Showing posts with label Ayurarogyalu. Show all posts
Showing posts with label Ayurarogyalu. Show all posts

Tuesday, October 23, 2012

Food as Medicine


.


HEADACHE?   EAT   FISH!  
Eat   plenty of fish -- fish oil helps prevent  headaches..
So  does ginger, which  reduces inflammation and pain.  

HAY   FEVER?
  EAT   YOGURT!

Eat   lots of yogurt before pollen season.
Also-eat honey from  your area (local  region) daily.


TO   PREVENT STROKE
 DRINK   TEA!  
Prevent   build-up of fatty deposits on artery walls  with regular  doses of tea.  (actually,   tea suppresses appetite and keeps the  pounds from  invading....Green tea is great  for our immune  system)!

INSOMNIA   (CAN'T SLEEP?)
 HONEY!

Use honey as a tranquilizer and  sedative.  

ASTHMA?  
EAT   ONIONS!!!!  

Eating   onions helps ease constriction of  bronchial tubes.  (onion   packs place   on chest  helped   the respiratory ailments and actually made   breathing  better).

ARTHRITIS?
  EAT   FISH, TOO!!
 
Salmon, tuna, mackerel and sardines  actually  prevent arthritis.  (fish   has omega oils, good for our immune   system)


UPSET   STOMACH?
  BANANAS   - GINGER!!!!!  
Bananas   will settle an upset stomach.
Ginger  will cure morning  sickness and nausea..  

BLADDER   INFECTION?
 DRINK   CRANBERRY  JUICE!!!!  

High-acid   cranberry juice controls harmful bacteria.  

BONE   PROBLEMS?
 EAT   PINEAPPLE!!!
 
Bone fractures and osteoporosis can be  prevented by the  manganese in pineapple.  

MEMORY   PROBLEMS?
 EAT   OYSTERS!  

Oysters   help improve your mental functioning by  supplying  much-needed zinc.  

COLDS?
  EAT   GARLIC!  

Clear   up that stuffy head with garlic.  (remember,   garlic lowers cholesterol,  too.)

 

COUGHING?  
USE   RED PEPPERS!!  
A substance similar to that found in  the cough syrups is  found in hot red  pepper. Use red (cayenne) pepper  with  caution-it can irritate your tummy.  

BREAST   CANCER?
  EAT   Wheat, bran and  cabbage

Helps to maintain estrogen at healthy  levels.  

LUNG   CANCER?
  EAT   DARK GREEN AND ORANGE AND  VEGGIES!!!  

A   good antidote is beta carotene, a form of  Vitamin A found in  dark green and orange  vegetables.  

ULCERS?  
EAT   CABBAGE ALSO!!!
 
Cabbage contains chemicals that help  heal both gastric  and duodenal ulcers.  


DIARRHEA?  
EAT   APPLES!
Grate   an apple with its skin, let it turn brown  and eat it to cure  this condition.  (Bananas   are good for this  ailment)

CLOGGED   ARTERIES?
 EAT   AVOCADO!  

Mono   unsaturated fat in avocados lowers  cholesterol.  

HIGH   BLOOD PRESSURE?
 EAT   CELERY AND OLIVE  OIL!!!

Olive oil has been shown to lower  blood pressure.
Celery contains a  chemical that lowers pressure too.  

BLOOD   SUGAR IMBALANCE?
 EAT   BROCCOLI AND PEANUTS!!!  

The   chromium in broccoli and peanuts helps  regulate insulin and  blood sugar.  

Kiwi:
  Tiny but mighty. This is a good source of  potassium,  magnesium, Vitamin E &  fibre. It's Vitamin C content is  twice  that of an orange.  

Apple:
  An apple a day keeps the doctor away?  Although an apple has  a low Vitamin C  content, it has antioxidants &   flavonoids which enhances the activity of  Vitamin C thereby  helping to lower the  risks of colon cancer, heart  attack &  stroke..

Strawberry:
  Protective fruit. Strawberries have the  highest total  antioxidant power among  major fruits & protects the body  from  cancer causing, blood vessels clogging   free radicals. (Actually,   any berry is good for you..they're high in  anti-oxidants and  they actually keep us  young...........blueberries are the best  and  very versatile in the health field........they  get rid  of all the free-radicals that  invade our  bodies)

Orange :
  Sweetest medicine. Taking 2 - 4 oranges a  day may help  keep colds away, lower  cholesterol, prevent  & dissolve kidney  stones as well as lessen the risk  of colon  cancer..

Watermelon:
  Coolest Thirst Quencher. Composed of 92%  water, it is also  packed with a giant dose  of glutathione which helps boost  our  immune system..  They are also a key source  of  lycopene - the cancer fighting oxidant.   Other  nutrients  
Found in watermelon are Vitamin  C  & Potassium. (watermelon   also has natural substances [natural SPF  sources] that keep  our skin healthy,  protecting our skin from those darn UV   rays)

Guava   & Papaya:
 Top awards for Vitamin C. They are the  clear winners for  their high Vitamin C  content. Guava is also rich in fibre  which  helps prevent constipation.  

Papaya
  is rich in carotene, this is good for your  eyes.  (also   good for gas and  indigestion)


 
Tomatoes  
are   very good as a preventative measure for  men, keeps those  prostrate problems from  invading their  bodies......GOOD   AS MEDICINE..

Monday, August 6, 2012

సర్వరోగ నివారిని ప్రాణాయామం

తరచూ అనారోగ్యాలకు గురయ్యే మహిళలు నిత్యం యోగా చేయడం మూలంగా ఆరోగ్యం కుదుటపడు తుందని వైద్యులు సూచిస్తున్నారు. వివిధ రకాల యోగ మూలంగా శరీరం, మనసు రెండు కూడా ప్రశాంతంగా ఉంటాయని వారంటున్నారు. మానసిక ఒత్తిడిని అధిగమించడానికి యోగా ఎంతో గానో ఉపయోగపడుతుందని, మహిళలు ఇంటి పట్టునే ఉండి ప్రతిరోజు యోగాను చేయడం వల్ల అన్ని రకాల సమస్యలు పరిష్కారమవుతాయని వారంటు న్నారు. యోగాలో భాగంగా ప్రాణాయామం గురించి  తెలుసుకుందాం.

1.ప్రాణాయామ విశేషాలు
benefa 

ప్రాణం + ఆయామం = ప్రాణాయమం. ప్రాణమంటే జీవన శక్తి. ఆయామం అంటే విస్తరింపచేయుట లేక నియంత్రించి ఉంచుట అని అర్ధం. పతంజలి మహర్షి ప్రసాదించిన యోగ సూత్ర ప్రకారం శ్వాస, ప్రశ్వాసల్ని నియంత్రించి ఉంచడమే ప్రాణాయామం అని నిర్ధారించడం జరిగింది. లోనికి పీల్చే గాలిని శ్వాస అని, బయటికి వదిలే గాలిని ప్రశ్వాస అని అంటారు.శ్వాస ప్రశ్వాసల్ని నియంత్రించడం, క్రమబద్దం చేయడం ద్వారా అంతర్గత సూక్ష్మప్రాణాన్ని కూడా అదుపులో ఉంచవచ్చు.నాడీమండలం, రక్త ప్రసార ధమనులు, జీర్ణకోశం, మూత్రకోశం మొదలుగా గల వాటన్నిటి యందు ప్రాణం సంచ రిస్తూ ఉంటుంది.

ప్రాణాయామం వల్ల వాటన్నింటికి శక్తి, రక్షణ కల్పిస్తాయి. కనుకనే ‘‘ ప్రాణాయా మేన యుక్తేన సర్వరోగ క్షయ భవేత్‌’’ అంటే ప్రాణాయామం నియమబద్ధంగా ఆచరిస్తే సర్వరోగాలు హరించిపోతాయి అను సూత్రం ప్రచలితం అయింది.

ప్రాణానికి ప్రాణ, అపాన, సమాన; ఉదాన, వ్యానమను 5 రూపాలు ఉన్నాయి. ప్రాణానికి స్థానం హృదయం. అపానానికి స్థానం గుదం. సమానానికి స్థానం నాభి. ఉదనానికి స్థానం కంఠం. వ్యానానికి స్థానం శరీరమంతా. శ్వాసక్రియకు ప్రాణం, విసర్జన క్రియకు అపానం, పాచన క్రియకు సమానం, కంఠశక్తికి ఉదానం, రక్తప్రసార క్రియకు వ్యానం తోడ్పడుతాయి. శ్వాసను బయటకు వదిలే క్రియను రేచకం అని, లోపలకి పీల్చే క్రియను పూరకం అని, లోపల గాలిని ఉంచడాన్ని అంతర్‌ పూరకం అని, తిరిగి బయటకి వదిలి ఆపి ఉంచడాన్ని బాహ్యకుంభకం అని అంటారు. ఈ క్రియలు ప్రాణాయామానికి సాధనాలు.మెడికల్‌ సైన్స్‌ ప్రకారం రెండు ముక్కు రంధ్రాల ప్రయోజనం ఒక్కటే. కాని యోగులు ఈ రెండింటికి మధ్య గల భేదం గ్రహించారు.


వారి పరిశోధన ప్రకారం కుడి ముక్కు రంధ్రాన్నుంచి నడిచే గాలి కొద్దిగా ఉష్ణం కలిగిస్తుంది. అందు వల్ల దీన్ని వారు సూర్య నాడి లేక సూర్య స్వరం అని అన్నారు. అట్లే ఎడమ ముక్కు రంధ్రం ప్రభావం వల్ల చల్లని దనం అందువల్ల దాన్ని చంద్రనాడి లేక చంద్రస్వరం అని అన్నారు. ఈ రెండిటికి మధ్య సమన్వయం సాదించుటకు యోగ శాస్త్రంలో ప్రాధాన్యం ఇవ్వబడింది. హ అను అక్షరం చంద్రుడికి, ట అను అక్షరం సూర్యుడికి గుర్తుగా నిర్ధారించారు. అందువల్ల హఠ యోగం వెలువడింది. హఠ యోగమంటే చంద్ర సూర్య నాడులకు సంబంధించిన విజ్ఞానం అన్నమాట. హఠం అనగాబలవంతం అనికాదు. ప్రాణాయామ విజ్ఞానమంతా చంద్ర, సూర్య స్వరాలకు సంబంధించినదే.

2. ప్రాణాయామం వల్ల కలిగే ప్రయోజనాలు

  • ఊపిరితిత్తులు బాగా పనిచేస్తాయి.
  • శరీరానికి ప్రాణవాయువు బాగా లభిస్తుంది.
    Sitaa
  • రక్త శుద్ధి జరిగి అందలి చెడు అంతా
  • బయటికి వెళ్లి పోతుంది.
  • గుండెకు సత్తువ లభిస్తుంది.
  • మెదడు చురుగ్గా పనిచేస్తుంది.
  • ప్రేగులు, నరాలు, నాడులు శుభ్ర పడతాయి.
  • జఠరాగ్ని పెరుగుతుంది.
  • శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.
  • ఆయుష్షు పెరుగుతుంది. ఇది అన్నిటికంటే మించిన విశేషం.

    3. తీసుకోవలసిన జాగ్రత్తలు
    • మైదానంలోగాని, తోటలోగాని, తలుపులు తెరచియున్న గదిలోగాని,
    • కంబళీ లేక బట్ట లేక ఏదేనీ ఆసనం మీద కూర్చొని ప్రాణాయామం చేయాలి.
    • గాలి విపరీతంగా వీస్తూ ఉంటే ఆ గాలి మధ్య ప్రాణాయామం చేయకూడదు.
    • మురికిగా ఉన్న చోట, దుర్వాసన వస్తున్న చోట, పొగ వస్తున్న చోట ప్రాణాయామం చేయకూడదు.
    • సిగరెట్టు, బీడి, చుట్టపొగ వస్తున్న చోట ప్రాణాయామం చేయకూడదు.
    • పొట్ట నిండుగా ఉన్నపుడు ప్రాణాయామం చేయకూడదు.
    • ప్రాణాయామం చేసే ముందు, చేసిన తరువాత కూడా ఇతర యోగాసనాలు వేయవచ్చు.
    • అయితే చివర శవాసనం వేసి కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలి.
    • ప్రాణాయామం వేసినపుడు బట్టలు తక్కువగానూ, వదులుగానూ ధరించాలి.
    • పద్మాసనం, సుఖాసనం, సిద్ధాసనం, వజ్రాసనం ప్రాణాయామానికి అనువెైన ఆసనాలు.
    • నేల మీద కూర్చోలేనివారు, కుర్చి మీద నిటారుగా కూర్చొని ప్రాణాయామం చేయవచ్చు.
    • నడుం, వీపు, వెన్నెముక, మెడలను నిటారుగా ఉంచి ప్రాణా యామం చేయాలి.
    • ప్రాణాయామం చేసేటపుడు ఒకసారి కుడి ముక్కు రంధ్రాన్ని, ఒకసారి ఎడమ ముక్కు
    • రంధ్రాన్ని మూయవలసి ఉంటుంది. కుడి ముక్కు రంధ్రాన్ని కుడిచేతి బొటన వ్రేలితోనూ, ఎడమ ముక్కు రంధ్రాన్ని కుడిచేతి ఉంగరం వ్రేలితోనూ మూయాలి.
    • ముక్కు రంధ్రాలు సరిగా శుభ్రంగా లేకపోతే ప్రాణాయామం చేసే ముందు జలనేతి, సూత్రనేతి క్రియలు సక్రమంగా చేయాలి. అలాచేస్తే ప్రాణాయామం చేస్తున్నపుడు శ్వాస సరిగ్గా ఆడుతుంది.
    • ప్రాణాయామ క్రియలు చేస్తూ ఉన్నపుడు మనస్సును పూర్తిగా శ్వాస ప్రశ్వాస క్రియలపెై కేంద్రీకరిచాలి. వేరే యోచనలకు తావు ఇవ్వకూడదు.

Saturday, May 19, 2012

గ్యాస్ట్రో ఎంటరాలజీలో చెయ్యి తిరిగిన ‘చల్లనయ్య’ - పద్మశ్రీ డాక్టర్ డి.నాగేశ్వరరెడ్డి


పెద్దవాళ్లు ఏమని దీవిస్తారు? నిండు నూరేళ్లు చల్లగా ఉండమనేగా!
డాక్టర్ నాగేశ్వరరెడ్డి వైద్యం కూడా పెద్దల దీవెనలాగే పని చేస్తుంది.
ఉదర బాధలు లేకుండా చేసి, జీవితాన్ని ఉల్లాసంగా ఉంచుతుంది.
గ్యాస్ట్రో ఎంటరాలజీలో చెయ్యి తిరిగిన ఈ ‘చల్లనయ్య’ దగ్గరికి
‘కడుపు చేతపట్టుకుని’ మెలితిరిగిపోతూ రోజూ వందల మంది వస్తుంటారు.
ఒకసారి వచ్చి వెళ్లండని ఫారిన్ డాక్టర్‌ల నుండి
ఫోన్ల మీద ఫోన్లు వస్తుంటాయి!


‘‘మా బాబే’’ అని పెద్దలు అందించే దీవెనలకు...
‘‘బతికించారు సార్’’ అని పెట్టే దండాలకైతే లెక్కే లేదు.
క్షణం తీరిక లేకుండా...
సెలబ్రిటీలకు, సామాన్యులకు
సమానంగా అందుబాటులో ఉంటూ...
ఇరవయ్యేళ్లకు పైగా భారతీయ వైద్యరంగానికి ఖ్యాతిని, ప్రఖ్యాతిని
ఆర్జించి పెడుతున్న ఈ డాక్టర్‌గారిలో ఇంత సంకల్పబలం ఎక్కడిది?


కర్తవ్యపు ఉరుకులు పరుగుల వేడిలో
ఈయన్ని చల్లగా ఉంచుతున్నదెవరు?


వైద్యో నారాయణో హరి అన్న మాటకు నిలువెత్తు నిదర్శనం... వైద్యుడన్న మాటకు అసలు సిసలు నిర్వచనం అయిన పద్మశ్రీ డాక్టర్ డి.నాగేశ్వరరెడ్డి  

ఇన్నర్‌వ్యూ ఇది.

హాస్టల్ జీవితాన్ని చాలామంది ఇష్టపడరు. హాస్టల్‌ని జైలులా ఫీలవుతారు. కానీ హాస్టల్‌కి వెళ్లడం వల్లే నా జీవితం మలుపు తిరిగింది. అసలు ఇంట్లో అమ్మానాన్నల దగ్గర ఉండి చదువుకోవాల్సిన నేను, హాస్టల్‌కి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? దాని వెనుక ఓ కథ ఉంది. ఆ కథలో హీరోని నేనే.


మాది చిత్తూరు జిల్లా, వీరనత్తోడ్. నాన్న దువ్వూరి భాస్కర్‌రెడ్డి పాథాలజీ ప్రొఫెసర్. తన వృత్తి కారణగా ఆయన పలుచోట్ల పని చేయడంతో నాకు మా సొంత ఊరితో పెద్దగా అనుబంధం లేదు.

నాన్న ఎక్కడ పనిచేస్తే, అదే మా ఊరు అన్నట్టుగా ఉండేది. నేను పెద్ద తెలివైనవాణ్నేం కాదు. మూడో తరగతి ఫెయిలయ్యాను కూడా. అల్లరిలో మాత్రం నేను నంబర్‌వన్!


చిన్నప్పుడు వైజాగ్‌లో ఉండేవాళ్లం. ఇద్దరు తమ్ముళ్లతో కలిసి చాలా అల్లరి చేసేవాణ్ని. ఏం చేయాలన్నా ఐడియా నాదే. పాపం వాళ్లు నన్ను ఫాలో అయ్యేవారంతే. ఓసారి మా తమ్ముణ్ని ఫ్రిజ్‌లో పెట్టేశాను. ఉక్కగా ఉందన్నాడు మరి! ఇంకోసారి మా వీధిలోకి గడ్డిబండి వచ్చింది. అది వీధి దాటేలోపు మొత్తం గడ్డంతా లాగి పారేశాం. పాపం, ఆయన మా అమ్మ (శారద) దగ్గరికి వచ్చి వాపోయాడు. మరోసారి ఇంటిముందున్న కారు గేర్లు మార్చి వదిలేశాను.


