Showing posts with label ప్రాణాయామం. Show all posts
Showing posts with label ప్రాణాయామం. Show all posts

Tuesday, March 27, 2012

యువతరం ధ్యాన మంత్రం

http://www.yogiinterrupted.com/wp-content/uploads/2011/11/How-to-Meditate-Properly1.jpg
‘నిత్యం పని ఒత్తిడి..శారీరకంగా..మానసికంగా ఎంతో అలసిపోతున్నాం ..పెరుగుతున్న పోటీతత్వం కారణంగా ఎప్పటికప్పుడు సామర్ధ్యం పెంచుకుంటూ పోటీ పడాల్సి వస్తోంది. ఇంటి బాధ్యతలు..బంధుత్వాలు .. స్నేహాలు ఇలా ప్రతిక్షణం మనిషిని చుట్టే ఆలోచనలు జీవితాన్ని అతలాకుతలం చేస్తున్నారుు. మనసులు మానసిక సంఘర్షణలకు లోనవుతున్నారుు. ఈ బాధ్యతలన్నీ సరైన ప్రణాళిక లేకుంటే ఏ పనీ సరిగా చేయలేం. అనుకున్నవన్నీ సాధించలేం. దీని నుంచి ఎలా బయటపడాలి ? జీవితంలో విజయం ఎలా సాధించాలి ? ఆనందంగా ఎలా ఉండాలి ? సమాజ నిర్మాణంలో మన బాధ్యత ఏంటి ? ఇలా ఎప్పుడైనా ఆలోచించామా ? అనేక శారీరక రుగ్మతలకు మానసిక దుర్బలత్వమే కారణం. మరి మనం శారీరకంగా ఆరోగ్యంగా ఉండా లంటే తగిన వ్యాయామం చేయాలి. మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే మన మెదడుకు పదును పెట్టాలి. అంటే మనసును ప్రక్షాళన చేసుకోవాలి. ఇందుకు ధ్యానం చక్కటి మార్గం. ప్రస్తుతమున్న జీవన విధానం కన్నా ఉన్నతంగా ధ్యానం ద్వారా జీవితాన్ని గడపవచ్చని ధ్యానేకంద్రాల నిర్వాహ కులు చెబుతున్నారు.
Yogad 
ఏదైనా పవిత్ర లక్ష్యాన్ని నిర్థారించుకుని దానిపైనే దృష్టి నిలపడం ధ్యానం. ఇది ఒక పద్ధతి ప్రకారంగా జరగాలి. ధ్యానం యోగాలో ఒక భాగం. మన పూర్వీకులు అనేక సంవత్సరాలు పరిశో ధన చేసి మానవ శరీరం యోగా రూపంలో గొప్ప ఆద్యాత్మిక శక్తిని సాధించే ప్రక్రియను ప్రపంచానికి అందించారు. యోగాకు ఆద్యుడు పతంజలి సూచించిన ప్రకారం ఎనిమిది నియమాలతో కూడుకుంది . భౌతిక శాస్తప్రరంగా, సాంకేతిక విజ్ఞానపరంగా ఎంతో వృద్ధి సాధించినప్పటికీ సంతోషంగా మనం జీవించలేకపోతున్నాం. ఈ దిశగా ఆలోచిస్తే యోగా అవసరమే అని చెప్పక తప్పదు. ఎందుకంటే మానసికంగా, శారీరకంగా ఆరోగ్యవంతమైన జీవితం కోసం యోగా, ధ్యానం సాధనచేస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయని సాధకులు చెబుతున్నారు.

యోగా ప్రయోజనాలు ఇవీ...

Yoga3 
మనం సాధన చేసే తీరును బట్టి ఫలితాలు ఉంటాయి. మనం ప్రతి రోజూ భౌతిక విధులు నిర్వర్తిస్తున్నట్లుగానే ధ్యానాన్ని కూడా నిత్యకృతగా మార్చుకుంటే మంచి ఫలితాలు బోధపడతాయని యోగా నిపుణులు చెబుతున్నారు. కేవలం శారీరక, మానసిక ఆరోగ్యా లకే ఈ ధ్యానం పరిమితం కాదు. మనం ప్రశాంతంగా జీవిస్తూ, మన చుట్టూ ప్రశాంత వాతావరణం ఉండేలా చేయడమే ధ్యానం. నిర్మాణాత్మక సమాజం దిశగా మనం పయనించేందుకు ధ్యానం గొప్ప వరం. సాంప్రదాయ యోగా క్రమేణా అనేక పద్ధతుల్లో ప్రాచుర్యంలోకి వచ్చింది. ఎన్నో సంస్థలు పలు రకాలుగా యోగా, ధ్యానంలో శిక్షణ ఇస్తూ వాటి కేంద్రాలను విస్తరిస్తున్నాయి. http://yogalina.files.wordpress.com/2012/01/pilates_mat_class_joyg-ay24.jpg
విదేశాల్లోనే ఎక్కువ ఆదరణ...
యోగా మన దేశంలో పుట్టినప్పటికీ విదేశా ల్లోనే ఎక్కువ ఆదరణకు నోచుకుంటోందని యోగా గురువు ఎ.ఎల్వీ కుమార్‌ చెబుతున్నారు. అన్నారు. అమెరికా, స్వీడన్‌, కెనడా, యుకె, పోలెండ్‌ దేశాలకు చెందిన 20 మంది పాశ్చాత్యులు యోగా నేర్చుకోవడానికి ఇటీవల భాగ్యనగరానికి విచ్చేశారు. యోగా హీలింగ్‌ ఫౌండేషన్‌ అనే స్వచ్చంద సంస్థ సాంప్రదాయయోగా (ట్రెడిషనల్‌ యోగా) లో టీచర్లకు గత కొద్ది కాలంగా శిక్షణను అందిస్తోంది. శిక్షణలో భాగంగా ఆసనాలు, ప్రాణాయామ, శ్వాస పద్ధతులు, మెడిటేషన్‌ తదితర అంశాలపైన క్లాసులు ఇస్తున్నారు. ఇవే కాకుండా యోగా పరిచయం, ఎక్‌స్టర్నల్‌ (బహిర్గత), ఇంటర్నల్‌ (అంతర్గత) యోగా, ఇతర ప్రత్యామ్నాయ శాస్తల్రను బోధిస్తున్నారు.

ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌లో శిక్షణ...
Yogal 
ప్రధానంగా ధ్యానం పైనే దృష్టిని కేంద్రీకరిస్తారు. రిథమిక్‌ టైప్‌ ఆఫ్‌ బ్రీథింగ్‌లో ఆరు రోజులపాటు ఈ శిక్షణ ఉంటుంది. ప్రతి రోజు మూడు గంటలపాటు ప్రాణా యామం బస్ర్తిక, సుదర్శన్‌ క్రియల్లో శిక్షణ ఇస్తారు. ఈ ధ్యానం వల్ల శరీరానికి 72 నుంచి 80 శాతం వరకు గాలి అదనంగా అందుతుంది. మానసిక ఒత్తిడిని దూరం చేసి ఇతరత్రా సమస్యలను ఎదుర్కొనేందుకు ఆత్మ విశ్వాసాన్ని పెంపొందిస్తుంది. దీనిని ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ అందిస్తోంది. కోర్సు పూర్తయిన తరువాత ప్రతి రోజూ 20 నిముషాల పాటు దీనిని కొనసాగిస్తే సరిపోతుంది.
-ఇస్కా రాజేష్‌బాబు
‘సూర్య’ ఫీచర్స్‌ ప్రతినిధి

