Showing posts with label ఆరోగ్యానికి అవీ ఇవీ. Show all posts
Showing posts with label ఆరోగ్యానికి అవీ ఇవీ. Show all posts

Saturday, October 22, 2011

స్థూలకాయానికి సిసలైన పరిష్కారం

స్థూలకాయంతో కదలికలు కష్టం కావడమే కాదు శరీరం పలురకాల దుష్ప్రభావాలకు గురవుతుంది. 21 శతాబ్ధంలోని అతి తీవ్రమైన సమస్య స్థూలకాయమే. శరీరాన్ని రోగగ్రస్తం చేయడమే కాకుండా అంతిమంగా ఇది మనిషి ఆయుష్షును తగ్గించివేస్తుంది.
ఎందుకొస్తుంది?
స్థూలకాయానికి, మౌలికంగా జీవన శైలి లోపాలు, ఆహారపు అలవాట్లే కారణంగా ఉంటాయి. అంటే అవసరానికన్నా ఎక్కువ మోతాదులో ఆహారం తీసుకోవడం, ఆహారం తీసుకోవడానికి ఒక నిర్ధిష్టమైన సమయమేదీ పాటించకపోవడం, పగటిపూట అతిగా నిద్రించడం, నిరంతరం కూర్చుని ఉండే ఉద్యోగ వ్యాపారాలు, బొత్తిగా శరీర శ్రమ లేకపోవడం వంటి కారణాలే ప్రధానంగా ఉంటాయి. వీటికి తోడు కొందరికి జన్యుపరమైన కారణాలతో కూడా స్థూలకాయం రావచ్చు.
వైద్యపరమైన కారణాలు
మనం తీసుకునే ఆహారం సక్రమంగా జీర్ణమైతేనే అది శరీరానికి శక్తినిస్తుంది. అయితే కొంద రిలో జీవక్రియలేవీ సరిగా పనిచేయవు. ఫలితంగా కొవ్వు, మలిన పదార్థాలు శరీరంలో పేరుకుపోతాయి. ఇది స్థూలకాయానికి దారి తీయడంతో పాటు అధిక రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలకు దారి తీస్తాయి. వీటితో పాటు థైరాయిడ్ సమస్యలు, హార్మోన్, బహిష్టు సమస్యలు మొదలవుతాయి. గర్భాశయం తీసివేసిన కారణంగా కూడా కొందరిలో ఈ సమస్యలు తలెత్తవచ్చు. కొందరిలో ఈ స్థితిలో రక్తహీనత సమస్యకూడా ఏర్పడుతుంది.
స్థూలకాయంతో చిక్కులు
స్థూలకాయంతో అధిక రక్తపోటు, మధుమేహం మాత్రమే కాదు, ఆస్తమా, కీళ్లనొప్పులు, గుండె జబ్బులు కూడా వస్తాయి. శరీరంలో కొవ్వు అతిగా పేరుకుపోవడం వల్ల శరీరంలోని అతి కీలక భాగాలైన గుండె, లివర్, కిడ్నీలు కూడా దె బ్బ తింటాయి. శరీరంలో అతిగా కొవ్వు పేరుకుపోయిన వారు ఇతరుల కన్నా 30 శాతం కన్నా ఎక్కువగా గుండెపోటుకు గురయ్యే ప్రమాదం ఉంది.

ఇవీ మా చికిత్సలు
వాస్తవానికి స్థూలకాయాన్ని తగ్గించడంలో ఆయుర్వేదం అత్యంత సురక్షిత వైద్య విధానం. ప్రపంచ ప్రసిద్ధిపొందిన ఆర్య వైద్య ఫార్మసీ లిమిటెడ్ (కోయంబత్తూర్)తో ఒప్పదం కుదర్చుకున్న మా మంజూష ఆయుర్వేద హాస్పిటల్ స్థూలకాయాన్ని శాశ్వతంగా తొలగించగలుగుతోంది. మూల దోషాలను తొలగించడం, పేరుకుపోయిన కొవ్వు, వ్యర్థపదార్థాలను శరీరం నుంచి తొలగించడం, స్థూలకాయపు దుష్ప్రభావాలను తొలగించడం ప్రధాన లక్ష్యాలుగా ఈ చికిత్సలు కొనసాగుతాయి.
ప్రత్యేకంగానే...
సమస్య స్థూలకాయమే అయినా, ఆ స్థితి ఏర్పడటానికి వ్యక్తి వ్యక్తికీ వేరు కారణాలు ఉంటాయి. అందుకే ఆయా వ్యక్తుల జీవన శైలి, ఆహారపు అలవాట్లు, జీవక్రియల పనితీరు, శరీర ప్రకృతి, దోషాల స్థితి, మొదటి నుంచి ఆరోగ్య పరిస్థితులు వీటన్నిటినీ ప్రత్యేకంగా పరీక్షి స్తాం. శరీర వ్యవస్థను సమూలంగా చక్కదిద్దడానికి కడుపులోకి కొన్ని మందులు కూడా ఇస్తాం. శరీరంలో పేరుకుపోయిన కొవ్వును, మలినాలనూ తొలగించడానికి ఉద్దేశించి ఆయుర్వేదంలో 150 థెరపీల దాకా ఉన్నాయి. వ్యక్తుల శరీర ధర్మాన్ని , వాత, పిత్త , కఫ దోషాలను అనుసరించి ఆ థెరపీలను ఎంపిక చేస్తాం. ఆయుర్వేద వైద్య చికిత్సలతో బరువు తగ్గడంతో పాటు శరీరం చక్కని ఆకృతి పొందుతుంది. వీటితో పాటు అధికరక్తపోటు, మధుమేహం వంటి సమస్యలు నియంత్రణలోకి వస్తాయి. శరీరాన్ని బాహ్యంగా, అంతర్గతంగా పరిశుభ్రం చేయడం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తాం. బరువు త గ్గించే క్రమంలో థైరాయిడ్ సమస్యలు, హార్మోన్ సమస్యలు, ఆస్టియో పొరోసిస్ సమస్యలు తొలగిపోతాయి. వీటికి తోడు కండరాలు, ఎముకలు శక్తివంతమవుతాయి.
పలు విధానాల్లో...
వైద్య విధానాల్లోని కొన్ని ప్రత్యేక థెరపీలతో కేవలం నాలుగైదు వారాల్లో 5 నుంచి 10 కిలోల బరువు తగ్గుతారు. శరీర ఆకృతిలో 15 నుంచి 25 సెంటీ మీటర్లు తగ్గుతారు. మా హాస్పిటల్‌లో శరీర ఆకృతిని చక్కదిద్దే కొన్ని ప్రత్యేకమైన తైల మర్ధనలు ఉన్నాయి. ఈ చికిత్సలు తీసుకున్న తరువాత ఒక పరిపూర్ణ మైన ఆకృతి వారి సొంతమవుతుంది. చికిత్స అయిపోయిన తరువాత మరో మూడు మాసాల దాకా శరీరం బరువు అలా తగ్గుతూనే ఉంటుంది. అదే క్రమంలో శరీర ఆకృతి కూడా చక్కబడుతూనే ఉంటుంది. ఆ తరువాత మేము సూచించే విధానాలను అనుసరిస్తే, వారి శరీర బరువు, ఆకృతి, ఆశించిన రీతిలోనే నిలకడగా ఉంటాయి.

డా. మంజుషా
మంజుషా ఆయుర్వేదిక్ హాస్పిటల్,
మాదాపూర్, హైదరాబాద్,
ఫోన్ : 8978 222 777, 8978 222 888,
040-64507090.

Tuesday, June 14, 2011

నడుస్తున్న వైద్యం '' మూలికోపతి ''

అజీర్తి, ఎసిడిటీ, తలనొప్పి, మోకాళ్ల నొప్పులు, అల్సర్లు, జుట్టు రాలడం, చర్మ రోగాలు, దంతసమస్యలు, మానసిక ఆందోళనలు, మధుమేహం, రక్తపోటు, ప్రాణాంతక క్యాన్సర్లు... లైఫ్‌స్టయిల్ కారణంగా వచ్చిన రుగ్మతలు కావచ్చు, శరీర రసాయన ధర్మంలో మార్పుల కారణంగా తగులుకున్న రోగాలూ కావచ్చు. ఆయుర్వేద పరిభాషలో చెప్పాలంటే వాత, పిత్త, కఫ సంబంధ రుగ్మతలన్నింటికీ జనామోదం లభిస్తున్న పరిష్కారం హెర్బల్ ట్రీట్‌మెంట్. మూలికావైద్యం. ఒకప్పుడు అది ప్రాచీన వైద్యం.. ఇప్పుడదే ఇన్‌థింగ్. ఆధునికత అంగీకరించి ఆహ్వానిస్తున్న పురాతన విధానం.

ఇంగ్లీష్‌లో హెర్బ్స్, హిందీలో జరీబూటి, తెలుగులో మూలికలు - వీటితో వైద్యమే ఇప్పుడు ప్రపంచాన్నంతా ఊపేస్తోంది. వేల కోట్ల డాలర్ల అలోపతి వైద్యానికి సవాలు విసురుతోంది. మూలికావైద్యం, దేశీయ వైద్య విధానాలు ఆగినచోట అలోపతి పుట్టిందని ఒకనాటి భావన. అలోపతి ఆగిపోయిన చోట మూలికావైద్యం ప్రస్థానం ప్రారంభమైందన్నది నేటి కొత్త విశ్వాసం. మూలికావైద్యానికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది. ప్రపంచవ్యాప్తంగా పరిఢవిల్లిన ప్రతి నాగరికత మూలాల్లోనూ మూలికల విజ్ఞానం నిబిడీకృతమై ఉంది. ప్రతి సమాజంలోనూ ప్రకృతి శరీరధర్మంపై చూపే ప్రతికూల ప్రభావాల నుంచి తమను తాము కాపాడుకోవడానికి మూలవాసులు మూలికలనే ఆశ్రయించారు. అయితే శాస్త్రీయ పునాదులతో అలోపతి వైద్య విధానం వ్యాప్తిలోకి వచ్చిన తర్వాత దేశీయవైద్యవిధానాల్లో 'శాస్త్రీయత' కొరవడిందనే పేరుతో ముప్పేట దాడులు మొదలయ్యాయి. ఆ దాడుల తొలి విక్టిమ్ మూలికా వైద్యం.

