Showing posts with label యోగ. Show all posts
Showing posts with label యోగ. Show all posts

Monday, August 6, 2012

సర్వరోగ నివారిని ప్రాణాయామం

తరచూ అనారోగ్యాలకు గురయ్యే మహిళలు నిత్యం యోగా చేయడం మూలంగా ఆరోగ్యం కుదుటపడు తుందని వైద్యులు సూచిస్తున్నారు. వివిధ రకాల యోగ మూలంగా శరీరం, మనసు రెండు కూడా ప్రశాంతంగా ఉంటాయని వారంటున్నారు. మానసిక ఒత్తిడిని అధిగమించడానికి యోగా ఎంతో గానో ఉపయోగపడుతుందని, మహిళలు ఇంటి పట్టునే ఉండి ప్రతిరోజు యోగాను చేయడం వల్ల అన్ని రకాల సమస్యలు పరిష్కారమవుతాయని వారంటు న్నారు. యోగాలో భాగంగా ప్రాణాయామం గురించి  తెలుసుకుందాం.

1.ప్రాణాయామ విశేషాలు
benefa 

ప్రాణం + ఆయామం = ప్రాణాయమం. ప్రాణమంటే జీవన శక్తి. ఆయామం అంటే విస్తరింపచేయుట లేక నియంత్రించి ఉంచుట అని అర్ధం. పతంజలి మహర్షి ప్రసాదించిన యోగ సూత్ర ప్రకారం శ్వాస, ప్రశ్వాసల్ని నియంత్రించి ఉంచడమే ప్రాణాయామం అని నిర్ధారించడం జరిగింది. లోనికి పీల్చే గాలిని శ్వాస అని, బయటికి వదిలే గాలిని ప్రశ్వాస అని అంటారు.శ్వాస ప్రశ్వాసల్ని నియంత్రించడం, క్రమబద్దం చేయడం ద్వారా అంతర్గత సూక్ష్మప్రాణాన్ని కూడా అదుపులో ఉంచవచ్చు.నాడీమండలం, రక్త ప్రసార ధమనులు, జీర్ణకోశం, మూత్రకోశం మొదలుగా గల వాటన్నిటి యందు ప్రాణం సంచ రిస్తూ ఉంటుంది.

ప్రాణాయామం వల్ల వాటన్నింటికి శక్తి, రక్షణ కల్పిస్తాయి. కనుకనే ‘‘ ప్రాణాయా మేన యుక్తేన సర్వరోగ క్షయ భవేత్‌’’ అంటే ప్రాణాయామం నియమబద్ధంగా ఆచరిస్తే సర్వరోగాలు హరించిపోతాయి అను సూత్రం ప్రచలితం అయింది.

ప్రాణానికి ప్రాణ, అపాన, సమాన; ఉదాన, వ్యానమను 5 రూపాలు ఉన్నాయి. ప్రాణానికి స్థానం హృదయం. అపానానికి స్థానం గుదం. సమానానికి స్థానం నాభి. ఉదనానికి స్థానం కంఠం. వ్యానానికి స్థానం శరీరమంతా. శ్వాసక్రియకు ప్రాణం, విసర్జన క్రియకు అపానం, పాచన క్రియకు సమానం, కంఠశక్తికి ఉదానం, రక్తప్రసార క్రియకు వ్యానం తోడ్పడుతాయి. శ్వాసను బయటకు వదిలే క్రియను రేచకం అని, లోపలకి పీల్చే క్రియను పూరకం అని, లోపల గాలిని ఉంచడాన్ని అంతర్‌ పూరకం అని, తిరిగి బయటకి వదిలి ఆపి ఉంచడాన్ని బాహ్యకుంభకం అని అంటారు. ఈ క్రియలు ప్రాణాయామానికి సాధనాలు.మెడికల్‌ సైన్స్‌ ప్రకారం రెండు ముక్కు రంధ్రాల ప్రయోజనం ఒక్కటే. కాని యోగులు ఈ రెండింటికి మధ్య గల భేదం గ్రహించారు.