మా ఇల్లు ఎత్తుమీద ఉండేది. దాంతో కారు వేగంగా వెళ్లి చెట్టును ఢీకొట్టింది. పెట్రోలు మండుతుందో లేదో చూడాలనిపించిందోసారి. సరే చూద్దామని షెడ్డులో పోసి అంటించా. పెద్ద పెద్ద మంటలు! నాన్నకు మామూలుగా కోపం రాలేదు. ఇక నిన్ను భరించలేను, ఆటో మెకానిక్ షెడ్డు పెట్టిస్తాను, రిపేర్లు చేసుకోమన్నారు. అయినా ఆ రేంజ్‌లో అల్లరి చేస్తే ఎవరు మాత్రం భరించగలరు!

అందుకే ఇక లాభం లేదని తీసుకొచ్చి, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చేర్పించేశారు. హాస్టల్ జీవితం ప్రారంభం! అయితే ఈనాటి ఈ జీవితానికి నాంది అక్కడే పడిందని చెప్పొచ్చు. అక్కడి ఉపాధ్యాయుల ప్రభావంతో నా ఆలోచనాధోరణి మారింది. చదువు ప్రాధాన్యత తెలిసి వచ్చింది. జీవితంలో ఉన్నతస్థాయికి చేరుకోడానికి అవసరమైన అసలైన చదువు అప్పుడే మొదలయ్యింది.


ఐదేళ్లూ నేనే ఫస్ట్!


విజయవాడ లయోలా కాలేజీలో ఇంటర్ పూర్తి చేశాను. ఆ సంవత్సరమే మెడిసిన్‌కి ప్రవేశ పరీక్ష పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. నేనా పరీక్ష రాసి పాసై, కర్నూలు మెడికల్ కాలేజీలో చేరాను. ఆ కాలేజీకి నాన్నే ప్రిన్సిపల్. మహా స్ట్రిక్టుగా ఉండేవారు.

మా కాలేజీలో చాలా చక్కని వాతావరణం ఉండేది. ఇంకా చెప్పాలంటే, అదో పల్లెటూరులా ఉండేది. ఎలాంటి భేదాలు, భేషజాలు ఉండేవి కాదు. ప్రొఫెసర్లలో చాలామంది సైకిల్‌మీదే కాలేజీకి వచ్చేవారు. దాంతో డాక్టర్ అంటే కారులో తిరగాలన్న ఆలోచనే మాకు కలిగేది కాదు. మెడికల్ కాలేజే అయినా రకరకాల ఆటల్లో కూడా ప్రోత్సహించేవారు. నాకు క్రీడల పట్ల ఆసక్తి చాలా ఎక్కువ. క్రికెట్, టెన్నిస్ టీములకి నేనే కెప్టెన్‌ని.


అలాగని చదువు పట్ల నిర్లక్ష్యం ఎప్పుడూ లేదు. ఐదేళ్లూ కాలేజ్ ఫస్ట్ వచ్చాను. అలాంటి అరుదైన, అందమైన వాతావరణంలో ఎంబీబీయస్ పూర్తయ్యింది. తర్వాత మద్రాస్ యూనివర్శిటీలో జనరల్ మెడిసిన్‌లో ఎండీ చేశాను. ఆ తర్వాత గ్యాస్ట్రో ఎంటరాలజీలో డీఎమ్ కోర్సు కోసం ఛండీగడ్‌లోని పీజీఐఎమ్‌ఈఆర్ యూనివర్సిటీలో చేరాను. నిజానికి అప్పట్లో కార్డియాలజీ కోర్సులంటే క్రేజ్!


కానీ నాకు ఎప్పుడూ ఏదైనా కొత్త విషయం తెలుసుకోవాలనుండేది. అరుదైన అంశాలవైపే మనసు మొగ్గు చూపేది. అప్పుడే కొత్తగా ఎండోస్కోపీ టెక్నాలజీ రావడంతో గ్యాస్ట్రో ఎంటరాలజీలో నైపుణ్యం సాధించాలని డిసైడైపోయాను. అక్కడ ఆ బ్రాంచ్‌లో ఒకే ఒక్క సీటు ఉంది. అదృష్టం... ఆ ఒక్క సీటూ నాకే వచ్చింది.


అక్కడ రెండేళ్ల కోర్సు పూర్తయ్యాక హైదరాబాద్ నిమ్స్‌లో చేరాను. తర్వాత రెండేళ్లు గాంధీ మెడికల్ కాలేజీలో కూడా చేశాను. మళ్లీ నిమ్స్‌లో చేరాను. అక్కడ్నుంచి వచ్చేసి మెడినోవాలో చేరాను. కాస్త నిలదొక్కుకునేటప్పటికి విదేశీ యూనివర్సిటీల నుంచి అవకాశాలు రావడం మొదలయ్యింది. హార్వర్డ్ మెడికల్ కాలేజీ వారు కోటి రూపాయల జీతంతో జాబ్ ఆఫర్ చేశారు. కానీ నేను అంగీకరించలేదు. నా సేవలు మన దేశానికే అందాలన్నది నా కోరిక.


అప్పటికి మనదేశంలో గ్యాస్ట్రో ఎంటరాలజీలో శిక్షణ పొందినవారుగానీ నైపుణ్యం ఉన్నవాళ్లు గానీ పెద్దగా లేరు. నా అవసరం ఇక్కడ ఎంతైనా ఉందనిపించింది. నేనిలా ఆలోచించడానికి కారణం ఓ రకంగా నాన్నే! ఆయన ఎప్పుడూ పేదల గురించి ఆలోచించేవారు. వారికి సేవలందించడమే లక్ష్యంగా భావించేవారు. ఆయన ప్రభావం నామీద చాలా ఉంది. ఆయనిచ్చిన ఆ స్ఫూర్తి విదేశాల్లో స్థిరపడాలన్న ఆలోచనను నాకు రానివ్వలేదు.


ధనికుల వైద్యుణ్ని కాను!


నేను ‘ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ’ పెట్టినప్పుడు చాలామంది అన్నారు- ‘ఎందుకీ ఆస్పత్రి పెట్టడం, దీనికి పెద్ద ప్రాముఖ్యత లేదు, రోగులు అంతగా రారు’ అని. అది నిజం కాదు. మన దేశంలో 1/3 వంతు మంది ఈ వ్యాధులతో బాధపడుతున్నారు. వారికి మంచి వైద్యం అవసరం ఉంది. ఆ ఉద్దేశంతోనే ఆస్పత్రి పెట్టాను.

చాలామంది అనుకుంటారు మా హాస్పిటల్లో వైద్యం ఖరీదైనదని, సామాన్యుడికి అందుబాటులో ఉండదని! అది అపోహ మాత్రమే. ఇక్కడ వైద్యం ఖరీదైనదే. కానీ అది డబ్బున్నవాళ్లకి మాత్రమే అందడం లేదు. మా ఆస్పత్రిలో ధనవంతులకు ఎన్ని బెడ్స్ ఉన్నాయో, పేదవాళ్లకీ అన్నే ఉన్నాయి. ఎంతమంది దగ్గర డబ్బులు తీసుకుని వైద్యం చేస్తున్నానో, అంతమందికి ఉచితంగా కూడా చేస్తున్నాను. ఎల్వీ ప్రసాద్ హాస్పిటల్లో కంటే మా దగ్గర ఎక్కుమంది పేద రోగులు ఉంటారంటే ఎవరూ నమ్మరు.


మా హాస్పిటల్లో ముప్ఫై శాతం చారిటీకే కేటాయించామని కూడా చాలామందికి తెలియదు. నిజానికి నాకింకా ఎక్కువే చేయాలనుంది. కానీ సంస్థ తరఫున అంతకంటే చేయడం కష్టం. జీతాలు ఇవ్వాలి, హాస్పిటల్ మెయింటెయిన్ చేయాలి, ఇంకా చాలా ఖర్చులుంటాయి కదా! అందుకే పూర్తిగా ఫ్రీగా చేయలేని పరిస్థితి. డబ్బు తీసుకుని వైద్యం చేయడం డాక్టర్‌గా నాకు బాధగానే ఉంటుంది. కానీ తప్పదు. ప్రభుత్వ సహాయం అందితే అది సాధ్యపడొచ్చు. ముఖ్యంగా రోగులకు ఇన్సూరెన్స్ ఇచ్చే పద్ధతిని ప్రభుత్వం ప్రారంభిస్తే, మరింతమందికి లబ్దిని చేకూర్చగలం!


అంతేకాదు, మన దేశంలో చాలామంది అల్సర్లు, నులిపురుగుల సమస్యలతో సతమత మవుతున్నారు. దానికి కారణం శుభ్రమైన నీరు, ఆహారం, పరిసరాలు లేకపోవడం!

అందుకే వాటిమీద అవగాహన కల్పించడానికే ఏషియన్ హెల్త్ కేర్ ఫౌండేషన్‌ను స్థాపించాం.

మారుమూల గ్రామాలకు వెళ్లి ఉచితంగా వైద్యసేవలు అందిస్తున్నాం. ఇంతవరకూ కోటిమందిని చేరగలిగాం. ఆంధ్రప్రదేశ్ అంతటా సేవలు అందించడానికి మరో పదేళ్లు పట్టొచ్చు. భువనగిరి (నల్లగొండ జిల్లా) దగ్గర్లో యాభై వేల జనాభా ఉన్న ఓ గ్రామాన్ని దత్తత తీసుకున్నాం. దాన్ని సంపూర్ణ ఆరోగ్యవంతమైన పల్లెగా తీర్చి దిద్దాలనుకుంటున్నాం. ఇలా నా వరకూ నేను చేయగలిగినంత సేవ చేస్తున్నా!


వాళ్లలో నచ్చేది అదే!


ఓసారి హఠాత్తుగా కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్.ఎం. కృష్ణ నుంచి పిలుపు వచ్చింది... ఆయన భార్యకి సీరియస్‌గా ఉందని, చికిత్స చేయాలని! అక్కడి డాక్టర్లు లాభం లేదనడంతో చివరగా నన్ను సంప్రదించారు. నేను హైదరాబాద్ తీసుకు రమ్మన్నాను. కానీ ఆవిడ వచ్చే స్థితిలో లేరు. నేను అప్పటికప్పుడు వెళ్లలేను. దాంతో ఆయనే ఓ ప్రైవేట్ ఫ్లయిట్ పంపించారు.

అది చాలా మంచిదయ్యింది. ఎందుకంటే ఇంకాస్త లేటయినా ఆవిడ చనిపోయుండేవారు. చికిత్స తర్వాత చాలా త్వరగా కోలుకున్నారావిడ. దాంతో కృష్ణ చాలా ఆశ్చర్యపోయారు. తమ రాష్ట్రంలో ఆస్పత్రి పెట్టి సేవలు అందించమని కోరారు. కానీ నాకది ఇష్టం లేదు. మొదటి ప్రాధాన్యత నా రాష్ట్రానికే అని చెప్పాను. అర్థం చేసుకున్నారు. ‘మా ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ’ పెట్టినప్పుడు చాలా సహాయం చేశారు.


అంతకుముందు అమితాబ్ విషయంలోనూ ఇలాగే జరిగింది. వెంటనే వచ్చి తన తండ్రిని చూడాలంటూ ఆయన ఐదారుసార్లు ఫోన్ చేశారు. ఎంతో బిజీగా ఉండటం వల్ల వెళ్లలేకపోయాను కానీ అన్నిసార్లు కాంటాక్ట్ చేయడంతో కాదనలేక వెళ్లాను. అసలు మొదట ఆయన డాక్టర్ కోసం అమెరికాకి ఫోన్ చేశారట. వాళ్లేమో మంచి డాక్టర్‌ని మీ దగ్గర పెట్టుకుని మాకు ఫోన్ చేశారేంటని అన్నారట. వాళ్ల ద్వారా నా గురించి తెలుసుకుని నాకు ఫోన్ చేశారాయన. ఆ సంఘటన తర్వాత ఆయన నాకు మంచి స్నేహితుడయ్యారు.


ఎం.ఎఫ్.హుస్సేన్ కూడా నా దగ్గర చికిత్స తీసుకున్నారు. ప్రతిగా ఆయన అభిమానంతో ఇచ్చిన పెద్ద పెయింటింగ్ నాకెంతో అపురూపం! ఆయన నన్నోసారి ముంబై పిలిచారు. నేను పెట్టబోయే కొత్త ఆస్పత్రి గోడల నిండా చిత్రాలు గీస్తానని చెప్పారు. దురదృష్టం! అలా జరగకముందే చనిపోయారు.


వీళ్లంతా గొప్పవాళ్లు. పేరు, డబ్బు, పరపతి ఉన్నవాళ్లు. అయినా తగ్గి ఉంటారు. గౌరవంగా ప్రవర్తిస్తారు. అభిమానంగా మాట్లాడతారు. ఎదిగేకొద్దీ ఒదగడమంటే ఏంటో వాళ్లను చూస్తే తెలుస్తుంది! నేనూ అలానే ఉండటానికి ప్రయత్నిస్తాను.


నా వరకూ నేను డాక్టర్‌కి మూడు లక్షణాలు తప్పకుండా ఉండాలని అను కుంటాను. హార్డ్‌వర్క్ (కష్టపడే తత్వం), హానెస్టీ (నిజాయితీ), హ్యుమిలిటీ (వినమ్రత). డాక్టర్ ప్రతిక్షణం వృత్తికి న్యాయం చేయడానికి కష్టపడాలి. చేసే పనిని నిజాయితీగా చేయాలి. అంతేకాదు, రోగుల విషయంలో వినమ్రతతో ఉండాలి. నేను డాక్టర్‌ని, నువ్వు రోగివి అన్నట్టుగా గర్వంగా ప్రవర్తించడం తగదు. ఈ మూడింటినీ నేనెప్పుడూ మిస్ కాను.


వీకెండ్ ఫాదర్‌ని!


డాక్టర్‌గా తెల్లకోటు వేసుకున్నప్పటి నుంచి ఈ రోజు వరకూ వైద్యం తప్ప మరో ప్రపంచమే లేకుండా బతుకుతున్నాను. ఈ ప్రపంచంలో ఏదైనా నాకు నా వృత్తి తర్వాతే. చివరికి నా కుటుంబం కూడా. నేను ఇంట్లో గడిపేది ఐదు గంటలు. రోజులో నిద్రపోయేది కేవలం నాలుగు గంటలు. మిగిలిన సమయమంతా రోగుల కోసమే. నా భార్య కూడా డాక్టరే కాబట్టి అర్థం చేసుకుంటుంది. నా కూతురు సంజన కూడా ఏనాడూ నన్ను ఇబ్బంది పెట్టలేదు.

నేను ఇల్లు వదిలే సమయానికి తను లేచేది కాదు. నేను ఇంటికి వెళ్లేసరికి తను నిద్రపోయేది. వారాంతంలో మాత్రమే నన్ను చూసేది. దాంతో తనెప్పుడూ నన్ను ‘వీకెండ్ ఫాదర్’ అంటుండేది. నా బిజీ షెడ్యూల్స్ చూసి విసిగిపోయే తాను మెడిసిన్ చదవకూడదనుకుంది. ఇంజినీరింగ్ చేసింది. మరో ఇంజినీర్‌ని పెళ్లి చేసుకుని అమెరికాలో స్థిరపడిపోయింది.


నాకు సెలవుల్లేవు. వీకెండ్స్ లేవు. పార్టీలు లేవు, సరదాలు లేవు. ముప్ఫయ్యేళ్లుగా ఒక్క సినిమా కూడా చూడ లేదు. అయినా కుటుంబాన్ని మిస్ అవు తున్నాననో, వ్యక్తిగత జీవితానికి ఎక్కువ సమయం కేటాయించలేకపోతున్నానో ఎప్పుడూ బాధపడలేదు. ఓ మంచి డాక్టర్‌ని అయినందుకు ఆనందపడుతున్నాను.


అది నా కల!


ఏదైనా పెద్ద జబ్బు చేయగానే విదేశాలకు వెళ్లి చికిత్స చేయించుకోవాలను కుంటారు చాలామంది. అక్కడైతేనే వైద్యం బాగుంటుందనుకుంటారు. కానీ అది కేవలం అపోహ. ఇక్కడ కూడా మనకు మంచి టెక్నాలజీ ఉంది. ప్రజ్ఞావంతులైన డాక్టర్లున్నారు. డాక్టర్ ఎక్కడైనా ఒక్కటే.

విధానాలు వేరుగా ఉంటాయి... అంతే! మన దేశంలో ఒక్క ఫోన్ చేస్తే పిజ్జా వచ్చేస్తుంది. కానీ అంబులెన్స్ మాత్రం రాదు. అదే విదేశాల్లో అయితే అంబులెన్స్ పిజ్జా కంటే ముందు వస్తుంది. ఇలాంటి కొన్ని తేడాలు తప్ప మన వైద్య విధానం విదేశీ వైద్యవిధానానికి ఏమాత్రం తీసిపోదు.

మా ఇన్‌స్టిట్యూట్‌నే తీసుకుంటే, విదేశాల నుంచి వచ్చిన ఎంతోమంది విద్యార్థులు ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. అంటే మన దగ్గర విజ్ఞానం ఉందనే కదా! పదుల సంఖ్యలో డాక్టర్లు మా ఇన్‌స్టిట్యూట్‌లో నిత్యం పరిశోధనలు చేస్తూనే ఉంటారు.

మాది టీమ్ వర్క్. అందరం కలసి కొత్త విధానాల కోసం శ్రమిస్తూ ఉంటారు. ఇటీవలే చర్మకణం నుంచి లివర్‌ని డెవలప్ చేసే విధానాన్ని కనుగొన్నాం. ఒకట్రెండు సంవత్సరాల్లో అది అందుబాటులోకి వస్తుంది. ఇంకా మరికొన్ని అంశాలపైనా ప్రయోగాలు చేస్తున్నాం. మరికొన్నేళ్లలో గ్యాస్ట్రో ఎంటరాలజీలో మన దేశం మరింత అభివృద్ధి సాధించాలి. అది నా కల. దాన్ని నిజం చేయడానికి నా టీమ్ సహకారంతో అనుక్షణం శ్రమిస్తున్నాను.


పెద్దవాళ్లు ఒప్పుకోలేదు!


