ్యాధులు - నోరు సరిగా శుభ్రం చేసుకోకపోవడం వల్ల ఇన్‌ఫెక్షన్లు వచ్చి చిగుళ్లు దెబ్బతింటాయి. చిగుళ్ల వ్యాధి వల్ల ఎముక కూడా దెబ్బతినవచ్చు. చిగుళ్ల వ్యాధులు వంశపారంపర్య కారణాల వల్ల కూడా రావచ్చు.
- చిప్స్, చాక్లెట్లు లాంటివి ఎక్కువగా తినడం వల్ల కూడా దంతాలు దెబ్బతింటాయి. నోటి శుభ్రత లేకపోవడం కూడా కారణమే. - ప్రమాదాల్లో నోటికి దెబ్బలు తగిలినప్పుడు కూడా దంతాలను కోల్పోయే అవకాశం ఉంటుంది.

డాక్టర్ మహేంద్ర ఆజాద్
డెంటల్ అండ్ మాక్సిలోఫేషియల్
సర్జరీ సెంటర్, హైదరాబాద్.
ఫోన్:9391035568

Tuesday, January 4, 2011

శీతాకాలంలోనే కాదు .... ఏ కాలమైనా కోమలమే..

శీతాకాలంలోనే కాదు సంవత్సరం అంతా పాదాలను అందంగా ఉంచుకోవడానికి కొన్ని చిట్కాలను పాటించాల్సిందే. మన శరీరంతో పాటు చర్మాన్ని చలికాలంలో చిట్లకుండా చూసుకోవాలంటే కొన్ని రకాలైన జాగ్రత్తలను తీసుకోవాలి. ముఖ్యంగా చేతులు, పాదాల విషయంలో మరీ జాగ్రత్త వహించాలి.పాదాలు, చేతి వేళ్ళ సంరక్షణకోసం మెనిక్యూర్‌, పెడిక్యూర్‌లను ఆశ్రయించడం మనకు తెలిసిందే. దీనికోసం మహిళలు ఎక్కువగా బ్యూటీపార్లర్‌లను ఆశ్రయిస్తుంటారు. దానికోసం ఎంతో ఖర్చుచేస్తారు. అయితే, ఇంట్లోనే చిన్నపాటి చిట్కాలు పాటించడం వల్ల పాదాలు, చేతులను అందంగా మలచుకోవచ్చు.

పాదాలు సంరక్షణకు:
footదుమ్ము, ధూళివల్ల పాదాలు మురికిగా కనుపిస్తాయి. వాటిని శుభ్రం చేసుకోవడానకి గోరువెచ్చని నీటిని ఒక బేసిన్‌లో తీసుకొని, ఎప్సాన్‌ ఉప్పు, బాడీ వాష్‌కు సంబంధించిన సోప్‌ క్రీమ్‌ను మిశ్రమంగా కలుపుకొని అందులో పాదాలను పదినిమిషాలసేపు ఉంచాలి.ఫ్యూమిస్‌ స్టోన్‌ తీసుకొని చర్మాన్ని బాగా రుద్దాలి.ఆరేంజ్‌ స్టిక్‌ను తీసుకొని కాలి గోళ్ళ మధ్య ఉన్న మట్టిని తొలగించాలి. అంతేకాకుండా గోళ్ళను కూడా పాలిష్‌ చేసుకోవాలి. సుతిమెత్తని పాదాలు ఎల్లప్పుడూ అందంగా కనపడాలంటే... నెలకొకసారైనా ఇలాంటి టిప్స్‌ని ఇంట్లో ఉండే చేసుకోవాలి. అప్పుడు ఖర్చు తగ్గడంతో పాటు అందమైన పాదాలు మీ సొంతమవుతాయి.

చేతుల సంరక్షణకు:
మన శరీరంలో ఎక్కువగా పనిచేసేవి చేతులే... అందుకోసం చేతుల విషయంలో... మరీ ముఖ్యంగా గోళ్ళ విషయంలో శ్రద్ధ వహించకపోతే... అంద వికారంగా తయరవుతాయి.పెడిక్యూర్‌లాగానే...మేనిక్యూర్‌ను కూడా ఇంట్లో కొన్ని సింపుల్‌ చిట్కాలు పాటించి అందంగా మలచుకోవచ్చు.గోరువెచ్చని నీటిని తీసుకొని దానిలో చేతులను ఉంచి, ఆరెంజ్‌ వుడ్‌ స్టిక్‌తో గోళ్ళను శుభ్రపరుచుకోవాలి. కాళ్ళ కన్నా చేతులపై మనం ఎక్కువ శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉంది. ఫ్యూమస్‌ స్టోన్‌పై చేతులను ఉంచి బాగా రుద్దా లి. అంతేకాకుండా ఎవరికి ఇష్టమైన సోప్‌ క్రీమ్‌ను వాడుకొని మరింతగా రుద్దుకోవడం ద్వారా చేతులను మరింత అందంగా మలచుకోవచ్చు.

కాలంతో పనిలేదు...
పాదాలను ఎండాకాలంలోనే సంరక్షించుకోవాలనే రూలేంలేదు. అన్ని కాలాల్లోనూ శ్రద్ధతీసుకున్నప్పుడే అవి అందంగా తయారవుతాయి. అందుకోసం ఇంట్లోనే తయారుచేసుకునే పదార్ధాలతోపాటు, కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వారానికి ఒక అరగంట సమయం మీ పాదాలకోసం కేటాయిసే ్తచాలు అందమైనా పాదాలు మీసొంతం.

స్మూత్‌గా తయారవుతుంది...

feet 
ఒక ప్లాస్టిక్‌ బౌల్‌లో గోరువెచ్చని నీటిలో సాఫ్ట్‌నెస్‌ కోసం కొన్ని చుక్కల ‘చామోమైల్‌’ ఆయిల్‌ వేయాలి.తరువాత పాదాలను అందులో పదినిమిషాల పాటు అందులో ఉంచాలి. తరువాత తీసి టవల్‌తో తుడిచేస్తేచాలు మీ పాదాలు ఎంతో నునుపుగా తయా రవుతాయి.ప్యూమిస్‌ స్టోన్‌ను నీటిలో ఒక నిమిషం పాటు ఉంచి ఆ రాయి తో పాదాల చర్మాన్ని సున్నితంగా రు ద్దాలి. అప్పుడు చర్మంపై ఉండే మృత కణాలు పోయి సాఫ్ట్‌ అండ్‌ స్మూత్‌ గా తయారవుతాయి. మాయిశ్చరైజింగ్‌ క్రీమ్‌గానీ, ఆయిల్‌తో గానీ మీ పాదా లకు మర్దనా చేసుకుంటే మీ పాదాల కు విశ్రాంతి కలుగుతుంది. అంతేకా కుండా తిరిగి ఉత్తేజంగా తయార వుతుంది.

అపుడే అందం వస్తుంది ...
మీరు కాలిగోళ్లకు పాలిష్‌ వేయాలను కున్నప్పుడు ముందుగా గోరును శుభ్రపరుచుకోవాలి. ఇందుకోసం నెయిల్‌పాలిష్‌ రియూవర్‌ను ఉప యోగించవచ్చు. రిమూవర్‌ను ఉప యోగించిన తరువాత టవల్‌తో పూర్తిగా శుభ్రపరిచిన తరువాతే పాలి ష్‌ వేసుకోవాలి. అప్పుడే అందం వస్తుంది. పాలిష్‌ను ఎట్టి పరిస్థితు ల్లోనూ చర్మానికి తాకకుండా చూసు కోవాలి.

Sunday, December 26, 2010

బ్లాక్ హెడ్స్‌కు దూరంగా...

ముఖాన్ని అందవిహీనంగా మార్చేవాటిలో బ్లాక్‌హెడ్స్ ప్రధానమైనవి. సెబాషియస్ అనే గ్రంథి నూనె పదార్థాన్ని(సెబమ్) అధికంగా విడుదల చేయడం వల్ల ఇవి ఏర్పడతాయి. చర్మానికి రంగునిచ్చే పిగ్మెంట్ ఎక్కువైనా ఈ సమస్య వస్తుంది. వెంటనే తగిన చికిత్స తీసుకుంటే వీటిని నివారించుకోవడమే కాకుండా అందాన్ని కాపాడుకోవచ్చు.