వారి పరిశోధన ప్రకారం కుడి ముక్కు రంధ్రాన్నుంచి నడిచే గాలి కొద్దిగా ఉష్ణం కలిగిస్తుంది. అందు వల్ల దీన్ని వారు సూర్య నాడి లేక సూర్య స్వరం అని అన్నారు. అట్లే ఎడమ ముక్కు రంధ్రం ప్రభావం వల్ల చల్లని దనం అందువల్ల దాన్ని చంద్రనాడి లేక చంద్రస్వరం అని అన్నారు. ఈ రెండిటికి మధ్య సమన్వయం సాదించుటకు యోగ శాస్త్రంలో ప్రాధాన్యం ఇవ్వబడింది. హ అను అక్షరం చంద్రుడికి, ట అను అక్షరం సూర్యుడికి గుర్తుగా నిర్ధారించారు. అందువల్ల హఠ యోగం వెలువడింది. హఠ యోగమంటే చంద్ర సూర్య నాడులకు సంబంధించిన విజ్ఞానం అన్నమాట. హఠం అనగాబలవంతం అనికాదు. ప్రాణాయామ విజ్ఞానమంతా చంద్ర, సూర్య స్వరాలకు సంబంధించినదే.

2. ప్రాణాయామం వల్ల కలిగే ప్రయోజనాలు

  • ఊపిరితిత్తులు బాగా పనిచేస్తాయి.
  • శరీరానికి ప్రాణవాయువు బాగా లభిస్తుంది.
    Sitaa
  • రక్త శుద్ధి జరిగి అందలి చెడు అంతా
  • బయటికి వెళ్లి పోతుంది.
  • గుండెకు సత్తువ లభిస్తుంది.
  • మెదడు చురుగ్గా పనిచేస్తుంది.
  • ప్రేగులు, నరాలు, నాడులు శుభ్ర పడతాయి.
  • జఠరాగ్ని పెరుగుతుంది.
  • శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.
  • ఆయుష్షు పెరుగుతుంది. ఇది అన్నిటికంటే మించిన విశేషం.

    3. తీసుకోవలసిన జాగ్రత్తలు
    • మైదానంలోగాని, తోటలోగాని, తలుపులు తెరచియున్న గదిలోగాని,
    • కంబళీ లేక బట్ట లేక ఏదేనీ ఆసనం మీద కూర్చొని ప్రాణాయామం చేయాలి.
    • గాలి విపరీతంగా వీస్తూ ఉంటే ఆ గాలి మధ్య ప్రాణాయామం చేయకూడదు.
    • మురికిగా ఉన్న చోట, దుర్వాసన వస్తున్న చోట, పొగ వస్తున్న చోట ప్రాణాయామం చేయకూడదు.
    • సిగరెట్టు, బీడి, చుట్టపొగ వస్తున్న చోట ప్రాణాయామం చేయకూడదు.
    • పొట్ట నిండుగా ఉన్నపుడు ప్రాణాయామం చేయకూడదు.
    • ప్రాణాయామం చేసే ముందు, చేసిన తరువాత కూడా ఇతర యోగాసనాలు వేయవచ్చు.
    • అయితే చివర శవాసనం వేసి కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలి.
    • ప్రాణాయామం వేసినపుడు బట్టలు తక్కువగానూ, వదులుగానూ ధరించాలి.
    • పద్మాసనం, సుఖాసనం, సిద్ధాసనం, వజ్రాసనం ప్రాణాయామానికి అనువెైన ఆసనాలు.
    • నేల మీద కూర్చోలేనివారు, కుర్చి మీద నిటారుగా కూర్చొని ప్రాణాయామం చేయవచ్చు.
    • నడుం, వీపు, వెన్నెముక, మెడలను నిటారుగా ఉంచి ప్రాణా యామం చేయాలి.
    • ప్రాణాయామం చేసేటపుడు ఒకసారి కుడి ముక్కు రంధ్రాన్ని, ఒకసారి ఎడమ ముక్కు
    • రంధ్రాన్ని మూయవలసి ఉంటుంది. కుడి ముక్కు రంధ్రాన్ని కుడిచేతి బొటన వ్రేలితోనూ, ఎడమ ముక్కు రంధ్రాన్ని కుడిచేతి ఉంగరం వ్రేలితోనూ మూయాలి.
    • ముక్కు రంధ్రాలు సరిగా శుభ్రంగా లేకపోతే ప్రాణాయామం చేసే ముందు జలనేతి, సూత్రనేతి క్రియలు సక్రమంగా చేయాలి. అలాచేస్తే ప్రాణాయామం చేస్తున్నపుడు శ్వాస సరిగ్గా ఆడుతుంది.
    • ప్రాణాయామ క్రియలు చేస్తూ ఉన్నపుడు మనస్సును పూర్తిగా శ్వాస ప్రశ్వాస క్రియలపెై కేంద్రీకరిచాలి. వేరే యోచనలకు తావు ఇవ్వకూడదు.