మద్రాస్ యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు క్యారల్ ఆన్‌తో పరిచయమయ్యింది. తను అప్పుడు డెర్మటాలజీలో పీజీ చేస్తోంది. ఎందుకో చెప్పలేను కానీ, తను నాకు చాలా నచ్చింది. తనకీ నేను నచ్చాను. తను పుట్టిందీ పెరిగిందీ మద్రాసులోనే. పైగా క్రిస్టియన్. మతాలు, సంప్రదాయాలు వేరుకావడంతో ఇరుపక్షాల పెద్దలూ ఒప్పుకోలేదు. మా ఇద్దరికీ మత విశ్వాసాలు లేవుకానీ పెద్దలను నొప్పించడం ఇష్టం లేక వాళ్లు ఒప్పుకునేవరకూ ఎదురుచూశాం. అందరూ ఓకే అన్నాకే ఒక్కటయ్యాం!
..............
మర్చిపోలేని అనుభవమది!


ఓసారి కర్నూలులో మెడికల్ క్యాంప్ జరుగుతోంది. ఆ విషయం తెలిసిన వైఎస్సార్ వెంటనే అక్కడికి వచ్చారు. అప్పటికి మేం అల్సర్ ఉన్న ఓ రోగికి ఎండోస్కోపీ సర్జరీ చేస్తున్నాం. ఆ పేషెంట్‌ని చూసి వైఎస్సార్- ‘నువ్వు రామిరెడ్డి’ కదా అన్నారు. అతను పులివెందులలో ఉండేవాడట. చాలాకాలం క్రితమే కర్నూలు వచ్చి స్థిరపడ్డాడట.

అయినా కూడా ఆయన గుర్తుపట్టి పలకరించడం చూసి ఆశ్చర్యపోయాను. అంతేకాదు, నేను ఎండోస్కోపీ మొదలుపెడుతుండగానే ఆయన- ‘అతనికి క్యాన్సర్ ఉన్నట్టుంది చూడండి’ అన్నారు. బయాప్సీ చేస్తే నిజంగానే క్యాన్సరని తేలింది. నేనెప్పటికీ మర్చిపోలేని అనుభవమది.


-సమీర నేలపూడి

ఫొటోలు: జి.అమర్

Friday, May 18, 2012

Thyroid Gland Problems ( థైరోయిడ్ సమస్యలు ).



ధైరాయిడ్‌ తీరుతెన్నులు : మన శరీరంలోని ముఖ్యమైన గ్రంథుల్లో థైరాయిడ్‌ ఒకటి. ఇది మన శారీరక ఎదుగుదలలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ గ్రంథి పనితీరు గతితప్పడం వలన హైపో థైరాయిడిజం, హైపర్‌ థైరాయిడిజం, గాయిటర్‌ వంటి సమస్యలు తలెత్తుతాయి. దీనికి గల స్పష్టమైన కారణాలు తెలియవు. కాని ఈ సమస్యలను ఆదిలోనే గుర్తిస్తే మెరుగైన చికిత్సను అందించి పూర్తిగా నయం చేయవచ్చును . థైరాయిడ్‌ వచ్చినపుడు నిపుణులతో స్వరపేటిక పరీక్ష చేయించుకోవలెను. ఎందుకంటే ఒకొక్కసారి థైరాయిడ్‌ వ్యాధి ముదిరి లోపల స్వరపేటికకు ప్రాకి బొంగురు సంభవించవచ్చును.

థైరాయిడ్‌:

థైరాయిడ్‌ గ్రంధి మెడ ప్రాంతంలో కంఠముడి (ఎడమ్స్‌ ఏపిల్‌) కింద ఉండే ఒక గ్రంధి. ఇది సీతాకోకచిలుక యొక్క రెక్క రూపంలో శ్వాస నాళానికి (ట్రెఖియా) యిరు పక్కలా ఉంటుంది.

థైరాయిడ్‌ గ్రంధి నుండి విడుదలయ్యే థైరాయిడ్‌ హార్మోన్‌ మన శరీరంలో ప్రతి కణంపై ప్రభావం చూపి, మన శరీరం యొక్క పనులను నియంత్రించేందుకు సాయపడుతుంది. థైరాయిడ్‌ గ్రంధి పిట్యూటరీ అనబడే యింకొక గ్రంధి హైపోథేలమస్‌ అనే మెదడులోని భాగం శరీరంలోని థైరాయిడ్‌ హార్మోన్‌ మొత్తాన్ని నియంత్రించేందుకు కలిసి పని చేస్తాయి. ఉదాహరణకు దేహంలో తగినంత థైరాయిడ్‌ హార్మోను లేకపోతే పిట్యూటరీ గ్రంధి ఈ అవసరాన్ని గ్రహించి, థైరాయిడ్‌ని ఉత్తేజపరిచేందుకు థైరాయిడ్‌ స్టిమ్యులేటింగ్‌ హార్మోన్‌ (టి.ఎన్‌.హెచ్‌)ని విడుదల చేస్తుంది. అలాంటి టిఎన్‌హెచ్‌ సంకేతంతోనే థైరాయిడ్‌ గ్రంధి హార్మోన్‌ని ఉత్పత్తి చేసి రక్తంలోకి నేరుగా పంపుతుంది.

హైపర్‌ థైరాయిడ్‌జమ్‌:

ఈ రుగ్మత థైరాయిడ్‌ గ్రంధి మరీ ఎక్కువ హార్మోన్‌ని ఉత్పత్తి చేయడం వలన ఏర్పడుతుంది.

లక్షణాలు:

ఈ వ్యాధి వచ్చినప్పుడు గొంతు థైరాయిడ్‌ గ్రంధి (వాపు) పెద్దదవవచ్చు (గాయిటర్‌).

1. త్వరితమైన గుండెరేటు- నిముషానికి 100 కంటే ఎక్కువ. 2. నరాల బలహీనత, ఆదుర్దా, చికాకు. 3. చేతులు వణకడం. 4. చెమటలు పట్టడం. 5. మామూలుగా తింటున్నా బరువు కోల్పోవటం. 6. వేడి తట్టుకోలేక పోవటం.
7. జుట్టు ఊడిపోవటం 8. తరచూ విరేచనాలు. 9. కళ్ళు ముందుకు చొచ్చుకురావటం. 10. తరచూ రుతు శ్రావం.
11. సక్రమంగా లేని గుండె లయ

చికిత్స : ఇందులో వయసుబట్టి వైద్యం ఉంటుంది. చిన్న వయసులో ఉంటే యాంటి థైరాయిడ్‌ మందులు వాడుతారు. 45 ఏళ్ల లోపు ఉన్న వారిలో అవసరాన్ని బట్టి ఆపరేషన్‌ చేయాల్సిరావచ్చు. రేడియో థార్మికత ఇచ్చే వైద్యం బాగా ప్రాచుర్యం పొందింది. ఇదిసామాన్యంగా 45 ఏళ్లు పైవారికి ఇస్తారు. చికిత్స తీసుకునేటప్పుడు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
propylthiouracil (PTU, AntiTyrox) and methimazole (Neomerkazole,MMI, Tapazole). Carbimazole (which is converted into MMI in the body) is available

మందులు స్పెసలిస్ట్ డాక్టర్ సలహా తో వాడాలి .

హైపోథైరాయిడిజం:

థైరాయిడ్‌ గ్రంధి మామూలుకన్నా తక్కువగా థైరా యిడ్‌ హార్మోన్స్‌ ఉత్పత్తి చేస్తున్న పðడు ఈ పరిస్థితి వస్తుంది.

లక్షణాలు:

1. అలసట, నీరసం. 2. నిద్రమత్తు. 3. ఏకాగ్రత కోల్పోవడం. 4. పెళుసైన పొడిజుట్టు, గోళ్ళు. 5. దురద పుట్టించే పొడి చర్మం. 6. ఉబ్బిన ముఖం. 7 మలబద్దకం. 8. శరీరం బరువెక్కడం. 9. తక్కువైన రుతుశ్రావం. 10. రక్తహీనత.

హైపోథైరాయిడిజంని నిర్ధారణ చేయడం ఎలా

డాక్టర్‌గారు గుర్తించగల ప్రత్యేక లక్షణాలు మరియు శారీరక చిహ్నాలు. థైరాయిడ్‌ వచ్చినపðడు నిపుణులతో స్వరపేటిక పరీక్ష చేయించుకోవలెను. ఎందుకంటే ఒకొక్కసారి థైరాయిడ్‌ వ్యాధి ముదిరి లోపల స్వరపేటికకు ప్రాకి బొంగురు సంభవించవచ్చును.

టి.ఎన్‌.హెచ్‌. ( థైరాయిడ్‌ స్టిమ్యులేటింగ్‌ హార్మోన్‌/థైరో (టోపిన్‌) పరీక్ష. ఎక్కువగా ఉండును .

రక్తంలో పెరిగిన టి.ఎస్‌.హెచ్‌. స్థాయి. హైపో థైరాయిడ్‌జమ్‌ యొక్క ఖచ్చితమైన సూచిక.

థైరాయిడ్‌ హార్మోన్‌ ఉత్పత్తి చేయడం కొద్దిగా తగ్గగానే ఈ పిట్యూటరీ హార్మోన్‌ ఉత్పత్తి ఎక్కువవుతుంది.

చికిత్స : ఈ సమస్య మందుల ద్వారానే నయమవుతుం ది. క్రమం తప్పకుండా రోజూ మందులు తీసుకోవాల్సి ఉం టుంది. ఇది కొద్దిగా ఉన్నప్పుడే డాక్టర్‌ని సంప్రదించి సరైన వైద్యం తీసుకుంటే పూర్తి ఉపశమనాన్ని పొందవచ్చు. పిల్ల ల్లో శారీరకంగా, మానసిక ఎదుగుదల తక్కువగా ఉన్నవా రిలో వైద్యం వల్ల పూర్తిగా నయం కాకపోవచ్చు. పెద్ద వారిలో పూర్తిగా నయమవుతుంది. దీనికి థైరాక్షిన్‌ రిప్లేస్మెంట్ ట్రీట్మింట్ తీసుకోవాలి . లీవో థైరాక్షిన్‌ తగిన మోతాదులొ వాడాలి. డోసు ఎంత తీసుకోవాలో డాక్టర్ని సంప్రదించి వాడాలి .

రేడియం ఎబెలేషన్‌ సాదారణ ట్రీట్మెంట్ లో భాగమయిపోంది .
సర్జరీ కూడా కొన్ని చోట్ల చేస్తారు .

స్పెసలిస్ట్ లు ఎక్కువగా ఉన్న ఈ రోజుల్లో స్పెసలిస్ట్ ని కలిసే తగిన ట్రీట్మింట్ ఎంచుకోవాలి .


గాయిటర్‌-goiter
థైరాయిడ్‌ గ్రంథి అసహజంగా పెరగడాన్ని గాయిటర్‌ అంటారు. ఇందులో రెండు రకాలుంటాయి. మొదటి రకం యుక్త వయసు సమయంలో పెరగడం. ఆ సమ యంలో థైరాయిడ్‌ అవసరం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల పెరుగుతుంది. అప్పుడు గ్రంథి సాధారణంగా రెండు వైపులా పెరుగుతుంది. క్రమేణా కొద్ది రోజుల్లో యాధాస్థితికి వస్తుంది. ఇది సమస్య కాదు. దీనికి భయపడాల్సిన అవసరం లేదు. రెండవ రకంలో ఒక వైపు మాత్రమే గడ్డలాగా ఉండవచ్చు. రెండు వైపులా అసాధారణంగా పెరుగుతుంది. ఇలా తయారైనది థైరాయిడ్‌లో వచ్చిన శాశ్వత మార్పు. ఇది మామూలు స్థితికి రాదు. అందుకే దీనిని వైద్యం తప్పనిసరి అవుతుంది.
చికిత్స : ఇలా అసహజంగా పెరిగిందానికి శస్తచ్రికిత్స అవసరం అవుతుంది. గడ్డలు ఉన్న స్థాయి, ప్రాంతాన్ని, పరిమణాన్ని, సంఖ్యని బట్టి శస్తచ్రికిత్స ఆధారపడి ఉంటుంది. లోవెక్టమీ, హెమీ థైరాయిడ్‌ వెక్టమీ, సబ్‌టోటల్‌ వెక్టమీ అనే సర్జరీలు చేయాల్సి ఉంటుంది.

థైరాయిడ్‌ క్యాన్సర్‌ :
ఇది చాలా అరుదుగా వస్తుంది. సర్జరీయే దీనికి చికిత్స. ఇందులో థైరాయిడ్‌ గ్రంథిని పూర్తిగా తొలగిస్తారు. ఈ ఆపరేషన్‌ తరువాత రోగి అందరిలాగే నిండైన జీవితాన్ని గడిపే అవకాశం ఉంది


గర్భిణులు థైరాయిడ్‌ గురించి ఆలోచించండి!

థైరాయిడ్‌ సమస్యలతో బాధపడే గర్భిణులు జాగ్రత్తగా ఉండటం ఎంతో అవసరం. థైరాక్సిన్‌ హార్మోన్‌ లోపిస్తే (హైపోథైరాయిడిజమ్‌) గర్భస్రావమయ్యే ముప్పు ఎక్కువని చాలామందికి తెలియదు. తగు చికిత్స తీసుకోకపోతే బరువు, రక్తపోటు పెరగటంతో పాటు ముందుగానే కాన్పు అయ్యే అవకాశమూ ఉంది. పుట్టిన పిల్లల్లోనూ బుద్ధి వికాసం అంతగా ఉండదు. మనదేశంలోని గర్భిణుల్లో హైపోథైరాయిడిజమ్‌ తరచుగానే కనిపిస్తున్నట్టు ఇటీవల ఢిల్లీలో చేసిన తాజా అధ్యయనంలో వెల్లడి కావటం మరింత ఆందోళన కలిగిస్తోంది. అందుకే దీనిపై అవగాహన కలిగించేందుకు ఇండియన్‌ థైరాయిడ్‌ సొసైటీ(ఐటీఎస్‌) జనవరి నెలను 'థింక్‌ థైరాయిడ్‌ మంత్‌'గా పాటిస్తోంది. మనదేశంలో గర్భిణుల్లో 6.47 శాతం మంది హైపోథైరాయిడిజమ్‌తో బాధపడుతున్నట్టు తేలటం ఆందోళన కలిగిస్తోంది. పుట్టబోయే బిడ్డల క్షేమం కోసం గర్భిణులంతా థైరాయిడ్‌ పరీక్ష చేయించుకోవాలని (ఐటీఎస్‌) మెంబర్స్ చెబుతున్నారు. చాలామంది గర్భిణులు తాము తీసుకునే ఆహారం, రక్తపోటు, వ్యాయామం, డాక్టర్‌ వద్దకు వెళ్లటంపై ఎక్కువగా దృష్టి పెడుతుంటారు గానీ థైరాయిడ్‌ పరీక్షను అంతగా పట్టించుకోరు. పుట్టబోయే పిల్లల ఆరోగ్యం దృష్ట్యా ఈ పరీక్ష చేయించుకోవటం చాలా అవసరము .

థైరాయిడ్‌ వంటి సమస్యలుండే వారికి పోషకాహారము , 
Nutritive food for Thyroid patitients.

శారీరకంగా, మానసికంగా చురుగ్గా ఉన్నప్పుడే చకచకా పనులు చేసుకోగలం. అదే థైరాయిడ్‌ వంటి సమస్యలుంటే అది సాధ్యం కాదు. నిలువునా నిస్సత్తువ ఆవరించి.. పనిమీద దృష్టి నిలపలేం. థైరాయిడ్‌లో రెండు రకాల సమస్యలుంటాయి. అవి హైపర్‌ థైరాయిడిజమ్‌, హైపో థైరాయిడిజమ్‌. వారి వారి సమస్యను బట్టి ప్రత్యేక పోషకాహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది.

పోషకాహారమే పరిష్కారం..
పురుషుల్లో కంటే మహిళల్లోనే అధికంగా కనిపించే సమస్య హైపర్‌థైరాయిడిజమ్‌. థైరాయిడ్‌ గ్రంథి మోతాదుకు మించి విడుదల చేసే థైరాక్సిన్‌ హార్మోన్‌ కారణంగా ఈ సమస్య ఏర్పడుతుంది. ఈ సమస్య ఉన్నవారిలో సాధారణంగా కనిపించే లక్షణాలు ఒళ్లంతా చెమటలు పట్టడం, వేడికి శరీరం తట్టుకోలేకపోవడం, వణుకు, ఆందోళన, బరువు తగ్గిపోవడం, ఏకాగ్రత లోపించడం, గుండె వేగంగా కొట్టుకోవడం, క్రమం లేని నెలసరి. ప్రతి రెండు వేల మంది గర్భిణుల్లో ఒకరు ఈ సమస్యతో బాధపడుతున్నారని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. గర్భదారణ సమయంలో తగిన రక్తపరీక్షల సాయంతో సమస్యని కనిపెట్టవచ్చు.

ఇనుమే.. ఇంధనం

పోషకాహారంతో ఈ సమస్యకి చెక్‌పెట్టవచ్చు. గర్భిణులు, పాలిచ్చే తల్లులు అయితే ఈ ఆహార నియమాలు తప్పనిసరిగా పాటించాలి. ఈ సమస్య ఉన్నవారు త్వరగా బరువు కోల్పోతారు. కాబట్టి తగినన్ని మాంసకృత్తులు, విటమిన్లు తీసుకొంటూ సంపూర్ణ పోషకాహారంపై దృష్టి సారించాలి. బి విటమిన్లని పుష్కలంగా అందించే పాలు, పాల ఉత్పత్తులు, రాగిజావ, పిండిని పులియబెట్టి చేసే దోశ, ఇడ్లీలు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలుంటాయి. అలాగే ఇనుము అధికంగా ఉండే పదార్థాలని ఆహారంలో చేర్చడం వల్ల నీరసం, అలసట తగ్గుతాయి. ఇందుకోసం గుడ్లు, ముదురు ఆకుపచ్చని ఆకుకూరలు, చికెన్‌, ఖర్జూరం, అంజీర పండ్లని తినాలి.

ఎప్పటికప్పుడు నిస్సత్తువగా అయిపోయే శరీరానికి బలాన్నివ్వాలంటే ఒకేసారి కాకుండా రోజులో ఎక్కువ సార్లు ఆహారాన్ని కొద్దికొద్దిగా తీసుకోవాలి. పంచదార కలపని తాజా పండ్ల రసాన్ని తరచూ తీసుకోవడం వల్ల థైరాయిడ్‌ గ్రంధి నియంత్రణలో ఉంటుంది. వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. సముద్ర చేపల్లో ఉండే మాంసకృత్తులు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రోజుకో గుడ్డు క్రమం తప్పకుండా తీసుకొంటే జీవక్రియలు సాఫీగా సాగుతాయి.