కారణాలు

* చర్మంలో జీవక్రియలు సక్రమంగా జరగడానికి వీలుగా సెబాషియస్ గ్రంథి నూనె పదార్థాన్ని విడుదల చేస్తుంది. ఈ నూనె ఉత్పత్తి ఎక్కువైనప్పడు దానికి చర్మంలోని మలిన పదార్థాలు కూడా తోడయ్యి బ్లాక్‌హెడ్స్, వైట్‌హెడ్స్‌గా ఏర్పడతాయి.
* చర్మంలో బ్లాక్‌హెడ్స్ ఏర్పడడానికి దుమ్ముకూడా ఒక కారణం. చర్మంలో పేరుకున్న దుమ్ము కారణంగా బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. దీనికి నూనెకూడా జత కావడంతో బ్లాక్‌హెడ్స్ ఏర్పడతాయి. .
ట బ్లాక్‌హెడ్స్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ గిల్లకూడదు. దీనివల్ల పరిస్థితి మరింత విషమిస్తుంది. గిల్లడం వల్ల చర్మంపై ఉన్న బ్యాక్టీరియా చర్మంలోపలికి చొచ్చుకుపోయి మరింత హాని చేస్తుంది.
నివారణ చిట్కాలు

* ముల్లంగి విత్తనాలను పేస్ట్‌లాచేసుకుని దాన్ని నీళ్లతో కలిపి ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాలపాటు ఆరనిచ్చి తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగేయాలి. *మూడు నాలుగు కప్పుల నీటిని వేడిచేసి వాటికి రెండు టీ స్పూన్ల సోడా బైకార్బోనేట్ కలపాలి. ఓ టవల్‌ను ఈ నీటిలో ముంచి ముఖంపై ఉంచుకోవాలి. ఇలా ఐదారుసార్లు చేయాలి. ఇప్పుడు ఒక స్పూన్ పెరుగులో ఒక టీ స్పూన్ బియ్యం పిండిని కలుపుకుని బ్లాక్‌హెడ్స్ ఉన్నచోట రుద్దుకోవాలి. ఆరిన తర్వాత చల్లటి నీటితో కడిగే స్తేసరి.

* గంధపు చెక్క పొడికి రోజ్‌వాటర్ కలిపి ఆ పేస్ట్‌తో ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. ఆరిన తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి. ఈ విధంగా చేయడం వల్ల బ్లాక్‌హెడ్స్ త గ్గడంతోపాటు చర్మం చల్లగా ఉంటుంది.
*నాలుగు టేబుల్ స్పూన్ల బేకింగ్‌సోడాకు ఒక టీ స్పూన్ డెడ్‌సీ సాల్ట్, రెండు స్పూన్ల నీటిని కలుపుకోవాలి. దీంతో చర్మాన్ని రుద్దుకుంటే మంచి ఫలితం ఉంటుంది. * ఓట్‌మీల్ పౌడర్‌కు రోజ్‌వాటర్ కలుపుకుని ఆ పేస్ట్‌ను వేళ్లతో ముఖానికి రాసుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడుక్కుంటే సరిపోతుంది.
* సాధారణ చర్మతత్వం ఉన్నవారు ముల్తానీ మట్టికి రోజ్ వాటర్ కలుపుకుని చర్మంపై రాసుకోవాలి. దీనివల్ల బ్లాక్‌హెడ్స్ తగ్గిపోవడమే కాకుండా చర్మం నున్నగా అవుతుంది.
* మెంతి ఆకులను పేస్ట్‌లా దాన్ని చర్మంపై రాసుకోవాలి. 15 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగేయాలి. ప్రతిరాత్రి పడుకునే మందు ఇలా చేస్తే కొన్ని రోజుల్లోనే బ్లాక్‌హెడ్స్ తగ్గిపోతాయి. .
ట పెరుగులో నల్లమిరియాల పొడివేసి బాగా కలిపి దాన్ని ముఖానికి రాసుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడుక్కుంటే సరిపోతుంది.
* తాజా కొత్తిమీర ఆకుల నుంచి తీసిన రసం ఓ టేబుల్‌స్పూన్, పసుపు అర టీ స్పూన్ తీసుకుని ఈ మిశ్రమాన్ని పడుకునే ముందు రాసుకోవాలి. ఉదయం లేచిన వెంటనే కడుక్కోవాలి. ఇలా ఓ వారం చేస్తే మంచి ఫలితాలు కన్పిస్తాయి.
* ద్రాక్షపండ్ల గుజ్జును బ్లాక్‌హెడ్స్ ఉన్న ప్రాంతంలో రాసుకోవాలి. ఆరిన తర్వాత గోరువెచ్చటి నీటితో కడుక్కుంటే సరిపోతుంది.
* ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని, ఒక టేబుల్ స్పూన్ దాల్చినచెక్క పొడిని కలుపుకుని పడుకునే ముందు ముఖానికి రాసుకుని ఉదయాన్నే కడిగేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
* ఓ పావు కప్పు వేడినీటిలో ఒక టేబుల్ స్పూన్ ఎప్సమ్ సాల్ట్, మూడు చుక్కల అయోడిన్ వేసి చల్లారేవరకు అలానే ఉంచాలి. తర్వాత ఆ మిశ్రమంలో దూదిని ముంచి బ్లాక్‌హెడ్స్‌పై రాసుకోవాలి.
* పొట్లకాయ గుజ్జును ముఖానికి రాసుకోవడంవల్ల మొటిమలు, ముడతలు, వైట్‌హెడ్స్, బ్లాక్‌హెడ్స్ రాకుండా ఉంటాయి.

Tuesday, December 14, 2010

స్టెప్ వేయండి ...... స్లిమ్ అవ్వండి ....... * ' బాలీఫిట్ '.

సన్నబడాలంటే ఏం చేయాలని ఎవరినడిగినా బోలెడు సలహాలు ఇస్తారు. జిమ్ కెళ్లమని ఒకరు చెబితే తిండి తగ్గించమని ఒకరు చెబుతారు. అవన్నీ విని విని బోరు కొట్టేసి ఉన్నాయి అందరికీ. అందుకే అనూజ రాజేంద్ర కనిపెట్టిన కొత్త పద్ధతికి చాలా డిమాండ్ ఉంది. ఆ పద్ధతి పేరు 'బాలీఫిట్'. 'ఫిట్‌నెస్ త్రూ డ్యాన్స్'అనే నినాదంతో అనూజ ఈ వినూత్న పద్ధతిని అందరికీ పరిచయం చేశారు. బరువు తగ్గాలనుకునే వారితో ఆమె నాట్యం చేయిస్తుందన్నమాట. అమెరికాలో స్థిరపడ్డ ఈ ఆలోచన అనూజకి మూడేళ్ల కిత్రం వచ్చింది.

భరతనాట్యం, భాంగ్రా నృత్యాలు వచ్చిన అనూజ ఇప్పటికే చాలా దేశాల్లో నృత్య ప్రదర్శనలు ఇచ్చింది. కాని పెళ్లయి పిల్లలు పుట్టాక బాగా ఒళ్లు చేసింది. తను స్లిమ్‌గా అవ్వాలంటే మళ్లీ నాట్యం చేయాల్సిందేననుకుంది. ఒక్క ఏడాదిలోనే ఇరవైకిలోల బరువు తగ్గింది. ఈ విషయాన్ని గమనించిన చుట్టుపక్కలవారు తమకు కూడా నాట్యం నేర్పమని అడిగారు. అంతే 'నాట్యంతో బరువు తగ్గడమెలా' అని కొద్ది రోజులు స్టడీ చేసింది అనూజ. 2007లో అమెరికాలోని మిచిగాన్ పక్కనున్న ఆన్ ఆర్బర్‌లో తొలి శిక్షణా కేంద్రం ప్రారంభించింది. ఇందులో భారతీయుల కంటే ఎక్కువగా అమెరికన్లే చేరారు. మూడేళ్లు తిరిగేసరికి తీరిక లేనంత బిజీ అయిపోయింది అనూజ.