వ్యాపారం - లాభం నిండి ఉన్న అలోపతిని ఫార్మాసంస్థలు, ఆధునిక వైద్యులతో పాటు సోకాల్డ్ హేతువాదులు, 'జనవిజ్ఞానులు' నెత్తికెక్కించుకుని సంప్రదాయ విజ్ఞానంపై దాడులకు దిగుతున్నారు. దీనివల్ల సంప్రదాయ విజ్ఞానం సమసిపోకున్నా మసకేసిపోయింది. థాంక్ గాడ్. కొన్ని రకాల రుగ్మతలకు విషయంలో అలోపతి వైద్య విధానంలో పరిష్కారాలు లేకపోవడంతో గత కొన్నేళ్లుగా మళ్లీ సంప్రదాయ, దేశీయ వైద్యవిధానాలకు ఆదరణ పెరుగుతున్నది. ఈ వైద్య విధానాలకు పాతవైభవాన్ని తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నవారు సాధిస్తున్న విజయాలు కూడా ఇందుకు దోహదం చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా మూలికావైద్యం అనూహ్యమైన ప్రాచుర్యాన్ని పొందుతున్నది. ఆధునిక జీవితంలో హెర్బ్స్ అంతర్భాగంగా మారిపోతున్నాయి. హెర్బల్ టీ, హెర్బల్ బాత్ పౌడర్, హెర్బల్ టూత్‌పేస్ట్ మొదలు చిన్నా, పెద్ద శారీరక, మానసిక ఆరోగ్య సమస్యల పరిష్కారానికి ఉపయోగపడే పలురకాల హెర్బల్ ఉత్పత్తులు ఇప్పుడు ప్రతి ఇంటా దర్శనమిస్తున్నాయి.

అశ్వగంధ, సర్పగంధ, శతావరి, ఆమ్లా, అలోవెరా, బ్రహ్మి, వేప, ఆల్ఫాల్ఫా, నేల ఉసిరి, అడవిచామంతి, పసుపు, వెల్లుల్లి, అల్లం, అవిశెలు, జీలకర్ర, మెంతులు, కరివేప... ఇవి అరుదైన మూలికలూ కావచ్చు, పోపు పెట్టెలో కనిపించే దినుసులూ కావచ్చు.

వేదకాలం నుంచే...

రుగ్వేదంలో తొలుత మూలికల ప్రస్తావన కనిపిస్తుంది. సోమ గురించి ఎక్కువ ప్రస్తావించినా రావి, పలాస వంటి ఇతర మూలికల పేర్లు కూడా రుగ్వేదంలో కనబడతాయి. ఇంద్రునికి అత్యంత ఇష్టమైన సోమపానం తయారీకి ఉపయోగించిన మూలికే సోమ. ఆధునిక వృక్ష శాస్త్రవేత్తలు ఈ సోమ మూలికను గుర్తించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. సోమ మూలికకు సంబంధించి ఆయుర్వేద వైద్యుల్లోనూ ఏకాభిప్రాయం లేదు. బహుశా ఇది అంతరించి పోయిన మొక్కల జాతికి చెంది ఉండవచ్చని కొందరి భావన. అధర్వణవేదంలో దాదాపు 100 మూలికల ప్రస్తావన ఉన్నా వాటిలో అనేకం ఇప్పుడు లభ్యం కావడం లేదు. వాటిని పోల్చేందుకు వృక్షశాస్త్ర నామం ఏమిటో తెలియడం లేదు. దేశీయ వైద్య పద్ధతులను క్రమబద్ధీకరించిన ఘనత చరకునిది. క్రీస్తు పూర్వం మూడో శతాబ్దంలో చరకుడు మూలికా వైద్యాన్ని భారతదేశంలోని జానపదుల వైద్య విధానాలను గ్రంథస్థం చేశారు. ప్రాచీన భారతంలో చరకుడు, సుశ్రుతుడు, వాగ్భటుడు అసమానవైద్యులుగా గుర్తింపు పొందారు.

ప్రపంచవ్యాప్తంగా పేరున్న 100 మూలికల్లో 50 మూలికలు భారతీయులు తరతరాలుగా వినియోగిస్తున్నారు. ప్రపంచమంతటా గుర్తింపుపొందిన చైనా మూలికల్లో 20 మూలికలు మన దేశీయ వైద్యంలో కూడా విరివిగా వినియోగంలో ఉన్నాయి. చైనా ప్రభుత్వం అలోపతి పరిమితులను గుర్తించి ప్రజారోగ్య సంరక్షణ కోసం సంప్రదాయ వైద్య విధానాలకు పెద్దపీట వేయడంతో చైనా సంప్రదాయ వైద్యం అంతర్జాతీయంగా పాపులర్ అయింది. నిజానికి మన బలవర్ధక, అశ్వగంధ, తిప్పతీగ, బోడతరము, నేలతంగేడు, గుంటకలగర, చిత్రమూలము, పల్లేరు వంటి ఔషధ మొక్కలు, పసుపు, వేప, కానుగ, వావిలి, జిల్లేడు.. ఇదే కోవకు చెందిన చైనీస్ మొక్కల కంటే శక్తిమంతమైనవి. యూరప్, అమెరికాల్లో లభించే మూలికలతో పోలిస్తే కూడా అదే జాతికి చెందిన భారతీయ మూలికలను ఎక్కువ శక్తిమంతమైనవిగా భావిస్తారు. మరీ ముఖ్యంగా హిమాలయాల్లో లభించే మూలికలను మహిమాన్వితమైనవిగా విశ్వసిస్తారు.

ఈజీగా ఇంటిలోనే...

దేశీయ వైద్యంలో ఆయుర్వేదం, సిద్ధ, యునాని, హోమియోపతి, నాచురోపతి విధానాలున్నాయి. వీటన్నిటిలోనూ ఔషధ మూలికలను వినియోగించినప్పటికీ మూలికావైద్యానికి ఈ వైద్య విధానాలకు తేడా ఉంది. ముఖ్యంగా ఆయుర్వేదానికి మూలికా వైద్యానికి తేడా లేదనుకుంటారు. అది సరికాదు. ఆయుర్వేదం కొన్ని సందర్భాల్లో సంక్లిష్టమైన ప్రక్రియలతో కూడింది. ఒకటి కంటే ఎక్కువ మూలికల సంయోజనం, విలీనం వంటివి అందులో జరుగుతాయి. జంతు, ఖనిజ, లోహ సంబంధమైన వాటిని కూడా ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తారు. ఆయుర్వేదానికి ప్రామాణిక గ్రంధాలున్నాయి. ఒకరకంగా ఇవి సాధారణ మూలికలకు వాల్యూ యాడెడ్ ప్రాడక్ట్స్. మూలికావైద్యంలో నేరుగా లభించే మూలికలనే ఉపయోగిస్తారు. వాటిని తయారు చేయడంలో రకరకాల ప్రక్రియలు ఉన్నప్పటికీ అవి సులభమైనవే. నాలుగైదు కంటే మూలికలను సంయోజనపరిచే అవకాశం మూలికావైద్యంలో లేదు. కావలసిన మూలికలు లభిస్తే ఎవరికి వారు ఔషధాలను తయారు చేసుకునే వెసులుబాటు ఈ విధానంలో ఉంది.

మూలికా వైద్యంలో మొక్కల వేర్లు, కాండం, బెరడు, ఆకులు, మొగ్గలు, పూలు, కాయలు, పండ్లు, గింజలు, చిగుళ్లను... ఔషధ పదార్ధాలుగా ఉపయోగిస్తారు. ఏ మొక్క దేనికి ఉపయోగపడుతుంది.. ఏ ఆకును ఏ రకంగా ఉపయోగించవచ్చు.. వగైరా విషయాలకు సంబంధించిన సాధారణ జ్ఞానం ఒక తరం నుంచి మరో తరానికి వందల సంవత్సరాలుగా అందుతూ వస్తున్నది. మధ్యలో 'శాస్త్రీయ విప్లవం' సృష్టించిన అంతరం వల్ల ఒకటి రెండు తరాలకు ఈ జ్ఞానం దూరమైంది. వివిధ గిరిజన తెగల్లో మూలికలకు సంబంధించిన అద్భుతమైన పరిజ్ఞానం ఉంది. వారు సాధారణ, అసాధారణ వ్యాధులను సైతం అందుబాటులో ఉన్న మూలికలతోనే నయం చేసుకునే ప్రయత్నం చేస్తారు. గిరిజనుల నుంచి ప్రాచీన రుషుల నుంచి పల్లెల నుంచి క్రమంగా మూలికా వైద్యం విస్తరిస్తూ వచ్చింది. ఔషధాలుగా వాడే చాలా మూలికలు ఆహారంగానూ, మసాలా దినుసులు గానూ, సుగంధ ద్రవ్యాలుగానూ మారి వేలాది సంవత్సరాలుగా వాడుకలో ఉన్నాయి. పసుపు, వెల్లుల్లి, అల్లం, మిరియాలు, ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు ఇలాంటివే.

అదిరిపోతున్న ప్రచారం..

యోగ గురువు బాబా రామ్‌దేవ్, ఆయన సహచరుడు బాలకృష్ణ మహరాజ్ యోగతో పాటు ఆయుర్వేదాన్ని మరీ ముఖ్యంగా మూలికల ప్రశస్తిని విస్త­ృతంగా ప్రచారంలోకి తెచ్చారు. పొద్దున్నే ఆస్తా టీవీలో జరీబూటీపై బాలకృష్ణ చెప్పే విషయాలు మూలికల సామర్థ్యాన్ని సామాన్యులకు చేరవేశాయి. ఆ తర్వాత దాదాపు అన్ని టీవీఛానళ్లు, ఇతర ప్రచార సాధనాలు దీనిని అందిపుచ్చుకున్నాయి. మధ్యాహ్నం వంటిల్లు కార్యక్రమంలో వంటలను పరిచయం చేయడం ప్రతి టీవీ ఛానెల్లోనూ ఎంత సాధారణమైందో ఇప్పుడు పొద్దున్నే ఒక అరగంట వైద్యం-ఆరోగ్యం పేరుతో రకరకాల మూలికలను పరిచయం చేయడం, వాటి ఉపయోగాలను వివరించడం అంతే సాధారణమైంది. చాలామంది వీటిని నోట్‌బుక్‌లో రాసుకుని బంధుమిత్రులకు చేరవేయడం కూడా వర్తమాన దృశ్యం.

టీవీల్లో ప్రచారాలకు తోడుగా ఆయుర్వేదం, మూలికా వైద్యంపై తెలుగులోనే ఇటీవల కాలంలో డజన్ల సంఖ్యలో పుస్తకాలొచ్చాయి. రకరకాల మూలికలు, వాటి లక్షణాలు, ఉపయోగాల గురించి వివరించే పుస్తకాలతో పాటు, రకరకాల వ్యాధులు వాటి చికిత్సలో ఉపయోగపడే మూలికలను గురించి వివరించే పుస్తకాలూ ఉన్నాయి. డాక్టర్ కొప్పుల హేమ్రాది 'వనమూలికా ప్రభావం' డా. జి. లక్ష్మణరావు 'మూలికా వైద్యంతో ఆరోగ్యం', డాక్టర్ ఏల్చూరి ఆయుర్వేద పత్రిక ఇంకా అనేక పుస్తకాలు, మేగజైన్లు మార్కెట్లో ఉన్నాయి. అంతేకాక చిట్కా వైద్యంపై ప్రతి పత్రికలోనూ కాలమ్ ఉంటున్నది. ఇంట్లో అందుబాటులో ఉండే దినుసుల్లో దాగి ఉన్న ఆరోగ్య ర హస్యాలపై విరివిగా రాసే వారి సంఖ్య పెరుగుతున్నది.