ఇక ఆహార పదార్థాలు వండటానికి ఉపయోగించే వంట నూనెల విషయంలో జాగ్రత్తలు అవసరం. ఆలివ్‌, రైస్‌బ్రాన్‌, పల్లీ, నువ్వల నూనెలు అయితే మేలు. ఇవి చర్మాన్నీ సంరక్షిస్తాయి. వారంలో రోజుకో రకం చొప్పున మితంగా గింజలు తినడం వల్ల కూడా మెరుగైన ఫలితాలు పొందవచ్చు.

ట్రాన్స్‌ ఫ్యాటీ ఆమ్లాలు ఉండే పదార్థాలకి దూరంగా ఉండాలి. అంటే నూనెలో బాగా వేయించిన పదార్థాలకి, బిస్కెట్లు, కేకులు, ఫ్రెంచ్‌ ఫ్రైస్‌ వంటి వాటికీ, అతిగా శుద్ధి చేసిన పదార్థాలకీ దూరం పాటించాలి. టీ, కాఫీ, శీతల పానీయాలని పూర్తిగా మానేయాలి. ఇవి జీవక్రియలని ప్రభావితం చేస్తాయి.

క్రూసీఫెరస్‌ రకం ఆహారపదార్థాలుగా పిలుచుకొనే క్యాబేజీ, క్యాలీఫ్లవర్లతో పాటు పియర్స్‌, పాలకూర, సోయాబీన్స్‌ని తినాలి. ఎందుకంటే ఇవి థైరాయిడ్‌ హార్మోన్‌ ఉత్పత్తిని అదుపులో ఉంచుతాయి.

పాలు, చేపలతో ఫలితాలు

విపరీతమైన ఆందోళన, చర్మం పొడిబారిపోవడం, మలబద్ధకం, ఒళ్లు నొప్పులు, కీళ్లు.. కండరాలు పట్టేసినట్టు ఉండటం, బరువు పెరిగిపోవడం, నెలసరి సమయంలో అధిక రోజులు రక్తస్రావం.. ఇవన్నీ హైపోథైరాయిడిజమ్‌ లక్షణాలు. థైరాక్సిన్‌ హార్మోన్‌ తక్కువ విడుదలవ్వడం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. గర్భం ధరించాలనుకొనే మహిళలు ముందుగా థైరాయిడ్‌ పరీక్షలు చేయించుకోవాలి. నిర్లక్ష్యం చేస్తే రక్తహీనత వంటి సమస్యలని ఎదుర్కోవాల్సి ఉంటుంది.

పాలు, చీజ్‌, మాంసం, చేపలు ఆప్రికాట్లు, ప్రూన్స్‌, ఖర్జూరం, గుడ్డులోని తెల్ల సొన వీటిని తినడం వల్ల ఐయోడిన్‌ పుష్కలంగా అందుతుంది. అలాగే అయొడిన్‌ తగు మోతాదులో ఉండే ఉప్పుని రోజూ అందేట్లు చూసుకోవాలి. శుద్ధిచేసిన ఆహార పదార్థాలకి బదులుగా సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు ఉండే తృణధాన్యాలని తీసుకోవాలి. ముఖ్యంగా ఓట్లు, దంపుడు బియ్యం, జొన్నలు, రాగి వంటివి నెమ్మదిగా జీర్ణమయి అధిక బరువు సమస్యని తగ్గిస్తాయి. దాంతో పాటు కొవ్వునీ తగ్గిస్తాయి. ఇక శక్తిని పుంజుకోవడానికి నిత్యం పండ్లు, తాజా కాయగూరలు అధికంగా తీసుకోవాలి. గుడ్డులోని తెల్లసొన, చేపలు, మాంసం ఇవి మేలు రకం మాంసకృత్తులని అందిస్తాయి.

కొద్దికొద్దిగా.. ఎక్కువ సార్లు ఆహారం
క్యాబేజీ, క్యాలీఫ్లవర్‌, బ్రకోలీ, పాలకూర, పియర్స్‌, స్ట్రాబెర్రీలు.. వీటిని తీసుకోకూడదు. ఎందుకంటే ఇవి థైరాయిడ్‌ స్థాయులని మరింత ప్రభావితం చేస్తాయి. అలాగే పచ్చి వేరుసెనగలకీ దూరంగా ఉండాలి. ఉడకబెట్టినా, వండినా వాటి కొంత ప్రభావం తగ్గుతుంది. సోయాపదార్థాలు తీసుకోవడం వల్ల హైపోథైరాయిడిజమ్‌ మరింత పెరిగే అవకాశం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి సోయా పదార్థాలకీ దూరంగా ఉండాలి. వెల్లుల్లిని కూడా తగిన మోతాదులో తీసుకోవడం వల్ల అయొడిన్‌ స్థాయి నియంత్రణలో ఉంటుంది. ఆహారాన్ని ఒకేసారి పెద్ద మొత్తంలో తీసుకొనే కంటే ఆరుసార్లు కొద్దికొద్దిగా తీసుకోవాలి. ఈ సమస్య ఉన్నవారిలో మలబద్ధకం చాలా సాధారణంగా కనిపించే సమస్య. పీచు అధికంగా ఉండే పదార్థాలని తినాలి. నీళ్లు అధికంగా తాగాలి. హైపోధైరాయిడ్‌ ఉన్నవారు తప్పనిసరిగా తీసుకోవాల్సిన పోషకం సెలీనియం. ఇది చేపలు, మాంసంతో పాటు పుట్టగొడుగుల నుంచీ అందుతుంది. ఇటువంటి ఆహార జాగ్రత్తలు తీసుకొన్నట్టయితే సమస్యని పక్కకు నెట్టి హాయిగా ఉండొచ్చు. 
 
 -  Dr.Seshagirirao-MBBS,DOHM,DAc,MAMS

Friday, May 4, 2012

సొరియాసిస్‌కు సమూల చికిత్స

సొరియాసిస్ రావడానికి కారణాలేవైనా చికిత్స మాత్రం రోగనిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తూ వ్యాధి పునరావృతం కాకుండా చేయగలగాలి. సరిగ్గా హోమియో వైద్య విధానం ఈ విధంగానే ఉంటుందని అంటున్నారు డా.శ్రీకర్‌మను.

ప్రకృతి జీవనానికి ముఖ్య ఆధారం సూర్యరశ్మి. ప్రతీ జీవనక్రియలో సూర్యరశ్మి పాత్ర కీలకం. మానవుని శరీరంలో ఎముకలకు కావలసిన విటమిన్ డి ఉత్పత్తికీ అవసరం. వేసవిలో హఠాత్తుగా పెరుగుతున్న వేడి, తేమ కారణంగా శరీర నీటిశాతం తగ్గడం వల్ల రకరకాల అనారోగ్య లక్షణాలు ముఖ్యంగా చర్మసమస్యలు వచ్చిపడుతున్నాయి. అందులో సొరియాసిస్ ఒకటి. వయసుతో సంబంధం లేకుండా జన్యుపరమైన కారణాల వల్ల స్త్రీలలో ఎక్కువగా సొరియాసిస్ కనిపించవచ్చు.

ఆరోగ్యవంతుల్లో చర్మం ఉపరితలం కింద కొత్తకణాలు నిరంతరం తయారవుతుంటాయి. సుమారు 24 నుంచి 30 రోజులకు ఇవి వెలుపలకు చేరుకుంటాయి. కాని సొరియాసిస్ బారినపడిన వారిలో ఈ వ్యాధి అదుపు తప్పి చర్మకణాలు, మూడు లేదా నాలుగు రోజులకే వేగంగా తయారయి వెలుపలకు చేరుకుంటాయి. ఈ కణాలకు పోషకాలు అందించే ప్రక్రియలో చర్మం మీద ఎర్రని పొర ఏర్పడటం, పొలుసులుగా మారి రాలటం జరుగుతుంది. సర ైన అవగాహన, జాగ్రత్తలేకుండా అందుబాటులో ఉన్న రకరకాల మందులు, షాంపూలు, పైపూతల ద్వారా తాత్కాలిక ఉపశమనంతో రాజీపడటం ద్వారా సమస్య మరింత జఠిలమవుతుంది.

లక్షణాలు: పొట్టు రాలటం, దురద, జుట్టు రాలడం వంటివి ప్రథమ లక్షణాలు. కొంతమందిలో చర్మంలో మంటలు, గోకిన కొద్దీ దురదలు పెరగడం సర్వసాధారణంగా కనిపిస్తుంది. నోటి నుంచి ద్రవం కొంత మందిలో పొక్కులు రావడం, పొలుసులు కట్టడం చూస్తుంటాం. దీర్ఘకాలం చర్మంలో పగుళ్లు ఏర్పడటం, దళసరిగా మారటం జరుగుతుంది. శరీరంలో ఎక్కడైనా ప్రారంభమయ్యే ఈ లక్షణాలు కొంతమందిలో ఎక్కువగా తలలో మొదలయి జట్టు రాలడానికి ముఖ్యకారణంగా మారుతాయి.

కారణాలు: జన్యులోపాలకు కొన్ని రకాల ప్రేరేపిక అంశాలు తోడైనపుడు సొరియాసిస్ వంటి లక్షణాలుగా బయటపడుతాయి. వంశపారపర్యంగా రావడానికి అవకాశం ఉన్నా అదే కారణం కాదు. ప్రొటీన్స్, పౌష్ఠికాహార లోపం, కొన్ని రకాల సబ్బులు, డిటర్జెంట్‌ల వల్ల , హార్మోన్ల సమస్య వల్ల రక్తప్రసరణ తగ్గినపుడు శరీరకణాలకు అవసరమైన ఆహారం లభించకపోవడంతో పాటు జీవక్రియలో ఏర్పడిన వ్యర్థాల తొలగింపులో జాప్యం జరగడం, ఉబ్బరం, విరేచనాలు, ఫుడ్ అలర్జీ, తేన్పులు వంటి గ్యాస్ట్రిక్ సమస్యలు, మానసిక ఒత్తిడి, ఆందోళన అధికమైనపుడు ఉత్పత్తియైన కార్టిసాల్ హార్మోన్ దుష్రభావం, వాతావరణ మార్పులకు శరీరం అలవాటు పడకపోవడం, చిన్న చిన్న అనారోగ్య సమస్యలకు ఇష్టానుసారంగా మందులు వాడటం వల్ల జీవరసాయనాల అసమతుల్యత వల్ల సొరియాసిస్ ప్రారంభమవుతుంది.

తీసుకోవలసిన జాగ్రత్తలు: సొరియాసిస్ అంటువ్యాధి కాదు. ఒకరి నుంచి మరొకరికి సోకదు. సొరియాసిస్ కేవలం చర్మానికి సంబంధించిన లక్షణం కాదు. బలహీనపడిన రోగనిరోధక వ్యవస్థ, చర్మంలో జీవరసాయన చర్యలలో ఏర్పడుతున్న అసమతుల్యతకు ముఖ్యసంకేతాలు. కేవలం ఆహార నియమాలు, జీవనశైలిలో మార్పులతో దీనిని తొలగించలేము. సొరియాసిస్ ఒకేరకమైన కారణం వల్ల అందరిలో రావటం జరగదు. ఏ ఇద్దరిలో కూడా జన్యుపరంగా సమానత్వం ఉండదు. ఈ వ్యాధికి సొంతవైద్యం పనికిరాదు.

సొంతవైద్యం వల్ల సమస్య మరింత ఎక్కువ కావటం, ఆర్థరైటిస్ వంటి వాటికి దారితీయడం జరుగుతుంది. ఒత్తిడి తగ్గించుకుంటూ సరియైన వ్యాయామాలు చేస్తూ, పౌష్ఠికాహారం తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇస్నోఫిల్ కౌంట్, సీబీపీ, హార్మోనల్ అనాలసిస్ వంటి రక్తపరీక్షలతోపాటు స్కిన్ బయాప్సీ, స్కిన్ అలర్జీ పరీక్షలు చేయాలి. రోజూ ఉదయం, సాయంత్రం 10 నుంచి 20 నిమిషాల పాటు వ్యాధి తీవ్రత ఉన్న ప్రదేశంలో సూర్యరశ్మి తగిలేలా చూసుకోవాలి.

సమస్యలు: దీర్ఘకాలం పాటు ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే శరీరమంతటా వ్యాపించడం, జుట్టురాలడం, శరీరంలో నీటిశాతం తగ్గిపోవడం, ఆర్థరైటిస్, గుండె సమస్యలు, రక్తనాళాల సమస్యలకు దారితీయవచ్చు. చర్మంలో పగుళ్లు ఏర్పడటం, రంగుమారటం, దళసరిగా తయారవడం జరుగుతుంది.

హోమియో చికిత్స: సొరియాసిస్ బారినపడిన వారికి ఉపశమనం అందేలా చేయడంతో పాటు పునరావృతం కాకుండా చేయడం చికిత్స ప్రధాన లక్ష్యంగా ఉంటుంది. వ్యాధి ఆధారిత ఇక్కట్లను తొలగించడం తద్వారా శాశ్వత పరిష్కారం లభించేలా చేయడం జరుగుతుంది.

హోమియో మందుల వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. జన్యుపరమైన లోపాలను చక్కదిద్దడం, జీవరసాయనాల అసమతుల్యతలను తొలగించి రోగనిరోధక వ్యవస్థను పటిష్టం చేయడం ద్వారా సమస్య పునరావృతాలను కూడా నియంత్రించడం జరుగుతుంది. చికిత్సా ఫలితాలు జన్యు తత్వం, సంబంధిత అసమతుల్యతను బట్టి మారుతుంటుంది. వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే నిపుణులైన హోమియో వైద్యున్ని కలిసి తగిన చికిత్స తీసుకుంటే సొరియాసిస్ సమస్య సమూలంగా తొలగిపోతుంది.

- డా. శ్రీకర్ మను
ఫౌండర్ ఆఫ్ డా. మనూస్ హోమియోపతి,
ఫోన్ : 9032108108
9030 339 999


Friday, April 6, 2012

ఉచితంగా ఆరోగ్యం

‘ఖర్చు పెట్టి మందులను మాత్రమే కొనగలం. ఆరోగ్యాన్ని కొనలేం’ అన్నది ఒక నానుడి. కానీ ఆరోగ్యాన్ని ఉచితంగానే పొందవచ్చు. మనం రోజూ చేసే పనులతోనే ఒక్క పైసా ఖర్చు కాకుండానే ఆరోగ్యంగా ఉండవచ్చు. కాకపోతే కొద్దిపాటి వ్యాయామం, మంచి బ్రేక్‌ఫాస్ట్, క్రమం తప్పకుండా వేళకు నిద్రపోవడం వంటి కొన్ని మార్గదర్శకాలు పాటించాల్సి ఉంటుందంతే. ఇవన్నీ ఫ్రీగా లభించేవే. ఈ నెల 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఉచితంగానే ఆరోగ్యాన్ని ఎలా పొందవచ్చో తెలిపేదే ఈ కథనం.
మనం పనిచేస్తే ఆరోగ్యకరమైన రీతిలో శక్తి ఖర్చవుతుంది. కానీ మనం పనిచేయకపోయినా మన కండరాలు దెబ్బతింటాయని మీకు తెలుసా? మనం ఎలాంటి శారీరక శ్రమ చేయకుండా బెడ్ రెస్ట్ తీసుకుంటూ ఉంటే రోజుకు ఎనిమిది గ్రాముల చొప్పున కండరాల్లోని ప్రోటీన్ ఖర్చవుతుంది. శారీరక శ్రమ లేనివారిలో ప్రతి వారం 1.54 గ్రాముల మేరకు ఎముకను కోల్పోతాం. కొన్ని రోజుల పాటు అదేపనిగా రెస్ట్ తీసుకుంటే 10-15 శాతం రక్తంలోని ప్లాస్మాను కోల్పోతాం. దీన్ని అధిగమించాలంటే ఖర్చు చేయాల్సింది డబ్బు కాదు... కేవలం కాస్త శారీరక శక్తినే. రోజుకు 40 నిమిషాలు కేటాయించి రోజూ నడకలాంటి వ్యాయామం చేస్తే మనం కోల్పోయే కండరాలను, ఎముకలను (మజిల్ లాస్ అండ్ బోన్ లాస్)ను అరికట్టవచ్చు. మనం రోజూ ఉపయోగించే లిఫ్ట్‌కు బదులు మెట్లపై నడవడం, కాస్తంత సమీపంలోనే ఉన్న ప్రదేశాలకు వాహనాలు వాడకపోవడం వంటివి చేస్తే చాలు. దీనితో పాటు సరైన నిద్ర, తప్పనిసరిగా వేళకు బ్రేక్‌ఫాస్ట్, వేళకు మంచి ఆహారం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి.

ఆరోగ్యం కోసం శారీరక శ్రమ అవసరం. దానికోసం గుర్తుపెట్టుకుని పాటించాల్సిన అంశాలివి...

వాకింగ్ అన్నిటికంటే ముఖ్యమైన వ్యాయామం.

జాగింగ్, రన్నింగ్ వంటివి మొదలుపెట్టే ముందర వాకింగ్ తప్పనిసరిగా చేయాలి.


{పతిరోజూ 40 నిమిషాలు వాకింగ్ చేస్తూ అలా వారంలో కనీసం ఐదుసార్లు పాటించాలి.


వాకింగ్‌లో వేగం ప్రతి గంటకు మూడు కిలోమీటర్ల నుంచి ఏడు కిలోమీటర్ల వరకు ఉండవచ్చు.


వాకింగ్ ఏ వేళలో చేసినా పరవాలేదు. ఉదయం వేళల్లో అయితే మంచిది.


వాకింగ్ చేస్తే తప్పనిసరిగా చెమట పట్టాలనే నియమం లేదు.


జబ్బుతో ఉన్నప్పుడు వాకింగ్ చేయడం మంచిది కాదు.

 నడక మొదలుపెట్టాక ఆపడం మంచిది కాదు. ప్రతిరోజూ చేయాలి. ఎందుకంటే ఒకసారి నడక మొదలు పెట్టాక అడపాదడపా మానేస్తుంటే శరీరం దానికి అడ్జస్ట్ కావడం అన్నది కష్టమై శరీరంమీద చాలా ఒత్తిడి పడుతుంది.

పరగడపున వాకింగ్ కంటే ఏదైనా తేలికపాటి శ్నాక్ తీసుకుని వాకింగ్ చేయడమే మంచిది.