ఎలాంటి నాట్యం చేస్తారు...
భరతనాట్యం, భాంగ్రా, బాలీవుడ్ స్టెప్పులకు ఏరోబిక్స్ టిప్స్ కలిపితే బాలీఫిట్ అవుతుంది. ఒక నిమిషానికి 100 నుంచి 150 బీట్స్ ఉండి హోరెత్తింటే పాటల్ని ఎంపిక చేస్తారు. ఇందులో ఎక్కువగా రీమిక్సే ఉంటాయి. సరదాగా సాగే ఈ నాట్యంలో రకరకాల భంగిమలు ఉంటాయి. మూడు రకాల వ్యాయామాలు ఉండేలా దాన్ని తయారుచేశారు. బాలీఫిట్ కార్డియో, బాలీఫిట్ రిథమ్, బాలీఫిట్ టాట్స్. వీటికి కావాల్సిన స్టెప్పుల్ని ముందుగానే శిక్షకులు నేర్పిస్తారు. మ్యూజిక్‌లో వచ్చే బాణీలకు తగ్గట్టుగా డ్యాన్స్ చేస్తే సరిపోతుంది.

రోజూ ఉదయం పూట ఓ గంటసేపు ఈ బాలీఫిట్ చేస్తే ఒంట్లో కొవ్వుని ఇట్టే కరిగించేయొచ్చంటున్నారు అనూజ. విదేశాల్లో విజయవంతమైన తన ప్రయోగాన్ని ఆమె ఆ తర్వాత స్వదేశంలోనూ ప్రవేశపెట్టింది. ముంబై నగరంలో తను ఏర్పాటు చేసిన బాలీఫిట్ శిక్షణ కేంద్రాలకు కూడా యువత నుంచి మంచి స్పందనే వచ్చింది. బాలీఫిట్‌కి వెళుతున్న పెద్దవయసు వారు ఏమంటారంటే 'బాలీఫిట్ వల్ల ఒళ్లు తగ్గడమే కాదు మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది' అని.

ఎప్పటికైనా గొప్ప నటిని అవ్వాలనుకున్న అనూజ ఇప్పుడు బాలీఫిట్ సెలబ్రెటీగా ఎదిగిపోయింది. అమెరికా, కెనడా, ఇండియాలో బోలెడు బాలీఫిట్ తరగతులు నిర్వహించి అందరి మనసుల్ని గెలిచింది.' స్లిమ్‌గా అవ్వడం ఎలా' అని బెంగపడుతున్నవారి పాలిట దేవతగా మారిపోయింది. మనమందరం అనూజ దగ్గరికి వెళ్లలేం కాబట్టి ఇంట్లోనే ఒక మ్యూజిక్‌ప్లేయర్ ఆన్ చేసి రోజూ ఉదయం ఓ గంట డ్యాన్స్ ప్రాక్టీసు చేసి చూద్దాం.

'జిమ్ జిమ్మం' టోంది యువత


సమయం
ఉదయం ఐదున్నర నుంచి ఎనిమిది గంటల మధ్య
నగరాల్లో ఎక్కడ చూసినా ఎవరో ఒకరు 'వాకింగ్' లేదా 'జాగింగ్' చేస్తూ కనిపిస్తారు. కొందరు 'వ్యాయామాలు', మరికొందరు 'యోగాసనాలు' వేస్తూ కనిపిస్తుంటారు. కొందరు 'జిమ్' నుంచి, మరి కొంతమంది 'ఏరోబిక్స్' సెంటర్ల నుంచి బయటకొస్తూ కనిపిస్తుంటారు. ఇంకా జాగ్రత్తగా చూస్తే బయటకొచ్చే టైమ్ లేక బాల్కనీలోనో వరండాలో ఏదో ఒక వ్యాయామ భంగిమలో కనిపిస్తుంటారు.

సమయం
సాయంత్రం నాలుగున్నర గంటల తరవాత- సేమ్ సీన్ రిపీట్.
ఏదో ఒక నగరంలో కాదు దేశంలోని అన్ని చోట్లా ఇదే పరిస్థితి. ఎవరికీ తప్పని 'ఫిట్‌నెస్ మంత్ర' ఇది. ఆడ, మగ, చిన్నా పెద్దా తేడా లేకుండా ఫిట్‌నెస్ కోసం కొందరు 'పరుగులు' పెడుతుంటే, కొందరు 'బరువులు' మోస్తున్నారు. కొంతమంది 'ఆడు'తుంటే, కొంతమంది 'ధ్యానం'లో మునిగిపోతున్నారు. ఒక దశాబ్దం క్రితం మన ఫిట్‌నెస్ పరిశ్రమ పరిధి చాలా తక్కువ. ఫిట్‌నెస్ పట్ల మన వాళ్ల ఆలోచనా విధానం 'మోజు' నుంచి 'అవగాహన'కు చేరుకోవడమే ఈ రంగంలో సంభవించిన పెద్ద మార్పు అనుకోవచ్చు. ఆ మార్పే భారత ఫిట్‌నెస్ పరిశ్రమను విదేశీ కంపెనీలు సైతం కోట్ల పెట్టుబడులతో పరుగెత్తుకొచ్చే విస్తృత పరిశ్రమగా రూపొందించింది. ఆ 'పరిశ్రమ' గురించే ఈ వారం కవర్‌స్టోరీ.


మన దేశ యువత ఇప్పుడు ఫిట్‌నెస్ బాట పడుతోంది. ఆ బాటే అవకాశంగా విదేశీ ఫిట్‌నెస్ కంపెనీలు మన దేశంలో ప్రవేశిస్తున్నాయి. గత కొద్ది కాలంగా ఇండియాపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి. ఈ రెండేళ్లలో వెయ్యికి పైగా 'వ్యాయామ కేంద్రాలు' ఏర్పాటు చేశాయంటే వాటికి ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. మన దేశంలో ఫిట్‌నెస్ ఇండస్ట్రీ టర్నోవర్ ఏటా 40 శాతం పెరుగుతూ వస్తోంది. ఈ యేడాది అంచనా 2900 కోట్లకు పైమాటే! ఇక్కడ కనిపిస్తున్న ప్రధాన విదేశీ కంపెనీలు 'స్నాప్ ఫిట్‌నెస్ క్లబ్', 'గోల్డ్స్ జిమ్', 'ఫిట్‌నెస్ ఫస్ట్', '24 హవర్స్ ఫిట్‌నెస్', 'ఎనీటైమ్ ఫిట్‌నెస్', 'రీబాక్ ఫిట్‌నెస్ క్లబ్స్'. మొదటి మూడు టాప్‌టెన్ లిస్టులో ఉన్న కంపెనీలు. ఈ కంపెనీలకు 'ఫిట్‌నెస్ మ్యాగజైన్స్' కూడా మంచి రేటింగ్ ఇవ్వడంతో విస్తరణకు మరిన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. జీవనశైలిలో ఫిట్‌నెస్ కూడా ఒక భాగం అనే అవగాహన పెరుగుతుండడంతో జిమ్ సెంటర్‌లు నడుపుతున్న కంపెనీలు 'ఎనీటైమ్ జిమ్'లు, 'ఏసీ జిమ్'లంటూ కొత్త కొత్త పద్ధతులకు శ్రీకారం చుట్టాయి.

దేశవ్యాప్తంగా...

అమెరికాకు చెందిన 'స్నాప్ ఫిట్‌నెస్ క్లబ్' పదకొండు మిలియన్ డాలర్ల పెట్టుబడితో రెండేళ్ల క్రితం మనదేశంలో మొత్తం 250 వ్యాయామకేంద్రాలను ప్రారంభించాలనే ఆలోచనతో వచ్చింది. ఇప్పటికి యాభై ఐదు కేంద్రాలను ఏర్పాటు చేసుకుంది. దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబయి, హైద్రాబాద్, పూణె, నాగపూర్, జలంధర్, చంఢీగఢ్, అమృతసర్, లూధియానాలలో ఈ కంపెనీకి బ్రాంచీలు ఉన్నాయి. ఈ కంపెనీ చెప్పేమాట ఏమిటంటే... 'యూరప్, అమెరికా దేశాల కంటే ఇక్కడే వ్యాయామం పట్ల ఎక్కువ ఆసక్తి ప్రదర్శిస్తున్నారని, కనుక తాము తప్పకుండా వ్యాపారంలో విజయవంతం అవుతామని.'
అంతేకాదు వీళ్లు ప్రారంభించిన 'ఎనీటైమ్ ఫిట్‌నెస్ క్లబ్'లకు కూడా బాగానే ఆదరణ ఉంది. వివిధ షిఫ్టుల్లో పనిచేసే కార్పొరేట్ ఉద్యోగుల సౌకర్యార్థమే ఈ ఎనీ టైమ్ జిమ్‌లు. యు.ఎస్.కే చెందిన మరో ఫిట్‌నెస్ కంపెనీ 'గోల్డ్స్ జిమ్'. ఒక్క ముంబయిలోనే ఆ కంపెనీకి నలభై ఐదు వ్యాయామకేంద్రాలున్నాయి. 2002లో భారతదేశంలో ప్రవేశించి ప్రధాన నగరాలన్నింటిలోకి విస్తరించిన ఈ కంపెనీ రెండు నెలలకు ఒక జిమ్ చొప్పున బ్రాంచీలను పెంచుకుంటూ పోతోంది. వీటి తర్వాత స్నాప్ ఫిట్‌నెస్ కంపెనీ, 24 అవర్స్ ఫిట్‌నెస్ కంపెనీ ఇలా ఒక్కొక్కటీ మన దేశానికి వచ్చి నిలదొక్కుకున్నాయి.