మూలికలపై పరిశోధనలు చేస్తున్న వారి సంఖ్య కూడా పెరిగింది. అసంఖ్యాకమైన మూలికాధార ఉత్పత్తులు మార్కెట్‌లోకి వస్తున్నాయి. నేరుగా మూలికలనే విక్రయిస్తున్న సంస్థలు కూడా ఉన్నాయి. ఇందులో అవ్యవస్థీకృత రంగంలోని సంస్థలతో పాటు వ్యవస్థీకృత రంగంలో కోట్లాది రూపాయల వ్యాపారం చేస్తున్న సంస్థలు కూడా ఉన్నాయి. హిమాలయ డ్రగ్స్ సంస్థ అర్జున, అశ్వగంధ, బ్రహ్మి, హరీద్ర, కపికచ్చు, పునర్నవ, శొంఠితో సహా దాదాపు 30 వరకు మూలికలను శుద్ధంగా మాత్రల రూపంలో అందిస్తున్నది. అనేక ఆయుర్వేద ఔషధ దుకాణాల్లో ఇటీవల కాలంలో చిన్నచిన్న ప్యాకెట్స్‌లో రకరకాల మూలికల పౌడర్లను విక్రయిస్తున్నారు.

తస్మాత్ జాగ్రత్త..

ప్రపంచవ్యాప్తంగా సంప్రదాయ, ప్రత్యామ్నాయ వైద్య విధానాలకు ఆదరణ పెరుగడంతో వీటి వ్యాపారం 12000 కోట్ల డాలర్లకు చేరింది. 2050 కల్లా ఈ వ్యాపారం 7 లక్షల కోట్ల డాలర్లకు చేరే అవకాశం ఉందని అంటున్నారు. భారత్‌లో దేశీయ మూలికా వ్యాపారం 10,000 కోట్ల రూపాయలుంటుందని అంచనా. అమెరికా, కెనడా, జపాన్, బ్రిటన్, జర్మనీ, ఆస్ట్రేలియాతో సహా పలు అభివృద్ధి చెందిన దేశాల్లో హెర్బల్ వైద్యం పుంజుకుంటున్నది. భారత్ నుంచి ఏటా 3000 కోట్ల రూపాయల విలువైన మూలికలు ఎగుమతి అవుతున్నాయి. భారత్‌తో పోలిస్తే చైనా ఎగుమతులు ఇంకా చాలా ఎక్కువ. దాదాపు 20 వేల కోట్ల రూపాయల విలువైన హెర్బ్స్‌ను చైనా ఎగుమతి చేస్తున్నది. దేశంలో మొత్తం 15 ఆగ్రో క్లైమాటిక్ జోన్స్ ఉన్నాయి.

ఈ జోన్స్‌లో మొత్తం 18000 రకాల పుష్పజాతులున్నాయి. అందులో 7000 రకాల మొక్కలను వైద్యంలో వినియోగిస్తున్నారు. మరీ ముఖ్యంగా 960 రకాల మొక్కలను వైద్య చికిత్సలో విరివిగా వాడుతున్నారు. జాతీయంగా అంతర్జాతీయంగా కూడా భారీ ఎత్తున ఈ మొక్కల ట్రేడింగ్ జరుగుతున్నది. ప్రభుత్వ లెక్కల ప్రకారం ప్రధానంగా 178 జాతుల మొక్కల వినియోగం దేశీయంగా కొన్ని వందల టన్నుల్లో ఉంది. అయితే ఈ విధానాల కారణంగా భారత్‌కు శతాబ్దాలుగా గర్వకారణంగా ఉన్న అమూల్యమైన ఔషధ మొక్కల జాతులు అంతరించిపోతున్నాయన్న విమర్శలూ వస్తున్నాయి. అదొక కోణమైతే తాత్కాలికమైన అభివృద్ధి కోసం అరణ్యాలను, కొండలను ధ్వంసం చేస్తున్న కారణంగా, ఏజెన్సీ ప్రాంతాలను చదును చేస్తున్న కారణంగా స్వీయ అవసరాలకు సరిపడా ఔషధ మొక్కలు కూడా భవిష్యత్‌లో మనకు అందుబాటులో ఉండకపోవచ్చు.

దివ్యౌషధాలు

ఆల్పాల్ఫాకు వ్యాధినిరోధక శక్తిని ప్రసాదించే గుణం ఎక్కువ. ఆల్ఫాల్ఫాను గింజల పొడిగా, మొలకలుగా, టీ ఆకు పసరుతో చేసిన కషాయంగా... ఇలా రకరకాల రూపంలో తీసుకోవచ్చు. ఆల్ఫాల్ఫా గింజలను వంటకాల్లో కూడా ఉపయోగిస్తున్నారు. దంతాలను, చిగుళ్లను, ఊపిరితిత్తులను, రక్తధమనులను, గుండెను అది శక్తిమంతంగా ఉంచుతుంది.
మన రాష్ట్రంలో విరివిగా కనిపించే కలుపుజాతి గడ్డి చేమంతి అనే మొక్కను ఎగ్జిమా నివారణకు శక్తిమంతంగా ఉపయోగించవచ్చని అంటున్నారు. దీనిని రైతులు పశువుల గాయాలు, పుండ్లకు వైద్యం చేయడానికి ఉపయోగిస్తున్నారు.
రోడ్డుపక్క కనిపించే నేలఉసిరిని పచ్చకామెర్ల చికిత్సలో ఉపయోగిస్తారు. అలోపతిలో పచ్చ కామెర్లకు మందులేదు. మానసిక రుగ్మతల చికిత్సలో జటామాంసి, అశ్వగంధి, బ్రహ్మి, జలబ్రహ్మి, వృద్ధదారు, శంఖపుష్పిని చాలా కాలంగా వాడుతున్నారు.

మూర్కొండ, తగిరిశ, తుప్ప తంగేడు, కసివింద, తెల్ల ఈశ్వరి, ఉత్తరేణి, పర్ణయవాని, నేల ములక, ఉచ్చింత.. ఇవన్నీ వినియోగంలో ఉన్న మొక్కలే. ప్రాణాంతకమైన హెర్పస్ సింప్లెక్స్ వైరస్ (హెచ్ఎస్‌వి) కారణంగా వచ్చే వ్యాధులను శక్తిమంతంగా అరికట్టే రెండు మొక్కలను ఇండియాలో కనుగొన్నారు. హైపరికమ్ హుకెరనమ్, హైపరికమ్ మైసోరెన్స్ అనే ఈ రెండు మూలికలు నీలిగిరి కొండల్లో విస్తారంగా దొరుకుతాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆవిష్కరణ. ఎందుకంటే హెర్పస్ సింప్లెక్స్ వైరస్ వల్ల వచ్చే వ్యాధులకు అలోపతిలో ఔషధాలు ఇప్పటికీ లేవు. వైరల్ వ్యాధులకు మూలికా వైద్యంలో వున్న పరిష్కారాలు అలోపతిలో లేవని నిపుణుల అభిప్రాయం. అశ్వగంధ, తిప్పతీగ, శతావరి, బోడతరము, చిత్రమూలము, నేలతంగేడు, పసుపు, పాలసుగంధి, వచ, వెల్లుల్లి, అడ్డసర... హెచ్ఐవి రోగుల్లోనూ జవసత్వాల కోసం వీటిని ఉపయోగిస్తున్నారు.

రక్తపోటుకు వాడే రిసెర్ఫిన్‌ను సర్పగంధి నుంచి రూపొందించారు. కార్డియోటానిక్ డిటిటాలిస్‌ను ఫాక్స్ గ్లోవ్ మొక్క నుంచి తయారు చేశారు. పిల్లల్లో వచ్చే లుకేమియా చికిత్సలో ఉపయోగించే విన్‌క్రిస్టిసిస్, విన్‌బ్లాస్టిన్‌సిన్‌లోను రోసి పెరివింకిల్‌గా చెప్పే బిళ్లగన్నేరు నుంచి తయారు చేశారు. మిరపకాయలు, పచ్చిబొప్పాయి ముక్కలు, అల్లం, యష్టమధు, రుబాబ్ మూలికలు లాలాజల ఉత్పత్తిని పెంచి పిండిపదార్థాలు జీర్ణం కావడానికి తోడ్పడుతాయి. బర్బెరీ, సెంటావరి, జెంటియన్, గ్లోడెన్ సీల్, దవనం వంటి మూలికలు ఆకలిని పెంచుతాయి. జామ ఆకుల కషాయంతో పుక్కిలిస్తే చిగుళ్ల వ్యాధులు, మాయం అవుతాయి. అజీర్తి వ్యాధులకు బొప్పాయి దివ్య ఔషధంగా చెబుతారు. మాంసాహార పదార్ధాలను తేలిగ్గా జీర్ణం చేసుకోవడానికి బొప్పాయి ఉపయోగపడుతుంది. వాము గింజలను నెమ్మదిగా నములుతూ రసాన్ని మింగుతూ ఉంటే అజీర్తి, కడుపుబ్బరం తగ్గుతాయి. పసుపు కలిపిన నీళ్లతో జీర్ణవ్యవస్థ చక్కబడుతుంది.