Tuesday, July 19, 2011

చురుకైన జీవనం కోసం

చురుకుగా, ఆరోగ్యంగా ఉండడానికి ఫిట్‌నెస్‌ ఎంతో అవసరం. ఫిట్‌నెస్‌ సరిగా లేకపోతే ఏపనీ సరిగా చేయలేము. శరీరం ఫిట్‌గా ఉంటేనే శరీరాకృతి బాగుంటుంది. మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవన శైలి ప్రభావం మహిళల శరీరాకృతిపై చెడు ప్రభావాన్ని చూపిస్తోంది. క్రమం తప్పకుండా ప్రార్థన చేయడం ద్వారా ఆరోగ్యంగా, నాజూగ్గా ఉండవచ్చంటున్నారు ఫిట్‌నెస్‌ నిపుణులు. అదెలాగో చూద్దాం.
fitness
  • కాసేపు ప్రార్ధనలో గడిపితే మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది.
  • అలసట, ఆందోళన, నీరసాన్ని పోగొట్టి సరికొత్త ఉత్సాహాన్ని నింపుతుంది.
  • ప్రతిరోజూ క్రమం తప్పకుండా ప్రార్థన చేసేవారికి అనారోగ్యం వచ్చే అవకాశాలు తక్కువ. ఏదైనా అనారోగ్యం బారిన పడినా త్వరగా కోలుకుంటారు.
  • ప్రార్థన చేసే వారిలో డిప్రెషన్‌ దరిచేరదు.
  • బిపిని తగ్గిస్తుంది.
  • కొలెస్ట్రాల్‌ లెవల్స్‌ పెరగకుండా చూస్తుంది. దీనివల్ల శరీరంలో కొవ్వు శాతం క్రమబద్దీకరించబడుతుంది.
  • దీనితో బరువు తగ్గుతున్న ఫీలింగ్‌ కలుగుతుంది. ఇది మీలో మరింత ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది.
  • ప్రార్థనతో పాటు వాకింగ్‌, చిన్న చిన్న వ్యాయామాలు క్రమం తప్పకుండా చేసిచూడండి.
  • మీ శరీరాకృతిలో వచ్చే తేడాను చూసి మీరే ఆశ్చర్యపోతారంటే అతిశయోక్తి కాదేమో!
  • మన కోసం మరొకరున్నారనే భావన, మనకు అండగా నిలబడతారనే భావన రావడం వల్ల వ్యక్తిలో ఆందోళన తగ్గుతుంది.
  • దీనికి వ్యాయామాన్ని జోడిస్తే మరి చురుకుదనమే కాదు మనమీద మనకున్న భరోసాతోఅందం పెరుగుతుంది.

Tuesday, July 12, 2011

కపాలభాతి యోగ స్నానం

స్నానం చేస్తాం. శరీరం శుభ్రం అవుతుంది. తలస్నానం చేస్తాం. తలభారం దిగుతుంది. చన్నీళ్ల స్నానం చేస్తాం. బద్ధకం పోతుంది. వేణ్ణీళ్ల స్నానం చేస్తాం. మసాజ్‌లా ఉంటుంది.అయితే - ఇవన్నీ పైపై స్నానాలు. కాకిస్నానాలు. లోపలి దేహానికి కూడా చేయించినప్పుడే అది సంపూర్ణ స్నానం అవుతుంది. ఈవారం కపాలభాతి ఆసనం నేర్పిస్తున్నాం. సాధన చెయ్యండి. మెదడుకు, శ్వాసకోశాలకు, జీవక్రియలకు లాలపొయ్యండి. గాల్లో తేలినట్లు లేకపోతే అడగండి.

కపాలభాతి ప్రయోజనాలు:

మెదడు శుభ్రపడడంతోపాటు, ఆలోచనశక్తి, స్మరణశక్తి పెరుగుతాయి

శ్వాసకోశనాళాల్లో కఫం పోతుంది కాబట్టి ఆస్థ్మా బాధితులకు మంచి ఫలితాన్నిస్తుంది


ఊపిరితిత్తులు శుభ్రపడుతాయి, రక్తశుద్ధి జరుగుతుంది, గుండెపనితీరు మెరుగవుతుంది


జీర్ణక్రియ మెరుగవుతుంది, మల బద్దకం, నిద్రమత్తు, బద్దకంపోతాయి


సైనస్, కిడ్నీ సమస్యలు పోతాయి


కపాలభాతిని రోజూ సాధన చేస్తుంటే మధుమేహం సాధారణస్థితికి వస్తుంది

వీళ్లు చేయకూడదు!
హైబీపీ, కడుపులో ట్యూమర్లు, హెర్నియా, గుండెజబ్బుల వాళ్లు, గర్భిణులు, పీరియడ్స్ సమయంలోనూ చేయకూడదు.

ఎప్పుడు చేయాలంటే!

ఉదయం లేదా సాయంత్రం చేయవచ్చు, కానీ పొట్ట ఖాళీగా ఉండడం ముఖ్యం. మొదలు పెట్టిన రోజే ఎక్కువ సేపు చేయకుండా క్రమంగా నిడివి పెంచుకోవాలి. సాధన మధ్యలో విశ్రాంతి తప్పనిసరి. ప్రారంభంలో వీపు కిందిభాగం, కడుపులో నొప్పి అనిపించవచ్చు. అది సాధన చేసే కొద్దీ తగ్గిపోతుంది.


జాలంధర బంధం అంటే గడ్డాన్ని ఛాతీకి బంధించి ఉంచడం, మూలబంధం అంటే మలద్వారాన్ని పైకి లేపి ఉంచడం, ఉడ్యానబంధం అంటే పొట్టను బిగించడం.


బాహ్య కుంభకం అంటే శ్వాస వదిలిన తరవాత కొద్దిసేపు తీసుకోకపోవడం (ఊపిరి బిగపట్టడం). ఇలా ఉండగలిగినంత సేపు మాత్రమే ఉండాలి.


అంతర వ్యాయామం: ఆయుర్వేదం

కపాలభాతి బాహ్య వ్యాయామం మాత్రమే కాదు అంతర వ్యాయామం కూడ. సాధారణ వ్యాయామాలతో దేహంలో అన్ని భాగాల మీద ఒత్తిడి పడుతుంది, కాని కడుపు భాగం మీద ఒత్తిడి కలగదు. కపాలభాతి ద్వారా ఉదరం, ఛాతీ కండరాలకు చక్కటి వ్యాయామం అందుతుంది. దాంతో కొవ్వు కరుగుతుంది. వీటితోపాటు జీర్ణాశయం, క్లోమం, కాలేయం, ప్లీహం, మూత్రాశయం వంటి భాగాల కండరాలు కూడా ఉత్తేజితమవుతాయి. కాబట్టి ఆయా భాగాల నుంచి ఉత్పత్తి కావల్సిన ఎంజైమ్‌లు సమృద్ధిగా ఉత్పత్తి అవుతాయి, పనితీరు మెరుగవుతుంది. ఉదాహరణకు క్లోమ గ్రంథి ఉత్తేజితమై ఇన్సులిన్ ఉత్పత్తి క్రమబద్ధమై మధుమేహం నియంత్రణ అవుతుంది. చర్మానికి దేహభాగాలకు మధ్య నున్న కొవ్వు కాని, అంతర భాగాలు, కండరాల మధ్య నున్న కొవ్వు కరగాలన్నా ఇది మంచి వ్యాయామం. భోజనం చేసిన తర్వాత, ఉదర, ప్లీహ సంబంధ వ్యాధులతో బాధపడుతున్న వారు కపాలభాతి సాధన చేయరాదు.
- డాక్టర్ విఎల్‌ఎన్ శాస్త్రి, ఆయుర్వేద వైద్యులు
యోగశాస్త్రం ప్రకారం
‘కపాలం’ అంటే మస్తిష్కం లేదా మెదడు. ‘భాతి’ అంటే ప్రకాశం. శిరస్సును ప్రకాశింపచేసే క్రియ కాబట్టి దీనిని కపాలభాతి అంటారు. ఇది షట్‌క్రియల్లో ఒకటి అయినప్పటికీ ప్రాణాయామంలో భాగంగానూ సాధన చేయవచ్చు. దీనిని నాలుగు దశల్లో చేయాలి. గతవారం భస్త్రిక ప్రాణాయామాన్ని ఐదు దశల్లో సాధన చేశాం. భస్త్రికలో గాలిని తీసుకోవడం, వదలడం రెండూ ఉంటాయి, కపాలభాతితో గాలిని వదలడమే ప్రధానం. శ్వాస తీసుకోవడం అప్రయత్నంగా జరగాలి తప్ప, ప్రయత్నపూరకంగా గాఢంగా, దీర్ఘంగా తీసుకోవడం అనేది ఉండదు.
సాధన ఇలా!పద్మాసన స్థితిలో వెన్ను, మెడ నిటారుగా ఉంచి, చేతులను వాయుముద్రలో మోకాళ్ల మీద ఉంచాలి. కళ్లుమూసుకోవాలి, ముఖంలో ప్రశాంతత ఉండాలి.

మొదటి దశలో...