స్మోకింగ్, ఆల్కహాల్ వంటి అలవాట్లు ఉంటే క్రమం తప్పకుండా వాకింగ్ చేయడం వల్ల అవి కూడా తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే మీరు ఆరోగ్యాన్ని పెంచుకుంటున్న స్పృహ మిమ్మల్ని ఆ అలవాట్లకు దూరంగా ఉంచుతుంది.


మంచి బ్రేక్ ఫాస్ట్: మనం ఒక రోజులో ఖర్చు పెట్టే శక్తిలో మూడింట ఒకవంతు మనం ఉదయం తీసుకునే ఆహారం (బ్రేక్ ఫాస్ట్) తోనే వస్తుంది. రోజూ బ్రేక్‌ఫాస్ట్ తినడం వల్ల కేవలం శక్తిని పొందడం మాత్రమే కాదు... మన ప్రవర్తనలోనే మార్పు వస్తుంది.


ఉదాహరణకు
మనలో చిరాకుపడే తత్వం తగ్గుతుంది.

దేనిమీదనైనా దృష్టి కేంద్రీకరించగలిగే శక్తి పెరుగుతుంది.


అవసరాన్ని బట్టి తదేకంగా పనిచేయగలిగే శక్తి మెరుగవుతుంది.


దానితో పాటు మన బరువుకు తగినట్లుగా వేళకు మంచి ఆహారం తీసుకోవాలి.


దీనితో పాటు మన ఆహార అవసరాలకు తగినట్లుగా అవసరమైనన్ని క్యాలరీల ఆహారమే తీసుకోవాలి.



నిద్ర బాగా పట్టాలంటే...

బెడ్‌రూమ్ ప్రశాంతంగా ఉండేలా చూసుకోండి. ఎక్కువ వేడిగానూ, ఎక్కువ చల్లగానూ ఉండకూడదు. నిద్ర వేళ ఎక్కువగా లేకుండా చూసుకోవాలి.

సాయుంత్రం వేళల్లో కాఫీలు, టీలను, కెఫిన్ ఉండే కూల్‌డ్రింక్స్ తీసుకోకూడదు.


రాత్రిపూట గోరువెచ్చని నీటితో స్నానం చేయూలి.


ప్రతి రోజూ నిర్ణీత వేళకే నిద్రకు ఉపక్రమించాలి.


నిద్రకు ముందు  టీవీలో ఉద్వేగం కలిగించే దృశ్యాలున్న సినిమాలూ, సీరియుళ్లు చూడొద్దు.


రాత్రి బాగా నిద్ర పట్టాలంటే పగలు కనీసం అరగంట సేపరుునా పగటి వెలుగులో (డే లైట్) గడపాలి. వుసక వెలుగు రూమ్‌లలో గడిపేవారికి రాత్రివేళల్లో సరిగా నిద్రపట్టదు.


నిద్రకు ముందు ఆహ్లాదకరమైన మ్యూజిక్ వినాలి.


గోరు వెచ్చని పాలు తాగాలి. పాలలో ట్రిప్టోఫ్యాన్ అనే అమైనో ఆసిడ్ ఉంటుంది. దాని వల్ల బాగా నిద్ర పడుతుంది.


నిద్రకు ముందు  పుస్తకాలు చదవడం వంటివి చేయువద్దు. పుస్తకం చదువుతూ ఉంటే అలా మనకు తెలికుండానే నిద్రపడుతుందని చాలా మంది అనుకుంటారు. కానీ... నిజానికి అలా దృష్టి పూర్తిగా చదవడంలో నిమగ్నమైపోతే నిద్రకు దూరమయ్యే సందర్భాలే చాలా ఎక్కువ.


పొగతాగే అలవాటును పూర్తిగా మానుకోండి.


నిద్రకు ముందు ఆల్కహాల్ అస్సలు తీసుకోకూడదు. కొందరిలో ఆల్కహాల్ నిద్ర పట్టడానికి దోహదం చేసినా అది గాఢనిద్ర దశలోకి వెళ్లనివ్వదు. అందుకే మద్యం తాగి నిద్రలోకి జారుకున్న తర్వాత నిద్రలేచాక రిఫ్రెషింగ్ ఫీలింగ్ ఉండదు.


నిద్ర...
ఎప్పుడూ మనలను ఆరోగ్యకరంగా ఉంచే మన మెదడుకు తగినంత విశ్రాంతి కావాలంటే మంచి నిద్ర అవసరం. మంచి నిద్రవల్ల వయసుతో వచ్చే కొన్ని వ్యాధులను నివారించవచ్చు.

Tuesday, March 27, 2012

యువతరం ధ్యాన మంత్రం

http://www.yogiinterrupted.com/wp-content/uploads/2011/11/How-to-Meditate-Properly1.jpg
‘నిత్యం పని ఒత్తిడి..శారీరకంగా..మానసికంగా ఎంతో అలసిపోతున్నాం ..పెరుగుతున్న పోటీతత్వం కారణంగా ఎప్పటికప్పుడు సామర్ధ్యం పెంచుకుంటూ పోటీ పడాల్సి వస్తోంది. ఇంటి బాధ్యతలు..బంధుత్వాలు .. స్నేహాలు ఇలా ప్రతిక్షణం మనిషిని చుట్టే ఆలోచనలు జీవితాన్ని అతలాకుతలం చేస్తున్నారుు. మనసులు మానసిక సంఘర్షణలకు లోనవుతున్నారుు. ఈ బాధ్యతలన్నీ సరైన ప్రణాళిక లేకుంటే ఏ పనీ సరిగా చేయలేం. అనుకున్నవన్నీ సాధించలేం. దీని నుంచి ఎలా బయటపడాలి ? జీవితంలో విజయం ఎలా సాధించాలి ? ఆనందంగా ఎలా ఉండాలి ? సమాజ నిర్మాణంలో మన బాధ్యత ఏంటి ? ఇలా ఎప్పుడైనా ఆలోచించామా ? అనేక శారీరక రుగ్మతలకు మానసిక దుర్బలత్వమే కారణం. మరి మనం శారీరకంగా ఆరోగ్యంగా ఉండా లంటే తగిన వ్యాయామం చేయాలి. మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే మన మెదడుకు పదును పెట్టాలి. అంటే మనసును ప్రక్షాళన చేసుకోవాలి. ఇందుకు ధ్యానం చక్కటి మార్గం. ప్రస్తుతమున్న జీవన విధానం కన్నా ఉన్నతంగా ధ్యానం ద్వారా జీవితాన్ని గడపవచ్చని ధ్యానేకంద్రాల నిర్వాహ కులు చెబుతున్నారు.
Yogad 
ఏదైనా పవిత్ర లక్ష్యాన్ని నిర్థారించుకుని దానిపైనే దృష్టి నిలపడం ధ్యానం. ఇది ఒక పద్ధతి ప్రకారంగా జరగాలి. ధ్యానం యోగాలో ఒక భాగం. మన పూర్వీకులు అనేక సంవత్సరాలు పరిశో ధన చేసి మానవ శరీరం యోగా రూపంలో గొప్ప ఆద్యాత్మిక శక్తిని సాధించే ప్రక్రియను ప్రపంచానికి అందించారు. యోగాకు ఆద్యుడు పతంజలి సూచించిన ప్రకారం ఎనిమిది నియమాలతో కూడుకుంది . భౌతిక శాస్తప్రరంగా, సాంకేతిక విజ్ఞానపరంగా ఎంతో వృద్ధి సాధించినప్పటికీ సంతోషంగా మనం జీవించలేకపోతున్నాం. ఈ దిశగా ఆలోచిస్తే యోగా అవసరమే అని చెప్పక తప్పదు. ఎందుకంటే మానసికంగా, శారీరకంగా ఆరోగ్యవంతమైన జీవితం కోసం యోగా, ధ్యానం సాధనచేస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయని సాధకులు చెబుతున్నారు.

యోగా ప్రయోజనాలు ఇవీ...

Yoga3 
మనం సాధన చేసే తీరును బట్టి ఫలితాలు ఉంటాయి. మనం ప్రతి రోజూ భౌతిక విధులు నిర్వర్తిస్తున్నట్లుగానే ధ్యానాన్ని కూడా నిత్యకృతగా మార్చుకుంటే మంచి ఫలితాలు బోధపడతాయని యోగా నిపుణులు చెబుతున్నారు. కేవలం శారీరక, మానసిక ఆరోగ్యా లకే ఈ ధ్యానం పరిమితం కాదు. మనం ప్రశాంతంగా జీవిస్తూ, మన చుట్టూ ప్రశాంత వాతావరణం ఉండేలా చేయడమే ధ్యానం. నిర్మాణాత్మక సమాజం దిశగా మనం పయనించేందుకు ధ్యానం గొప్ప వరం. సాంప్రదాయ యోగా క్రమేణా అనేక పద్ధతుల్లో ప్రాచుర్యంలోకి వచ్చింది. ఎన్నో సంస్థలు పలు రకాలుగా యోగా, ధ్యానంలో శిక్షణ ఇస్తూ వాటి కేంద్రాలను విస్తరిస్తున్నాయి. http://yogalina.files.wordpress.com/2012/01/pilates_mat_class_joyg-ay24.jpg
విదేశాల్లోనే ఎక్కువ ఆదరణ...
యోగా మన దేశంలో పుట్టినప్పటికీ విదేశా ల్లోనే ఎక్కువ ఆదరణకు నోచుకుంటోందని యోగా గురువు ఎ.ఎల్వీ కుమార్‌ చెబుతున్నారు. అన్నారు. అమెరికా, స్వీడన్‌, కెనడా, యుకె, పోలెండ్‌ దేశాలకు చెందిన 20 మంది పాశ్చాత్యులు యోగా నేర్చుకోవడానికి ఇటీవల భాగ్యనగరానికి విచ్చేశారు. యోగా హీలింగ్‌ ఫౌండేషన్‌ అనే స్వచ్చంద సంస్థ సాంప్రదాయయోగా (ట్రెడిషనల్‌ యోగా) లో టీచర్లకు గత కొద్ది కాలంగా శిక్షణను అందిస్తోంది. శిక్షణలో భాగంగా ఆసనాలు, ప్రాణాయామ, శ్వాస పద్ధతులు, మెడిటేషన్‌ తదితర అంశాలపైన క్లాసులు ఇస్తున్నారు. ఇవే కాకుండా యోగా పరిచయం, ఎక్‌స్టర్నల్‌ (బహిర్గత), ఇంటర్నల్‌ (అంతర్గత) యోగా, ఇతర ప్రత్యామ్నాయ శాస్తల్రను బోధిస్తున్నారు.

ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌లో శిక్షణ...
Yogal 
ప్రధానంగా ధ్యానం పైనే దృష్టిని కేంద్రీకరిస్తారు. రిథమిక్‌ టైప్‌ ఆఫ్‌ బ్రీథింగ్‌లో ఆరు రోజులపాటు ఈ శిక్షణ ఉంటుంది. ప్రతి రోజు మూడు గంటలపాటు ప్రాణా యామం బస్ర్తిక, సుదర్శన్‌ క్రియల్లో శిక్షణ ఇస్తారు. ఈ ధ్యానం వల్ల శరీరానికి 72 నుంచి 80 శాతం వరకు గాలి అదనంగా అందుతుంది. మానసిక ఒత్తిడిని దూరం చేసి ఇతరత్రా సమస్యలను ఎదుర్కొనేందుకు ఆత్మ విశ్వాసాన్ని పెంపొందిస్తుంది. దీనిని ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ అందిస్తోంది. కోర్సు పూర్తయిన తరువాత ప్రతి రోజూ 20 నిముషాల పాటు దీనిని కొనసాగిస్తే సరిపోతుంది.
-ఇస్కా రాజేష్‌బాబు
‘సూర్య’ ఫీచర్స్‌ ప్రతినిధి

Tuesday, January 10, 2012

ఆకలి... ఆరోగ్యం...


ఉపవాసం పేరిట లంఖణాలు చేయడం అంత మంచిది కాదు. అలా కడుపును చాలా సేపు ఖాళీగా ఉంచడం సరైనది కాదు. కడుపును ఖాళీగా ఉంచడం, పూర్తిగా భర్తీ చేసేయడం... ఈ రెండూ మంచిది కాదు.
 
  మీకు వేళకు ఆకలవుతుందా? మంచి జీర్ణశక్తి ఉందా? అది మంచి ఆరోగ్య సూచన. ఆ ఆరోగ్యాన్ని అలా కొనసాగించాలి. మనం పనులతో దాన్ని నిర్లక్ష్యం చేసి ఆకలిని పట్టించుకోకుండా ఉండటం, వేళకు తినకపోవడం, వేళ మించాక తినడం వంటివి చేస్తే చేజేతులారా సమస్యలను కొని తెచ్చుకున్నట్లే. ఆకలి విషయంలో పాటించాల్సిన ఆరోగ్య సూచనలివి... 

http://chicshaping.com/wp-content/uploads/2011/12/hay-diet.jpg
కరకరలాడిపోతున్నట్లుగా మరీ ఆకలి పెరిగిపోయేవరకూ ఆగకండి. అలాగని ఆకలి వేయకుండానే తినేయకండి. వేళకు తింటూ ఉంటే అదే సమయానికి ఆకలి అనిపిస్తుంది. క్రమం తప్పకుండా ఒకే సమయంలో తినడం అన్ని విధాలా మంచిది.
రెస్టారెంట్‌లాంటి చోట్లకు వెళ్లినప్పుడు వండి వడ్డించాల్సిన భోజనం వచ్చేలోపు రెడీమేడ్‌గా దొరికేవాటినే చాలా మంది తినేస్తుంటారు. అలాంటి సమయంలో అందుబాటులో ఉన్న బెకరీ ఐటమ్స్‌తో కడుపును నింపేయకండి. కాస్త ఆలస్యం అయినా... పోషకాలను అందించే ఉడికించిన భోజన పదార్థాలనే తినండి. 

http://healthyetips.com/wp-content/uploads/2011/08/2087080.jpg
బ్రేక్‌ఫాస్ట్ రాజుగారి భోజనంలా భారీగా ఉండవచ్చు. మధ్యాహ్న భోజనం ధనికులు తినే భోజనంలా ఉండవచ్చు. కానీ... రాత్రి తినేది మాత్రం సామాన్యులు తినేలా ఉండాలి. అంటే... రాత్రుళ్లు పరిమితంగా తినాలని గుర్తుపెట్టుకోండి.
మీరు భోజనంతో పాటు సాఫ్ట్ డ్రింక్స్‌గాని, జ్యూస్‌గానీ కలిపి తీసుకోకండి. భోజనం సమయంలో వీలైనంతగా నీళ్లు కూడా తాగకండి. భోజనం పూర్తయ్యాకే నీళ్లు తాగండి. 

http://healthyweightlossmanagement.com/wp-content/uploads/2009/08/healthy_eating_s1_family_eating_healthy.jpg
మీరు మటన్, చికెన్ వంటి మాంసాహారం తీసుకుంటూ ఉంటే... దానితో పాటు వీలైనంతగా ఉడికించిన కూరగాయలు, పండ్లు తినండి.
ఆకలి తీరినట్లు అనిపించగానే తినడం ఆపేయండి. భోజనం రుచిగా ఉంది కదా అని మరీ ఎక్కువగా తినేయకండి. దాని వల్ల వచ్చే అనర్థాలు ఎన్నో!
పాప్‌కార్న్స్, శ్నాక్స్, సాఫ్ట్‌డ్రింక్స్ లాంటి చిరుతిండ్లకు దూరంగా ఉండండి.
వృత్తిపరంగా ఎన్ని ఒత్తిడులు ఉన్నా భోజనం వేళను పాటించండి. రాత్రుళ్లు చాలాసేపు ఆగాల్సి వస్తే రాత్రి భోజనం స్కిప్ చేయకండి. పొటాటో చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ వంటి పదార్థాల స్థానంలో దోసముక్కలు, క్యారట్ ముక్కలు, టొమాటో ముక్కలు వంటి సలాడ్స్ తీసుకోండి. 

http://healthyeatingportal.com/i/img09.jpg
ఎవరైనా ఏదైనా ఆఫర్ చేసినప్పుడు అన్ని వేళలా అన్ని పదార్థాలూ తినకండి. స్నేహపూర్వకమైన ఒత్తిడితో అన్నీ తినేయకండి. ఆరోగ్యకరం కాని వాటిని వద్దనడమూ నేర్చుకోండి. 

http://www.goodhealthhabit.com/wp-content/uploads/2011/09/facts-about-healthy-eaeting.jpg
ఉపవాసం పేరిట లంఖణాలు చేయడం అంత మంచిది కాదు. అలా కడుపును చాలా సేపు ఖాళీగా ఉంచడం సరైనది కాదు. కడుపును ఖాళీగా ఉంచడం, పూర్తిగా భర్తీ చేసేయడం... ఈ రెండూ మంచిది కాదు.
ఆల్కహాల్ అలవాటును పూర్తిగా మానేయండి.

Friday, December 23, 2011

సోరియాటిక్ ఆర్థరైటిస్‌కు మేలైన చికిత్స

దీర్ఘకాలిక వ్యాధి అయిన సొరియాసిస్‌కు శాస్త్రీయ చికిత్స చేయించుకోకుంటే ఇది మరింత జటిలమై సొరియాటిక్ ఆర్థరైటిస్‌గా రూపాంతరం చెందుతుంది. మానసికంగా, శారీరకంగా రోగి జీవనశైలిని నియంత్రిస్తున్న సొరియాసిస్‌కు సొంత వైద్యం చేస్తే దుష్ఫలితాలు వస్తాయి. సొరియాటిక్ ఆర్థరైటిస్‌కు హోమియోలో మెరుగైన చికిత్స ఉందంటున్నారు సీనియర్ హోమియో వైద్యులు డాక్టర్ శ్రీకర్ మనూ.

సొరియాటిక్ ఆర్థరైటిస్ వ్యాధి బారిన పడిన వారి దైనందిన జీవితం దుర్భరంగా వుంటుంది. చర్మం ఎర్రబడటం, దురద, మంటతో పాటు చర్మం పొలుసులుగా రాలటం సొరియాసిస్ లక్షణాలు. ఈ లక్షణాలతోపాటు కీళ్లవాపు, నొప్పి, బిగుసుకుపోవటం వంటి లక్షణాలు తోడైనపుడు 'సొరియాటిక్ ఆర్థరైటిస్'గా గుర్తించవచ్చు. సొరియాసిస్ రోగుల్లో పదిశాతం మందిలో సొరియాటిక్ ఆర్థరైటిస్ లక్షణాలు కనిపిస్తాయి.