వెల్లుల్లి :
వెల్లుల్లి సూక్ష్మజీవులను అతి సూక్ష్మజీవులను కూడా సంహరిస్తుంది. గాయాలకు చీము పట్టకుండా చేస్తుంది. చర్మవ్యాధులను, సుఖవ్యాధులను కూడా నయం చేస్తుంది. రక్తంలో కొలస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. గుండెపోటు ప్రమాదాన్ని, మెదడులో రక్తస్రావ, రక్తపోటు ప్రమాదాలను నివారిస్తుంది. మధుమేహ వ్యాధిలో ఇన్సులిన్ అవసరాన్ని తగ్గిస్తుంది. జీర్ణవాహికలో అన్నిరకాల హానికర సూక్ష్మజీవులను నిర్మూలిస్తుంది. చైనాలో టీబీ చికిత్సలో కూడా వెల్లుల్లిని ప్రధాన ఔషధంగా వాడిన దాఖలాలున్నాయి. క్రీస్తుపూర్వం 1500 సంవత్సరాల నాటి వైద్య గ్రంథాల్లోనూ వెల్లుల్లి ప్రస్తావన ఉంది. మొదటి ప్రపంచయుద్ధంలో బ్రిటిష్, రష్యా సైనికులు యుద్ధంలో క్షతగాత్రుల చికిత్స కోసం యాంటిబయోటిక్‌గా వెల్లుల్లిని వివరీతంగా వాడారు.
అర్జున :
ఇది ఉపఖండంలో పెరిగే వృక్షం. కార్డియాలజీ సమస్యలకు ఔషధంగా క్రీస్తుపూర్వం 2500 సంవత్సరాల నుంచి ఉపయోగిస్తున్నారు. ఇది గుండెకు బలాన్నిస్తుంది. ఒత్తిడిని, మానసిక ఆందోళనను దూరం చేస్తుంది. గుండెకు రక్త ప్రసరణను క్రమబద్దం చేస్తుంది. కడుపులో అల్సర్లు, ఇంటర్నల్ బ్లీడింగ్, ఆస్తమా, విరేచనాల్లో కూడా దీనిని ఉపయోగిస్తారు. చెడు కొవ్వును నిర్మూలిస్తుంది. లివర్ వ్యాధులనూ నివారిస్తుంది.
అశ్వగంధ :
అశ్వగంధ అంటే గుర్రం వాసనలను వెదజల్లేదని అర్ధం. శారీరక శక్తిసామర్థ్యాలను పెంచే ఔషధంగా చెబుతారు. అకాల వృద్ధాప్యాన్ని అరికడుతుంది. లైంగిక సామర్థ్యం ఉద్దీపనకేకాక, తీవ్రమైన మానసిక వత్తిడి కారణంగా తలెత్తే కీళ్లనొప్పులు, రక్తపోటు, మధుమేహం చికిత్సలోనూ దీనిని విరివిగా వాడతారు. వ్యాధినిరోధక సామర్థ్యాన్ని పెంచే అశ్వగంధ అనేక ఆయుర్వేధ ఔషధాల తయారీలో కూడా వాడతారు. ప్రపంచాన్ని ఊపేస్తున్న చైనా, కొరియా ఔషధ మొక్క జిన్‌సింగ్‌కు ధీటైన భారతీయ వెర్షన్‌గా అశ్వగంధను చెబుతారు.
మేషశృంగి :
తెలుగులో పొడపత్రిగా వ్యవహరించే మేషశృంగికి మధుమేహ వ్యాధిని అరికట్టే సామర్థ్యం ఉంది. అందువల్లే మధునాశిని అని కూడా అంటారు. స్వీట్స్‌పై ఆసక్తిని కూడా తగ్గించే శక్తి దీనికి ఉంది. విదేశాల్లో ఈ ఔషధంపై అనేక పరిశోధనలు జరిగాయి. ఇప్పటికీ జరుగుతున్నాయి. మధుమేహాన్ని అదుపులో ఉంచే విషయంలో ఈ ఔషధం శక్తిని అందరూ అంగీకరించారు.
అలోవెరా :
కలబందపై ఇప్పుడు కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతోంది. దీన్ని మిరకిల్ ప్లాంట్‌గా వ్యవహరిస్తారు. వ్యాధులను నయం చేసే సహజసిద్ధమైన స్వభావం గల మొక్కగా చెబుతారు. శరీరానికి అవసరమైన అమినో యాసిడ్స్ కలబందలో పుష్కలంగా ఉన్నాయి. అనేకరకాల చర్మవ్యాధులకు దివ్యౌషధం.
శతావరి :
స్త్రీలవ్యాధులకు దివ్యౌషధం. హార్మోన్ల వ్యవస్థ సమతౌల్యాన్ని కాపాడుతుంది. సంతానోత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతుంది. మహిళల గర్భాశయాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. తరుచు అబార్షన్లయ్యే మహిళలకు ఇది అద్భుత ఔషధంగా పనిచేస్తున్నట్టు చెబుతారు.
................................................
* వి.శ్రీనివాస్ - సెల్ : 99854 11006

Friday, April 29, 2011

నీళ్లు నమలండి

ఇది మీరు అనుకునే నీళ్లు నమలడం కాదు... నీళ్లు నిండుగా ఉండే పుచ్చకాయ, టొమాటో లాంటివి నమలడం, లస్సీ, మజ్జిగలను చప్పరించడం. పండ్లు తినడం అన్నమాట. ఈ సీజన్‌లో నీళ్లు ఎక్కువగా తాగుతాం. అది అవసరం కూడా. కానీ... పిల్లలు ఎండలో ఆడుకుంటూ ఆ విషయమే మర్చిపోతారు. కొందరు పనులపై బయటికి వెళ్లినప్పుడు కుదరక నీళ్లు తాగలేరు. అప్పుడు డీహైడ్రేషన్ సమస్య బాధిస్తుంది. వేసవిలో ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకుంటే ఈ సమస్యను అధిగమించవచ్చు. ఈ నీళ్లు నమలడం పొరబాటు కానే కాదు. దీన్ని నిక్షేపంగా చేయవచ్చు. అదే... ఈ  ముందుజాగ్రత్త.

వేసవిలో... కాలానికి అనుగుణంగా తీసుకునే ఆహారం శరీరాన్ని పదిలంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ సీజన్‌లో తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి.

పుచ్చకాయ:
ఇందులో 80 శాతం కంటె ఎక్కువ నీరు ఉంటుంది. అందువల్ల ఇది దాహాన్ని తీర్చి, డీహైడ్రేషన్ నుంచి కాపాడుతుంది.

గ్రిల్డ్ వెజిటబుల్స్:
ఉల్లిపాయ, క్యారట్, బీన్స్, వెల్లుల్లి వంటి వాటిని... ఎండలో నుంచి ఇంట్లోకి రాగానే తినాలి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు ఎండతో వచ్చే చర్మవ్యాధులనుంచి రక్షిస్తాయి.

సలాడ్స్:
వేసవిలో కూరగాయలతో రకరకాల సలాడ్స్ తయారుచేసుకోవచ్చు. గ్రిల్డ్ వెజిటబుల్స్, గ్రిల్డ్ వెజిటబుల్ పాస్తా, నూడుల్స్, గ్రిల్డ్ వెజిటబుల్ పనీర్ సలాడ్స్ వంటివి చేసుకోవచ్చు.

వెజిటబుల్, చిల్డ్ సూప్స్:
దోసకాయ వంటివాటితో చేసిన సూప్‌ను భోజనానికి ముందుగా తీసుకోవటం వల్ల ఆకలి పెరుగుతుంది.

హోల్ గ్రెయిన్ సలాడ్స్:
మొక్కజొన్నలు, మొలకెత్తిన పెసలు, శనగలు (స్ప్రౌట్స్), కూరముక్కలు... వంటివాటిని కలిపి తింటే మంచిది.

 బీన్ అండ్ స్ప్రౌట్ సలాడ్: కొన్ని బీన్స్‌ను కాని స్ప్రౌట్స్‌ను గాని తరిగిన కూరముక్కలు, పండ్ల ముక్కలతో పాటు కలిపి తీసుకుంటే క్యాల్షియం, ప్రొటీన్లు ఎక్కువశాతంలో అందుతాయి.

వెజిటబుల్ చీజ్ సలాడ్స్:
తక్కువ క్యాలరీలున్న చీజ్‌ను తరిగిన కూరలతో కలపటం వల్ల క్యాల్షియం, ప్రొటీన్ల పరిమాణాన్ని పెంచవచ్చు.

కొవ్వు తక్కువగా ఉండే పానీయాలు:
వేసవి లో తియ్యగా, చిక్కగా ఉండే కాఫీ, టీ, సోడాలను, ఐస్‌క్రీమ్‌లను తీసుకోవటం చూస్తాం. వీటిలో క్యాలరీలు ఎక్కువ. ఎటువంటి ద్రవపదార్థాన్ని తీసుకున్నా తాత్కాలిక ఉపశమనమే. అందువల్ల - మజ్జిగ, లస్సీలో ఫ్యాట్ లేని పాలు వాడాలి.

పండ్లతో తయారైన డెజర్ట్స్:
చిక్కగా, మందంగా ఉండే డెజర్ట్స్‌కు బదులుగా పండ్లతో తయారుచేసిన డెజర్ట్స్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి.

టొమాటో సాస్, బొప్పాయి, రెడ్ క్యాప్సికమ్‌లో విటమిన్ ఎ లభిస్తుంది.


వేసవిలో ఆకలి వేసినప్పుడు రకరకాల పండ్లు, బెర్రీలు, పుచ్చకాయ వంటి వాటిని తీసుకోవాలి. ఆకుపచ్చని కూరలు, టొమాటోలు, బఠాణీ వంటివి తీసుకోవటం వల్ల పోషకపదార్థాలు శరీరానికి అందుతాయి.


చల్లని కుకుంబర్:
చల్లని దోసకాయ ముక్కలను సలాడ్స్‌లోను, కూరలలోనూ వాడవచ్చు.

మామిడి:
ఇందులో బీటా కెరొటిన్, విటమిన్ సి, ఫైబర్లు ఉంటాయి.

బెర్రీలు (స్ట్రాబెర్రీలు):
ఈ పళ్లను పెరుగులోనూ, ఐస్‌క్రీంలాంటి వాటిలోనూ వాడవచ్చు.

పనీర్:
ప్రొటీన్లు, క్యాల్షియం ఎక్కువ.

వాల్‌నట్స్:
ఆక్రోట్లు (వాల్‌నట్), చేపలలోని ఒమేగా - 3 ఫ్యాటీయాసిడ్లు గుండె ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడతాయి. వేయించిన చేపల కంటె ఉడకబెట్టినవి మంచిది.

ఓట్స్:
ఫైబర్లు, ప్రొటీన్లు ఎక్కువ.
తృణధాన్యాలు: పొట్టుతీయని పప్పుధాన్యాలు, గింజల ఉత్పత్తులు తీసుకోవాలి.

నూనె పదార్థాలు శరీరంలోని నీటి శాతాన్ని తగ్గించేస్తాయి. అందువల్ల వేసవిలో జంక్‌ఫుడ్‌ని, వేయించిన పదార్థాలను వాడటం మానాలి.


ఎరుపు, ఆరంజ్, పసుపు రంగులలో ఉన్న కూరలు... గుమ్మడి, బంగాళదుంప, చిలగడదుంప, బెల్‌పెపర్... వంటివాటిలో ఎ విటమిన్, సి విటమిన్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.


నీరు:
దాహాన్ని తీర్చడానికి మంచినీటికి మించినది లేదు. ఎండలో ఇంటికి వచ్చినప్పుడు ఒక్క గ్లాసుడు నీరు తీసుకుంటే చాలు, శరీరం ఉత్తేజితమవుతుంది. మంచినీరు ఎక్కువగా తాగుతూంటే డీ హ్రైడ్రేషన్‌కు దూరంగా ఉండవచ్చు.

పెద్దలకు...

బరువు తగ్గి, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపటానికి వేసవి మంచి సమయం. పద్ధతి ప్రకారం సమతుల ఆహారం తీసుకుంటే, బరువు తగ్గటానికి ఉపయోగపడుతుంది. నేరుగా ఎండలోకి వెళ్లి వ్యాయామం చేయటం ఈ కాలంలో మంచిది కాదు.

తాజా పండ్లు, కూరలు తీసుకోవాలి.తర్బూజా, పుచ్చకాయ వంటివి ప్రతిరోజూ తీసుకోవాలి


మజ్జిగను ఎక్కువగా తాగుతుండాలి

క్యారట్లు, బీట్‌రూట్లను రసం రూపంలో తీసుకుంటే మంచిది.ఈ కాలంలో దొరికే తాజాగా ఉండే ఆకుపచ్చ రంగు కూరల వాడకం చాలా మంచిది


మధ్యాహ్నం, రాత్రి వేళలో తీసుకునే భోజనంలో తప్పనిసరిగా తాజా పచ్చికూరలు, మొలకెత్తిన ధాన్యం ఉండేలా చూసుకోవాలి

తాజాగా ఉండే పండ్లరసాలు తీసుకోవటం మంచిది


ఆల్కహాల్ మానేయాలి. ఇక కెఫిన్ ఉంటే కాఫీలవంటి వాటిని కూడా తగ్గిస్తే మంచిది. ఎందుకంటే అవి శరీరంలోని నీటి శాతాన్ని తగ్గిస్తాయి.