ముంబయి, బెంగళూరులలో బ్రాంచీలను తెరిచిన మరో విదేశీ కంపెనీ 'ఫిట్‌నెస్ ఫస్ట్'. ఇది బ్రిటిష్ కంపెనీ. 'భారతదేశంలో అర్బన్ ప్రజల జీవన ప్రమాణస్థాయి పెరిగిందని, ఫిట్‌నెస్ కోసం కొంత మొత్తం వెచ్చించేందుకు వారు ముందుకొస్తున్నారని' అభిప్రాయ పడుతున్న ఈ కంపెనీ 2012 నాటికి దేశంలో 125 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు సమాయత్తం అవుతోంది. అప్పటి వరకు మరో 15 కేంద్రాలను తెరిచి మెంబర్‌షిప్‌ను ఇంకా పెంచుకునే యోచనలో ఉంది.

అత్యాధునిక సదుపాయాలు, అంతర్జాతీయ స్థాయి నిర్వహణతో ఇప్పటికే బాగా పాతుకుపోయిన ఈ జిమ్‌లలో నెలకు సగటున ఆరు వందల చొప్పున మెంబర్‌షిప్ పెరుగుతోంది. సంవత్సర సభ్యత్వం కోసం సగటున రూ. 14,000 వరకు చార్జ్ చేస్తున్నారు. నెలకయితే 1500 రూపాయల చొప్పున తీసుకుంటున్నారు. ఈ ఫిట్‌నెస్ సెంటర్లలో యోగా,ఏరోబిక్స్, ఇండోర్ సైక్లింగ్, పర్సనల్ ట్రెయినింగ్ (విదేశీ వ్యక్తిగత శిక్షకులతో), స్విమ్మింగ్‌పూల్స్, షవరింగ్ ఏరియాస్, డీవీడి లైబ్రరీ తదితర సదుపాయాలు ఉంటాయి.

దేశీయ కంపెనీ టాల్‌వాకర్


మన దేశం విషయానికొస్తే అతిపెద్ద జిమ్ నెట్‌వర్క్ ఉన్న సంస్థ 'టాల్‌వాకర్'. ఉదయపూర్, లూధియానా, నెరుల్(నవీ ముంబయి), హిమాయత్‌నగర్(హైద్రాబాద్), బెంగళూరు, హుబ్లీ, బెల్గాం, ఔరంగాబాద్ మొదలైన చోట్ల దీనికి వ్యాయామ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో వ్యక్తిగత శిక్షకుడు, డైటీషియన్, ఫిజియోథెరపిస్టు తప్పకుండా ఉంటారు. వారికి జీతాలు మొదలు మిషనరీ కొనుగోలు వరకు అన్నీ కలుపుకుని ఏడాదికి అన్ని సెంటర్ల నిర్వహణ వ్యయం సుమారు పదహారు కోట్ల రూపాయలు. అయినా 76 కేంద్రాల్లో సుమారు లక్ష మంది మెంబర్‌షిప్‌తో నడుస్తున్న ఈ కంపెనీకి వచ్చే లాభాలతో పోల్చితే ఆ 'ఖర్చు' చాలా తక్కువే.

ప్యాకేజీ ఆఫర్లు

విదేశీ ఫిట్‌నెస్ క్లబ్‌లు మన దేశంలో ప్రవేశించాక ఫిట్‌నెస్ రంగం స్థాయిలో చాలా మార్పులే వచ్చాయి. ఆకర్షణీయమైన ప్రకటనలు, అంతర్జాతీయ స్థాయి నిర్వహణను అన్ని కంపెనీలు అనుసరిస్తున్నాయి. ప్రత్యేక 'ప్యాకేజీలు', పండగలకు 'ఆఫర్లు' ఎక్కువయ్యాయి. దాంతో పాటు మెరుగైన మెషినరీ కోసం ఎంత సొమ్మయినా ఖర్చు చేసేలా స్థానిక కంపెనీలు తమ పద్ధతులను మార్చుకున్నాయి.
ఫిట్‌నెస్ ఇండస్ట్రీలో వచ్చిన మార్పుల్లో ప్రధానంగా చెప్పుకోవలసింది మెషినరీ మార్కెట్ గురించి. భారత్‌లో ఉన్న విదేశీ కంపెనీల ఎక్విప్‌మెంట్ అంతా దిగుమతి చేసుకున్నది కావడం వల్ల మన వాళ్లు కూడా అటుగా దృష్టి సారించారు. పేరున్న ఏ జిమ్‌ను చూసినా అంతా విదేశీ టెక్నాలజీయే. ఇండియా వస్తువుల మీద నమ్మకం లేక కాదుగాని విదేశీ మెషినరీ మీద మోజు పెరుగుతుండడం వల్లే అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా దేశాల నుంచి మెషనరీ దిగుమతి పెరిగిపోతోంది. సెలబ్రిటీ జిమ్‌లు, హోమ్ జిమ్‌లు కూడా ఈ మధ్య కాలంలో బాగా పెరిగిపోతున్నాయి. దాంతో మెషినరీ కొనుగోలు విశేష స్థాయిలో ఉంది. మన దేశంలో ఫిట్‌నెస్ మెషినరీ మార్కెట్ విలువ ఎంతో తెలుసా? 12.5 బిలియన్ రూపాయలు. అది రెండేళ్ల కిందటి మాట. మార్కెట్ విశ్లేషకుల ప్రకారం మరో రెండేళ్లలో అది ఐదింతలు పెరగనుంది.

పర్సనల్ ట్రెయినర్ ఉంటే బెటర్

అదే క్రమంలో వ్యక్తిగత శిక్షకులను నియమించుకునే పద్ధతి కూడా పెరిగింది. మూడునాలుగేళ్ల క్రితం కంటే ఇప్పుడు టీనేజ్ మొదలు యువత, సీనియర్ సిటిజన్స్ వరకు అందరూ వ్యక్తిగత శిక్షకులను ఆశ్రయించడం పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. ఢిల్లీ, ముంబయి, కలకత్తా, బెంగళూరులలో జిమ్‌కు వెళ్లేవారిలో దాదాపు సగం మంది వ్యక్తిగత శిక్షకులను నియమించుకుంటున్నారు. వారికి ఒక్కో సెషన్‌కు 250-500 వరకు ఫీజు చెల్లించాల్సి ఉన్నా వెనకాడడం లేదు. అంటే నెలకు ఐదు నుంచి ఇరవై వేల రూపాయలు. మంచి శరీరాకృతి కోసం యువత, అధిక బరువు వంటి సమస్యలతో మధ్యవయస్కులు, అనారోగ్య నివారణ కోసం రిటైరయిన ఉద్యోగులు... ఇలా ఎవరి కోణం వారిదే అయినా అందరి కామన్ ఎజెండా మాత్రం ఫిట్‌నెస్సే. షారూక్‌ఖాన్, అమీర్‌ఖాన్, ఐశ్వర్యారాయ్, కరీనాకపూర్ వంటి సెలిబ్రిటీలకు వ్యక్తిగత శిక్షకులుగా పనిచేసే వారికి ఒక్కో సెషనుకు పది వేల రూపాయలు చెల్లిస్తారని చెప్పుకుంటారు.