ఈ సమస్య స్త్రీ,పురుష భేదం లేకుండా వయసు పెరుగుతున్న కొద్దీ వస్తుంది. 40 నుంచి 50 సంవత్సరాల వయసు వారిలో ఎక్కువగా ఈ వ్యాధి సోకుతుందని అధ్యయనంలో తేలింది. 80 శాతం మంది సొరియాసిస్ వ్యాధి సోకిన తరువాత ఆర్థరైటిస్ సమస్యకు గురవుతున్నారు. 15 శాతం మందిలో ఆర్థరైటిస్ వచ్చిన తర్వాత సొరియాసిస్ బారిన పడటం కనిపిస్తుంది.

కారణాలు

జన్యువులు, వాతావరణం, రోగనిరోధక వ్యవస్థ, మానసిక కారణాలు, వాడుతున్న మందుల దుష్ప్రభావం వంటి కారణాల వల్ల సొరియాటిక్ ఆర్థరైటిస్ వస్తుంది. సొరియాటిక్ ఆర్థరైటిస్ సమస్య తో బాధపడుతున్న వారిలో 50 శాతం మందిలో హెచ్ఎల్ఎ-బి27 జీన్స్ ప్రభావం వల్ల ఈ సమస్య వస్తున్నదని తేలింది. రోగనిరోధక వ్యవస్థలోని హెల్పర్ టీ కణాల సంఖ్య తగ్గటం కూడా ఈ వ్యాధి రావటానికి ఒక కారణమని తాజా పరిశోధనలు చెపుతున్నాయి.

ముఖ్య లక్షణాలు

కీళ్ల నొప్పి, వాపు లేదా బిగుసుకు పోవటం ఈ వ్యాధి లక్షణం. కీళ్లపై ఉన్న చర్మం ఎర్ర బడటం, వేడిగా అనిపించటం, కీళ్లు ముఖ్యంగా చేతులు, కాళ్లు వంకర పోవటం వంటి మార్పులు వస్తాయి. చేతులు, కాలి గోర్లలో మార్పులు రావటం, వాపుతో నిర్మాణ మార్పులు వస్తాయి. కీళ్ల చుట్టూ ఉన్న నరాల్లో సొరియాటిక్ ఆర్థరైటిస్ ప్రభావం వల్ల కండరాలు, ఊపిరితిత్తులు, నడుములోని రక్తనాళాల్లో కూడా మార్పులు సంభవిస్తాయి.

దీనివల్ల ఛాతినొప్పి, గుండె సమస్యలు తలెత్తవచ్చు. శరీరాన్ని కాపాడే రోగ నిరోధక కణాలు శరీరంలోని ముఖ్య అవయములపైన దుష్ప్రభావం చూపటం వల్ల ఈ లక్షణాలు మొదలవుతాయి. కేసు హిస్టరీతో పాటు శారీరక పరీక్షలు, రక్తపరీక్షలు, ఎక్స్‌రే వంటివి చేయటం ద్వారా సొరియాటిక్ ఆర్థరైటిస్‌ను నిర్ధారించవచ్చు. ఇవే కాకుండా హెచ్ఎల్ఎ బి-27, సీటీ, ఎంఆర్ఐ వంటి పరీక్షలు కూడా కొన్నిసందర్భాల్లో చేయాల్సి రావచ్చు.

అపోహలు

సొరియాసిస్ లేదా సొరియాటిక్ ఆర్థరైటిస్ గాని అంటువ్యాధులు కావు. రోగితో సహజీవనం చేయటం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు కలగవు. పరిశుభ్రత లేని కారణంగా సొరియాసిస్ రావటం అనేది కేవలం అపోహ మాత్రమే. జన్యుపరంగా వ్యాధి వచ్చే అవకాశం ఉన్న వారికి ఇన్‌ఫెక్షన్, మానసిక ఆందోళన, చర్మానికి గాయం, హార్మోన్‌ల ప్రభావం, కొన్ని రకాల మందుల దుష్ప్రభావం వంటి ప్రేరేపకాలు తోడైనపుడు ఈ వ్యాధి రావచ్చు. సొరియాటిక్ ఆర్థరైటిస్ కేవలం చర్మానికి, కీళ్లకు సంబంధించిన వ్యాధి కాదు.

సరైన చికిత్స చేయించుకోలేక పోయినపుడు ప్రాణాంతకంగా కూడా మారే దీర్ఘకాలిక వ్యాధి. ఈ వ్యాధి నిర్ధారణ అంత సులభం కాదు. ఒక్కో సారి మిగిలిన చర్మవ్యాధులు అంటే డర్మటైటీస్, గజ్జి లేదా ఎలర్జీ వంటి వాటితో తప్పుడు నిర్ధారణ చేస్తారు. సొరియాసిస్ లేదా ఆర్థరైటిస్‌కు చికిత్స లేదనటం కేవలం అపోహ మాత్రమే. మనిషి జన్యు నిర్మాణ వ్యవస్థను బలోపేతం చేసి, ఎలాంటి లోపాన్ని అయినా సరిచేయగలిగిన ఏకైక చికిత్సా విధానం హోమియోపతి. హోమియోపతి వైద్యం ద్వారా ఇలాంటి రుగ్మతల నుంచి సంపూర్ణ విముక్తి పొందే అవకాశముంది.

మేలైన హోమియో వైద్యం

ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా చికిత్స చేయటం హోమియో వైద్యుల అదనపు బలం. సొరియాసిస్ చికిత్సలో హోమియో వైద్యుడు ఎలాంటి తైలాలు, పైపూతలు లేకుండా కేవలం మందులతో నయం చేయవచ్చు. మార్పులు మనిషి జన్యు నిర్మాణాన్ని బట్టి ఉంటుంది. అయితే మానసిక ఒత్తిడిని తగ్గించుకోవటం, శారీరక పరిశ్రమ చేయటం, పౌష్టికాహారం తీసుకోవటం లాంటివి చాలా ముఖ్యం.

హోమియో మందులు కీళ్లపై దాడి చేస్తున్న కణాలను నియంత్రించే జన్యువుల సంకేతాలను సరిచేయటం ద్వారా చికిత్సా విధానం ఆరంభమవుతుంది. తద్వారా శరీర అవయవాల్లో జరిగే జీవనక్రియల్లో సమతౌల్యం ఏర్పరచటం వల్ల వ్యాధిని సమూలంగా తగ్గించే వీలుంటుంది. ఈ చి కిత్సా విధానంలో వ్యాధి తిరగబెట్టే ప్రసక్తే వుండదు. దీనికోసం రోగి సహకారం అత్యంత ముఖ్యం.

సొరియాసిస్ లేదా సొరియాటిక్ ఆర్థరైటిస్ గాని అంటువ్యాధులు కావు. రోగితో సహజీవనం చేయటం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు కలగవు. పరిశుభ్రత లేని కారణంగా సొరియాసిస్ రావటం అనేది కేవలం అపోహ మాత్రమే.జన్యుపరంగా వ్యాధి వచ్చే అవకాశం ఉన్న వారికి ఇన్‌ఫెక్షన్, మానసిక ఆందోళన, చర్మానికి గాయం, హార్మోన్‌ల ప్రభావం, కొన్ని రకాల మందుల దుష్ప్రభావం వంటి ప్రేరేపకాలు తోడైనపుడు ఈ వ్యాధి రావచ్చు.
- డాక్టర్ శ్రీకర్ మను
ఫౌండర్ ఆఫ్ డా.మనూస్
హోమియోపతి,
ఫోన్స్: 9032 108 108
9030339999

ఆత్మజ్ఞానం..క్రియాయోగం

ఆత్మజ్ఞానం..క్రియాయోగం

మనిషి ఆత్మజ్ఞాన సాధన కోసం చేసేదే క్రియాయోగం. పతంజలి మహ ర్షి తన యోగ శాస్త్రంలో చెప్పిన క్రియా యోగం, భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించిన కర్మయోగం సంధానం చేసి క్రియాయోగంగా ప్రపంచానికి అందించారు శ్యామాచరణ లాహిరి. ఆయన శిష్యులలో అతి ముఖ్యులు, క్రియాయోగాన్ని విశ్వవ్యాపితం చేయడానికి కృషి చేస్తున్న డాక్టర్ అశోక్ కుమార్ చటర్జీ 79వ జన్మదినం నేడు. 
ఆ సందర్భంగా క్రియాయోగదర్శనం...
ప్రాణమే భగవంతుడని, దానినే ఈశ్వరుడు, విష్ణువు, శివుడు, అల్లా, జీసస్ ఇలా అనేక నామాలతో పిలవడం జరుగుతోందని తపస్సంపన్నులైన మన మహర్షులు, యోగులు చెబుతారు. అదే అనంత సృష్టిని ధరిస్తోంది. ఈ ప్రాణమే దేహంలో శ్వాస రూపంలో చంచలంగా ఉంది. దాన్ని స్థిరం చేసే విధానమే క్రియా యోగం. బయట శ్వాసని బయటే విడిచిపెట్టి దేహంలో ఉండే ప్రాణ, అపాన వాయువులతో చేసే అంతర్ముఖ ప్రాణాయామమే ఈ క్రియా యోగం. క్రియా యోగ సాధన వల్ల కేవలకుంభక స్థితిని పొందడం ద్వారా సమస్తమైన ప్రాపంచిక చంచలత్వం నశించి ప్రాణం, అంతర్ముఖం చెంది, స్థిర ప్రాణంగా అనగా కర్మాతీత, గుణాతీత, ఇచ్ఛారహిత నిర్గుణ పరబ్రహ్మని పొందడం జరుగుతుంది. ఇది ప్రాణ సాధన.

ఈశ్వరప్రాప్తికి మార్గం ఆత్మజ్ఞాన సంపన్నులైన మునులు, ఋషులు, యోగ పురుషులతో సనాతన భారతదేశం ఈ అనంత విశ్వంలో ధార్మిక జగత్తుకి రాజధానిగా నేటికీ విరాజిల్లుతోంది. సంసార బంధనాలలో చిక్కుకున్న బాధాతప్తహృదయులకు ఈశ్వరప్రాప్తి పొందే సహజమైన, సత్యమైన యోగసాధనను సంప్రాప్తింపచేయటానికి భగవానుడు 1828 సెప్టెంబర్ 30న యోగిరాజ శ్యామచరణ లాహిరి అవతారంలో జన్మించారు. బెంగాల్ నదియా జిల్లాలోని ఘుర్ని గ్రామంలో జన్మించిన లాహిరి చిన్నతనంలోనే తల్లిని కోల్పోయారు. తన మూడవ ఏటి నుంచే ధ్యానలోకంలోకి అడుగిడిన లాహిరి మెడ దాకా ఇసుక కప్పుకుని ధ్యానం చేసేవారు. ఆయన ఐదవ ఏట వరదలు వచ్చి పూర్వీకుల గృహం కొట్టుకుపోగా కుటుంబం వారణాసికి వలసవెళ్లింది. ఆయన జీవితకాలంలో ఎక్కువభాగం వారణాసిలోనే గడిపారు.

శ్యామాచరణులు వేదం, ఉపనిషత్తులు వంటి శాస్త్రాలతోపాటు ధార్మిక గ్రంథాలను అధ్యయనం చేశారు. ఉదరపోషణార్థం బెంగాలీ, ఇంగ్లీషు, ఉర్దూ, హిందీ భాషలు నేర్చుకొని మిలటరీ ఇంజనీరింగ్ వర్క్స్‌లో గుమాస్తాగా చేరారు. వేతనం సరిపడనంతగా లేకపోవడం వలన కుటుంబ ఖర్చుల కోసం ట్యూషన్లు కూడా చెప్పేవారు. ఐదుగురు సంతానం కలిగి, అన్నదమ్ముల గృహకలహాల నడుమ జీవిక సాగిస్తూ యోగులు, సాధువులు, మహాత్ముల తపోభూమిగా, దేవభూమిగా ప్రసిద్ధిగాంచిన హిమాలయాలలో తపస్సు సాగిస్తున్న శ్రీకృష్ణ భగవాన్ స్వరూపులైన బాబాజీ వద్ద క్రియాయోగ దీక్షను పొందారు శ్యామాచరణులు.

వారి ఆజ్ఞమేరకు గృహస్థు యోగ్యతతో గృహస్థాశ్రమంలోనే ఉంటూ కఠోర యోగ సాధన చేసి కొత్తకొత్త ఎత్తులను అనాయాసంగా దాటుతూ, సాధనలో ఉచ్ఛతమ స్థితిని పొంది, సరళము, నిరాడంబరమైన, అతి స్వల్ప సమయంలో ఫలమిచ్చే క్రియాయోగ సాధనని సంసారులకు ఇవ్వడం ఆరంభించారు. కాశీలో నడిచే విశ్వనాథునిగా పేరుగాంచిన శ్రీత్రైలింగస్వామి వారి ప్రేమను, ప్రశంసలు, ఆదరాభిమానాలను లాహిరి మహాశయులు పొందగలిగారు.

దైవంతో సంభాషణ కుల, మత, జాతి, పేద, ధనిక అనే తారతమ్యాలు లేకుండా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు, ఆత్మజ్ఞాన పిపాసులందరికీ క్రియాయోగ దీక్షని శ్యామాచరణులు అందచేశారు.'నీవు ఎవరికి చెందవు..అలాగే నీకూ ఎవరూ చెందరు. ఏదో ఒకరోజు హఠాత్తుగా ఈ లోకంలోని సమస్తాన్ని త్యజించవలసి వస్తుంది. ఇప్పటి నుంచే దైవంతో సాన్నిహిత్యాన్ని పొందు. క్రియోయోగం ద్వారా దైవంతో సంభాషించు. సత్యం నీకు గోచరిస్తుంది. ధ్యానం ద్వారా అన్ని సమస్యలను పరిష్కరించుకో. జీవితంలో నీకు ఎదురయ్యే అన్ని చిక్కు ప్రశ్నలకు ధ్యానంలో సమాధానాలు లభిస్తాయి' అని శ్యామాచరణులు తన శిష్యులకు ఉద్బోధించేవారు.

షిరిడీ సాయినాథుడు కూడా లాహిరి మహాశయుల వద్ద క్రియా యోగ దీక్షను పొందినట్లుగా లాహిరి వారి రహస్య డైరీల ద్వారా తెలియవచ్చింది. 1895 సెప్టెంబర్ 26న తాను ఇక ఈ లోకాన్ని విడిచే సమయం ఆసన్నమైందని లాహిరి మహాశయులు తన శిష్యులు కొందరికి తెలియచేశారు. 'నేను నా స్వగృహానికి వెళుతున్నాను. నా గురించి చింతించకండి. నేను తిరిగి జన్మిస్తాను' అని చెప్పి మహాసమాధిలోకి ప్రవేశించారు శ్యామాచరణులు. హరిద్వార్‌లోని కేశవ ఆశ్రమంలో లాహిరి మహాశయులవారి సమాధిని దర్శించవచ్చు.

ఒకే పృథ్వి-ఒకే ధర్మం క్రియా యోగాన్ని పునఃస్థాపించిన శ్యామాచరణ లాహిరి శిష్యులలో ముఖ్యులు డాక్టర్ అశోక్‌కుమార్ చటర్జీ. లాహిరి మనుమడు స్వర్గీయ సత్యాచరణ లాహిరి వద్ద క్రియాయోగంలోని ఉత్తమ దశలన్నీ పొంది, అతి స్వల్ప కాలంలో మహోన్నత స్థితిని పొంది, ప్రపంచ క్రియా యోగాచార్యులుగా ఖ్యాతి గడించారు ఆయన. 1997 ఏప్రిల్ 27న ఫ్రాన్స్ దేశంలోని హ్యూగన్ పట్టణంలో టిబెట్ ఆధ్మాత్మిక గురువు దలైలామా ఆధ్వర్యంలో జరిగిన విశ్వధర్మ సమ్మేళనంలో మన దేశం నుంచి సనాతన ధర్మపు ఏకైక ప్రతినిధిగా చటర్జీ ఒక్కరికే ఆహ్వానం దక్కడం ఆయన కీర్తికి నిదర్శనం. ఆ సమ్మేళనానికి హాజరైన చటర్జీ 'రండి..అందరం కలిసి ఈ బహు ధర్మాల అస్థిత్వాన్ని మరచి, విభేదాలను విడనాడి ఒకే భగవంతుడు, ఒకే పృథ్వి, ఒకే ధర్మం, ఒకే మనిషి అనే సత్యాన్ని స్వీకరిద్దాం' అంటూ ఉత్తేజభరితంగా చేసిన ప్రసంగానికి అన్ని దేశాల మత ప్రతినిధులతోపాటు దలైలామా నుంచి కూడా ప్రశంసలు లభించాయి.

క్రియా యోగ రాజధాని నేడు కొందరు గురువులుగా చలామణి అవుతూ లాహిరి మహాశయులు అందించిన క్రియాయోగాన్ని రకరకాలుగా మార్పు చేసి, ఆ మహనీయుని పేరును దుర్వినియోగపరుస్తున్నారు. ఈ పరిస్థితులలో లాహిరి మహాశయులు అందించిన క్రియాయోగాన్ని యథాతధంగా అందించడానికి చటర్జీ దీక్షాబద్ధులై నిరంతరం శ్రమిస్తున్నారు. ఈ క్రమంలో డాక్టర్ చటర్జీ కోల్‌కతాకు 100 కిలోమీటర్ల దూరంలో గల కాకద్వీపంలో విశ్వానికంతటికీ క్రియా యోగ రాజధానిని నిర్మించారు. అలాగే ప్రధాన కేంద్రంగా లాహిరి మహాశయుల మందిరాన్ని నిర్మించి యోగిరాజ శ్యామచరణ సనాతన మిషన్‌ను స్థాపించారు. కుల, మత, దేశ తారతమ్యం లేకుండా ఆత్మ పిపాసులందరికీ క్రియాయోగ దీక్షను ప్రదానం చేస్తున్నారు డాక్టర్ చటర్జీ.