వృద్ధులకు



వీరు తీసుకునే ఆహారంలోకార్బోహైడ్రేట్లు అంటే గోధుమ, బ్రౌన్ రైస్, బంగాళదుంపలు, తృణధాన్యాలు

ప్రొటీన్లు, కొవ్వుతక్కువగా ఉండే మాంసం, చేపలు, గుడ్లు, పప్పుధాన్యాలు

ఆహారంలో ఐదువంతుల భాగం పండ్లు, కూరలు లేదా పండ్లరసాలు

ప్రాసెస్ చేసిన మాంసం, కేకులు, బిస్కెట్లలో (వీటిలో శాచురేటెడ్ ఫ్యాట్ తక్కువగా ఉంటుంది)

తగినంత ఉప్పు రోజుకి ఆరు గ్రాముల ఉప్పు కంటె ఎక్కువ తీసుకోకూడదు)

పీచుపదార్థాలు (ఫైబర్)

పేగు సంబంధిత సమస్యలు వయసుపెరిగే కొద్దీ ఎక్కువవుతుంటాయి. ముఖ్యంగా మలబద్దకం అధికమవుతుంటుంది. జీర్ణవ్యవస్థ సక్రమంగా ఉండటానికి తగినంత పీచుపదార్థాలు తీసుకోవటం అవసరం. ఇందుకోసం...

పొద్దున్నే అల్పాహారంగా తృణధాన్యాలు లేదా ఓట్స్

హోల్‌గ్రెయిన్‌తో చేసిన బ్రెడ్ గోధుమ పాస్తా లేదా బ్రౌన్ రైస్


బీన్స్ లేదా ఆ జాతికి చెందిన గింజలు తాజా పండ్లు, కూరగాయలు

పిల్లలకు...
వేసవి అంటే పిల్లలు ఇంటిదగ్గర గడిపే రోజులు, ప్రయాణాలు చేసేరోజులు, లేదా సమ్మర్ క్యాంపులతో బిజీగా ఉండే రోజులు. విపరీతంగా ఆడుతూండటం వల్ల వారిలోని శక్తి సన్నగిల్లుతూంటుంది. శరీరంలో ఉన్న నీటి శాతం తగ్గిపోతుంటుంది. అందువల్ల పిల్లలకు పోషకాహారాన్ని అందించాలి.

పాల ఉత్పత్తులు - లస్సీ, మజ్జిగ, ఫ్లేవర్డ్ మిల్క్, ఫ్రూట్ మిల్క్ షేక్‌లు (మ్యాంగో మిల్క్ షేక్) వంటివి పిల్లల శరీరానికి అవసరమయిన శక్తిని, ప్రొటీన్లను, క్యాల్షియమ్‌ను, ఫ్లూయిడ్లను అందిస్తాయి.


తాజా పండ్లు, చల్లగా ఉండే పండ్ల రసాలు వంటివి కూడా పిల్లల శరీరంలోని నీటి శాతం తగ్గిపోకుండా కాపాడతాయి.


పిజ్జాలు, శాండ్‌విచ్ వంటివి పనీర్, తాజాకూరగాయలతో తీసుకుంటే పరవాలేదు కాని, ఎక్కువగా చీజ్ ఉపయోగించినవి మాత్రం మంచిది కాదు.

 

వెజిటబుల్స్‌ను పనీర్‌తో కలిపి ఇవ్వవచ్చు. లేదా పనీర్ రోల్స్ కూడా ఇవ్వవచ్చు.

ఇంట్లో తయారుచేసిన ఐస్‌క్రీమ్‌లు, ఫ్రూట్ కస్టర్డ్స్, పుడింగ్స్, స్మూతీస్, ఐస్ గోల్స్... వంటివి పిల్లలకి పెట్టవచ్చు.

Friday, December 31, 2010

పసుపుతో ఆరోగ్యం * పసుపే ఆరోగ్యానికి పసిడి

* పాలు వేడిచేసి వాటిలో చిటికెడు పసుపు, మిరియాల పొడి కలిపి రాత్రి పడుకునే ముందు తాగితే దగ్గు తగ్గుతుంది.
* సువాసన భరితమైన మరువాన్ని పసుపులో కలిపి నూరి రాస్తే చర్మవ్యాధులు తగ్గుతాయి.
* పసుపు కొమ్ములను నూరి, నీళ్ళలో అరగదీసి గాని/ పసుపు పొడిని పేస్ట్‌లా నీళ్ళతో చాది గానీ కడితే సెగ్గడ్డలు - కరుపులు మెత్తబడతాయి. పుళ్లు మానుతాయి.
* వేపాకు, పసుపు కలిపి నూరి ఆ పేస్ట్‌ను రాసుకుంటే మశూచి పొక్కులు, గజ్జి, తామర మొదలైన చర్మవ్యాధులలో దురద, మంట, పోటు తగ్గుతాయి.
* పసుపు కలిపిన నీటిలో పరిశుభ్రమైన వస్త్రాన్ని ముంచి బాగా నాననిచ్చి, నీడన ఆరబెట్టి కాస్త తడి పొడిగా ఉంటుండగానే కళ్లు తుడుచుకుంటూ ఉంటే కంటి జబ్బులు తగ్గుతాయి.
* వేప నూనెలో పసుపు కలిపి వేడిచేసి, కురుపులకు- గాయాలకు, గజ్జి, చిడుము లాంటి చర్మరోగాలకు పై పూతగా రాసుకుంటే గుణం కనిపిస్తుంది.
* వేడి చేసిన నీటిలో తేయాకు, మినప పిండి, సెనగ పిండి, పసుపువేసి బాగా కలియతిప్పి, ఈ మిశ్రమాన్ని పొయ్యిమీద పెట్టి, రెండున్నర గ్లాసుల నీరు పోసి బాగా మరుగుతుండగా అట్టి ఆవిరిని పీలిస్తే ఉబ్బసం, ఇస్నోఫీలియా మటుమాయం అవుతుంది.
* మెత్తటి పసుపు, ఉప్పు బాగా కలిపి, దానినే టూత్ పౌడర్‌గా వాడితే దంతాల నొప్పి, నోటి దుర్వాసన, పుప్పిపళ్లు నివారింపబడతాయి.
* నిమ్మరసం, కీరాలను కొద్దిగా పసుపు కలిపి రాస్తున్నట్లయితే ఎండ తీవ్రత వల్ల నల్లబారిన చర్మం తిరిగి కాంతివంతంగా తయారవుతుంది.
* పసుపును స్నానానికి ముందు కొబ్బరినూనెతో కలిపి ముఖానికి రాసుకొని మృదువుగా మర్దనా చేయాలి. ఇలా చేయడంవలన చర్మరోగాలు రావు. ముఖం కాంతివంతంగా తయారవుతుంది.
* పసుపు, గంధం సమపాళ్లలో తీసుకొని పేస్ట్‌లాచేసి పెరుగువేసి కలిపి ముఖానికి రాసుకుని, ఆరిన తర్వాత చల్లటి నీటితో కడిగితే ముఖం కాంతివంతంగా తయారవుతుంది.
* దానిమ్మ, బత్తాయి, నిమ్మ తొక్కలు ఎండబెట్టి పొడిచేసి స్నానం చేసే ముందు పసుపుతో కలిపి శరీరంపై రుద్దుకుంటే చర్మరంధ్రాల్లో మురికిపోయి శరీరానికి నిగారింపు వస్తుంది.
* పసుపు, చందన పొడి, రోజ్‌వాటర్‌తో కలిపి పేస్ట్‌లాచేసి ముఖానికి పూసి, కొంత సేపటి తర్వాత కడగాలి. దీనివల్ల ముఖంపై వచ్చే పింపుల్స్ తగ్గుతాయి.
* రోజూ సాయంత్రం వేపాకు, పసుపు, సాంబ్రాణి, దిరిసెన ఆకులు కలిపి ఇంట్లో ధూపంవేస్తే దోమలనూ, కీటకాలనూ నిరోధించవచ్చు.
* చికెన్‌ఫాక్స్ (ఆట్లమ్మ) వ్యాధికి చందనం, పసుపు, తులసి, వేప మెత్తగా నూరి శరీరంపై ఒత్తుగా రాస్తూ ఉంటే ఉపశమనంగా ఉంటుంది.
* పసుపు కొమ్మును మెత్తగా పొడిచేసి, మజ్జిగలో కలిపి రోజూ ఒకసారి తాగితే దీర్ఘకాలిక చర్మవ్యాధులతోపాటు విరేచనాలు- కీళ్లనొప్పులు తగ్గుతాయి.
* పసుపు కలిపిన కొత్తిమీర ఆకుల రసాన్ని రోజూ రాత్రి నిద్రపోయేముందు ముఖానికి మాస్క్ మాదిరిగా పటిస్తుంటే మొటిమలు- మచ్చలు నివారించవచ్చు. చర్మం గరకుదనంపోయి మృదువుగా తయారవుతుంది.
* పసుపుతో అవిసె పూలు కలిపి బాగా దంచి మెత్తటి రసం తీసి ఔషధంగా రోజుకు రెండుమూడు బొట్లు చొప్పున వాడితే కండ్ల కలకకు ఉపశమనంగా ఉంటుంది.
* వేపాకు, పసుపు కలిపి నీళ్లలోవేసి మరిగించి కాళ్లకు చేతులకు రాయడంవల్ల కాళ్ల పగుళ్లు తగ్గుతాయి.
* చక్కెర కలిపిన పాలను వేడిచేసి, పసుపువేసుకుని సేవిస్తే జలుబుకు ఉపశమనంగా ఉంటుంది.
* చిన్న పసుపుకొమ్ము పొడిని నెయ్యితో కలిపి తీసుకుంటే దగ్గు తగ్గుతుంది.
* పసుపుకొమ్ము బెల్లంతో కలిపి నీటిలో నాననిచ్చి ఆ నీటిని తాగడం ద్వారా రొంపతో వచ్చే గొంతునొప్పి తగ్గుతుంది.
* వేపాకు, పసుపు కలిపిన మిశ్రమాన్ని చర్మవ్యాధులు ఉన్నచోట రాస్తే చర్మవ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
* టేబుల్ స్పూన్ పసుపును ఉల్లిపాయతో కలిపి వాపులు ఉన్నచోట రాస్తే తగ్గుతాయి.
* గంధం, పసుపును తీసుకుని తలకు పట్టుగా వేసుకుంటే తల నొప్పికి ఎంతో ఉపశమనంగా ఉంటుంది.
* ఇంగువ రెండు టీ స్పూన్లు తీసుకుని, పసుపువేసి రెండిటినీ పేపర్‌లో చుట్టి దాన్ని కాల్చి, వాసన పీల్చినట్లైతే మైగ్రేన్ తల నొప్పి తగ్గుతుంది.
* పది గ్రాములు పసుపు తీసుకుని దానిలో 50గ్రాములు పెరుగుతో కలిపి తీసుకుంటే కామెర్లు తగ్గుతాయి.
* గోరువెచ్చగా కాచిన నీటిని తీసుకుని దానిలో పసుపు, కొద్దిగా ఉప్పు వేసి ఈ మిశ్రమాన్ని రెండుమూడుసార్లు పుక్కిలిస్తే టాన్సిల్స్ తగ్గుతాయి.
* నీళ్ళతో పసుపుని మరిగించి బట్టలో వడకట్టి, ఈ వడకట్టిన నీటితో కళ్ళను శుభ్రపరచుకుంటే కళ్లల్లో పుసులు తగ్గుతాయి.
* కొంచెం నిమ్మరసంతో పసుపుని కలిపి కురుపులు ఉన్నచోట రాస్తే ఉపశమనంగా ఉంటుంది.
* పసుపు రోజూ వాడడంవల్ల సాధారణ మధుమేహం నుండి కుష్టు వ్యాధి వరకు అనేకానేక సాధారణ అనారోగ్యాలకు చక్కని ఔషధంగా ఉపయోగపడుతుంది.
* నీళ్ళలో పసుపుని కలిపి తాగితే కడుపులో వుండే నులి పురుగుల్ని హరిస్తుంది.
* పసుపు, సైంధవ లవణం, శొంఠి పొడిని అన్నంలో కలుపుకుని తింటే ఆకలి పెరుగుతుంది.
* పసుపు వాడడంవల్ల బ్లడ్‌ప్రెషర్ తగ్గుతుంది. గోరు చుట్టుకు పసుపును మందుగా వాడిచే ఎంతో ఉపశమనంగా ఉంటుంది.
* నోటి దుర్వాసనలకు, దంతాల వ్యాధులకు పసుపు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
* బ్రహ్మజెముడుతో పసుపు కలిపి పుండ్లు ఉన్నచోట రాస్తే తగ్గుతాయి.
* తుమ్మిపూలను మిరియాలు, బెల్లంతో చూర్ణం చేసి సేవిస్తే దగ్గు తగ్గుతుంది.
* గ్లాసుడు పాలు వేడిచేసి దానిలో తేనె వేసి తాగితే రాత్రిపూట వచ్చే దగ్గు తగ్గుతుంది. పాలల్లో తేనె, చిటికెడు పసుపు వేసి బాగా కాచి, ఆ పసుపు పాలు తీసుకున్నా దగ్గు, జలుబు తగ్గుతాయి.