సర్టిఫికేట్ కోర్సులు

విదేశీ కంపెనీల రాక తర్వాత ఈ కేంద్రాల నిర్వహణ, ఫీజులు ఓ రేంజ్‌కు వెళ్లిపోయాయి. అయితే ఫిట్‌నెస్ ఇండస్ట్రీలో ఉపాధిని పెంచేందుకు ఇవి దోహదపడుతున్నాయి. ఇప్పుడు పెద్ద పెద్ద వ్యాయామ కేంద్రాలు వ్యక్తిగత శిక్షకులతో పాటు థెరపిస్టులు, డైటీషియన్‌లు ఇలా అనేకమందిని నియమించుకుంటున్నాయి. గోల్డ్స్ జిమ్ ఏకంగా 'జి.జి.యు.' (గోల్డ్స్ జిమ్ యూనివర్శిటీ) అని ఒక విశ్యవిద్యాలయాన్నే నడుపుతోంది. అందులో ఫిట్‌నెస్ రంగానికి సంబంధించిన ఏ సర్టిఫికెట్ కోర్సు చేసినా వారికి ఉపాధి ఖాయం. అది ఎంతోమందికి ఉద్యోగావకాశంగా కనిపిస్తోంది. గోల్డ్స్ జిమ్మే కాదు ఇప్పుడు దేశంలో పేరు పొందిన ఫిట్‌నెస్ కంపెనీలన్నీ 'ఫిట్‌నెస్ ఎడ్యుకేషన్ ఇన్సిట్యూట్'లుగా కూడా వ్యవహరిస్తున్నాయి.

మహిళలను లక్ష్యంగా చేసుకుని రీబాక్ కంపెనీ కూడా ఒక సర్టిఫికేట్ కోర్సును నేర్పిస్తోంది. 'నైక్ ఏరోబిక్స్' పేరుతో నడిచే ఆ కోర్సులో ఈ మధ్యే విద్యార్థుల సంఖ్య పెరగుతోందట. ఈ ఎడ్యుకేషన్ బ్రాంచ్‌లను కూడా మరిన్ని కేంద్రాలకు విస్తరించే యోచనలో ఉంది రీబాక్. చాలా నగరాల్లో ఇప్పటికీ (ఏరోబిక్స్ మినహా) మహిళా శిక్షకులు కొన్ని జిమ్ సెంటర్లలో మాత్రమే ఉన్నారు. గోల్డ్స్ జిమ్ కంపెనీకి కూడా ఇండియాలో ఇరవై మంది మాత్రమే మహిళా శిక్షకులు ఉన్నారట.

అన్ని కంపెనీల చూపూ ఈ రంగం మీదే

ఫిట్‌నెస్ ఇండస్ట్రీలో వ్యాపారావకాశాలు పెరుగుతుండడం గమనించి ఇతర రంగాలకు చెందిన కంపెనీలు కూడా ఈ రంగంలోకి ప్రవేశిస్తున్నాయి. అందుకు ఉదాహరణ ఈ మధ్యే ఎంట్రీ ఇచ్చిన 'ఎనీటైమ్ ఫిట్‌నెస్ క్లబ్'. సుమారు పదిహేను మిలియన్ డాలర్ల పెట్టుబడితో మన దేశంలో అడుగు పెట్టిందీ కంపెనీ. కంప్యూటర్లు తయారు చేసే టీజీఎస్ కంపెనీయే ఈ పేరుతో ఫిట్‌నెస్ రంగంలోకి ప్రవేశించింది. రీబాక్ కూడా అంతే! ప్రధానంగా క్రీడావస్తువులను తయారు చేసే కంపెనీ అది. ఏరోబిక్, జిమ్ సెంటర్లను నిర్వహిస్తుండమే కాకుండా ఇటీవల మెషినరీ తయారీని కూడా మొదలు పెట్టింది అది. రీబాక్ కంపెనీ చెప్తున్న లెక్కల ప్రకారం వాళ్లకు డెబ్బయి శాతం ఆదాయం ఫిట్‌నెస్ సెంటర్ల వల్లే వస్తోందట మిషనరీ అమ్మకాలు కలుపుకుని.

వీడియో ఫిట్‌నెస్

ఈ రంగంలో మరో కొత్త ట్రెండ్ డీవీడీ వర్క్ అవుట్స్. బిజీగా ఉండేవాళ్లకి, లేజీగా ఉండేవాళ్లకి ఫిట్‌నెస్ డీవీడీలు ఎంతగానో ఉపకరిస్తాయని ప్రకటనులు వెల్లువెత్తుతున్నాయి. రెండేళ్ల క్రితమే శిల్పాశెట్టి విడుదల చేసిన యోగా వీడియోలు సంచలనం సృష్టించాయి. ఆ తరవాత బిపాషా బసు, కరీనాకపూర్, షెర్లిన్‌చోప్రా, లారాదత్తాలు ఆ జాబితాలో చేరారు. వీళ్లందరి వర్క్ అవుట్ డీవీడీలు హాట్‌కేకుల్లా అమ్ముడయ్యాయి. కథానాయికలే కాదు హీరోలూ ఇదే దారిలో ఉన్నారు. జాన్ అబ్రహాం ఇప్పటికే ఒక 'వర్క్ అవుట్' చేయగా, హృతిక్‌రోషన్, సల్మాన్‌ఖాన్‌ల డీవీడీలు త్వరలోనే విడుదల కానున్నాయి. కత్రినా, ప్రియాంక చోప్రాలు కూడా అదే పనిలో ఉన్నారు. అందుకోసం ఈ స్టార్లంతా కోట్లలో పారితోషికం పుచ్చుకున్నట్టు బాలీవుడ్‌లో ప్రచారం జరగుతోంది. బాలీవుడ్ వర్క్ అవుట్స్‌కు ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతో క్రేజ్ ఉంది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న 'బాలీవుడ్', 'బాంబే డ్రీమ్స్', 'మసాలా బాంగ్రా', 'బాలీవుడ్ గ్రూవ్స్', 'ఇండియన్ డాన్స్ ఏరోబిక్స్', 'ఇండియన్ ఫోక్ డాన్స్' డీవీడీలు అమెరికా, యూరోప్ దేశాలలో నీరాజనాలు అందుకుంటున్నాయి.

యోగా...కాస్త వెరైటీగా

కొంచెం వెరైటీ కోరుకునే వారు మనసును, మెదడును అదుపులో ఉంచే యోగా, ధ్యానం వంటి ఆధ్యాత్మిక వ్యాయామానికి కూడా ఆకర్షితులవుతున్నారు. ఇప్పటికే సైఫ్ అలీఖాన్, అక్షయ్‌కుమార్, శిల్పాశెట్టి, దీపికా పదుకొనె, నేహా ధూపియా వంటి చాలామంది సెలబ్రిటీలు జిమ్ మానేసి యోగాసనాల వెంటపడ్డారు. ఆధునిక మానవుడు గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ మానసిక ఒత్తిడితో ఉంటున్నాడు కాబట్టి 'హౌ వుయ్ ఫీల్, నాట్ హౌ వుయ్ లుక్' అనేది కొత్త నినాదంగా మారుతోంది. ఆఫీసుల్లో, ఇళ్లల్లో పనులు చేసి శారీరకంగా అలిసిపోతున్న వాళ్లకి మళ్లీ జిమ్‌లో మిషనరీ వ్యాయామం చేస్తే అలసటే తప్ప శరీరానికి విశ్రాంతి ఎక్కడ దొరుకుతుందనేది కొంతమంది యోగా గురువుల ప్రశ్న. యోగా, ధ్యానం వంటి ఆధ్యాత్మిక వ్యాయామాల ద్వారా శరీరానికి కావల్సిన ఫిట్‌నెస్‌తో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుందని చెప్తున్నారు వాళ్లు. అయితే ఏ పరికరాలు అవసరం లేని యోగాను కూడా ఎవరూ చవకగా నేర్పించడానికి సిద్ధంగా లేరు. యోగా ఇష్టపడే వాళ్ల కోసం చాలా కంపెనీలు యోగా గురువులను అధిక మొత్తం చెల్లించి తమ ఫిట్‌నెస్ క్లబ్బులలో నియమించుకుంటున్నాయి. ఆకర్షణీయమైన జీతాలు ఊరిస్తుండడంతో ఎంతోమంది యోగా గురువులు కమర్షియల్ కెరీర్‌కు పునాదులు వేసుకుంటున్నారు.

అన్నీ ఫిట్‌నెస్ లోకే!