కుడి చేతి పిడికిలిని బిగించి, బొటనవేలితో ముక్కు కుడిరంధ్రాన్ని మూసి, ఎడమరంధ్రం నుంచి శ్వాసను పూర్తిగా వదలాలి. శ్వాసను వదిలినప్పుడు కడుపు భాగం లోపలికి ముడుచుకోవాలి. ఇలా 10-20 సార్లు చేయాలి. కొంతసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత మళ్లీ చేయాలి.

రెండవ దశలో...

కుడిచేతి చూపుడువేలు, మధ్యవేలిని మడిచి వాటి మీద బొటనవేలిని ఉంచాలి. ఉంగరపువేలు, చిటికెన వేళ్లతో ముక్కు ఎడమయంధ్రాన్ని మూయాలి. ముక్కు కుడిరంధ్రం నుంచి శ్వాసను పూర్తిగా వదలాలి.

మూడవ దశలో...

కుడిచేతి చూపుడువేలు, మధ్యవేలిని మడిచి, బొటన వేలితో ముక్కు కుడి రంధ్రాన్ని, చివరి రెండు వేళ్లతో ఎడమ రంధ్రాన్ని మూయాలి. ఇప్పుడు ఎడమరంధ్రం మీద ఉన్న వేళ్లను తీసి శ్వాసను వదలాలి. శ్వాసను పూర్తిగా వదిలిన వెంటనే చివరివేళ్లతో ఎడమరంధ్రాన్ని మూయాలి. తర్వాత ముక్కు కుడిరంధ్రం మీద ఉన్న బొటనవేలిని తీసి శ్వాసను పూర్తిగా వదలాలి.

నాలుగవ దశలో...

చేతులను వాయుముద్రలో ఉంచి శ్వాసను బలంగా వదలాలి. 10 -20 సార్లు చేయడం, మధ్యలో విశ్రాంతి, అప్రయత్నంగా శ్వాస తీసుకోవడం, శ్వాస వదిలినప్పుడు కడుపులోపలికి పోవడం వంటి నియమాలు అన్ని దశల్లోనూ యథాతథం. కపాలభాతిలో 90శాతం నిశ్వాస, పదిశాతం ఉచ్వాశ జరగాలి.

నాలుగు దశలూ పూర్తయిన తర్వాత శ్వాసను వదిలి మూలబంధం, ఉడ్యానబంధం, జాలంధర బంధం వేయాలి. ఈ బంధాలన్నింటినీ బాహ్య కుంభకంలోనే వేయాలి. ఈ స్థితిలో ఉండగలిగినంత సేపు ఉన్న తర్వాత బంధాలను విడవాలి. ముందుగా ఉడ్యానబంధం, తర్వాత జాలంధర బంధం, మూలబంధాలను విడవాలి. బంధాలను వేయడం, విడవడంలో క్రమం మారుతుంది. చివరగా విశ్రాంతి తీసుకోవాలి.

 












 
కొవ్వు శక్తిగా మారే ప్రక్రియ
మన శరీరంలోని కొవ్వును ఎల్ కార్నిటైన్ అనే పోషకం శక్తిగా మారుస్తుంది. ఎల్ కార్నిటైన్ తగ్గినా, దాని పనితీరు మందగించినా కొవ్వు శక్తిగా మారకుండా నిల్వ ఉండిపోతుంది. ఇది బాగా పనిచేయాలంటే దేహానికి తగినంత ఆక్సిజన్ అవసరం. కపాలభాతి సాధన చేసేవాళ్లు సమతుల ఆహారం తీసుకోవడం, మద్యపానం, ధూమపానం, జంక్‌ఫుడ్, స్వీట్లు, పాలు, పాల ఉత్పత్తులను మానేయడం. కార్బోహైడ్రేట్లను తగ్గించడం వంటి జాగ్రత్తలను పాటిస్తే నెలకు నాలుగు నుంచి ఐదు కిలోల బరువు తగ్గుతారు.

- డాక్టర్ సుజాతాస్టీఫెన్, న్యూట్రిషనిస్ట్, అవేర్ గ్లోబల్ హాస్పిటల్

- వాకా మంజుల,  ఫొటోలు: అమర శ్రీనివాసరావు.వి , మోడల్: పూజిత

Saturday, January 29, 2011

పని పెంచండి..బరువు తగ్గండి!

పక్క వీధిలోని పాలబూత్‌కి వెళ్లాలంటే బండి స్టార్ట్ చేయాల్సిందే... కిలోమీటర్ దూరం వెళ్లి కూరగాయలు కొనుక్కు రావాలంటే బండి కావాల్సిందే... బట్టలుతకడానికి వాషింగ్ మెషీన్... అంట్లు కడగడానికి ఓ పనిమనిషి... పచ్చళ్లు దంచిపెట్టడానికి మిక్సీ.... ఇదీ మారిన మన లైఫ్‌స్టైల్. చివరకు మనకు మిగిలిందేమిటి.... వెయిట్ లాస్ ట్రీట్‌మెంట్లకై వెదుకులాట.

* * * పది కిలోమీటర్లు నడిచివెళ్లి చిన్న చిన్న వస్తువులు కొనితెచ్చుకోవడం.., చదువుకోవడానికి నాలుగైదు కిలోమీటర్లు సైకిల్‌పై వెళ్లడం.... చేతులరిగిపోయేలా తిరగలి తిప్పడం..... ఇలాంటి కష్టాలన్నీ పోయాయి. చేతిలో డబ్బుంటే చాలు... అన్నీ మన ముందుకే వస్తాయి. అయితే ఆధునిక సౌకర్యాలతో పాటు ఎక్కడబడితే అక్కడ బరువుతగ్గించే సెంటర్లు కూడా పెరిగిపోయాయి. కారణం... ఊబకాయులు పెరిగిపోతుండటమే. దీనికి ఆడామగా, చిన్నా పెద్దా తేడా లేదు. బరువు పెరగడానికి వయసుతో పనిలేదు.

వెయిట్ తగ్గించే అద్భుతాలు

స్లిమ్మింగ్ క్యాప్సుల్స్, ఆయిల్స్, క్రీములు, పౌడర్లు, టీలు (డాక్టర్ టీ), డైట్ సప్లిమెంట్లు... ఇలా చెప్పుకొంటూ పోతే బరువు తగ్గించేవని చెప్పేవి మార్కెట్లో సవాలక్ష ఉన్నాయి. కొన్ని ఫిట్‌నెస్ సెంటర్లయితే వెయిట్ లాస్ ట్రీట్‌మెంట్ల పేరుతో మనీ బ్యాక్ పాలసీ లాంటి రకరకాల ఆఫర్లతో ఆకర్షిస్తున్నాయి. అల్ట్రాసౌండ్ చికిత్సలు, మసాజ్‌లు, రేడియేషన్ల వంటి వాటితో కొవ్వు కరిగిస్తామంటున్నాయి. కొన్ని జేబుకు చిల్లు పడటమే తప్ప వీటివల్ల ఎటువంటి ఉపయోగం లేదంటున్నారు బాధితులు. 'స్లిమ్మింగ్ మెషీన్ సహాయంతో మీ శరీరంలో ఎక్కడ కొవ్వు పేరుకుపోయినా తగ్గించేస్తామన్న మాటలు నమ్మి లక్షన్నర రూపాయలు చెల్లించాను.

స్లిమ్మింగ్ పరికరం ఉత్పత్తి చేసే వేడి కొవ్వును కరిగిస్తుందని నమ్మబలికారు. కానీ ఒక ఇంచు కూడా బరువు తగ్గలేదని వాపోయారు హైదరాబాద్‌కు చెందిన ఓ యాంకర్. మొత్తం బాడీ మసాజ్ చేయడం వల్ల కొవ్వు కరిగిపోతుందని వెళ్లిన కాల్‌సెంటర్ ఉద్యోగిని అయిన ప్రమీల వాళ్లు చెప్పిన విషయం విని ఆశ్చర్యపోయింది. రోజూ అరగంట సేపు వాకింగ్, తరువాత మరో అరగంట ఎక్సర్‌సైజ్ చేయడం వారానికి మూడుసార్లు తమ సెంటర్‌లో ఓ గంటసేపు మసాజ్...