వ్యాధులు - ఆయుర్వేద చిట్కాలు



* స్వచ్ఛమైన ఇంగువను నిమ్మరసంతో కలిపి నూరి కొద్దిగా వెచ్చచేసి దూదిని దానిలో ముంచి తడిపి పంటి నొప్పి వున్నచోట పెడితే పంటి నొప్పి తగ్గిపోతుంది.
* బిళ్ళగనే్నరు ఆకుల్ని, జామ ఆకుల్ని సమతూకంలో తీసుకుని ముద్దచేసి ఈ ముద్దని ఐదు చెంచాల వంతున ఉదయం సాయంత్రం 3 రోజులు తీసుకుంటే అతిసార వ్యాధి తగ్గుతుంది.
* వంద గ్రాముల వాము శుభ్రంచేసి ఎర్రగా వేయించి, మెత్తగా పొడిచేసి డబ్బాలో నిల్వ ఉంచుకొని గ్యాస్‌ట్రబుల్ ఉన్నప్పుడు ఒక చెంచా పొడిని నీళ్ళల్లోగాని, విడిగా గాని తీసుకుంటే ఎక్కువ త్రేన్పులు రాకుండా ఉంటుంది.
* ముల్లంగిని కూరగా చేసుకుని గానీ, దంచిన రసంగా గానీ తాగాలి. పల్లేరు సమూలంగా కషాయం చేసుకుని తాగితే మూత్ర సంచి సమస్యలు తగ్గుతాయి.
* మూత్రం కొంచెం కొంచెంగా వస్తే అల్లంముక్కలు తేనెతో గానీ, పంచదారతో గానీ కలుపుకుని తింటే యూనినరీ ఇన్‌ఫెక్షన్స్ తగ్గుతాయి.
* పచ్చి మెంతులు ఒక అరచెంచా ఉదయం, సాయంత్రం మింగాలి. పచ్చివి తినలేకపోతే పెరుగులో నానబెట్టుకుని తింటే మూత్ర పిండాల నొప్పి తగ్గుతుంది.
* గుప్పెడు వేపాకు, ఒక చెంచా పసుపు, ఒక చెంచా ఉప్పు దంచి కురుపుల మీద రుద్ది ఒక గంట తరువాత సున్నిపిండితో స్నానంచేస్తే గజ్జి కురుపులు తగ్గుతాయి.
* రెండు లేదా మూడు మిరియాలు బుగ్గన పెట్టుకొని మెల్లగా నములుతూ రసం మింగాలి. ఇలా రోజుకు ఐదునుండి ఏడు మిరియాలు నమిలితే దగ్గు తగ్గుతుంది.
* తెల్ల ఉల్లిపాయ రసం పది మి.లీ., అల్లం రసం పది మి.లీ. నిమ్మ రసం పది మి.లీ. తేనెతో కలిపి 50మి.లీ. తీసుకుంటే కాటరాక్ట్, గ్లూకోమా తగ్గుతుంది.
* తులసి రసం, అల్లం రసం రెండుమూడు చుక్కలు తీసుకుని కొంచెం తేనె కలిపి పిల్లలకిస్తే జ్వరం, జలుబు తగ్గుతాయి.
* త్రిఫల చూర్ణం, పసుపు, నీళ్ళు కలిపి పేస్టులా చేసి పడుకునే ముందు కాళ్ళు శుభ్రంగా కడుక్కొని మందుపెట్టాలి. పగుళ్ళు తగ్గేంతవరకు ఇలా చేస్తే కాళ్ళ పగుళ్ళు తగ్గుతాయి.
* అల్లం, జీలకర్ర నెయ్యిలో వేయించి, అందులో పటిక బెల్లం ముక్కలు వేసి కరగబెట్టాలి. పటిక బెల్లం కరిగాక ముక్కలుచేసి రోజూ ప్రొద్దున్న తీసుకుంటే పైత్యం తగ్గుతుంది.
* పండు జిల్లేడు ఆకుకు నీరు సున్నం రాసి, వెచ్చచేసి, రసం పిండి చెవిలో వేస్తే చెవి పోటు తగ్గుతుంది.
* అల్లం రసం, ఇంగువ కలిపి వెచ్చచేసి చెవిలో వేస్తే చీము కారడం తగ్గుతుంది. తాత్కాలికంగా వచ్చే చెవుడు కూడా తగ్గిపోతుంది.
* పెద్ద ఉల్లిపాయ, ఉప్పు కలిపి నూరి దానిని పండ్లకి వేసి రుద్దితే పండ్ల వెంట కారే రక్తం ఆగిపోతుంది.
* స్వచ్ఛమైన ఇంగువ నిమ్మ రసంతో నూరి కొద్దిగా వేడి చేసి, దూదిని దానిలో ముంచి తడిపి పంటి నొప్పి ఉన్నచోట పెడితే నొప్పి తగ్గుతుంది.
* గచ్చకాయ కాల్చిన మసి, పటిక, పోక చెక్కల మసి - మూడూ కలిపి చిగుళ్ళకి రుద్దితే చిగుళ్ళవాపు, చీము, నెత్తురు కారటం, నోటి దుర్వాసన తగ్గుతాయి.
* నేరేడు చెక్క చూర్ణం, కవిరి చూర్ణం (కాచు) సమానంగా కలిపి, కొద్దిగా ముద్దకర్పూరం కూడా కలిపి రాస్తే దంతాలకి సంబంధించిన సమస్త బాధలు తగ్గుతాయి.
* జాజికాయ చిన్న పలుకు దవడకి పెట్టుకుని కొంచెం కొంచెంగా నమిలి తినాలి. ఇది శరీరానికి వేడి చేస్తుంది. జాపత్రి చిన్న ముక్క తమలపాకులో వేసుకొని తింటే నోటి దుర్వాసన నివారణ అవుతుంది.
* లవంగం దవడకి పెట్టుకుని నమలాలి. పచ్చి పోకలు తమలపాకులో వేసుకుని తింటే నోటి దుర్వాసన తగ్గుతుంది.
* నేరేడు విత్తులు, గింజలు తీసేసిన కాకర కాయలు, నేలతంగేడు పూజ, పొడపత్రి, తిప్పతీగె, ఉసిరికాయ చూర్ణం చేసి రెండు పూటలా నోట్లో వేసుకొని, నీరు తాగితే మధుమేహం నియంత్రణలో ఉంటుంది.
* మందార పువ్వుల్ని కొబ్బరి నూనెలో వేసి మరగబెట్టి చల్లార్చి తలకు పెట్టుకుంటే జుట్టు ఊడకుండా ఉంటుంది.
* గుంటగలగరాకు దంచి, రసం తీసి ఒక వంతు కొబ్బరి నూనెలో కలిపి నీరు మరిగే వరకు ఉడకబెట్టాలి. చిటపట శబ్దం పోయి నూనె పైకి తేలేవరకు పొయ్యిమీద ఉంచాలి. సువాసనకి గంధకచ్చూరాలు కలుపుకుని, వాడడంవల్ల జుట్టు రాలదు. నల్లబడుతుంది. పెరుగుతుంది.
* వేపాకు రసం అరకప్పు, పెరుగు అరకప్పు, ఒక చెక్క నిమ్మకాయ రసం, మూడూ కలిపి తలకు పట్టించాలి. గంట తర్వాత కడిగితే చుండ్రు నివారణ అవుతుంది.
* వేపనూనె, కర్పూరం కలిపి రాస్తే తలలో పురుగు చచ్చి, కురుపులు మాడిపోతాయి, చుండ్రు తగ్గుతుంది.
* వంద గ్రాముల పెద్ద ఉల్లిపాయల్ని తీసుకొని వాటిని బాగా చితక్కొట్టి అర లీటరు నీళ్ళల్లో ఉడకబెట్టాలి. ఆ ఉడికిన నీళ్ళల్లో నాలుగోవంతు తీసుకొని పంచదార కలిపి తాగితే మూత్ర నాళంలో రాళ్ళు కరిగిపోతాయి.
* అల్లం, స్వచ్ఛమైన బెల్లం ఒక్కోటి 5గ్రాములు తీసుకుని రెండూ కలిపి రాత్రి పడుకోబోయేముందు నమిలి తింటే మలబద్ధకం పోతుంది.
* చందన అత్తరు (శాండల్ ఉడ్ ఆయిల్) పది చుక్కలు పంచదారతో కలిపి తింటే మూత్రపు మంట వెంటనే తగ్గిపోతుంది.