Monday, December 12, 2011

మానసిక వికాసానికి యోగా

dheera2 
ఆరోగ్య సంరక్షణకు సూక్ష్మ క్రియలు అధికంగా ఉపయోగపడతాయి. ఇవి శరీరంలోని మాలిన్యాన్ని తొలగించి, ఆయా అవయవాలకు వ్యాయామం కలుగజేసి, వాటి సామర్థ్యాన్ని పెంచుతాయి. ఈ సూక్ష్మ యోగ క్రియలను క్రింద కూర్చుని చేయాల్సి ఉంటుంది. క్రింద కూర్చోలేని వారు కుర్చీ మీద గాని లేక మంచం మీదగాని కూర్చొని చేయవచ్చు. కూర్చోలేకపోతే పడుకుని కూడా చేయవచ్చు. ఈ క్రియలు ఉదరం మీద ప్రభావాన్ని చూపుతాయి. కనుక భోజనం చేసిన తర్వాత వెంటనే చేయకూడదు. సూక్ష్మయోగ క్రియా ఏ అవయవానికి సంబంధించిందో ఆ అవయవం మీద మనస్సును కేంద్రీకరించడం అవసరం. ప్రతి క్రియ 30 నుంచి 60 సెకన్లు వరకు శక్తిని బట్టి చేయాల్సి ఉంటుంది.

యోగ ప్రార్థన క్రియ...
కూర్చొని రెండు చేతులు జోడించి, నమస్కారం చేస్తూ యోగ ప్రార్థన చేయాలి. మనస్సు ప్రశాంతంగా ఉండాలి. శ్వాస సాధారణంగా ఉండాలి. ప్రార్థన చేస్తున్నప్పుడు శ్వాస వదలాలి.
ప్రార్థన క్రియ వలన మనస్సుకు చంచలత్వం పోయి, స్థిరత్వం వస్తుంది. మనస్సులో ఏకాగ్రత కుదురుతుంది. హృదయ శుద్ధి కలుగుతుంది.

భస్ర్తిక క్రియ...
భస్ర్తిక క్రియలు నాలుగు రకాలు. ఇవి శ్వాస, ప్రశ్వాసల ద్వారా శరీర అవయవాలకు శుద్ధి కలిగించే క్రియలు. రెండు ముక్కుల ద్వారా వేగంగా శ్వాస వదలాలి, పీల్చాలి. ఇది భస్త్రిక క్రియ. కుడి ముక్కు రంధ్రం మూసి, ఎడమ ముక్కు రంధ్రం ద్వారా గాలిని త్వర త్వరగా వదలాలి, పీల్చాలి.ఇది చంద్రాంగ భస్ర్తిక. ఎడమ ముక్కు రంధ్రం మూసి, కుడి ముక్కురంధ్రం ద్వారా గాలిని వేగంగా వదలాలి, పీల్చాలి. ఇది సూర్యాంగ భస్ర్తిక. ఎడమ ముక్కు రంధ్రం ద్వారా గాలిని వేగంగా వదలాలి, పీల్చాలి. వెంటనే కుడి ముక్కు రంధ్రం ద్వారా వేగంగా వదలాలి, పీల్చాలి. ఇది సుషుమ్నా భస్ర్తిక. పై క్రియల వల్ల శరీరంలోని మాలిన్యం పోతుంది. వివిధ అవయవాలకు శుద్ధి కలిగి, వాటికి చైతన్యం కలుగుతుంది.

శిరస్సుకు...
ప్రతి క్రియ 30 సెకన్‌లతో ప్రారంభించి, 60 సెకన్ల వరకు చేయాల్సి ఉంటుంది. ఈ క్రియలు చేస్తున్నప్పుడు గాలిని కంఠం దాటి, లోనికి పోనీయకూడదు. ఇందులో పలు క్రియలున్నాయి.

ఎ. కంఠశుద్ధి: కంఠశుద్ధి కోసం శిరస్సును తిన్నగా ఉంచి, ఎదురుగా చూస్తూ, శ్వాసను వేగంగా వదలాలి, పీల్చాలి.
బి. ఆత్మశుద్ధి వృద్ధి: ఆత్మశక్తిని పెంచేందుకు, భయం పోయేదానికి, శిరస్సును ఎత్తి, శిరస్సు వెనకుక వైపున గల శిఖాభాగం మీద మనస్సును కేంద్రీకరించి, వేగంగా శ్వాస పీల్చాలి, వదలాలి.
సి. జ్ఞాపక శక్తి వికాసం: జ్ఞాపకం లేదా స్మరణ శక్తిని పెంచేందుకు శిరస్సును సగం వంచి, వేగంగా శ్వాస వదలాలి. మనస్సును మాడు మీద కేంద్రీకరించాలి.
డి. మేధాశక్తి వికాసం: వెన్నెముకపై, మెడ కింద, భృకుటిపై మేధాశక్తిని పెంచడానికి శిరస్సును పూర్తిగా వంచి, కళ్లు మూసుకుని వేగంగా శ్వాస వదలాలి, పీల్చాలి.

టెన్షన్‌ తగ్గించే క్రియలు...
టెన్షన్‌ తగ్గాలంటే, కనుబొమలు పైకెత్తి, నుదురుపై ముడుతలు పడేట్లు చేసి, ఐదు సెకన్లు అలాగే ఉండాలి. ఇలా నాలుగైదు సార్లు చేయాలి. శ్వాస సాధారణంగా ఉండాలి.

నేత్రశక్తి క్రియలు...
ఇవి మూడు రకాలు. అవి: 1. నేత్ర శాంతి కోసం చేసే క్రియలు, 2. నేత్ర శక్తి కోసం చేసే క్రియలు, 3. నేత్ర చంచలత్వాన్ని తగ్గించేందుకు చేసే క్రియలు. ఈ క్రియల్లో తలను కదపకూడదు. కళ్లను మాత్రమే తిప్పాలి. మనస్సును ఏకాగ్రత చేయడం అవసరం.

కళ్లకు శాంతిని కలిగించే క్రియలు...
ఇవి కనుగుడ్లను వేగంగా తిప్పే క్రియలు. రెండు చేతులు తిన్నగా ముం దుకు చాచి, పిడికిలి బిగించి, బొటనవేళ్లను నిలిపి రెండు ళ్లతో ఎడమ బొటనవేలిని, కుడి బొటనవేలిని వేగంగా చూడాలి. తర్వాత కుడి చేయి కుడివైపు ఉంచి, ఎడమ చేతిని, ఎడమవైపు కిందికి దింపి, పైబొటన వేలిని, కింది బొటన వేలిని వేగంగా చూడాలి. తర్వాత ఎడమ చేయి పైకి ఎడమవైపు ఉంచి, కుడి చేయి కిందికి కుడివైపుకు దింపి, రెండు బొటన వేళ్లను పైకి, కిందకు వేగంగా చూడాలి. తర్వాత ఒక బొటన వేలిని పైకి, మరో బొటన వేలిని కిందికి ఉంచి, వేగంగా చూడాలి. తర్వాత ఒక బొటన వేలిని భ్రుకుటికి ఎదురుగా ముక్కుకొసకు దగ్గరగా ఉంచి, మరో బొటనవేలిని ముందుకు చాచి, రెండింటిని ఒక దాని తర్వాత మరొక దాన్ని త్వరత్వరగా చూడాలి.

అనంతరం కుడిచేతిని తిన్నగా పక్కకు చాచి, బొటనవేలిని చూస్తూ, చేతిని గుం డ్రంగా పెద్ద సర్కిల్‌లో వేగంగా తిప్పాలి. మోచేతిని వంచకూడదు. ఎడమచేతిని కూడా తిన్నగా పక్కకు చాచి పైవిధంగా చేయాలి. రెండు రెప్పలను వేగంగా మూయాలి, తెరవాలి. పై క్రియలు పూర్తయిన వెంటనే రెండు అరచేతులు కలిపి బాగా రుద్దాలి. కొద్దిసేపుటికి వేడి కలుగుతుంది. రెండు కళ్లమీద రెండు అరచేతులను ఉంచాలి.

Saturday, November 12, 2011

ఫ్రెష్‌గా ఉండండి ఇలా...

 http://gerry.ws/files/2008/10/beautiful-face-by-tony.jpg
ముఖ సౌందర్యం, వర్చస్సు ఎక్కువగా, శరీర ఆరోగ్యం మీదే ఆధారపడి ఉంటాయి. అయితే ఆరోగ్యం బాగానే ఉన్నా, వాతావరణ కాలుష్యాల వల్ల కూడా కొందరి ముఖం మీద కొన్ని మచ్చలు, మరకలూ ఏర్పడవచ్చు. వీటిని నివారించడంలో తులసి గొప్ప ఔషధంగా పనిచేస్తుంది. కడుపులోకి తీసుకునే తులసి రసం, రక్తశుద్ధికి దివ్యంగా పనిచేస్తుంది. అలాగే, ముఖం మీద లేపనంగా వాడితే మచ్చలు, మరకలు పోయి ముఖం అందంగా కాంతివంతంగా మారుతుంది. బ్యాక్టీరియాను నశింపచేసే లక్షణం ఉన్నందున,ఆరోగ్య పరిరక్షణలో అనాదిగా తులసికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఉదయం వేళ కాసేపు తులసి ముందు కూర్చుని ఆ వాసనను బలంగా పీలిస్తేనే రక్తశుద్ధి అవుతుందని ఆయుర్వేదం చెబుతుంది. అలాంటిది కడుపులోకి నేరుగా ఆ రసాన్ని, లేదా ఆకు ముద్దను తీసుకుంటే ఇక చెప్పేదేముంది!http://www.kacha-stones.com/images/Tulasi1.gif
* ఎండు తులసి ఆకు పొడిని పౌడర్‌లా రోజూ ముఖానికి పట్టిస్తే, ముఖం సౌందర్యవంతంగానూ, కాంతివంతంగానూ మారుతుంది. ఈ పొడి ముఖం మీద ఉండే పలుచనివే కాదు గాఢమైన మచ్చల్ని కూడా తొలగిస్తుంది.

* రోజూ కొన్ని తులసి ఆకుల్ని, నమలి తినేస్తే, రక్త శుద్ధి ఏర్పడుతుంది. అలాగే తులసి పొడికి కొన్ని నీటి చుక్కలు కలిపిగానీ, పచ్చి తులసి ఆకులను నూరి గానీ, ఒక పేస్ట్‌లా ముఖానికి పట్టిస్తే, అక్కడున్న గుంటల్లో నిలిచిపోయిన అతి సూక్ష్మమైన మలినాలు సైతం తొలగిపోయి వర్చస్సు పెరగడంతో పాటు ముఖం, సహజ లావణ్యాన్ని సంతరించుకుంటుంది.

*ముఖం తాజాగా ఉండడానికి , ఏదైనా పాత్రలో కాసిని మంచి నీళ్లు తీసుకుని, అందులో సగం నిమ్మకాయ రసాన్ని పిండాలి. అందులో ఓ పిడికెడు తులసి ఆకులు, పిడికెడు మెంతెం ఆకులు వేసి కాసేపు మరగించాలి. జత్తును టవల్‌తో కట్టేసుకుని ముఖానికి మాత్రమే ఆ ఆవిరి పట్టాలి. కొన్ని నిమిషాల తరువాత చన్నీళ్లతో ముఖం కడిగేసుకుంటే ముఖం తాజాగా మెరిసిపోతుంది.
http://www.dyeli.com/wp-content/uploads/2010/07/face-skin1.jpg
* ముఖం మీద నల్లటి మచ్చలు ఉన్నవారు, నిమ్మరసం లేదా అల్లం రసం కలిపిన తులసి పేస్టును ముఖానికి పట్టించి అది ఎండిపోయిన దాకా అలాగే ఉంచాలి. ఇలా ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం చేస్తే మచ్చలు తొలగిపోవ డంతో పాటు ముఖం కాంతి వంతంగా, అందంగా  మారుతుంది.
*తులసి, మెంతి ఆకులతో చేసినడికాక్షన్ రోజూ తీసుకుంటే శరీరంలో నూతనోత్తేజం వస్తుంది.

Monday, October 31, 2011

ఫ్యాటీలివర్ సమస్యకు శాశ్వత పరిష్కారం

శరీరంలో అతి ముఖ్యమైన అవయవాల్లో కాలేయం ఒకటి. ఇది జీర్ణప్రక్రియకు తోడ్పడే రసాలను ఉత్పత్తి చేస్తుంది. కొందరు అధికంగా బరువు పెరగడం, కొవ్వు ఎక్కువగా పెరిగిపోవడం, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం, డయాబెటిస్ వంటి కారణాల వల్ల కాలేయం కొవ్వును తొలగించలేకపోతుంది. దీనివల్ల కొవ్వు పదార్థాలు కాలేయంలో నిలువ ఉండిపోతాయి. కాలేయం సాధారణ పరిమాణం కంటే పెద్దగా అవుతుంది. సామర్థ్యం తగ్గిపోతుంది. దీన్నే ఫ్యాటీలివర్ అంటారు. ఇతర సమస్యలకోసం ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నప్పుడు ఈ సమస్య బయటపడుతూ ఉంటుంది.

కారణాలు

కాలేయ వ్యాధులకు ప్రధాన కారణం హెపటైటిస్ ఇన్‌ఫెక్షన్. ఇదే కాకుండా ఆల్కహాల్, దీర్ఘకాలంపాటు మందులు వాడటం, విల్‌సన్స్ డిసీజ్, రోగనిరోధక వ్యవస్థలో కలిగే లోపాలు ఫ్యాటీ లివర్‌కు కారణమవుతాయి. డయాబెటిస్ ఉన్న వారు, స్థూలకాయులు, హైపర్‌ట్రైగ్లిసరిడీమియా, ఇన్సులిన్ రెసిస్టెంట్ ఉన్న వారు ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

నిర్థారణ పరీక్షలు

కంప్లీట్ బ్లడ్ పిక్చర్(సి.బి.పి), లివర్ ఫంక్షన్ టెస్ట్(ఎల్.ఎఫ్.టి), సి.టి లివర్, యూఎస్‌జి అబ్డామిన్, లివర్ బయాప్సీ, లిపిడ్ ప్రొఫైల్, ఎఫ్‌బిఎస్, పిఎల్‌బిఎస్, ఆర్‌బిఎస్ పరీక్షలు చేయించడం ద్వారా కాలేయ పనితీరు, వ్యాధులను నిర్ధారించుకోవచ్చు.

చికిత్స

కాలేయ వ్యాధులకు హోమియోలో చక్కటి మందులు అందుబాటులో ఉన్నాయి. ఫ్యాటీ లివర్ సమస్యను హోమియో మందులతో పూర్తిగా తగ్గించుకోవచ్చు. రోగి శారీరక, మానసిక తత్వాన్ని పరిశీలించి, వ్యాధి తీవ్రతను బట్టి మందులు ఇవ్వడం జరుగుతుంది. నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో ఈ మందులు వాడితే వ్యాధి త్వరగా తగ్గడానికి ఆస్కారం ఉంటుంది.

కార్డస్‌మరైనస్ : ఈ మందు కాలేయం, నరాల మీద మంచి ప్రభావం చూపుతుంది. ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉండటం, శరీరంలో నీరు పట్టడం, కాలేయం పరిమాణం పెరగడం, ఆకలి మందగించడం, మలబద్ధకం, అర్షమొలలు, శ్వాసతీసుకోవడం కష్టంగా ఉండటం వంటి లక్షణాలు ఉన్నవారు ఈ ఔషధం తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

ఛెలిడోనియమ్ : కాలేయం సమస్యలు, తల బరువుగా ఉండటం, తల తిరగడం, కాలేయం వాపు, పచ్చకామెర్లు, పిత్తాశయంలో రాళ్లు, మలబద్ధకం, ఆయాసం, మెడనొప్పి, కుడి భుజంనొప్పి, శరీరం పచ్చరంగులోకి మారడం వంటి లక్షణాలతో బాధపడుతున్నవారు ఉపయోగించదగిన మందు.

సియోనాంతస్ : ఇది కాలేయం, ప్లీహం మీద మంచి ప్రభావం చూపుతుంది. మలేరియా, రక్తహీనత, ప్లీహం వాపు, కుడిపైపు కడుపు నొప్పి, కాలేయ వాపు, నడుం నొప్పి, అర్జంటుగా మూత్రవిసర్జన చేయాల్సి రావడం వంటి లక్షణాలు ఉన్నవారికి ఉపకరిస్తుంది. లైకోపోడియమ్ : కొంచెం ఆహారం తీసుకోగానే కడుపు నిండిన ఫీలింగ్ కలగడం, కాలేయం వద్ద నొప్పి, శరీరంలో నీరు పట్టడం, కాలేయ వాపు, అర్షమొలలు, మలబద్ధకం, ఉత్సాహంగా లేకపోవడం, తీపిపదార్థాలంటే ఇష్టపడుతుండటం, చల్లదనానికి, రాత్రివేళ నొప్పి నుంచి ఉపశమనంగా అనిపించడం వంటి లక్షణాలు ఉప యోగించవచ్చు.

కాల్కేరియా కార్బ్ : తెల్లగా, లావుగా ఉండి ఎక్కువ చెమటలు పట్టే తత్వం ఉన్నవారికి మంచి మందు. వంగినపుడు కాలేయం వద్ద నొప్పి, కడుపు ఉబ్బడం, ఇంగ్వైనల్ మీసెంటరిక్ గ్రంథుల వాపు ఉంటుంది. చల్లదనానికి, నిలబడినపుడు ఈ లక్షణాలు ఎక్కువవుతుంటాయి. పొడి వాతావరణంలో నొప్పి ఉన్న వైపు పడుకుంటే ఉపశమనం ఉంటుంది. ఈ తరహా లక్షణాలతో బాధపడుతున్న వారు ఈ మందు వాడవచ్చు.

మెర్క్‌సాల్ : దాహం అధికంగా ఉండటం, జీర్ణశక్తితగ్గడం, కాలేయ వాపు, పచ్చకామెర్లు, రక్తం, జిగురుతో కూడిన విరేచనాలు వంటి లక్షణాలతో బాధపడుతున్నప్పుడు ఈ మందు బాగా పనిచేస్తుంది.

మాగ్‌మూర్ : ఇది కాలేయంపైన మంచి ప్రభావం చూపుతుంది. జీర్ణశక్తి లోపించిన మహిళలకు ఇది దివ్యౌషధం. గర్భాశయ సమస్యలతో బాధపడే వారు ఉపయోగించవచ్చు. నాలుకు పచ్చరంగులో ఉండటం, కడుపు ఉబ్బరం, మలబద్ధకం, అర్షమొలలు వంటి సమస్యలతో బాధపడుతున్నవారు ఉపయోగించదగిన మందు.