నెలరోజుల్లో అయిదు కిలోల బరువు తగ్గుతారని చెప్పడంతో ఇక తను తీసుకునే ఆహారం, వ్యాయామంపై దృష్టి పెట్టింది ప్రమీల. ఇలాంటి అనుభవాలు ఎన్ని ఎదురైనా అలా బయటకు వెళితే చాలు.. ఏ బేకరీకో, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌కో వెళ్లడం రుచిగా ఉన్నదల్లా లాగించెయ్యడం... తరువాత బరువు పెరిగిపోతున్నామని బాధపడటం... ఇటీవలి కాలంలో ఈ తరహా ధోరణి ఎక్కువయింది. ఎక్కువ కష్టపడకుండా వెంటనే బరువు తగ్గిపోవాలన్న కోరికతో స్లిమ్‌బెల్టులు, స్లిమ్ మెషీన్లు కొని తెచ్చిపెట్టుకోవడం, స్లిమ్ క్యాప్సుల్స్, యాంటి ఒబేసిటీ మందుల్లాంటివి వాడటం వల్ల అనుకున్న ఫలితం పొందడం మాట అటుంచి ఇతరత్రా సైడ్ ఎఫెక్టులు కలిగే అవకాశం ఉంది.

అసలైన మంత్రం

అందుకే బరువు తగ్గడానికి రాచబాట లాంటి వ్యాయామాన్ని వదిలేసి యంత్రాలపై ఆధారపడటం సరికాదు. వ్యాయామం చేసేందుకు సమయం సరిపోవట్లేదంటారు చాలామంది. కానీ ఆరోగ్యాన్ని మించిన ముఖ్యమైన పని మరొకటి లేదు. ఎంత అర్జెంట్ పనులున్నా వ్యాయామం కోసం కనీసం ఓ అరగంట సమయాన్ని కేటాయించాలి. మన రోజువారీ పనుల్లో కూడా కాస్త బద్దకాన్ని వదిలితే బరువు తగ్గించుకోవడం మన చేతుల్లో పనే. ఫస్ట్‌ఫ్లోర్‌కి వెళ్లడానిక్కూడా లిఫ్ట్ వాడేబదులు నాలుగు అంతస్థులున్నా మెట్లు ఎక్కండి. పక్కనున్న షాప్‌కి నడిచే వెళ్లండి. మీ బాబును స్కూల్లో దింపడానికి బండి తీయకండి.

సాధ్యమైనంతవరకూ కాళ్లకు పనిచెప్పండి. 'హాస్పిటల్‌లో ఏ ఫ్లోర్‌కి, ఎన్నిసార్లు వెళ్లాల్సి వచ్చినా లిఫ్ట్ అసలే వాడను. బరువు పెరగకుండా, ఆరోగ్యంగా ఉండటంలో నా రహస్యం అదే' అంటారు హైదరాబాద్‌లోని ప్రముఖ కార్డియాలజిస్టు డాక్టర్ సోమరాజు. అండుకే మీరూ బద్దకాన్ని వదిలి కొవ్వును కరిగించే వ్యాయామంపై దృష్టిపెట్టమంటున్నారు ఫిట్‌నెస్ నిపుణులు. ఎన్ని వెయిట్ లాస్ ట్రీట్‌మెంట్లు తీసుకున్నా ఆహారంలో జాగ్రత్తలు, వ్యాయామం లేకపోతే మాత్రం ఎక్కడి కొవ్వు అక్కడే ఉంటుంది. అందుకే ఒకరిని చూసి ఒకరు వెయిట్ లాస్ సెంటర్ల వైపు పరుగులెత్తకుండా మంచి తిండి తినండి, బాడీకి పని పెట్టండి, ఆరోగ్యంగా ఉండండని సూచిస్తున్నారు.
-కె.రచన

Thursday, January 6, 2011

Pranayama - Breathing Therapy

Important:This is only for the people who are breathing with their nose.
Not for people who are breathing with mouth.

Breathing Theraphy
Pranayama - Breathing Therapy - Phani Kiran: World Informatives

The nose has a left and a right side; we use both to inhale and exhale.

Actually they are different; you would be able to feel the difference.

The right side represents the sun, left side represents the moon.

During a headache, try to close your right nose and use your left nose to breathe.

In about 5 min, your headache will go. If you feel tired, just reverse, close your left nose and breathe through your right nose.

After a while, you will feel your mind is refreshed.

Right side belongs to 'hot', so it gets heated up easily, left side belongs to 'cold'.

Most females breathe with their left noses, so they get "cooled off" faster.

Most of the guys breathe with their right noses, they get worked up.

Pranayama - Breathing Therapy - Phani Kiran: World Informatives

Do you notice the moment we wake up, which side breathes faster? Left or right?

If left is faster, you will feel tired.

So, close your left nose and use your right nose for breathing, you will get refreshed quickly.

This can be taught to kids, but it is more effective when practiced by adults.

My friend used to have bad headaches and was always visiting the doctor.

There was this period when he suffered headache literally every night, unable to study.

Pranayama - Breathing Therapy - Phani Kiran: World Informatives

He took painkillers, did not work.

He decided to try out the breathing therapy here: closed his right nose and breathed through his left nose.

In less than a week, his headaches were gone! He continued the exercise for one month.

This alternative natural therapy without medication is something that he has experienced.

So, why not give it a try?

Monday, December 27, 2010

శరీరానికే తెలివి ఎక్కువ!

ప్రపంచానికి మన దేశం అందించిన ఆధ్యాత్మిక గురువుల్లో యూజీ కృష్ణమూర్తి ఒకరు. దాదాపు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లోను పర్యటించిన యూజీ- తనదైన శైలిలో భారతీయ ఆధ్యాత్మికతను ప్రచారం చేశారు. ఆయన చివరి రోజుల్లో తన శిష్యులతో జరిపిన సంభాషణల సమాహారమే- 'ద బయాలజీ ఆఫ్ ఎన్‌లైటెన్‌మెంట్'. జీవితం పట్ల ఆసక్తికి, అనురక్తి, జిజ్ఞాసను పెంపొందించే ఈ సంభాషణలలోని కొన్ని ఆసక్తికరమైన భాగాలు.....

పాల్ (శిష్యుడు): సరైన ఆహారం అంటే ఏమిటి?

యూజీ: శరీరానికి ఆహారం కావాలి. 'సరైన ఆహారం' అనే నిబంధన పెడితే, ఆహారాన్ని తీసుకోవటంపై నియంత్రణను విధించినట్లే. మన కడుపు దేనినైనా అరిగించుకోగలదు. అయితే మెదడు దానిని నియంత్రించటానికి ప్రయత్నించటం వల్ల అనేక సమస్యలు ఏర్పడుతున్నాయి.

పాల్: నిజంగానా..?

యూజీ: చాలాసార్లు మనం ఆహారాన్ని ఆనందం కోసం తింటాం. శరీరం కోసం తినం. ఆ విధంగా మనం అలవాటు పడ్డాం. జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ విషయం మీకే అర్థమవుతుంది. మీకు బాగా నచ్చిన ఆహారాన్ని తినద్దు. అప్పుడు మెదడులో ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయో గమనించండి. తినటానికి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోటం ఒక పని మాత్రమే. ఆహారాన్ని గుర్తించటం, దాని రుచిని ఆస్వాదించటం ఇవన్నీ వేర్వేరు పనులు.

ఇవన్నీ ఒక దానితో మరొకటి ముడిపడి ఉంటాయి. ఆహారం తినేటప్పుడు అనేక రకాల విషయాల గురించి ఆలోచిస్తుంటే- ఆహారాన్ని ఆస్వాదించలేం. అది అందించే తృప్తిని పొందలేం. మన కడుపుకు అందాల్సిన రక్తం మెదడుకు బదిలీ అవుతుంది. అందువల్లే మన పూర్వీకులు- తినే సమయంలో ఆలోచించటం కాని మాట్లాడటం కాని చేయవద్దంటారు..

మన శరీరానికి ఎలా పనిచేయాలో తెలుసు. దానికి కూడా తెలివితేటలు ఉన్నాయి. అయితే అది పనిచేయటానికి మనం అనుమతించాలి. ప్రతి సారి అడ్డం పడకూడదు. పరిణామక్రమంలో అభివృద్ధి చెందిన మానవుల తెలివితేటలు- శరీరపు తెలివితేటల ముందుకు ఎందుకు పనికిరావు. తనని తాను ఎలా రక్షించుకోవాలో శరీరానికి తెలుసు. కాబట్టి తినకూడని పదార్థమేదీ అది తినదు. ఎప్పుడైనా మనం అలాంటిది తిన్నా శరీరం దానిని బయటకు తోసివేస్తుంది.