* ముద్దతామర ఆకుల్ని వేళ్ళతో సహా నూరి కురుపుల మీద కట్టాలి. చీము తగ్గి కురుపులు మానుతాయి.
* మెంతికూర చిన్నదిగాని, పెద్దదిగాని కూర చేసుకుని రోజూ కనీసం మూడు నెలలు తింటే రక్తహీనత తగ్గుతుంది.
* అశ్వగంధ వేర్లు తీసుకుని మెత్తగా నూరి ఒక చెంచా పొడిని అర కప్పు నీళ్ళల్లోగాని, పాలల్లోగాని కలుపుకుని తాగితే నడుం నొప్పి తగ్గుతుంది.
* నిమ్మ రసంలో పాలు కలిపి రాత్రి పూట రాసి, ఉదయం గోరువెచ్చని నీటితో కడిగితే మొహంమీద మచ్చలు పోతాయి.
* ఒక చెంచా కస్తూరి పసుపు మెత్తగా చేసి, నువ్వుల నూనెలో గాని, పల్లీనూనెలో గాని కలిపి రాసుకుంటే మొటిమలు తగ్గుతాయి.
* వేపాకు మెత్తగా నూరి శనగ గింజంత మోతాదులో మాత్ర చేసుకుని రోజుకు మూడుసార్లు మింగితే మొటిమలు తగ్గుతాయి.
* ఉసిరికాయ రసం పంచదారతో కలిపి పూటకు పది గ్రాముల వంతున రెండు పూటలు తీసుకుంటే కీళ్ళనొప్పులు తగ్గుతాయి.
* పుదీనా కట్టలు నాలుగు తీసుకుని, పది గ్రాముల మిరియాలు, పది గ్రాముల శొంఠి కలిపి మెత్తగా నూరాలి. శనగ గింజంత టాబ్లెట్లు చేసుకుని నీడలో ఆరబెట్టాలి. రోజుకు మూడు టాబ్లెట్లు మూడునెలలు తీసుకుంటే స్థూలకాయం తగ్గుతుంది.
* అశ్వగంధ ఆకుల్ని ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఒక పచ్చి ఆకుని నమిలి మింగాలి. ఇది బరువును తగ్గిస్తుంది.
* జీవన్‌ధార ఒక చుక్క తమలపాకులో వేసి తినాలి. కరక్కాయ బెరడు దవడకు పెట్టుకొని దాని రసం మింగితే జలుబు, దగ్గు తగ్గుతాయి.
* రావి చికురుటాకులు తొమ్మిదింటి రసం తీసుకుని, తేనెతో కలిపి తీసుకుంటే రెండుమూడు పూటల్లో జలుబు తగ్గుతుంది.
* జిల్లేడు పువ్వు ఒక తమలపాకులో పెట్టి నమిలి తినాలి. ఇలా ఉదయం, సాయంత్రం రెండుపూటలా మూడురోజులు తింటే జలి జ్వరం తగ్గుతుంది.
* తులసి ఆకు రసంతో కొంచెం అల్లం రసం గాని, లేక కొంచెం శొంఠి రసం గాని కలిపి, టీ స్పూన్ తేనె కూడా కలిపి తాగితే కడుపునొప్పి వెంటనే తగ్గుతుంది.
* దానిమ్మ గింజలు చప్పరించి తింటే ఏ వయసు వారికైనా వాంతులు ఆగిపోతాయి. వేవిళ్ళతో ఉన్న స్ర్తిలకి తక్షణం పనిచేస్తుంది.

* ఎర్ర మందారం పూలను రెండు గ్లాసుల నీళ్ళలో వేసి ఉడికించి ఒక గ్లాసు నీరు వచ్చేవరకు మరిగించి, వడకట్టి, కషాయం తీసి సీసాలోకి తీసుకుని, రోజూ తలకి పెట్టుకొని రెండు గంటల తర్వాత తల స్నానం చేస్తే పేనుకొరుకుడు తగ్గుతుంది.
* గుంటగలగరాకు దంచి రసం తీసి ఒక వంతు కొబ్బరి నూనెతో కలిపి నీరు మరిగించి ఉడకబెట్టి, చిటపట శబ్దంపోయి నూనె పైకి తేలేవరకు పొయ్యిమీద ఉంచి, సువాసనకి గంధకచ్చూరాలు కలిపి, దీనిని వాడడంవల్ల జుట్టు రాలదు, నల్లబడుతుంది, పెరుగుతుంది.
* మెంతులు (పచ్చివి) మెత్తగా పొడి చేసి, తలకి సరిపోయే పొడిని రాత్రి నీళ్ళల్లో నానబెట్టి, అందులో నిమ్మరసం, పెరుగు కలిపి తలకు పట్టించి గంటసేపు వుండి, తల స్నానంచేస్తే చుండ్రు తగ్గుతుంది.
* కలబంద నుండి గుజ్జుతీసి మెత్తగా చేసి, గుజ్జుని తలకి పట్టించి గంట తర్వాత తల స్నానం చేస్తే చుండ్రు నివారణ అవుతుంది.
* బిళ్ళగనే్నరు ఆకులను, జామ ఆకుల్ని సమానంగా తీసుకుని ముద్దచేసి ఈ ముద్దని ఐదు చెంచాల వంతున ఉదయం సాయంత్రం మూడురోజులు తీసుకుంటే అతిసార వ్యాధి తగ్గుతుంది.
* చల్లటి ఒక కప్పు ఆవుపాలు తీసుకుని అందులో ఒక చెక్క నిమ్మరసం కలిపి వెంటనే తీసుకుంటే అర్షమొలలు తగ్గుతాయి.
* వంద గ్రాముల పెద్ద ఉల్లిపాయల్ని తీసుకుని వాటిని బాగా చితక్కొట్టి అర లీటరు నీటిలో ఉడకబెట్టాలి. ఆ ఉడికిన నీళ్ళల్లో నాలుగోవంతు తీసుకుని పంచదార కలిపి తాగితే మూత్ర నాళంలో రాళ్ళు కరిగిపోతాయి.
* అశ్వగంధ వేర్లు తీసుకుని మెత్తగా నూరి ఒక చెంచా పొడిని అరకప్పు నీటితో గాని పాలతో గాని కలుపుకుని తాగితే నడుంనొప్పి తగ్గుతుంది.
* జిల్లేడు పువ్వు, పసుపు సమానంగా తీసుకుని నూరి అందులో కొంచెం ఆముదాన్ని వేసి మడమకి రాత్రిపూట కట్టి ఉదయం తీసేస్తే మడమ నొప్పి తగ్గుతుంది.
* శొంఠి మిరియాలు సమానంగా తీసుకుని, రెండింటిని దోరగా వేయించి చూర్ణంచేసి పూటకి ఐదు గ్రాములు తేనెతో కలిపి రోజూ మూడు పూటలా 10 రోజుల్లో కీళ్ళ నొప్పులు తగ్గుతాయి.
* సింహనాద గుగ్గిళ్ళు అనే టాబ్లెట్లను రోజుకు మూడు చొప్పున మూడునెలలు వాడితే మోకాళ్ళ నొప్పి తగ్గుతుంది.
- పంతుల సూర్యలోవరాజు

వ్యాధులు - నివారణోపాయాలు

* ఉల్లిబింజర ఆకులు తుంచినప్పుడు వచ్చే రసంలో దూదిని ముంచి చెవిలో పెడితే చెవి పోటు, నొప్పికి ఉపయుక్తంగా ఉంటుంది.
* ఆముదం ఆకులను ముద్దగా నూరి తేనెతోకలిపి రోజుకు రెండుసార్లు చొప్పున ఐదు రోజులు వేసుకోవాలి. పెద్ద ఉసిరికాయ సైజులో రెండు గోళీలు ఉదయం, రెండు గోళీలు సాయంత్రం తీసుకుంటే పచ్చకామెర్లు తగ్గుతాయి.
* రావి చెక్క కొద్దిగా ఒక గ్లాసు నీళ్ళలో ఉడికించి కషాయం తీయాలి. చల్లారిన కషాయాన్ని రాత్రికి అలాగే వుంచి పరగడుపున తాగాలి. ఇలా మూడురోజులు తాగాలి. నేల ఉసిరి మందుతోపాటు రావిచెక్క కషాయం తాగితే పచ్చకామెర్లు తగ్గుతాయి.
* మంచి ఇంగువను నిమ్మరసంతో నూరి కొద్దిగా వేడి చేసి దూదిని దానిలో ముంచి తడిపి పంటి నొప్పి వున్నచోట పెడితే పంటి నొప్పి తగ్గుతుంది.
* గచ్చకాయ కాల్చిన మసి, పటిక, పోకచెక్కల మసి- ఈ మూడింటిని కలిపి చిగుళ్ళకి రుద్దితే చిగుళ్ళ వాపులు, చీము, నెత్తురు కారటం, నోటి దుర్వాసన తగ్గుతాయి.
* మెంతులు రెండు చెంచాలు, లేత వేప చిగురు, కాకరకాయ, బోగన్‌విల్లా లేత చిగుర్లు (ఎనిమిది లేక పది) తింటే మధుమేహం అదుపులో ఉంటుంది.
* నేరేడు విత్తులు, గింజలు తీసేసిన కాకరకాయలు, నేలతంగేడు పూత, పొడిపత్రి, తిప్పతీగె, ఉసిరికాయలను చూర్ణం చేసి రెండుపూటలా నోట్లో వేసుకొని నీటిని తాగితే మధుమేహం అదుపులో ఉంటుంది.
* ఒక కాకరకాయ, ఒక కీర కాయ, ఒక టమోటా పండు, పది తెల్ల బిళ్లగనే్నరు పూలు, పది వేప చిగుళ్ళు కలిపి కొంచెం నీళ్ళు కలిపి రసం తీసి, ఒక సీసాలో పోసుకుని ఫ్రిజ్‌లో భద్రపరచి పరగడుపున ఒక చెంచా రసం తాగితే షుగర్ పేషెంట్లకు ఇది దివ్య ఔషధం.
* గుప్పెడు యూకలిప్టస్ ఆకుల్ని దంచి గుజ్జుచేసి నుదుటిమీద అంటించుకొని మెత్తటి గుడ్డతో కట్టుకొని, గంటసేపు పడుకుంటే తలనొప్పి పోతుంది.
* పెద్ద ఉసిరికాయంత అల్లం, రెండు పసుపుకొమ్ములు కలిపి దంచి దానికి ఒక కాయ నిమ్మరసం, మూడు చెంచాల ఆముదం కలిపి గోరువెచ్చ చేయాలి. తలకి పట్టువేసి గుడ్డతో గట్టిగా కట్టి గంటసేపు నిద్రపోతే తలనొప్పికి ఉపయుక్తంగా ఉంటుంది.
* తులసి రసాన్ని నాలుగుచుక్కలు తీసుకుని ఎడమవైపు నొప్పి వస్తే కుడి ముక్కులో, కుడివైపు నొప్పి వస్తే ఎడమవైపు ముక్కులో వేసుకుని గంటసేపు పడుకుంటే పార్శ్వపు నొప్పి తగ్గుతుంది.

-సూర్యలోవరాజు


Tuesday, December 28, 2010

డిస్క్‌ప్రొలాప్స్‌తో ఎన్ని ఇక్కట్లో...