సగటు మనిషి 'బాడీ బిల్డర్'గా కండలు చూసుకుని మురిసిపోయే స్థాయి ఎప్పుడో దాటిపోయింది. సినిమాల ప్రభావంతోనే జిమ్ యావ మొదలైనప్పటికీ అది ఆరోగ్యానికి ఎంత అవసరమో అందరూ గుర్తించారు. ఈ యేడాది వ్యాయామ కేంద్రాలను ఆశ్రయిస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగిందని ఫిట్‌నెస్ సెంటర్లు నిర్వహిస్తున్న వివిధ కంపెనీలు ప్రకటించాయి. ప్రజల్లో వస్తున్న అవగాహనకు అనుగుణంగా వారిలో ఇంకా ఆసక్తిని పెంచి లాభాలు గడించేందుకు వ్యాయామాల్లో కూడా కొత్త కొత్త పద్ధతులు సృష్టిస్తున్నాయి పలు కంపెనీలు. అందుకోసం డాన్సులు, ఏరోబిక్స్‌లే కాకుండా 'స్పా' యోగాలను కూడా హెల్త్ అండ్ ఫిట్‌నెస్‌లో కలిపేశారు. అందుకే యోగా గురువులకు, కొరియోగ్రాఫర్లకు ఫిట్‌నెస్ సెంటర్లు నడిపే కంపెనీల నుంచి మంచి ఆఫర్లు వస్తున్నాయి.
ఫిట్‌నెస్ కోసం చేసే వ్యాయామం అయినా సరదాగా, ఆడుతూ పాడుతూ చేసేలా ఉండాలనేదే ఇప్పుడున్న కొత్త నియమం. అందులో భాగంగానే జాజ్, సల్సా, రుంబా...ఇలా కొన్ని ప్రత్యేక డాన్సులు కూడా ఫిట్‌నెస్‌లో కలిసిపోయాయి. అందుకే వయసుతో నిమిత్తం లేకుండా డాన్సు నేర్చుకుంటున్న వారితో శిక్షణా సంస్థలు నిండిపోతున్నాయి.

ఒళ్లు జిమ్మనాల్సిందే

భారతీయులు ఇప్పుడు 'సిక్స్‌ప్యాక్', 'ఎయిట్ ప్యాక్'లకు షేకవడం లేదు కాని 'ఫ్యామిలీ ప్యాక్' నుంచి దూరంగా ఉంటూ ఫిట్‌గా ఉండేందుకు మాత్రం ఆరాటపడుతున్నారు. ఒబేసిటీ, డయాబెటిస్ వంటి ఆరోగ్య సమస్యలు ఎక్కువైపోతుండడమే అందుకు ప్రధాన కారణం. గతంలో 'ఫిట్‌నెస్' అంటే మరోమాట లేదు జిమ్‌కు పరుగెత్తడం తప్ప. కాని ఇప్పుడు అలా కాదు ఆటలు, డాన్సులు, ఏరోబిక్స్, యోగా కూడా ఫిట్‌నెస్‌ను అందించే ప్రత్యామ్నాయాలుగా మారిపోయాయి. అందుకే నగరాల్లో ఎన్ని జిమ్ సెంటర్లు ఉన్నాయో, అన్ని డాన్సు సెంటర్లు, ఎన్ని ఏరోబిక్స్ సెంటర్లు ఉన్నాయో అన్ని యోగా కేంద్రాలూ దర్శనమిస్తాయి. నగర జీవితంలో ఐదు నిమిషాలు కూడా గట్టిగా నడవలేని పరిస్థితే ఉంది. ఆఫీసుల్లో కూర్చున్నచోటు నుంచి కదలకుండానే పనులు చేయాల్సి రావడం... రాకపోకలకు వాహనాలు ఉపయోగించక తప్పని స్థితి ఉండడంతో ఇంక శరీరాన్ని అన్ని రకాలుగా 'అదుపు'లో ఉంచుకోవాలంటే ఫిట్‌నెస్ కేంద్రాల్ని ఆశ్రయించక తప్పడం లేదు. సహజంగా ఒళ్లొంచే పరిస్థితులు వచ్చేదాకా ఈ ట్రెండ్ కొనసాగక తప్పదు.

హైద్రాబాద్ సంగతేంటి?

హైద్రాబాద్‌లో ఫిట్‌నెస్‌పై అవగాహన పెరుగుతున్నకొద్దీ వ్యాయామకేంద్రాల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతోంది. అందరికీ తెలిసిన గోల్డ్స్ జిమ్, లాటిట్యూడ్స్ ప్రో, ఫిట్‌బజ్, టాల్‌వాకర్, బాడీ అండ్ సోల్, స్నాప్ ఫిట్, దినాజ్ ఫిట్‌నెస్ స్టూడియో వంటివే కాకుండా కొత్తగా పాపులర్ అవుతున్న ఫిట్‌నెస్ వన్, బండాస్ బాడీఫ్లెక్స్ జిమ్, స్లిమ్‌జోన్, ఫిట్‌నెస్ వరల్డ్ జిమ్, పవర్‌పాయింట్ జిమ్... ఇలా లెక్కలేనన్ని వ్యాయామ కేంద్రాలు పట్టుకొస్తున్నాయి. చిన్నా చితకా జిమ్‌లు కలిపి వెయ్యికి పైగా ఉన్నాయి. కొందరిది బిజినెస్ అయితే కొందరికి అది ఉపాధి.
* కార్పొరేట్ జిమ్‌లలో నెల రోజుల మెంబర్‌షిప్ రూ. 5000, ఆరు నెలలకు 12000, సంవత్సరానికి 18000 వరకు ఉంది. అదే స్థానికంగా కొంచెం పేరున్న వాటిలో అయితే నెలకు 1200 రూపాయలు ఉండగా, చిన్న వాటిలో 125-400 మధ్య ఉంది.
* అయితే ఎనభై శాతం మంది రెండు నెలలకు మించి మెంబర్‌షిప్ కొనసాగించడం లేదు. అంటే మధ్యలో మానేసే వాళ్లే ఎక్కువ.
* కార్పొరేట్ ఉద్యోగుల సంఖ్య బాగానే ఉన్నా డ్రాపవుట్స్‌లో కూడా వాళ్లే ఎక్కువ.
* పెద్దవాళ్లు యోగా, జాగింగ్, వాకింగ్‌లతోనే సరిపెట్టుకుంటున్నారు.
* పూర్తిస్థాయి బాడీబిల్డర్‌గా పోటీల్లో పాల్గొనాలంటే కనీసం లక్ష రూపాయలు ఖర్చు పెట్టాల్సిందే. ఆసక్తి కలవారు అందుకూ వెనకాడడం లేదు.
* 'మిస్టర్ వరల్డ్' పోటీల్లో పాల్గొనాలనే ఆశతో, అది సాధ్యం కాకపోతే వ్యక్తిగత శిక్షకులుగానైనా ఉపాధి పొందవచ్చనే నమ్మకంతో నగర యువత ఫిట్‌నెస్ కెరీర్‌పై ఇప్పుడిప్పుడే దృష్టి పెడుతున్నారు.
ఇది నాణేనికి ఒకవైపు, మరోవైపు ఫిట్‌నెస్‌పై అత్యాశతో అనర్థాలు కొనితెచ్చుకుంటున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. సినిమా హీరోలనో, మరొకరినో చూసి త్వరగా కండలు పెంచాలనే అత్యాశతో 'డ్రగ్స్' తీసుకుని అనారోగ్యం పాలవుతున్నారు కొందరు. 'నిజం చెప్పాలంటే హైద్రాబాద్‌లో ఆరోగ్యం కోసమే జిమ్‌కు వచ్చే యువకుల సంఖ్య చాలా తక్కువ. ఐదారు నెలల్లోనే బాడీ బిల్డర్‌గా కనిపించాలని, సిక్స్ ప్యాక్ తెచ్చుకోవాలనే కోరికతో ఎక్కువ మంది వస్తుంటారు. విచ్చలవిడిగా ప్రచారంలో ఉన్న ఫిట్‌నెస్ డ్రగ్స్‌కు అలవాటు పడుతున్నారు. దానివల్ల భవిష్యత్‌లో కలిగే అనర్థాలేమిటో జిమ్ నిర్వాహకులు చెప్పడం లేదు. ఇక్కడ సగానికి పైగా జిమ్‌లు డ్రగ్స్‌ను ప్రోత్సహిస్తున్నాయి. ఎందుకంటే వాటికి వచ్చే ఆదాయంలో డెబ్బయి శాతం డ్రగ్స్ ద్వారానే' అని ఎనిమిది సంవత్సరాల నుంచి 'పవర్‌పాయింట్ జిమ్' నడుపుతున్న అచ్చగొని సతీష్ గౌడ్ అన్నారు.