పాల్: కొన్ని రకాల ఆహారాలను త్యజించటం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయంటారు.. యూజీ: భారతదేశంలో చాలామంది పాటించే ఒక ఆచారం ఉంది. కొంతమంది తమకు బాగా ఇష్టమైన పదార్థాన్ని అక్కడ వదిలేసి వస్తారు. నాకు తెలిసిన ఒక పెద్ద గురువు ఉన్నాడు. ఆయన భగవద్గీత ప్రవచనాలు చెబుతూ ఉంటాడు. ఆయన కాశీకి వెళ్లి - తనకు నచ్చని పదార్థాలు వదిలేసి వచ్చేశాడు. ఇలాంటి వాళ్లు కూడా ఉంటారు. చాలా సార్లు మనం ఇతరులను అనుకరిస్తూ ఉంటాం.

కాశీకి వెళ్లి ఏదో ఒకటి వదిలేయాలన్నారు కాబట్టి వదిలేసి వచ్చేస్తాం. దీని వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. చాలా సార్లు బుద్ధుడు చెప్పాడు కాబట్టి ఆ పని చేస్తున్నాం.. జీసస్ చెప్పాడు కాబట్టి ఈ పని చేస్తున్నాం అంటూ ఉంటారు. అసలు భావం తెలియకుండా చేసే పనుల వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. దీని వల్ల ప్రపంచమంతా అనుచరులు మాత్రమేతయారు అవుతారు. మళ్లీ వారి మధ్య ఘర్షణలు ఏర్పడతాయి...

పాల్: అసలు దేవుడు ఉన్నాడా?

యూజీ: ఈ ప్రశ్నను నాకు నేనే వేసుకుంటూ ఉంటాను. నాకు సమాధానం అయితే దొరకలేదు. భయం వల్ల మనకు మనం దేవుడిని సృష్టించుకుంటాం. అందువల్ల దేవుడు ఉన్నాడా? లేడా అనేది అసలు సమస్య కాదు. 'దేవుడు' అనే ఆకారాన్ని సృష్టించుకోవటం వల్ల మనం ఎంత ఆనందంగా ఉన్నాం అనే విషయమే ప్రధానం. అందుకే భారత దేశంలో 33 కోట్ల దేవుళ్లు ఉన్నారంటారు. 33 కోట్ల మంది ప్రజలు-తమ కోసం దేవుళ్లను సృష్టించుకున్నారన్నమాట.

ఈ సమాధానాన్ని నమ్మితే- దేవుడు ఉన్నాడా? లేదా? అనే వాదనలకు అసలు అర్థమే ఉండదు. అయితే అప్పుడు మనంతట మనం సృష్టించుకున్న దేవుడిని మనం ఎందుకు నమ్మాలి? అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. భయం వలనే దేవుడిని మనం సృష్టించుకున్నాం అనే విషయాన్ని అర్థం చేసుకుంటే- మిగిలిన విషయాల్లో దేవుడి ప్రమేయం ఉండదు.

యోగా గురించి..

మన శరీరంలో 64 ప్రాంతాల్లో నాడులు ఉంటాయి. మన మణికట్టు దగ్గర ఉన్న నాడినే డాక్టర్లు పరీక్షిస్తారు. కాని శ్వాసకు సంబంధించిన వ్యాయామ సూత్రాలను నేర్చుకుంటే-ఈ నాడులు కొట్టుకోవటాన్ని మనం గమనించగలుగుతాం. ఇదే విధంగా ఆధ్యాత్మిక అంశాలను మనం శారీరకంగా కూడా గమనించవచ్చు. ఉదాహరణకు హిందువులు - 'ఓమ్' అనే నాదాన్ని జపిస్తారు.

దీనిని జపించినప్పుడు మనం శ్వాస తీసుకొనే పద్ధతి పూర్తిగా మారిపోతుంది. దీనినే కొన్ని వేల సార్లు జపించినప్పుడు మనకు తెలియకుండానే శ్వాస తీసుకొనే పద్ధతిలో మార్పు వస్తుంది. అలౌకికమైన ఆనందం వస్తుంది. అందువల్లే ఓంకారాన్ని కొన్ని వేల సార్లు జపించమని చెబుతూ ఉంటారు. అయితే ఓంకారాన్ని జపించటం వెనక ఉన్న మర్మాన్ని మాత్రం ఎవరూ చెప్పరు.. 
పాల్: యోగా వల్ల మన భావోద్వేగాలను అదుపులో పెట్టుకోగలమా? యూజీ: లేదు. యోగా వల్ల శరీరమే అదుపులోకి వస్తుంది. మంచి స్థితిలో ఉంటుంది. మనం జీవించటానికి ఆహారం ఎలా తింటామో ఇది కూడా అంతే.....

పాల్: అయితే ఉన్నత స్థితికి చేరుకోవటానికి యోగ ఉపయోగపడుతుందంటారా..? యూజీ: యోగానే కాదు. ఏ వ్యవస్థా ఆ స్థితిని చేరుకోవడానికి ఉపయోగపడదు. ముందు శరీరాన్ని అదుపులో ఉంచుకోవాలి. క్రమశిక్షణతో వ్యవహరించాలి.

శరీరం అదుపులోకి వచ్చిన తర్వాత ప్రాణాయామం చేయాలి. ఆ తర్వాత మన చుట్టూ ఉన్న స్థితిని ప్రశ్నించాలి. ఆ తర్వాత ధ్యానం చేయాలి. ధ్యానం అన్నింటికన్నా చివరది. మొదటిది కాదు. అయితే కొందరి సిద్ధాంతం ప్రకారం ఇవన్నీ ఒకే సారి చేయాలి. ఈ సిద్ధాంతం గురించి నాకు తెలియదు. తెలుసుకోవాలనే ఆసక్తి కూడా లేదు.

Saturday, September 18, 2010

ఆయురారోగ్యాల చిరునామా ప్రకృతి వైద్యం

మహాత్మాగాంధీ ‘ గ్రామస్వరాజ్‌’ ‘స్వాతంత్రోద్యమం’,‘అస్ప్రశ్యత’, ‘ఖాదీ’ వంటి ఎన్నో అంశాలను ప్రపంచం దృష్టికి తెచ్చినవారు. అట్లాగే ‘ప్రకృతి చికిత్స’కు వారే‘ అంబాసిడర్‌’గా ఉండి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. స్వయంగా మనుషులకే కాదు జంతువులకు కూడా ప్రకృతి చికిత్స అందజేసి సమకాలికులకు ఆదర్శ నాయకులయ్యారు.


housesద్రోణంరాజు వెంకటచలపతి శర్మ జర్మనీ భాషలో ఉన్న ప్రకృతి చికిత్సా విధానానికి సంబంధించిన పుస్తకాలను తెనిగించి ఆ చికిత్సను 1890లోనే మనకు పరిచయం చేశారు. ఆ తర్వాత 1933లో గుంటూరు జిల్లాలో ప్రకృతి ఆశ్రమాన్ని డా. వేగిరాజు కృష్ణంరాజు స్థాపించారు. అది 1944 నుంచి భీమవరంలో శ్రీ రామకృష్ణ ప్రకృతి ఆశ్రమం పేరిట స్థిరపడి శాఖోపశా ఖలుగా విస్తరించింది. ఇప్పుడు వేగిరాజు కుటుంబీకులైన డా.రవివర్మ, డా. కమలాదేవి, డా.గోపాలరాజు మొదలైనవారు సేవలందిస్తున్నారు.ప్రకృతి నుంచి దూరం జరిగే కొద్ది మనిషిలో వికృతి పెరుగుతుంది. ఈ వికృతి శరీరంలోనూ, మనసులోనూ చోటు చేసుకోవడంతో అనారోగ్యం మొదలవుతుంది. ప్రపంచ ఆరోగ్యసంస్థ ఆరోగ్యం అంటే ఏంటో నిర్వచించింది.కేవలం రోగం లేకపోవడం లేదా వైల్యం లేకపోవడమే ఆరోగ్యం అనిపించుకోదు. భౌతికంగా, సామాజికంగా కూడా సంపూ ర్ణంగా స్వస్థత కలిగి ఉండడమే ఆరోగ్యం.