Tuesday, March 27, 2012

యువతరం ధ్యాన మంత్రం

http://www.yogiinterrupted.com/wp-content/uploads/2011/11/How-to-Meditate-Properly1.jpg
‘నిత్యం పని ఒత్తిడి..శారీరకంగా..మానసికంగా ఎంతో అలసిపోతున్నాం ..పెరుగుతున్న పోటీతత్వం కారణంగా ఎప్పటికప్పుడు సామర్ధ్యం పెంచుకుంటూ పోటీ పడాల్సి వస్తోంది. ఇంటి బాధ్యతలు..బంధుత్వాలు .. స్నేహాలు ఇలా ప్రతిక్షణం మనిషిని చుట్టే ఆలోచనలు జీవితాన్ని అతలాకుతలం చేస్తున్నారుు. మనసులు మానసిక సంఘర్షణలకు లోనవుతున్నారుు. ఈ బాధ్యతలన్నీ సరైన ప్రణాళిక లేకుంటే ఏ పనీ సరిగా చేయలేం. అనుకున్నవన్నీ సాధించలేం. దీని నుంచి ఎలా బయటపడాలి ? జీవితంలో విజయం ఎలా సాధించాలి ? ఆనందంగా ఎలా ఉండాలి ? సమాజ నిర్మాణంలో మన బాధ్యత ఏంటి ? ఇలా ఎప్పుడైనా ఆలోచించామా ? అనేక శారీరక రుగ్మతలకు మానసిక దుర్బలత్వమే కారణం. మరి మనం శారీరకంగా ఆరోగ్యంగా ఉండా లంటే తగిన వ్యాయామం చేయాలి. మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే మన మెదడుకు పదును పెట్టాలి. అంటే మనసును ప్రక్షాళన చేసుకోవాలి. ఇందుకు ధ్యానం చక్కటి మార్గం. ప్రస్తుతమున్న జీవన విధానం కన్నా ఉన్నతంగా ధ్యానం ద్వారా జీవితాన్ని గడపవచ్చని ధ్యానేకంద్రాల నిర్వాహ కులు చెబుతున్నారు.
Yogad 
ఏదైనా పవిత్ర లక్ష్యాన్ని నిర్థారించుకుని దానిపైనే దృష్టి నిలపడం ధ్యానం. ఇది ఒక పద్ధతి ప్రకారంగా జరగాలి. ధ్యానం యోగాలో ఒక భాగం. మన పూర్వీకులు అనేక సంవత్సరాలు పరిశో ధన చేసి మానవ శరీరం యోగా రూపంలో గొప్ప ఆద్యాత్మిక శక్తిని సాధించే ప్రక్రియను ప్రపంచానికి అందించారు. యోగాకు ఆద్యుడు పతంజలి సూచించిన ప్రకారం ఎనిమిది నియమాలతో కూడుకుంది . భౌతిక శాస్తప్రరంగా, సాంకేతిక విజ్ఞానపరంగా ఎంతో వృద్ధి సాధించినప్పటికీ సంతోషంగా మనం జీవించలేకపోతున్నాం. ఈ దిశగా ఆలోచిస్తే యోగా అవసరమే అని చెప్పక తప్పదు. ఎందుకంటే మానసికంగా, శారీరకంగా ఆరోగ్యవంతమైన జీవితం కోసం యోగా, ధ్యానం సాధనచేస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయని సాధకులు చెబుతున్నారు.

యోగా ప్రయోజనాలు ఇవీ...