* బి. మహేందర్

Tuesday, December 7, 2010

కండర పుష్టికి కావాలా తైలాలు?

సౌష్టవమైన ఆకృతిని, దృఢత్వాన్నీ కలిగించేవి కండరాలే. చర్మం లోపల సన్నని దారాల్లా ఉండడంతో మొదలు, శరీరంలోని అన్ని అవయవాల నిర్మాణం దాకా కండరాలే కీలక పాత్ర వహిస్తాయి. సిక్స్ ప్యాక్, ఎయిట్‌ప్యాక్ బాడీ బిల్డింగ్‌లోనూ ముఖ్య భూమిక కండరాలదే.కండరాలు బలహీనపడిన వ్యక్తి బక్కచిక్కిపోతాడు. చర్మం సైతం తన ప్రభను కోల్పోయి ముడుతలు పడుతుంది. పైగా ఏపనీ చేయలేని అశక్తత, నిరుత్సాహం వెంటాడతాయి. ఇదంతా సరైన పోషకాహారం తీసుకోకపోవడం వల్ల కావచ్చు.

లేదా రక్తహీనత, క్షయ, గ్రహణి (ఐబిఎస్), తరుచూ వచ్చే జ్వరాలు, దీర్ఘకాలిక వ్యాధుల వల్లనూ కావచ్చు. గర్భిణిగా ఉన్నప్పుడు ఏర్పడిన పోషకలోపాల కారణంగా పుట్టిన బలహీన శిశువు మొదలు, «వృద్ధుల దాకా అందరూ కండరాల సమస్యను ఎదుర్కొనే వారే. ఇలాంటి వారికి కొన్ని ప్రత్యేక తైలాలతో మర్ధన చికిత్స చేస్తే ఆరోగ్యంతో పాటు కండర పుష్టీ పెరుగుతుంది. రక్తప్రసరణా వ్యవస్థ బలపడి చర్మంతోపాటు శరీర అవయవాలన్నీ తమతమ కార్యకలాపాలను సవ్యంగా జరుపుకోగల్గుతాయి. ఫలితంగా ఆరోగ్యమూ కుదుటపడుతుంది.

చందన బలా లాక్షాది తైలం :
చందనం, బలామూలం, లాక్ష్యానిర్యాసం, ఉశీర అనే నాలుగు వనౌషదుల కషాయం కాచిపెట్టుకుని దీనికి తగినన్ని పాలు కూడా కలుపుతారు. ఈ మొత్తానికి నాలుగో వంతు నువ్వుల నూనె చేరుస్తారు. నూనెలో నాలుగోవంతు చందన చెక్క, వట్టివేర్లు, సోంపు, దేవదారు చెక్క, పసుపు, కోష్టు, మంజిష్టా, అగరు, సుగంధిపాల, అశ్వగంధ, బలామూలాలు, కస్తూరి పసుపు, మూర్వా, తుంగ ముస్తలు, ముల్లంగి, ఏలకులు, దాల్చిన, నాగకేసరాలు, రాస్నా, లాక్షా, అజమోద, చంపక, చోరపుష్టి మొదలగు వాటి చూర్ణాలను ముద్దగా చేసి పైన తెలిపిన కషాయం, పాలు, నూనెలు ఉన్న పాత్రలోకి చే ర్చి 'తైలపాక విధి' లో ఆయుర్వేద ఫార్మసిస్టులు తయారు చేస్తారు.

ఉపయోగాలు
|* స్త్రీలలో రక్తస్రావ లక్షణాలు ఉండే గర్భకోశ వ్యాధులు (మెనొరేజియా, మెట్రోరేజియా), రక్తస్కందన లోపాలు ఉండే హీమోఫిలియా, మెటికియల్ హెమరేజ్ వంటి సమస్యలకు ఈ తైలంతో మర్ధన చికిత్స చేయడం వల్ల ఉపశమనం లభిస్తుంది.

* దగ్గు, దమ్ము, క్షయ వంటి ఊపిరితిత్తుల వ్యాధులు ఉన్నవారికి ఛాతిపనైన, ముందూ వెనుక మర్ధన చేస్తే ఛాతీలో కండరరపట్లు పోయి కసమస్యలు తేలిగ్గా ఉపశ మిస్తూ ఔషధ చికిత్సలో సహకరిస్తాయి.

* ఒంటిపైన పొడిదురదలు లేదా మంటలు ఉన్నప్పుడు ఈ తైలంతో మర్ధన చేస్తే తక్షణమే ఉపవమనం లభిస్తుంది. * రక్తంలో హీమోగ్లోబిన్ తక్కువగా ఉన్నప్పుడు వచ్చే వాపులు గానీ, రక్తకణాల క్షీణతతో వచ్చే కామెర్ల జబ్బు ( హీమోలైటిక్ జాండిస్)లో గానీ, ఈ తైౖలాన్ని వాడుకోవచ్చు.

* తలపోటు, కళ్ల మంటలు ఉన్నప్పుడు తలకు మర్ధించుకోవచ్చు. * కాళ్లు, చేతులు పట్టేస్తున్నప్పుడు ( క్రాంప్స్) ఈ తైలంతో మర్ధనచేస్తే ఉపశమనమే కాకుండా సమస్యలు శాశ్వతంగా తగ్గిపోతాయి.
* తరుచూ వచ్చే కొన్ని దీర్ఘకాలిక జ్వరాలకు ఈ తైలంతో అభ్యంగనం చేస్తే శరీరం శక్తిని పుంజుకోవడంతో పాటు జ్వర సమస్యలు కూడా పూర్తిగా పోతాయి.
ఈ ప్రొటీన్, క్యాల్షియం లోపాలతో చిన్న పిల్లల్లో వచ్చే ' ఫక్కా'( రికెట్స్, మరాస్మస్, క్యాషియోర్కర్) వంటి వ్యాధులు, పుట్టుకతోనే వచ్చే మెదడు ఎదగకకుండా పోయే సెరిబ్రల్ పాల్సీ, మెంటల్ రిటార్డేషన్, మజిల్ డిస్ట్రోఫీ వ్యాధకులకు కూడా ఈ ఈ తైలంతో అభ్యంగనం చేస్తే ప్రయోజనం ఉంటుంది.
మహా మాష తైలం
అశ్వగంధ, శ ఠీ, దేవదారు, బలా, రాస్నా, ప్రసారణీ, కుష్ఠం, భారంగీ, విదారీకంద, పునర్నవా, శతావరీ, జీరక, హింగు, శతపుష్పీ, గోక్షురా, పిప్పలీ మూల, చిత్రక, సైందవ లవణం, జీవనీయ గణం వంటి వనౌషధుల చూర్ణకల్కం ఒక భాగం తీసుకుని దానికి నాలుగు రె ట్లు నూనె, నూనెకు నాలుగు రెట్లు మినుముల ( మాష) కషాయం, పాలు కలుపుతారు. ఆ తరువాత అన్నిటినీ ఒక పాత్రలో చేర్చి 'తైలపాక విధి' లో నువ్వుల నూనె మిగిలేట్లు కాచి తయారు చేస్తారు. ఆయుర్వేద ఫార్మసిస్టులు కొందరు కల్క భాగంలో కొంత మేక మాంసాన్ని కూడా కలుపుతారు.