Nasyaఈ నిర్వచనాన్ని ఆధారంగా చేసుకుని ప్రకృతి వైద్యవిధాన శాస్త్ర అంశాలను మేళవించి చాలా వరకు సంఘసేవా దృష్టితో ప్రజలకు సేవలందిస్తున్న అసలైన ఆరోగ్య కేంద్రాలు ప్రకృతి చికిత్సాలయాలు. గత కొని సంవత్సరాలుగా యోగా కూడా ఈ వైద్యవిధానంలో ఒక భాగమైంది.ముందులు వేయకుండా జబ్బులను నయం చేయడం వల్ల మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశం ప్రజలకు చాలా తక్కువ ఖర్చుతో వైద్యాన్ని ప్రకృతి చికిత్స అందుబాటులోకి తెచ్చింది. దీంతో ఇది ఒక జీవిత విధా నంగా మారింది. ఇది ఒక దేశానికో, జాతికో మతానికో పరిమితమైంది కాదు అంతర్జాతీయ చికిత్సా విధానంగా గుర్తింపు పొందింది. ఈ వైద్య చికిత్స క్రింది మూడు అంశాలు దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతుంది.

1.శరీరంలో పేరుకు పోయిన మలినాలు
2.శరీరంలోని రక్తం మలినం కావడం
3.శరీరంలోని ప్రాణశక్తి తగ్గిపోవడం

walkపై మూడు అంశాలను దూరం చేసే సహజ చికిత్సలను ప్రకృతి వైద్యం అందిస్తుంది. అలోపతి వైద్యవిధానం సూక్ష్మజీవుల మూలంగా జబ్బులు కలుగుతాయని చెప్తుంది. కాని శరీరంలో మలినాలు పేరుకుపోవడం మూలంగానే సూక్ష్మజీవులు ఏర్పడతాయని ప్రకృతి వైద్యం చెప్తుంది. వీటిని తొలగించే క్రమంలోనూ ప్రాణశక్తిని పెంచే మార్గంలోనూ ప్రకృ తిలోని పంచభూతాలను నీరు, మట్టి, సూర్యరశ్మి, వాయువు, ఆకాశం ...వినియోగంలోకి తెస్తుంది.

జలచికిత్స: ఎనిమా, తొట్టిస్నానం, ఆవిరిస్నానం, మొదలైన విధానాల ద్వారా కడుపులోని,ఇతరత్రా వున్న మలినాలను తొలగించే చికిత్స ఇది.

మట్టి చికిత్స: రోగికి కడుపుమీద శుభ్రమైన తడి మట్టి ఉన్న గుడ్డను పెట్టడం వల్ల కడుపులోని అవయవాల పనితనం పెరుగుతుంది. శరీర మంతా తలనుంచి అరికాళ్లదాకా శుభ్రమైన మట్టిని బురదగా మార్చి పూయడం మూలంగా శరీరంలోని వేడిని తీసివేయగలుగుతుంది.

రంగుచికిత్స/ భిన్న వర్ణ చికిత్స:
scan పటకంలో నుంచి సూర్యుని కిరణాలు ఏడు రంగులుగా విడుదల అవుతాయి. వీటిలో ఒక్కో రంగుకు ఒక్కో శక్తి ఉంటుంది.ఎరుపు రంగు శక్తినిస్తుంది. గుండెకు బలాన్నిస్తుంది. నీలంరంగు నాడీ మండలాన్ని ప్రేరేపిస్తుంది.బిపిని తగ్గిస్తుంది. ఆకుపచ్చరంగు పిట్యూటరీ గ్రంథిని క్రమబద్ధం చేస్తుంది. మానసికమైన డిప్రెషన్‌ను తగ్గిస్తుంది. తెలుపురంగు రుతువులు మారి నపుడు వచ్చే జబ్బుల మీద పనిచేస్తుంది. మంచి నిద్రకు దోహదపడుతుంది. పసుపు రంగు రక్తాన్ని శుభ్రపరుస్తుంది. జీర్ణశక్తిని పెంచుతుంది. ఆల్ట్రా వయోలెట్‌ కిరణాలు విట మిన్‌ డిని అందజేస్తాయి.కొలెస్ట్రాల్‌ తగ్గిస్తుంది. బిపిని తగ్గిస్తుంది. ఇన్‌ఫ్రారెడ్‌ కిరణాలు కీళ్లనొప్పులను తగ్గిస్తాయి. రక్దప్రసరణను క్రమబద్ధం చేస్తాయి.

మర్ధన చికిత్స: శిరస్సునుంచి అరికాలు దాకా తైలమర్థనం చేయడం ద్వారా శరీరంలోని నొప్పులు తగ్గుతాయి. పట్టుకున్న నరాలు కీళ్లు వదులవుతాయి. కండరాలకు బలం చేకూరుతుంది. అంతేకాదు రక్త ప్రసరణ క్రమబద్దమై మలినాలు విడుదలకు దోహదం చేస్తుంది. సాధారణంగా మర్థన చికిత్సతో పాటు ఆవిరిస్నానం చేయిస్తారు. దీంతో శరీరం లోని మలినాలు చెమట ద్వారా బయటకు వస్తాయి. దీన్ని స్వేదన చికిత్స అంటారు.

వమనక్రియ:
bead వమన క్రియను వారానికి ఒకసారి చేయిస్తుంటారు. ఐదారు గ్లాసుల ఉప్పు నీటిని తాగించి వమనం చేయించడం ద్వారా కడుపులోనూ ఇతరాత్రా వున్న మలినాలు కఫం, బయటకు వచ్చేస్తాయి. పైత్యం తగ్గుతుంది. దీంతో పాటుగా జలనేతి ప్రక్రియను చేప డతారు. నీటిని ఒక రంధ్రం నుంచి పంపి మరోరంధ్రం ద్వారా బయటకు వచ్చేట్టు చేస్తారు. దీనివల్ల ముక్కుకు సంబంధించిన సమస్యలు తగ్గుతాయి.

ఉపవాసం: సహజంగా ప్రతి మనిషిలో ప్రాణశక్తి వుంటుంది. మాలిన్యాలు, ఇతర కారాణాలు దాన్ని సూర్యున్ని మేఘం లాగా కప్పెస్తాయి. అందువల్ల ప్రకృతివైద్య విధానంలో ఉపవాసం ద్వారా ఆ అడ్డంకులను పక్కన నెట్టి ప్రాణశక్తిని మేల్కోలుపు తారు.

ఆహారచికిత్స: ప్రకృతి వైద్యంలో మనం తీసుకునే ఆహారానికి ఉన్నతస్థానం ఉంది. ఆహారం అన్నది రోగం రాకుండా నివారించేందుకు ఉన్న రోగాన్ని తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది.

పంచకర్మ చికిత్స: మానసిక వత్తిడిని కంప్యూటర్‌ సంబంధించిన ఉద్యోగులకు ఏర్పడే సమస్యల నివారణకు శిరోధార చికిత్సను అందజేస్తారు.

ఫిజియోథెరపి: కీళ్లనొప్పులు, ఇతరాత్రా జబ్బులకు ఫిజియోథెరపి విధానాలను కూడా ప్రకృతి వైద్యం ఆమోదిస్తుంది. పై చికిత్సలకు చౌకధరలకు అందజేసే ప్రకృతి చికిత్సాలయం హైదరాబాదులోని రాజేంద్రనగర్‌ పరి సరాలలో నెహ్రూ జూ పార్కుకు 3 కిలోమీటర్ల దూరంలో బెంగళూరు హైవేకు వందగజాల దూరంలో ఉంది. ఇది కస్తుర్బా ప్రకృతి చికిత్స యోగ సంస్థ 1964 నుంచి సేవలందిస్తోంది. గాంధేయ విశ్వాసాలలో పనిచేసే సర్వోదయ ట్రస్ట్‌ పది ఎకరాల ప్రశాంత వాతావరణంలో దీన్ని ఏర్పరిచింది. ఇది 60 పడకలున్న వైద్యాలయం. బయటి రోగులకు కూడా చికిత్స అందజేస్తారు. ఇంట్లో ఉంటూనే ప్రకృతి వైద్య చికిత్సా పద్ధతులను అనుసరించి జీవించడానికి వీలుగా మార్గదర్శకత్వం వహి స్తారు. జనరల్‌ వార్డులతో పాటు ఎ/సి రూములు కూడా అందు బాటులో ఉన్నాయి. ఈ సంస్థ అధికబరువు,బి,పి, షుగరు, కీళ్లనొప్పులు, మెడ, నడుమునొప్పులు, ఎసిడిటి, మల బద్ధకం, సైనసైటిస్‌, ఆస్తమా, పక్షవాతం, చర్మవ్యాధులు, మానసిక వ్యాధులు మొదలగు వాటికి చికిత్సలు అందిస్తుంది.