Yoga3 
మనం సాధన చేసే తీరును బట్టి ఫలితాలు ఉంటాయి. మనం ప్రతి రోజూ భౌతిక విధులు నిర్వర్తిస్తున్నట్లుగానే ధ్యానాన్ని కూడా నిత్యకృతగా మార్చుకుంటే మంచి ఫలితాలు బోధపడతాయని యోగా నిపుణులు చెబుతున్నారు. కేవలం శారీరక, మానసిక ఆరోగ్యా లకే ఈ ధ్యానం పరిమితం కాదు. మనం ప్రశాంతంగా జీవిస్తూ, మన చుట్టూ ప్రశాంత వాతావరణం ఉండేలా చేయడమే ధ్యానం. నిర్మాణాత్మక సమాజం దిశగా మనం పయనించేందుకు ధ్యానం గొప్ప వరం. సాంప్రదాయ యోగా క్రమేణా అనేక పద్ధతుల్లో ప్రాచుర్యంలోకి వచ్చింది. ఎన్నో సంస్థలు పలు రకాలుగా యోగా, ధ్యానంలో శిక్షణ ఇస్తూ వాటి కేంద్రాలను విస్తరిస్తున్నాయి. http://yogalina.files.wordpress.com/2012/01/pilates_mat_class_joyg-ay24.jpg
విదేశాల్లోనే ఎక్కువ ఆదరణ...
యోగా మన దేశంలో పుట్టినప్పటికీ విదేశా ల్లోనే ఎక్కువ ఆదరణకు నోచుకుంటోందని యోగా గురువు ఎ.ఎల్వీ కుమార్‌ చెబుతున్నారు. అన్నారు. అమెరికా, స్వీడన్‌, కెనడా, యుకె, పోలెండ్‌ దేశాలకు చెందిన 20 మంది పాశ్చాత్యులు యోగా నేర్చుకోవడానికి ఇటీవల భాగ్యనగరానికి విచ్చేశారు. యోగా హీలింగ్‌ ఫౌండేషన్‌ అనే స్వచ్చంద సంస్థ సాంప్రదాయయోగా (ట్రెడిషనల్‌ యోగా) లో టీచర్లకు గత కొద్ది కాలంగా శిక్షణను అందిస్తోంది. శిక్షణలో భాగంగా ఆసనాలు, ప్రాణాయామ, శ్వాస పద్ధతులు, మెడిటేషన్‌ తదితర అంశాలపైన క్లాసులు ఇస్తున్నారు. ఇవే కాకుండా యోగా పరిచయం, ఎక్‌స్టర్నల్‌ (బహిర్గత), ఇంటర్నల్‌ (అంతర్గత) యోగా, ఇతర ప్రత్యామ్నాయ శాస్తల్రను బోధిస్తున్నారు.

ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌లో శిక్షణ...
Yogal 
ప్రధానంగా ధ్యానం పైనే దృష్టిని కేంద్రీకరిస్తారు. రిథమిక్‌ టైప్‌ ఆఫ్‌ బ్రీథింగ్‌లో ఆరు రోజులపాటు ఈ శిక్షణ ఉంటుంది. ప్రతి రోజు మూడు గంటలపాటు ప్రాణా యామం బస్ర్తిక, సుదర్శన్‌ క్రియల్లో శిక్షణ ఇస్తారు. ఈ ధ్యానం వల్ల శరీరానికి 72 నుంచి 80 శాతం వరకు గాలి అదనంగా అందుతుంది. మానసిక ఒత్తిడిని దూరం చేసి ఇతరత్రా సమస్యలను ఎదుర్కొనేందుకు ఆత్మ విశ్వాసాన్ని పెంపొందిస్తుంది. దీనిని ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ అందిస్తోంది. కోర్సు పూర్తయిన తరువాత ప్రతి రోజూ 20 నిముషాల పాటు దీనిని కొనసాగిస్తే సరిపోతుంది.
-ఇస్కా రాజేష్‌బాబు
‘సూర్య’ ఫీచర్స్‌ ప్రతినిధి

Friday, December 23, 2011

ఆత్మజ్ఞానం..క్రియాయోగం

ఆత్మజ్ఞానం..క్రియాయోగం

మనిషి ఆత్మజ్ఞాన సాధన కోసం చేసేదే క్రియాయోగం. పతంజలి మహ ర్షి తన యోగ శాస్త్రంలో చెప్పిన క్రియా యోగం, భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించిన కర్మయోగం సంధానం చేసి క్రియాయోగంగా ప్రపంచానికి అందించారు శ్యామాచరణ లాహిరి. ఆయన శిష్యులలో అతి ముఖ్యులు, క్రియాయోగాన్ని విశ్వవ్యాపితం చేయడానికి కృషి చేస్తున్న డాక్టర్ అశోక్ కుమార్ చటర్జీ 79వ జన్మదినం నేడు. 
ఆ సందర్భంగా క్రియాయోగదర్శనం...
ప్రాణమే భగవంతుడని, దానినే ఈశ్వరుడు, విష్ణువు, శివుడు, అల్లా, జీసస్ ఇలా అనేక నామాలతో పిలవడం జరుగుతోందని తపస్సంపన్నులైన మన మహర్షులు, యోగులు చెబుతారు. అదే అనంత సృష్టిని ధరిస్తోంది. ఈ ప్రాణమే దేహంలో శ్వాస రూపంలో చంచలంగా ఉంది. దాన్ని స్థిరం చేసే విధానమే క్రియా యోగం. బయట శ్వాసని బయటే విడిచిపెట్టి దేహంలో ఉండే ప్రాణ, అపాన వాయువులతో చేసే అంతర్ముఖ ప్రాణాయామమే ఈ క్రియా యోగం. క్రియా యోగ సాధన వల్ల కేవలకుంభక స్థితిని పొందడం ద్వారా సమస్తమైన ప్రాపంచిక చంచలత్వం నశించి ప్రాణం, అంతర్ముఖం చెంది, స్థిర ప్రాణంగా అనగా కర్మాతీత, గుణాతీత, ఇచ్ఛారహిత నిర్గుణ పరబ్రహ్మని పొందడం జరుగుతుంది. ఇది ప్రాణ సాధన.