నక్స్‌వామికా : తేన్పులు, వికారం, వాంతులు, జీర్ణశక్తిలోపించడం, కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు ఉన్నప్పుడు నక్స్‌వామికా మందు పనిచేస్తుంది.

ఫాస్‌ఫరస్ : ఫ్యాటీ లివర్, పచ్చకామెర్లు, కడుపునొప్పి, ఆహారం తీసుకున్న వెంటనే వాంతులు, మలబద్ధకం వంటి వ్యాధి లక్షణాలు ఉన్నప్పుడు ఉపయోగించదగిన మందు.
నివారణ

* అధిక బరువు ఉంటే తగ్గించుకోవాలి. ఎత్తుకు తగిన బరువు ఉండేలా చూసుకోవాలి.
* క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి.
* ఆహారంలో కార్బోహైడ్రేట్స్ తగ్గించి ఫైబర్ ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకోవాలి.
* కొవ్వుపదార్థాలు ఎక్కువగా తీసుకోకూడదు.

డాక్టర్ టి. ప్రభాకర్, ఎండి హోమియో
హోమియో కేర్ ఇంటర్నేషనల్
ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, 
ఫోన్ :955000339, 9550001188

Saturday, October 29, 2011

మలినాలను కడిగే పంచకర్మలు

ఎంత సేపూ వ్యాధి లక్షణాలను తగ్గించే వైద్య చికిత్సల కోసం వెళతాం కానీ, వ్యాధి కారకమైన ఆ మూలాల మీదికి చాలా సార్లు మన దృష్టే వెళ్లదు. శరీరంలో పేరుకుపోయిన కల్మషాలను తొలగించుకోకుండా ఏ వ్యాధైనా శాశ్వతంగా పోదుకదా! అందుకే ఆయుర్వేదం ఆ కల్మషాలను తొలగించే పంచకర్మ చికిత్సలకు అత్యంత ప్రాధాన్యతనిస్తుంది. ప్రత్యేకించి సొరియాసిస్ వ్యాధి నిర్మూలనలో ఈ పంచకర్మ చికిత్సలు మరీ ముఖ్యమైపోయాయి.

శరీరంలో పేరుకుపోయిన మాలిన్యాలు సొరియాసిస్ రావడానికి అతి ముఖ్యమైన కారణం. ఈ మాలిన్యాలకు మానసిక ఒత్తిళ్లు కూడా తోడైతే, సమస్య మరీ తీవ్రమవుతుంది. అందుకే సొరియాసిస్‌కు ఈ రెండు కోణాల్లోంచి చికి త్సలు అందించవలసి ఉంటుంది. ఈ క్రమంలో శరీరంలోని మలినాలను తొలగించడానికి ఉద్దేశించినవే పంచకర్మ చికిత్సలు.

వమనం, విరేచనం, వస్తి, నస్య, రక్తమోక్షణం అనే ఈ ఐదు చికిత్సలు సొరియాసిస్ నిర్మూలనలో అద్భుతంగా తోడ్పడతాయి. శరీరాన్ని పంచకర్మ చికిత్సలకు సిద్ధం చేయడానికి కూదా కొన్ని విధానాలు ఉంటాయి. వీటినే పూర్వకర్మలు అంటారు. అందులో భాగంగా స్నేహం ( తైలమర్ధనం) స్వేదం ( స్టీమ్) ఉంటాయి.

చర్మ వ్యాధుల్లో సాధారణంగా శరీరం పొడిబారిపోయి ఉంటుంది. ఔషధాలు కలిసిన నెయ్యి గానీ, నూనె గానీ ఇచ్చే ఈ స్నేహపాన ం వల్ల ఆ పొడితనం పోయి చ ర్మానికి ఒక నూనెతనం, ఒక మృదుత్వం వస్తాయి. ఈ చికిత్స మూడు నుంచి ఏడు రోజుల దాకా ఉంటుంది. ఈ ప్రక్రియలో వాడే నూనె లేదా నెయ్యికి సహజంగా జిడ్డుతనం, జారుడు గుణం ఉంటాయి. వీటివల్ల శరీరంలో పేరుకుపోయి, గ ట్టిపడిన దోషాలను ఇది మెత్తబడతాయి. ఆ తరువాత శరీరానికి చెమట పట్టించే స్వేదం చేస్తాం. దీనివల్ల అప్పటికే మెత్తబడిన మలినాలన్నీ కడుపులోకి వచ్చేస్తాయి. వాటిని కడుపులోంచి బయటికి పంపించడానికి ఇక పంచకర్మ చికిత్సలు అవసరమవుతాయి.

వమనం
సొరియాసిస్ మచ్చలు మందంగా ఉండి దురద కలిగిస్తూ, నలుపెక్కి ఉంటే శరీరంలో ఖఫదోషం ఎక్కువగా ఉన్నట్లు భావించబడుతుంది. ఈ దోషాన్ని నిర్మూలించడానికి 'వమన క్రియ' అవసరమవుతుంది. ఇది ఔషధాలు కలిపిన ద్రవాలు ఇచ్చి వాంతి చేయించే ప్రక్రియ. వమన క్రియ వల్ల కడుపులోకి చేరిన మలినాలన్నీ బయటికి వెళ్లిపోతాయి.

విరేచన క్రియ
సొరియాసిస్ మచ్చలు ఎర్రబడి, పొట్టు ఎక్కువగా రాలుతూ ఉండడం వాతం ఎక్కువగా ఉన్నట్లు చెప్పే సూచనలు. ఈ స్థితిలో విరేచన క్రియ అవసరమవుతుంది. వాతాన్ని తొలగించడంలో విరేచన క్రియను మించింది లేదు. ఇది మలద్వారం ద్వారా శరీరంలోని మలినాలన్నిటినీ బయటికి పంపించే ప్రక్రియ.

వస్తికర్మ
సొరియాసిస్ చికిత్సలో వస్తికర్మ పాత్ర చాలా తక్కువ. కాకపోతే, సమస్య సొరియాసిస్ ఆర్థరైటిస్‌గా పరిణమించిన స్థితిలో మాత్రం వస్తికర్మ అవసరమవుతుంది. ఈ సమస్యేమీ లేనప్పుడు వస్తికర్మ అవసరం లేదు. నిజానికి సొరియాసిస్ చికిత్సలో వమన, విరేచనాలదే కీలక పాత్ర అవుతుంది.

నస్యకర్మ
ఔషధపు చుక్కలను నాసిక రంద్రాల్లో వేసే ప్రక్రియను నస్యకర్మ అంటారు. ఇది శారీరక ప్రధానమే కాకుండా మానసిక ప్రధానం కూడా. ఈ చికత్సతో ప్రతికూల ప్రేరకాలన్నీ తొలగిపోయి మెదడు చైతన్యవంతమవుతుంది. అలాగే అస్తవ్యస్తమైపోయిన మెదడులోని అల్ఫా, బీటా, గామాలు నియంత్రణలోకి వస్తాయి.

ఇవి తరంగాల వంటివి. వీటి ఆధారంగానే మనిషి ఆలోచన సరళి ఉంటుంది. ఆ తరంగాలను నియంత్రించడం నస్యకర్మ వల్ల సాధ్యమవుతుంది. దీనివల్ల భయాందోళనలు, దిగులు, డిప్రెషన్ తొలగిపోయి, మానసిక ప్రశాంత ఏర్పడుతుంది. నిద్రలేమి సమస్య కూడా తొలగిపోతుంది.

రక్తమోక్షణం
కొందరిలో సొరియాసిస్ మచ్చలు కొన్ని చోట్ల మందంగా మారిపోతాయి. అక్కడ గడ్డకట్టుకుపోయిన చెడు రక్తమే ఇందుకు కారణం. ఆ చెడు రక్తాన్ని తీసివేయకుండా ఎన్ని మందులు వాడినా ఆ మచ్చలు తగ్గవు. గడ్డకట్టుకుపోయిన ఆ చెడు రక్తాన్ని, జలగల సహాయంతో తీసివేయవలసి ఉంటుంది. ఇలా చేసే ప్రక్రియనే రక్తమోక్షణం అంటారు. ఆ తరువాత కూడా ఆ వ్యాధి మళ్లీ రాకుండా ఒక ఏడాది పాటు మందులు వాడవలసి ఉంటుంది.

నిజానికి, పంచకర్మల తరువాత శరీరంలో మందులను గ్రహించే శక్తి బాగా పెరుగుతుంది. పంచ కర్మ చికిత్సలకు ముందే మందులు వాడితే, 50 శాతం ఉండే ప్రయోజనం ఆ చికిత్సల తరువాత అయితే 100 శాతం ఉంటుంది. కాకపోతే, పంచకర్మ చికిత్సలతో శరీరం పరిశుద్ధంగా మారి, మందులతో వ్యాధి తగ్గినా, అది శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరిగినట్లేమీ కాదు.

ఆ శక్తి పెరగకపోతే మళ్లీ ఏదో ఒక వ్యాధి వచ్చే వీలుంది. అందుకే పంచకర్మ చికిత్సలు తీసుకున్నాక వ్యాధి నిరోధక శక్తిని పెంచే రసాయన చికి త్సలు తప్పనిసరి అవుతాయి. అశ్వగంధ, శతావరి, గుడూచి, బ్రాహ్మి, యష్టిమధు వంటి ఔషధాల మిశ్రమంతో తయారయ్యే ఈ రసాయనాలు శరీరాన్ని సర్వశక్తివంతంగా తయారుచేస్తాయి. దీని వల్ల శరీరం వ్యాధిగ్రస్తం కాకుండా స్థిరంగా ఉంటుంది.

Saturday, October 22, 2011

స్థూలకాయానికి సిసలైన పరిష్కారం

స్థూలకాయంతో కదలికలు కష్టం కావడమే కాదు శరీరం పలురకాల దుష్ప్రభావాలకు గురవుతుంది. 21 శతాబ్ధంలోని అతి తీవ్రమైన సమస్య స్థూలకాయమే. శరీరాన్ని రోగగ్రస్తం చేయడమే కాకుండా అంతిమంగా ఇది మనిషి ఆయుష్షును తగ్గించివేస్తుంది.
ఎందుకొస్తుంది?
స్థూలకాయానికి, మౌలికంగా జీవన శైలి లోపాలు, ఆహారపు అలవాట్లే కారణంగా ఉంటాయి. అంటే అవసరానికన్నా ఎక్కువ మోతాదులో ఆహారం తీసుకోవడం, ఆహారం తీసుకోవడానికి ఒక నిర్ధిష్టమైన సమయమేదీ పాటించకపోవడం, పగటిపూట అతిగా నిద్రించడం, నిరంతరం కూర్చుని ఉండే ఉద్యోగ వ్యాపారాలు, బొత్తిగా శరీర శ్రమ లేకపోవడం వంటి కారణాలే ప్రధానంగా ఉంటాయి. వీటికి తోడు కొందరికి జన్యుపరమైన కారణాలతో కూడా స్థూలకాయం రావచ్చు.
వైద్యపరమైన కారణాలు
మనం తీసుకునే ఆహారం సక్రమంగా జీర్ణమైతేనే అది శరీరానికి శక్తినిస్తుంది. అయితే కొంద రిలో జీవక్రియలేవీ సరిగా పనిచేయవు. ఫలితంగా కొవ్వు, మలిన పదార్థాలు శరీరంలో పేరుకుపోతాయి. ఇది స్థూలకాయానికి దారి తీయడంతో పాటు అధిక రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలకు దారి తీస్తాయి. వీటితో పాటు థైరాయిడ్ సమస్యలు, హార్మోన్, బహిష్టు సమస్యలు మొదలవుతాయి. గర్భాశయం తీసివేసిన కారణంగా కూడా కొందరిలో ఈ సమస్యలు తలెత్తవచ్చు. కొందరిలో ఈ స్థితిలో రక్తహీనత సమస్యకూడా ఏర్పడుతుంది.
స్థూలకాయంతో చిక్కులు
స్థూలకాయంతో అధిక రక్తపోటు, మధుమేహం మాత్రమే కాదు, ఆస్తమా, కీళ్లనొప్పులు, గుండె జబ్బులు కూడా వస్తాయి. శరీరంలో కొవ్వు అతిగా పేరుకుపోవడం వల్ల శరీరంలోని అతి కీలక భాగాలైన గుండె, లివర్, కిడ్నీలు కూడా దె బ్బ తింటాయి. శరీరంలో అతిగా కొవ్వు పేరుకుపోయిన వారు ఇతరుల కన్నా 30 శాతం కన్నా ఎక్కువగా గుండెపోటుకు గురయ్యే ప్రమాదం ఉంది.

ఇవీ మా చికిత్సలు
వాస్తవానికి స్థూలకాయాన్ని తగ్గించడంలో ఆయుర్వేదం అత్యంత సురక్షిత వైద్య విధానం. ప్రపంచ ప్రసిద్ధిపొందిన ఆర్య వైద్య ఫార్మసీ లిమిటెడ్ (కోయంబత్తూర్)తో ఒప్పదం కుదర్చుకున్న మా మంజూష ఆయుర్వేద హాస్పిటల్ స్థూలకాయాన్ని శాశ్వతంగా తొలగించగలుగుతోంది. మూల దోషాలను తొలగించడం, పేరుకుపోయిన కొవ్వు, వ్యర్థపదార్థాలను శరీరం నుంచి తొలగించడం, స్థూలకాయపు దుష్ప్రభావాలను తొలగించడం ప్రధాన లక్ష్యాలుగా ఈ చికిత్సలు కొనసాగుతాయి.
ప్రత్యేకంగానే...
సమస్య స్థూలకాయమే అయినా, ఆ స్థితి ఏర్పడటానికి వ్యక్తి వ్యక్తికీ వేరు కారణాలు ఉంటాయి. అందుకే ఆయా వ్యక్తుల జీవన శైలి, ఆహారపు అలవాట్లు, జీవక్రియల పనితీరు, శరీర ప్రకృతి, దోషాల స్థితి, మొదటి నుంచి ఆరోగ్య పరిస్థితులు వీటన్నిటినీ ప్రత్యేకంగా పరీక్షి స్తాం. శరీర వ్యవస్థను సమూలంగా చక్కదిద్దడానికి కడుపులోకి కొన్ని మందులు కూడా ఇస్తాం. శరీరంలో పేరుకుపోయిన కొవ్వును, మలినాలనూ తొలగించడానికి ఉద్దేశించి ఆయుర్వేదంలో 150 థెరపీల దాకా ఉన్నాయి. వ్యక్తుల శరీర ధర్మాన్ని , వాత, పిత్త , కఫ దోషాలను అనుసరించి ఆ థెరపీలను ఎంపిక చేస్తాం. ఆయుర్వేద వైద్య చికిత్సలతో బరువు తగ్గడంతో పాటు శరీరం చక్కని ఆకృతి పొందుతుంది. వీటితో పాటు అధికరక్తపోటు, మధుమేహం వంటి సమస్యలు నియంత్రణలోకి వస్తాయి. శరీరాన్ని బాహ్యంగా, అంతర్గతంగా పరిశుభ్రం చేయడం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తాం. బరువు త గ్గించే క్రమంలో థైరాయిడ్ సమస్యలు, హార్మోన్ సమస్యలు, ఆస్టియో పొరోసిస్ సమస్యలు తొలగిపోతాయి. వీటికి తోడు కండరాలు, ఎముకలు శక్తివంతమవుతాయి.
పలు విధానాల్లో...
వైద్య విధానాల్లోని కొన్ని ప్రత్యేక థెరపీలతో కేవలం నాలుగైదు వారాల్లో 5 నుంచి 10 కిలోల బరువు తగ్గుతారు. శరీర ఆకృతిలో 15 నుంచి 25 సెంటీ మీటర్లు తగ్గుతారు. మా హాస్పిటల్‌లో శరీర ఆకృతిని చక్కదిద్దే కొన్ని ప్రత్యేకమైన తైల మర్ధనలు ఉన్నాయి. ఈ చికిత్సలు తీసుకున్న తరువాత ఒక పరిపూర్ణ మైన ఆకృతి వారి సొంతమవుతుంది. చికిత్స అయిపోయిన తరువాత మరో మూడు మాసాల దాకా శరీరం బరువు అలా తగ్గుతూనే ఉంటుంది. అదే క్రమంలో శరీర ఆకృతి కూడా చక్కబడుతూనే ఉంటుంది. ఆ తరువాత మేము సూచించే విధానాలను అనుసరిస్తే, వారి శరీర బరువు, ఆకృతి, ఆశించిన రీతిలోనే నిలకడగా ఉంటాయి.

డా. మంజుషా
మంజుషా ఆయుర్వేదిక్ హాస్పిటల్,
మాదాపూర్, హైదరాబాద్,
ఫోన్ : 8978 222 777, 8978 222 888,
040-64507090.

మెరిసే చర్మానికి...

బొప్పాయి పండు తింటే కంటికి మంచిది, గుండెకి బలం అని అందరికీ తెలుసు. కాని చర్మసౌందర్యానికి కూడా బొప్పాయి బోలెడు మేలు చేస్తుంది. బొప్పాయి పండు ఇంట్లో ఉన్నప్పుడు ఏం చేయాలో ......

* ముఖంపై ఉండే బ్లాక్‌హెడ్స్‌ని తొలగించడంలో బొప్పాయి గుజ్జు చాలా ఉపయోగపడుతుంది. ఒక గిన్నెలో రెండు టేబుల్ స్పూన్ల పచ్చిపాలు, రెండు టేబుల్ స్పూన్ల బొప్పాయి గుజ్జు, ఒక టేబుల్ స్పూను శెనగపిండి వేసి బాగా కలిపి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. దీని వల్ల బ్లాక్‌హెడ్స్ తొలగిపోవడమే కాకుండా చర్మం మెత్తగా తయారవుతుంది.

* ప్రతి రోజు ముఖం శుభ్రంగా కడుకున్నాక ఓ నాలుగు బొప్పాయి పండు ముక్కలతో ముఖంపై రుద్దితే నిర్జీవంగా ఉన్న చర్మం కాంతివంతంగా అవుతుంది.

* దీనితో పాటు మీరు తినే పండ్లలో ఎక్కువగా బొప్పాయి ఉండేలా చూడండి. దీని వల్ల కళ్లు ఆరోగ్యంగానే కాదు, కాంతివంతంగా కళకళలాడుతూ ఉంటాయి.