ఉపయోగాలు
ఈ దీర్ఘకాలిక పక్షవాతాలు లేదా నరాల సంబంధ వ్యాదుల్లో కండరాలు, స్నాయువులు (లిగమెంట్లు ) బలహీనపడుతూ ఉంటాయి. వీరికి మహా మాష తైలంతో మర్ధన చేస్తే కండరాలు, స్నాయువులు తిరిగి పుష్టిగా తయారవుతాయి.
* మాటిమాటికీ మూర్ఛలు వచ్చే వారికి, దవడలు పట్టేసే వారికి ఈ తైల మర్ధన ఎంతో మేలు చేస్తుంది.
* అపబాహుక, విశ్వాచీ, ఖంజ, పంగుతా, అర్థితం వంటి నరాల జబ్బుల్లో కండరాలు ఎండిపోతుంటాయి. ఆ స్థితి రాకముందే ఈ తైలంతో మర్ధన చే స్తూ ఉంటే కుంటి, గూని, మూతివంకర, చేతివాతం వంటి సమస్యలు తొలగిపోతాయి.
* పురుషుల్లో ధాతుక్షయం, ప్రత్యేకించి శుక్రక్షయం కారణంగా సంతానం కలగనప్పుడు మహా మాష తైలంతో మర్ధన చేసుకోవడతో పాటు కడుపులోకి కూడా తీసుకుంటే ఫలితం ఉంటుంది.
సూచనలు:
పైన పేర్కొన్న వ్యాధులకు తైల మర్ధన ంతో మంచి ఫలితాలే ఉంటాయి. అయితే ఆయుర్వేద వైద్యుల పర్యవేక్షణ లో కడుపులోకి కొన్ని మందులు కూడా తీసుకున్నప్పుడు ఆ ఫలితాలు రెట్టింపుగా ఉంటాయి. ఇక ఈ వ్యాధులకు అల్లోపతి వైద్య చికి త్సలు తీసుకునే వారు కూడా మర్ధన కోసం మహామాష తైలాన్ని నిస్సంకోంచంగా వాడుకోవచ్చు.

డాక్టర్ చిలువేరు రవీందర్
అసిస్టెంట్ ప్రొఫెసర్,
డాక్టర్ బిఆర్‌కెఆర్ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల, హైదరాబాద్,
ఫోన్: 9848750720.

Wednesday, November 10, 2010

అలసిన మనసుకు పునరుజ్జీవం ధారా చికిత్స

dhara
ఆధునిక ప్రపంచంలో పెరుగుతున్న జీవన వేగం మనిషి పై ఒత్తిడి పెం చుతోంది. ఉన్న దానిలో సంతృప్తి లేక లేని దాని కోసం ఆరాటపడటం అశాంతికి లోను చేస్తోంది. వేగంగా మారుతున్న జీవన వేగాన్ని, సాంకేతిక, పారిశ్రామిక అభివృద్ధిని మానవుడు అందుకోలేకపోతున్నాడు. దీనితో ఒంటరితనం, తనను ఎవరూ పట్టించుకోవడం లేదన్న భావన, ఆగ్రహం, ఒత్తిడి, ఆందోళనకు లోనవుతున్నాడు.

మనఃశరీరాలు ఎంత అవిభాజ్యమో, పరస్పర ఆధారితమో ఆయుర్వేదం సరి గా కనుగొన్నది. ఉద్వేగాలలో అసమతుల్యత, ఉద్రిక్తత, సంపూర్ణాహారం తీసుకోకపోవడం అనేవి మానసిక సమస్యలకు దారి తీస్తాయి. త్రిదోషాలలో ఒకటైన వాయు మనసును నియంత్రించి, ప్రోత్సహిస్తుంది. ఉద్వేగభరితమైన వాయు దోషం మనస్సును అతలాకుతలం చేయడం వల్ల భయం, దుఃఖం, నిస్సహాయత, స్తబ్దత, సన్నిపాతం వంటివి ఏర్పడతాయి. మనఃకాయక  పద్ధతికి సంబంధించి స్పష్టమైన వైఖరి కలిగిన తొలి వైద్య విధానం ఆయుర్వేదం అని చెప్పవచ్చు. ఆయుర్వేదం ప్రకారం మానసిక రోగాల వర్గీకరణ ఈ ప్రకారం ఉంటుంది.

dhara2
మానస వికార: అసూయ, భయ, చిత్తోద్వేగ, దైన్య, హర్ష, కామ, క్రోధ, లోభ, మద, మన్న, మోహ, శోక, విషాద, ఈర్ష్య, తమ, అతిప్రలాప, అస్వప్న, అతినిద్ర, భ్రమ.
ఉభయాత్మక మానస వికార: మానస అధిష్ఠాన ఉన్మాద, అపస్మార (epilepsy), అపతాంత్ర (hysteria)ü), అతత్వాభినివేశ (obsessive syndrome), మదత్యయ (alcoholic psychosis)), సన్య (coma)..
శరీర అధిష్ఠాన: కామ జ్వర, క్రోధ జ్వర, భయజ అతిసార, శోకజ అతిసార.
ధారా చికిత్స ప్రాధాన్యత:
పద్ధతి: కేరళీయ పంచకర్మలో ధారా ఒక ప్రత్యేక చికిత్స. ద్రవరూపంలో ఉన్న ఓషధులను నిర్ధిష్ట సమయం పాటు ధారగా శరీరం పై పోసే ప్రక్రియ. ఆయుర్వేద గ్రంథాలు దీనిని మూర్ధ తైల, శేక పరిశేకగా అభివర్ణించారు. దీనిని కేరళ సంప్రదాయ వైద్యులు మరింత మెరుగుపరచి, ప్రయోగాలు చేసి ‘ధారా చికిత్స’లో నైపు ణ్యం సాధించారు. ఇటీవలి కాలంలో కేరళీయ పంచకర్మ పద్ధతులలో ప్రముఖమైనదిగా పేరొందింది. ధారా చికిత్సలో కూడా మూడు రకాలు ఉన్నాయి. అవి:
dhara3
1. మూర్ధాన్య ధార (శిరో ధార)
2. సర్వాంగ ధార (శరీరం మొత్తం)
3. పరిశేక (శరీరంలో ఒక చోట మాత్రమే చేసేది)
మూర్ధన్య ధారే శిరోధారగా ప్రాచుర్యం పొందింది. ద్రవ రూపంలో ఉన్న ఓషధులను నుదిటపై ధారగా పోస్తారు. దీనిని మానసిక రోగాలైన సైకోసిస్‌, పిచ్చి, అపస్మారకం, ఒత్తిడి, ఆందోళన, న్యూరోసిస్‌, అయోమయం, నిద్రలేమి వంటి వ్యాధులకు చికిత్స నిమిత్తం విజయవంతంగా ప్రయోగించారు. అయితే దోషాన్ని బట్టి ఓషధులు మారుతాయి.
శిరోధార రకాలు, సూచనలు:
తక్రధార : గ్లాని, ఓజక్షయ, శిరశూల, హృద్రోగ
క్షీర ధార: అనిద్ర, ఉన్మాద, శిరశూల, ఒత్తిడి
తైల ధార: శిరశూల, మానసిక వ్యాధి
ఘృతధార : అనిద్ర, పిత్త వ్యాధులు
వీటికి అదనంగా నారికేళ జల అరనాల కషాయాలు లేదా శుద్ధమైన నీటిని అవసరాన్ని బట్టి ఉపయోగించవచ్చు.

dhara1
ఓషధీ తైలాలను 4-8 ఇంచీల ఎత్తు నుంచి నుదిటిపై ధారగా పడేలా ఏర్పాటు చేస్తారు. వ్యాధిని బట్టి, దోషాన్ని బట్టి 30-90 నిమిషాల పాటు దీనిని కొనసాగిస్తారు.

శిరోగత మర్మాలను ఉత్తేజితం చేయడం, ధ్యానం, చక్రాలను చైతన్యవంతం చేయడం, ధారగా ఓషధులను పోయడం వల్ల ఏర్పడే ఒత్తిడి ప్రభావం, దాని ఫలితాలు మనోవికారాలను నియంత్రించడంలో ఎంత దోహదం చేస్తుందో రుజువు అయ్యాయి.

గమనిక: ఈ వ్యాసం ఉద్దేశం ఒక వ్యాధి లేదా ఒక స్థితి గురించి చైతన్యం కలిగించడానికే తప్ప స్వయం చికిత్సను, ఔషధ సేవనాన్ని ప్రోత్సహించేందుకు కాదు. మందులు తీసుకునే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవడం అవసరం. ఎందుకంటే అనేక సమస్యలను మందుల అవసరం లేకుండానే జీవన శైలిలో మార్పులతో దూరం చేయవచ్చు.
డా ప్రసాద్‌, ఎం.డి.(ఆయుర్వేద),
డా స్వాతి, ఎం.డి. (ఆయుర్వేద)
గాయత్రి ఆయుర్వేదిక్‌ మల్టీ స్పెషాలిటీ సెంటర్‌,
101,రామచంద్రనివాస్‌ అపార్ట్‌మెంట్స్‌, 
వెంగళరావ్‌నగర్‌, హైదరాబాద్‌
ఫోన్‌: 93909 57168 / 9666649665 / 09503628150
Prasad _ayur@rediffmail.com
swathi_ayur@rediffmail.com