ఈశ్వరప్రాప్తికి మార్గం ఆత్మజ్ఞాన సంపన్నులైన మునులు, ఋషులు, యోగ పురుషులతో సనాతన భారతదేశం ఈ అనంత విశ్వంలో ధార్మిక జగత్తుకి రాజధానిగా నేటికీ విరాజిల్లుతోంది. సంసార బంధనాలలో చిక్కుకున్న బాధాతప్తహృదయులకు ఈశ్వరప్రాప్తి పొందే సహజమైన, సత్యమైన యోగసాధనను సంప్రాప్తింపచేయటానికి భగవానుడు 1828 సెప్టెంబర్ 30న యోగిరాజ శ్యామచరణ లాహిరి అవతారంలో జన్మించారు. బెంగాల్ నదియా జిల్లాలోని ఘుర్ని గ్రామంలో జన్మించిన లాహిరి చిన్నతనంలోనే తల్లిని కోల్పోయారు. తన మూడవ ఏటి నుంచే ధ్యానలోకంలోకి అడుగిడిన లాహిరి మెడ దాకా ఇసుక కప్పుకుని ధ్యానం చేసేవారు. ఆయన ఐదవ ఏట వరదలు వచ్చి పూర్వీకుల గృహం కొట్టుకుపోగా కుటుంబం వారణాసికి వలసవెళ్లింది. ఆయన జీవితకాలంలో ఎక్కువభాగం వారణాసిలోనే గడిపారు.

శ్యామాచరణులు వేదం, ఉపనిషత్తులు వంటి శాస్త్రాలతోపాటు ధార్మిక గ్రంథాలను అధ్యయనం చేశారు. ఉదరపోషణార్థం బెంగాలీ, ఇంగ్లీషు, ఉర్దూ, హిందీ భాషలు నేర్చుకొని మిలటరీ ఇంజనీరింగ్ వర్క్స్‌లో గుమాస్తాగా చేరారు. వేతనం సరిపడనంతగా లేకపోవడం వలన కుటుంబ ఖర్చుల కోసం ట్యూషన్లు కూడా చెప్పేవారు. ఐదుగురు సంతానం కలిగి, అన్నదమ్ముల గృహకలహాల నడుమ జీవిక సాగిస్తూ యోగులు, సాధువులు, మహాత్ముల తపోభూమిగా, దేవభూమిగా ప్రసిద్ధిగాంచిన హిమాలయాలలో తపస్సు సాగిస్తున్న శ్రీకృష్ణ భగవాన్ స్వరూపులైన బాబాజీ వద్ద క్రియాయోగ దీక్షను పొందారు శ్యామాచరణులు.

వారి ఆజ్ఞమేరకు గృహస్థు యోగ్యతతో గృహస్థాశ్రమంలోనే ఉంటూ కఠోర యోగ సాధన చేసి కొత్తకొత్త ఎత్తులను అనాయాసంగా దాటుతూ, సాధనలో ఉచ్ఛతమ స్థితిని పొంది, సరళము, నిరాడంబరమైన, అతి స్వల్ప సమయంలో ఫలమిచ్చే క్రియాయోగ సాధనని సంసారులకు ఇవ్వడం ఆరంభించారు. కాశీలో నడిచే విశ్వనాథునిగా పేరుగాంచిన శ్రీత్రైలింగస్వామి వారి ప్రేమను, ప్రశంసలు, ఆదరాభిమానాలను లాహిరి మహాశయులు పొందగలిగారు.