chari
- డా. జె.వి.ఎన్‌. చారి
ఎన్‌డి(ఉస్మానియా), సిఎచ్‌ఓ

Saturday, September 11, 2010

జంతు'యోగం'

ఏ జంతువునైనా కరకరా నమిలి జీర్ణం చేసుకుంటుంది సింహం. ఎంతటి విషంకక్కే పాములను మింగినా సరే, నెమలి నిగనిగలాడుతూనే ఉంటుంది. మెరుపు వేగంతో పరిగెత్తే కుందేలుకు అలసట అంటే తెలీదు. మైళ్లదూరం ప్రయాణమంటే గద్దకు లెక్కేలేదు. తలకు మించిన బరువును సైతం లాగిపడేస్తుంది వృషభం. నిప్పుల కొలిమిలాంటి ఎడారిలో ఒంటె హాయిగా జీవించేస్తుంది. ఇరుకైన ప్రదేశానికి తగ్గట్టు పాము తన శరీర పరిమాణాన్ని మార్చుకుంటుంది. ఏమిటీ జీవ రహస్యం..? ఒక్కో జంతువుకు ఒక్కో అపురూప జీవలక్షణాలను అందించిన ప్రకృతి మహత్యమది. అలాంటి అన్ని లక్షణాలు మనుషులకూ వస్తే, ఇంకెంత ఆరోగ్యంగా ఉంటారు..? అన్న ఆలోచన నుంచే పుట్టాయి ఈ యోగాసనాలు.... వీటిని మనకు వివరించారు భారతీయ యోగా సంస్థాన్ హైదరాబాద్ అధ్యక్షులు ప్రకాష్‌రావు.

ఊష్ట్రాసనం
ఊష్ట్రం అంటే ఒంటె. ఈ ఆసనంలో శరీరం ఒంటెలాగ ఒంకరటింకరగా కనిపిస్తుంది. ఒంటె సాధు జంతువైనా బలిష్టంగా ఉంటుంది. మన శరీరం కూడా ఒంటెలాగ బలంగా ఉండేందుకు ఈ ఆసనం తోడ్పడుతుంది. ఈ ఫొటోలో ఉన్నట్లు.. మోకాళ్ల మధ్యన భుజాల మధ్య ఉన్నంత వెడల్పు ఉంచాలి. పాదాలు ఆకాశం వైపు చూడాలి. తల వెనక్కి వంచాలి. అరచేతులు అరికాళ్లపైన ఉంచాలి. కళ్లు మూసుకొని వెన్నెముక మీద కలిగే ప్రభావాన్ని గమనించాలి.

ప్రయోజనం : మనం చేసే రోజువారీ పనుల్లో ఎక్కువ సమయం ముందుకు వంగి చేస్తుంటాం. ఇలా చేయడం వల్ల వెన్నుపూసలు దగ్గరై.. వాటి నడుమ ఉన్న గ్రంధులు ఒత్తిడికి గురవుతాయి. ఈ ఆసనంలో వెనక్కి వంగడం వల్ల రక్తప్రసరణ జరగని భాగాలు సర్దుకుంటాయి. మెడభాగం (సర్వికల్), నడుము మధ్య భాగం ( డోర్సల్) , నడుం కిందిభాగం (లంబార్) ఆరోగ్యంగా ఉంటాయి.  

సింహాసనం
సింహం అడవికి రాజు. అది ఎంత కఠినమైన ఆహారం తిన్నా అరిగించుకుంటుంది. సింహం తరచూ గర్జించడం వల్ల దాని లోపలి అవయవాలు చురుగ్గా తయారవుతాయి. సింహ ఆసనం వేసేవాళ్లకూ ఆ ఆరోగ్య ప్రయోజనాలు సిద్ధిస్తాయి. ఫోటోలో చూపిన విధంగా కాళ్లు మడిచి కూర్చున్నాక, చేతులు ముందుకుచాపి నిటారుగా వంగాలి. నోరు పెద్దగా తెరిచి, నాలుకను బయట పెట్టి సింహంలా గర్జించాలి. కంఠం, ఛాతీ పూర్తిగా తెరుచుకోవాలి.

ప్రయోజనం : కంఠానికి సంబంధించి ఎలాంటి వ్యాధులున్నా ఈ ఆసనం వాటిని పోగొడుతుంది. మెదడును చురుగ్గా ఉంచుతుంది. కళ్లు, ముక్కు, చెవుల పనితీరును మెరుగు పరుస్తుంది. పిత్తాశయంలో రాళ్లు చేరకుండా కాపాడుతుంది. ఒకవేళ ఇప్పటికే రాళ్లు ఏర్పడి ఉంటే.. మూత్రం ద్వారా బయటికి పంపుతుంది ఈ ఆసనం.  

భుజంగాసనం
పాముకు శరీరాన్ని ఎలా కావాలంటే అలా తిప్పుకొనే సౌకర్యం ఉంటుంది. పాము శరీరానికి ఉన్న లాభం మన శరీరానికి కూడా కలిగేలా చేస్తుంది భుజంగాసనం. రెండు చేతులనూ భూమికి ఆనించి, తలపైకెత్తి చూడాలి. వెన్నుపూసను కొద్దిగా వంచాలి.

ప్రయోజనం : మన శరీరానికి ఆధారం వెన్నుపూస. ఈ ఆసనం వేయడం వల్ల వెన్ను బలిష్టంగా తయారవుతుంది. వెన్నుపూస సమస్యలన్నీ తొలగిపోతాయి. వీపునొప్పి వెంటనే తగ్గిపోతుంది. మూల నాడులు, నాడీమండలం దృఢమవుతాయి. సెర్వికల్ నొప్పితో బాధపడే మహిళలకు ఈ ఆసనం ఎంతో ఉపయోగం.  



మయూరాసనం
పాములు నెమలికి ఆహారం. అయినా పాముల్లోని విషం నెమళ్లను ఏమీ చేయలేదు. విషాహారాన్ని కూడా జీర్ణం చేసుకోగల శక్తిని మయూరాసనం ఇస్తుంది. రెండు అరిచేతులను నేల మీద ఆన్చాలి. చేతులు పాదాల వైపు తిరిగుండాలి. నాభికి చెరోవైపు రెండు మోచేతులను ఉంచాలి. శరీరం కేవలం రెండు అరిచేతుల మీద నిటారుగా ఉంచాలి. ఈ స్థితిలో మెల్లగా శ్వాసను పీల్చాలి.

ప్రయోజనం : ఈ ఆసనం వల్ల కోలన్ నాడి (పెద్ద పేగులు) ప్రభావితం అవుతాయి. ఎంతో కాలం నుంచి వేధించే మలబద్ధకం అయినా తగ్గిపోతుంది. జఠరాగ్ని పెరుగుతుంది. నాభిని సరైన స్థానంలోకి తీసుకురావడం ఈ ఆసనంలోని ప్రత్యేకత. హెర్నియా, సయాటికా దోషాలు తగ్గుతాయి.
 
గరుడాసనం
శరీరాన్ని గరుడ పక్షి (గద్ద) ఆకారంలో ఉంచితే అది గరుడాసనం అవుతుంది. గద్ద ఎంత దూరం ప్రయాణించినా ఆయాసపడదు. ఆ లక్షణం మనకూ రావాలంటే ఈ ఆసనం వేయాలి. రెండు చేతులు, కాళ్లు మెలితిరిగినట్లు, పెనవేసుకున్నట్లు శరీరాన్ని ఉంచాలి. శ్వాసను బయటికి వదిలి సాధ్యమైనంత వరకు ఆపాలి. ఇదే ఆసనాన్ని తిరిగి రెండవకాలు, చేయితో చేయాలి.

ప్రయోజనం : నిల్చుని చేయడం వల్ల నడుము కింది భాగంలోని దోషాలు నయమవుతాయి. నడుంనొప్పి, స్లిప్ డిస్క్ దూరమవుతాయి. అండకోశం వృద్ధి చెందుతుంది. హెర్నియా బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది. అలసట, ఆయాసాలను దూరం చేస్తుంది.
 