దైవంతో సంభాషణ కుల, మత, జాతి, పేద, ధనిక అనే తారతమ్యాలు లేకుండా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు, ఆత్మజ్ఞాన పిపాసులందరికీ క్రియాయోగ దీక్షని శ్యామాచరణులు అందచేశారు.'నీవు ఎవరికి చెందవు..అలాగే నీకూ ఎవరూ చెందరు. ఏదో ఒకరోజు హఠాత్తుగా ఈ లోకంలోని సమస్తాన్ని త్యజించవలసి వస్తుంది. ఇప్పటి నుంచే దైవంతో సాన్నిహిత్యాన్ని పొందు. క్రియోయోగం ద్వారా దైవంతో సంభాషించు. సత్యం నీకు గోచరిస్తుంది. ధ్యానం ద్వారా అన్ని సమస్యలను పరిష్కరించుకో. జీవితంలో నీకు ఎదురయ్యే అన్ని చిక్కు ప్రశ్నలకు ధ్యానంలో సమాధానాలు లభిస్తాయి' అని శ్యామాచరణులు తన శిష్యులకు ఉద్బోధించేవారు.

షిరిడీ సాయినాథుడు కూడా లాహిరి మహాశయుల వద్ద క్రియా యోగ దీక్షను పొందినట్లుగా లాహిరి వారి రహస్య డైరీల ద్వారా తెలియవచ్చింది. 1895 సెప్టెంబర్ 26న తాను ఇక ఈ లోకాన్ని విడిచే సమయం ఆసన్నమైందని లాహిరి మహాశయులు తన శిష్యులు కొందరికి తెలియచేశారు. 'నేను నా స్వగృహానికి వెళుతున్నాను. నా గురించి చింతించకండి. నేను తిరిగి జన్మిస్తాను' అని చెప్పి మహాసమాధిలోకి ప్రవేశించారు శ్యామాచరణులు. హరిద్వార్‌లోని కేశవ ఆశ్రమంలో లాహిరి మహాశయులవారి సమాధిని దర్శించవచ్చు.

ఒకే పృథ్వి-ఒకే ధర్మం క్రియా యోగాన్ని పునఃస్థాపించిన శ్యామాచరణ లాహిరి శిష్యులలో ముఖ్యులు డాక్టర్ అశోక్‌కుమార్ చటర్జీ. లాహిరి మనుమడు స్వర్గీయ సత్యాచరణ లాహిరి వద్ద క్రియాయోగంలోని ఉత్తమ దశలన్నీ పొంది, అతి స్వల్ప కాలంలో మహోన్నత స్థితిని పొంది, ప్రపంచ క్రియా యోగాచార్యులుగా ఖ్యాతి గడించారు ఆయన. 1997 ఏప్రిల్ 27న ఫ్రాన్స్ దేశంలోని హ్యూగన్ పట్టణంలో టిబెట్ ఆధ్మాత్మిక గురువు దలైలామా ఆధ్వర్యంలో జరిగిన విశ్వధర్మ సమ్మేళనంలో మన దేశం నుంచి సనాతన ధర్మపు ఏకైక ప్రతినిధిగా చటర్జీ ఒక్కరికే ఆహ్వానం దక్కడం ఆయన కీర్తికి నిదర్శనం. ఆ సమ్మేళనానికి హాజరైన చటర్జీ 'రండి..అందరం కలిసి ఈ బహు ధర్మాల అస్థిత్వాన్ని మరచి, విభేదాలను విడనాడి ఒకే భగవంతుడు, ఒకే పృథ్వి, ఒకే ధర్మం, ఒకే మనిషి అనే సత్యాన్ని స్వీకరిద్దాం' అంటూ ఉత్తేజభరితంగా చేసిన ప్రసంగానికి అన్ని దేశాల మత ప్రతినిధులతోపాటు దలైలామా నుంచి కూడా ప్రశంసలు లభించాయి.

క్రియా యోగ రాజధాని నేడు కొందరు గురువులుగా చలామణి అవుతూ లాహిరి మహాశయులు అందించిన క్రియాయోగాన్ని రకరకాలుగా మార్పు చేసి, ఆ మహనీయుని పేరును దుర్వినియోగపరుస్తున్నారు. ఈ పరిస్థితులలో లాహిరి మహాశయులు అందించిన క్రియాయోగాన్ని యథాతధంగా అందించడానికి చటర్జీ దీక్షాబద్ధులై నిరంతరం శ్రమిస్తున్నారు. ఈ క్రమంలో డాక్టర్ చటర్జీ కోల్‌కతాకు 100 కిలోమీటర్ల దూరంలో గల కాకద్వీపంలో విశ్వానికంతటికీ క్రియా యోగ రాజధానిని నిర్మించారు. అలాగే ప్రధాన కేంద్రంగా లాహిరి మహాశయుల మందిరాన్ని నిర్మించి యోగిరాజ శ్యామచరణ సనాతన మిషన్‌ను స్థాపించారు. కుల, మత, దేశ తారతమ్యం లేకుండా ఆత్మ పిపాసులందరికీ క్రియాయోగ దీక్షను ప్రదానం చేస్తున్నారు డాక్టర్ చటర్జీ.

Monday, December 12, 2011

మానసిక వికాసానికి యోగా

dheera2 
ఆరోగ్య సంరక్షణకు సూక్ష్మ క్రియలు అధికంగా ఉపయోగపడతాయి. ఇవి శరీరంలోని మాలిన్యాన్ని తొలగించి, ఆయా అవయవాలకు వ్యాయామం కలుగజేసి, వాటి సామర్థ్యాన్ని పెంచుతాయి. ఈ సూక్ష్మ యోగ క్రియలను క్రింద కూర్చుని చేయాల్సి ఉంటుంది. క్రింద కూర్చోలేని వారు కుర్చీ మీద గాని లేక మంచం మీదగాని కూర్చొని చేయవచ్చు. కూర్చోలేకపోతే పడుకుని కూడా చేయవచ్చు. ఈ క్రియలు ఉదరం మీద ప్రభావాన్ని చూపుతాయి. కనుక భోజనం చేసిన తర్వాత వెంటనే చేయకూడదు. సూక్ష్మయోగ క్రియా ఏ అవయవానికి సంబంధించిందో ఆ అవయవం మీద మనస్సును కేంద్రీకరించడం అవసరం. ప్రతి క్రియ 30 నుంచి 60 సెకన్లు వరకు శక్తిని బట్టి చేయాల్సి ఉంటుంది.

యోగ ప్రార్థన క్రియ...
కూర్చొని రెండు చేతులు జోడించి, నమస్కారం చేస్తూ యోగ ప్రార్థన చేయాలి. మనస్సు ప్రశాంతంగా ఉండాలి. శ్వాస సాధారణంగా ఉండాలి. ప్రార్థన చేస్తున్నప్పుడు శ్వాస వదలాలి.
ప్రార్థన క్రియ వలన మనస్సుకు చంచలత్వం పోయి, స్థిరత్వం వస్తుంది. మనస్సులో ఏకాగ్రత కుదురుతుంది. హృదయ శుద్ధి కలుగుతుంది.

భస్ర్తిక క్రియ...
భస్ర్తిక క్రియలు నాలుగు రకాలు. ఇవి శ్వాస, ప్రశ్వాసల ద్వారా శరీర అవయవాలకు శుద్ధి కలిగించే క్రియలు. రెండు ముక్కుల ద్వారా వేగంగా శ్వాస వదలాలి, పీల్చాలి. ఇది భస్త్రిక క్రియ. కుడి ముక్కు రంధ్రం మూసి, ఎడమ ముక్కు రంధ్రం ద్వారా గాలిని త్వర త్వరగా వదలాలి, పీల్చాలి.ఇది చంద్రాంగ భస్ర్తిక. ఎడమ ముక్కు రంధ్రం మూసి, కుడి ముక్కురంధ్రం ద్వారా గాలిని వేగంగా వదలాలి, పీల్చాలి. ఇది సూర్యాంగ భస్ర్తిక. ఎడమ ముక్కు రంధ్రం ద్వారా గాలిని వేగంగా వదలాలి, పీల్చాలి. వెంటనే కుడి ముక్కు రంధ్రం ద్వారా వేగంగా వదలాలి, పీల్చాలి. ఇది సుషుమ్నా భస్ర్తిక. పై క్రియల వల్ల శరీరంలోని మాలిన్యం పోతుంది. వివిధ అవయవాలకు శుద్ధి కలిగి, వాటికి చైతన్యం కలుగుతుంది.

శిరస్సుకు...
ప్రతి క్రియ 30 సెకన్‌లతో ప్రారంభించి, 60 సెకన్ల వరకు చేయాల్సి ఉంటుంది. ఈ క్రియలు చేస్తున్నప్పుడు గాలిని కంఠం దాటి, లోనికి పోనీయకూడదు. ఇందులో పలు క్రియలున్నాయి.