గోముఖాసనం
ఆవు ఆకారంలో ఈ ఆసనం ఉంటుంది. ఫొటోలో ఉన్నట్లు కుడికాలును ఎడంవైపుకు.. ఎడం కాలును కుడివైపుకు మడవాలి. రెండు చేతులను వెనక్కి తీసుకొచ్చి, ఇంటర్‌లాక్ చేయాలి. సాధారణ శ్వాస తీసుకోవాలి. కొంతసేపయ్యాక వ్యతిరేక దిశలో రిపీట్ చేయాలి.

ప్రయోజనం : అతిగా మూత్రం వెలువడేవారికి ఇది ఎంతో ఉపకరిస్తుంది. మధుమేహాన్ని నియంత్రిస్తుంది. నీరసాన్ని తొలగిస్తుంది. నరాల నీరసాన్ని తగ్గించి, మనసుకు ఉల్లాసాన్ని ఇస్తుంది. అండకోశం అనవసర పెరుగుదలను ఆపుతుంది.  


వృషభాసనం
వృషభం (ఎద్దు) ఎంత గట్టిగా ఉంటుందో మనకు తెలుసు. సుఖాసనంలో కూర్చున్నట్లే ఒక కాలు అటు, మరొక కాలు ఇటు మడిచి కూర్చోవాలి. రెండు చేతులను మోకాలిమడమ దగ్గర పెట్టుకోవాలి.

ప్రయోజనం : వృషభాసనం వేస్తే మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి. నడుంనొప్పిని కూడా ఇది దరి చేరనీయదు. సుఖాసనం లాంటిదే. ప్రయోజనాల మాట అటుంచితే, కాసేపు కూర్చోవడానికి ప్రశాంతంగా ఉంటుంది.  





మార్జాలాసనం
మార్జాలం అంటే పిల్లి. దాని ఆకారం వచ్చేలా ఈ ఆసనాన్ని వేయాలి. మోకాళ్లు, అరచేతుల మీద వంగి ఉండాలి. తలను కిందికి వంచాలి. ప్రయోజనం : మధుమేహాన్ని చక్కగా నియంత్రిస్తుంది. పొత్తి కడుపు భాగాలు గట్టిపడతాయి.

ముఖ్యంగా మహిళలకు నాభి కింది భాగం సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. గర్భవతులు కూడా ఈ ఆసనాన్ని యోగా నిపుణుల సలహాతో చేయవచ్చు. సులువుగా ప్రసవం అయ్యేందుకు మార్జాలాసనం తోడ్పడుతుంది.  


శశాంకాసనం
శశాంకం అంటే కుందేలు. కుందేలు ఎంత వేగంగా, ఎంత దూరం పరిగెత్తినా ఊపిరి తీసుకొనేందుకు ఇబ్బంది పడదు. ఈ ఆసనం వేస్తే మీరు కూడా శ్వాసలో స్వేచ్ఛను అనుభవిస్తారు. మోకాళ్ల మీద కూర్చుని నెమ్మదిగా చేతులు ముందుకు చాపాలి. నిదానంగా చేతులను నేలకు తాకిస్తూ ఈ ఫొటోలో ఉన్నట్లు ముందుకు వంగి కాసేపు అలాగే ఉండాలి.

ప్రయోజనం : ఊపిరితిత్తులు, గుండె పనితీరు మెరుగుపడుతుంది. పేగుల్లో సమస్యలు తొలగిపోతాయి. నడుం దగ్గర కొవ్వు కరిగిపోతుంది. ఉదర సంబంధిత సమస్యలను కూడా పరిష్కరిస్తుంది. ఆకలిని బాగా పెంచి అజీర్తిని నివారిస్తుంది. గ్యాస్ట్రిక్ సమస్యలను పోగొడుతుంది.
 
మండూకాసనం
కప్ప ఆకారాన్ని పోలిన ఈ ఆసనంతో ఎన్నో ఉపయాగాలున్నాయి.మోకాళ్ల మీద కూర్చోవాలి. రెండు పిడికిళ్లు బిగించి పొట్టదగ్గర పెట్టుకోవాలి. మెల్లగా ముందుకు వంగి తలను నేలను తాకించే ప్రయత్నం చేయాలి.

ప్రయోజనం : రోజూ మండూకాసనం వేస్తే, ఇన్సులిన్ ఉత్పత్తి సవ్యంగా జరుగుతుంది. మధుమేహవ్యాధిగ్రస్తులకు ఎంతో ఉపకరిస్తుంది. ప్రొస్టేట్ గ్రంథి సమస్యలను రాకుండా కాపాడుతుంది. బొజ్జ బాగా తగ్గిస్తుంది.

ఆనందాసనం

ఆరోగ్యానికి నవ్వు చాలా అవసరం. హృదయం ప్రసన్నంగా వున్నప్పుడే నవ్వు వస్తుంది. అదే విధంగా నవ్వు రాగానే హృదయం ప్రసన్నం అవుతుంది. మొత్తం జీవరాశిలో నవ్వు మానవ జాతికే లభించిన వరదానం. నవ్వు ముఖం అందరినీ ఆకర్షిస్తుంది. అందువల్లనే నవ్వు ముఖం అవసరమని అందరూ భావిస్తూ వుంటారు. నవ్వు ముఖం వికసించి వుంటుంది.

andhanamహాస్యం టెన్షనును తొలగించేందుకు ఉపయోగపడుతుందని ఆధునిక శాస్తవ్రేత్తలు కూడా అంగీకరించారు. కనుకనే ప్రపంచమంతా హాస్య క్లబ్బులు(లాఫింగ్‌) ఏర్పడుతున్నాయి. యోగా శిక్షణా కేంద్రాల్లోనూ దీనిని ఆనందాసనం రూపంలో సాధకులు అభ్యసిస్తున్నారు. ఇప్పుడు ఆ ఆసనం గురించి తెలుసుకుందాం..

సాహిత్య రసశాస్త్రం ప్రకారం నవరసాల్లో హాస్యరసం ఒకటి. హాస్యరసానికి స్థారుూ భావం నవ్వు... నవ్వు వచ్చినప్పుడు శరీరంలో జరిగే మార్పును అనుభావాలు అంటారు. చిరు నవ్వు వచ్చినప్పుడు ముఖం విప్పారడం, కళ్లు సగంగాని లేక పూర్తిగా గాని మూత పడటం, పళ్లు బయటికి కనబడడం, పకపక నవ్వుతూ వున్నప్పుడు ధ్వని రావడం, భుజాలు ఎగురు తూ వుండటం, హాస్యరసానికి సంబంధించిన అనుభావాలు. ఈ అనుభావాలను రసశాస్త్రం లో స్మిత, హసిత, విహసిత, అవహసిత, అపహసిత, అతిహసిత అని ఆరు విధాలుగా విభజించారు.

స్మితము : నేత్రాల్లో కొద్దిగా వికాసం, పెదవుల కొద్ది కదలిక, ధ్వని వెలువడక పోవుట, చిరునవ్వు లేక మందహాసం దీనికి లక్షణాలు.
హాసితము : పెై లక్షణాలతోపాటు పళ్ల వరుస కూడా బయటికి కనబడటం హసిత లక్షణం.
విహసితము : ఇందులో స్మిత, హసిత లక్షణాలతోపాటు కంఠం నుంచి మధురధ్వని వెలువడుతుంది.
అవహసితము : విహసిత లక్షణాలతోపాటు శిరస్సులో కొంచెం కదలిక, భుజాల కదలిక లేక భుజాలు కొద్దిగా ఎగరడం అవహసిత లక్షణాలు.
అపహసితము : అవహసిత లక్షణాలతోపాటు కండ్లలో నీరు నిండటం, ఆనందబాష్పాలు రాలడం, అపహసిత లక్షణాలు.
అతిహసితం : పెై లక్షణాలతోపాటు కాళ్లు చేతులు కదిలించడం, ఎదురుగా వున్నవారిని చేతులతో పొడవటం, పెద్దగా ధ్వని చేస్తూ అట్టహాసంగా నవ్వడం అతిహసిత లక్షణాలు.
లాభాలు : బాధలు, కష్టాలు, నిరాశలు, నిస్ఫృహలు తొలగి మన స్సుకు ఆనందం కలు గుతుంది. జీర్ణక్రియ, శ్వాసప్రక్రియ, రక్త ప్రసరణ వంటి శరీర క్రియలపెై మంచి ప్రభావం పడుతుంది. హృదయం లోతుల్లో నుంచి ప్రసన్నత,ఆకర్షణా శక్తి పెరుగుతుంది.