ఎ. కంఠశుద్ధి: కంఠశుద్ధి కోసం శిరస్సును తిన్నగా ఉంచి, ఎదురుగా చూస్తూ, శ్వాసను వేగంగా వదలాలి, పీల్చాలి.
బి. ఆత్మశుద్ధి వృద్ధి: ఆత్మశక్తిని పెంచేందుకు, భయం పోయేదానికి, శిరస్సును ఎత్తి, శిరస్సు వెనకుక వైపున గల శిఖాభాగం మీద మనస్సును కేంద్రీకరించి, వేగంగా శ్వాస పీల్చాలి, వదలాలి.
సి. జ్ఞాపక శక్తి వికాసం: జ్ఞాపకం లేదా స్మరణ శక్తిని పెంచేందుకు శిరస్సును సగం వంచి, వేగంగా శ్వాస వదలాలి. మనస్సును మాడు మీద కేంద్రీకరించాలి.
డి. మేధాశక్తి వికాసం: వెన్నెముకపై, మెడ కింద, భృకుటిపై మేధాశక్తిని పెంచడానికి శిరస్సును పూర్తిగా వంచి, కళ్లు మూసుకుని వేగంగా శ్వాస వదలాలి, పీల్చాలి.

టెన్షన్‌ తగ్గించే క్రియలు...
టెన్షన్‌ తగ్గాలంటే, కనుబొమలు పైకెత్తి, నుదురుపై ముడుతలు పడేట్లు చేసి, ఐదు సెకన్లు అలాగే ఉండాలి. ఇలా నాలుగైదు సార్లు చేయాలి. శ్వాస సాధారణంగా ఉండాలి.

నేత్రశక్తి క్రియలు...
ఇవి మూడు రకాలు. అవి: 1. నేత్ర శాంతి కోసం చేసే క్రియలు, 2. నేత్ర శక్తి కోసం చేసే క్రియలు, 3. నేత్ర చంచలత్వాన్ని తగ్గించేందుకు చేసే క్రియలు. ఈ క్రియల్లో తలను కదపకూడదు. కళ్లను మాత్రమే తిప్పాలి. మనస్సును ఏకాగ్రత చేయడం అవసరం.

కళ్లకు శాంతిని కలిగించే క్రియలు...
ఇవి కనుగుడ్లను వేగంగా తిప్పే క్రియలు. రెండు చేతులు తిన్నగా ముం దుకు చాచి, పిడికిలి బిగించి, బొటనవేళ్లను నిలిపి రెండు ళ్లతో ఎడమ బొటనవేలిని, కుడి బొటనవేలిని వేగంగా చూడాలి. తర్వాత కుడి చేయి కుడివైపు ఉంచి, ఎడమ చేతిని, ఎడమవైపు కిందికి దింపి, పైబొటన వేలిని, కింది బొటన వేలిని వేగంగా చూడాలి. తర్వాత ఎడమ చేయి పైకి ఎడమవైపు ఉంచి, కుడి చేయి కిందికి కుడివైపుకు దింపి, రెండు బొటన వేళ్లను పైకి, కిందకు వేగంగా చూడాలి. తర్వాత ఒక బొటన వేలిని పైకి, మరో బొటన వేలిని కిందికి ఉంచి, వేగంగా చూడాలి. తర్వాత ఒక బొటన వేలిని భ్రుకుటికి ఎదురుగా ముక్కుకొసకు దగ్గరగా ఉంచి, మరో బొటనవేలిని ముందుకు చాచి, రెండింటిని ఒక దాని తర్వాత మరొక దాన్ని త్వరత్వరగా చూడాలి.

అనంతరం కుడిచేతిని తిన్నగా పక్కకు చాచి, బొటనవేలిని చూస్తూ, చేతిని గుం డ్రంగా పెద్ద సర్కిల్‌లో వేగంగా తిప్పాలి. మోచేతిని వంచకూడదు. ఎడమచేతిని కూడా తిన్నగా పక్కకు చాచి పైవిధంగా చేయాలి. రెండు రెప్పలను వేగంగా మూయాలి, తెరవాలి. పై క్రియలు పూర్తయిన వెంటనే రెండు అరచేతులు కలిపి బాగా రుద్దాలి. కొద్దిసేపుటికి వేడి కలుగుతుంది. రెండు కళ్లమీద రెండు అరచేతులను ఉంచాలి.