శరీర వ్యవస్థలో వెన్నెముక ఒక మూలస్తంభం లాంటిది. ఆ మూల స్తంభం దెబ్బ తింటే ఎటూ కదల్లేక నేల మీద వాలిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అసలు ఈ సమస్యలు రాకుండా జాగ్రత్త పడటమే ఉత్తమం. ఒకవేళ ఆ సమస్యలు వస్తే, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వైద్య చికిత్సలు తీసుకోవడం చాలా అవసరం. లేదంటే శరీరం శాశ్వతంగా మూలనపడే ముప్పు ఏర్పడుతుందంటున్నారు నిపుణులు.

* వెన్ను పలు విభాగాల సమ్మేళనం. వెన్నుముకకు తోడుగా కండరాలు, లిగమెంట్లు, డిస్కులు ఉంటాయి. వెన్నెముక సులభంగా వంగడానికి డిస్కులు, లిగమెంట్లు తోడ్పడతాయి. మెడనుంచి న డుము వరకు ఉండే ఈ వెన్నెముకలో 33 పూసలు ఉంటాయి. వెన్నెముకలోని ప్రతి రెండు పూసలను బంధిస్తూ లిగమెంట్లు ఉంటాయి. పూసల మధ్య రబ్బరు కుదురు లాంటి ఒక పదార్థం ఉంటుంది.

దీనికే డిస్క్ అని పేరు. వెన్నెముక పొడవునా లేదా వెన్నుపాము (స్పైనల్ కార్డ్) ఉంటుంది. దీంట్లోంచి అసంఖ్యాకమైన నరాలు వెళుతుంటాయి. మెడభాగం నుంచి వె ళ్లే నరాలు చేతుల్లోకి వెళతాయి. న డుము నుంచి వెళ్లే నరాలు కాళ్లలోకి వెళతాయి. వీటిలో కొన్ని నరాలు మూత్రకోశం, మలవిసర్జక భాగంతో పాటు లైంగిక భాగాల్లోకీ వెళతాయి. వెన్నుపూసల మధ్య ఉండే డిస్కు దెబ్బ తినడం శరీరంలోని ఒక పరిణామం.

శరీరంలోని కదలిక లకు ఒక ప్రధాన కేంద్రంగా ఉండడం వల్ల సర్వైకల్, లుంబార్ భాగాల్లోని డిస్క్‌లే ఎక్కువగా దెబ్బతింటూ ఉంటాయి. అంటే ఉన్న స్థానం నుంచి పక్కకు జరుగుతాయి ఈ స్థితినే డిస్క్ ప్రొలాప్స్ అంటారు. శరీరంలో వెన్నుపాము ఒక మూలస్తంభం లాంటిది. దానికి ఇరువైపులా, ఉదరభాగంలోనూ కండరాలు ఉంటాయి. నిరంతరం శరీర శ్రమ చేసివారిలో ఈ కండరాలు బలిష్టంగా ఉంటూ వెన్నుపూసలకు సహాయంగా ఉంటాయి.

ఈ శరీర శ్రమేదీ లే ని వారిలో కండరాలు బలహీనమై శరీర భారమంతా వెన్నుపాము మీదా అలాగే డిస్కుల మీదా పడుతుంది. ఆ ఒత్తిడికి లోనైన డిస్కు తన స్థానం నుంచి పక్కకు జరుగుతుంది. ఈ స్థితినే డిస్క్ ప్రొలాప్స్ అంటారు. ఈ స్థితిలో పక్కకు జరిగిన డిస్కు పక్కనున్న నాళాల మీద వాలిపోతుంది. ఆ తరువాత వచ్చే సమస్యల అన్నిటికీ ఇదే మూలం. డిస్కు నాళాల మీద వాలిన వెంటనే నొప్పి రావడం మొదలువుతుంది.

సాధారణంగా డిస్క్ ప్రొలాప్స్ సమస్యలకు గురయ్యే వారిలో ఎక్కువగా వృద్దులే ఉంటారు. అయితే శరీర శ్రమ బాగా తగ్గిపోవడం వల్ల ఇటీవలి కాలంలో యుక్తవయస్కులు కూడా ఈ సమస్యకు లోనవుతున్నారు. డిస్కుల్లో సహజంగానే కొంత ద్రవం ఉంటుంది. డిస్కుల్లో వెన్నుపూసను పట్టి ఉంచే బిగువు ఈ ద్రవం వల్లే కలుగుతుంది.. అయితే వయసు పైబడే కొద్దీ ద్రవం క్రమంగా తగ్గిపోయి డిస్కు మెత్తబడుతుంది. ఆ తరువాత వెన్నుపూసకు ఆధారంగా ఉండలేక డిస్కు తన స్తానం నుంచి కొంత పక్కకు జరిగి నరాల మీద వాలిపోతుంది. వెన్ను నొప్పి కారణాల్లో ఇదీ ఒకటి.

* డిస్కు సమస్యలకు స్థూలకాయం మరో ప్రధాన కారణం. బరువు పెరిగే కొద్దీ డిస్కుల మీద భారం పెరిగి అవి బయటికి అంటే త మ సహజ స్థానం నుంచి పక్కకు జరుగుతాయి.
* పని భారాన్ని అన్ని అవయవాల మీద సమంగా వేయకుండా ఆ ఒత్తిడి అంతా వెన్నెముక మీదే పడేలా చేయడం మరో కారణం.అలాగే శక్తిని మించిన బరువులు ఎత్తడం, ఏ శిక్షణా లేకుండానే హై జంప్, లాంగ్ జంప్, హెవీ వెయిట్ లిఫ్టింగ్‌లు, ఎక్కువ దూరం రన్నింగ్ చేయడం, రోజంతా వంగి పనిచేయడం డిస్కు ప్రొలాప్స్ కు దారి తీసే మరికొన్ని ఇతర కారణాలు. అలాగే వయాగ్రా లాంటి కృత్రిమ ప్రేరకాలు కూడా డిస్కు సమస్యలకు కారణమవుతాయి.

ఇవే కాకుండా ఏదైనా ప్రమాదంలో వెన్నుపూసల మీద బలంగా దెబ్బ తగలడం, మనం ప్రయాణిస్తున్న వాహనాలు గోతుల్లో పడిపోవడం కూడా ఈ సమస్యలను తెచ్చిపెడతాయి. కొందరిలో టిబి ఇన్‌ఫెక్షన్లు కూడా వెన్నుపూసను దెబ్బ తీసే ప్రమాదం ఉంది. పక్కకు జరిగిన డిస్కు నరాల మీద పడిపోయినప్పుడు నొప్పి మాత్రమే కాకుండా కొన్ని సార్లు పక్షవాతం కూడా రావచ్చు.

డిస్క్ దెబ్బతింటే...

మెడ భాగంలో మొదలయ్యే సర్వైకల్ స్పాండిలోసిస్ సమస్యతో మెడతో పాటు చేతి నరాల్లోనూ నొప్పివస్తుంది. నడుము భాగంలోని డిస్కులు పక్కకు జరిగిన వారికి పడుకుని లేదా కూర్చుని ఉంటే ఏమీ అనిపించదు. కానీ, లేచి కొద్ది దూరం నడవగానే వెన్నునొప్పి మొదలవుతుంది. కాళ్లల్లో నొప్పితో పాటు నరం ఒత్తిడికి గురవుతున్న చోట తిమ్మిరి వస్తుంది. నడకలో ఇబ్బందులు మొదలవుతాయి ఈ స్థితినే సయాటికా అంటారు.

చికిత్సలేమిటి?

ఎంఆర్ఐ పరీక్షలోనే దాదాపు 50 మందిలోని డిస్క్ ప్రొలాప్స్ సమస్య కనిపిస్తుంది. నిజానికి డిస్క్ ప్రొలాప్స్‌తోనే సమస్య కాదు. ప్రొలాప్స్ తరువాత నొప్పి వస్తేనే దాన్ని సమస్యగా భావించాలి. నొప్పి లేనప్పుడు పక్కకు జరిగిన డిస్కులు వాటికవే తిరిగి తమ సహజ స్థానానికి వచ్చే అవకాశం ఉంది. వాస్తవానికి 90 శాతం డిస్కు సమస్యలు మందులతోనే నయమవుతాయి.

మిగతా ఆ 10 శాతం మందికే శస్త్ర చికిత్స అవసరమవుతుంది. కాళ్లల్లో బలహీనతగానీ, తిమ్మిరిగానీ లేకుండా కే వలం నొప్పి మాత్రమే ఉంటే మందులు, ఫిజియోథెరపీతో సమస్య ముగిసిపోతుంది. కొందరిలో మందులు వాడుతున్నా తిమ్మిర్లతో పాటు కాళ్లు లేదా చేతులు బలహీనపడుతూ నొప్పి భరించలేని స్థితికి చేరుతుంది. తమ ఉద్యోగ, వ్యాపారాలేవీ చేసుకోలేని స్థితికి కూడా కొందరు వచ్చేస్తారు. అలాంటి వారికి శస్త్ర చికిత్స తప్పనిసరి అవుతుంది.

సాధారణంగా డిస్కు ఏదో ఒక పక్కకు జరగడమే చూస్తాం. కానీ, అరుదుగా కొందరిలో డిస్కు మద్యలో దెబ్బ తింటుంది. ఇది మరీ తీవ్ర సమస్య. ఈ సమస్యతో లైంగిక శక్తి దెబ్బ తింటుంది. చివరికి మలమూత్ర విసర్జనలు కూడా ఆగిపోతాయి, ఈ స్థితిలో తక్షణమే శస్త్ర చికిత్స చేయవలసి ఉంటుంది. ఆలస్యం చేస్తే ఇది ప్రాణాపాయానికి కూడా దారి తీయవచ్చు.

నివారణేమిటి ?

రోజూ పొట్ట, మెడ కండరాలను పటిష్టపరిచే వ్యాయామాలు చేస్తే నడుము భాగంలో వచ్చే లుంబార్ స్పాండిలోసిస్ గానీ, మెడ భాగంలో వచ్చే సర్వైకల్ స్పాండిలోసిస్ సమస్యలు గానీ రాకుండానే కాపాడుకోవచ్చు. నిజానికి మన రోజు వారి కార్యకలాపాలన్నిలోనూ శరీరాన్ని ముందు వైపు వంచే ఉంచుతాం.
ఈ స్థితిని బ్యాలెన్స్ చేసేందుకు శరీరాన్ని వెనుకకు వంచే సాధన లేవీ చాలా మంది చేయరు. అందుకే విధిగా శరీరాన్ని ముందుకు వ ంచే ఫ్లెక్షన్ వ్యాయామాలతో పాటు వెనక్కు వంచే ఎక్స్‌టెన్షన్ వ్యాయామాలు కూడా రోజూ చేస్తే డిస్కు సమస్యలను చాలా వరకు దూరంగా ఉంచవచ్చు.

Sunday, October 17, 2010

వృద్ధాప్యంలోనూ ఆరోగ్యంగా...

ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకుంటే వృద్ధాప్యంలో అయినా చలాకీగా ఉండవచ్చు. అక్టోబర్‌ వృద్ధుల మాసం. ప్రతి సంవత్సరం ఈ నెల మొదటి తారీకును ప్రపంచ వయోధికుల లేదా వృద్ధుల దినంగా పాటిస్తున్నారు. ఆయుర్వేదం వృద్ధులు జీవించినంత కాలం ఆరోగ్యవంతం గా, వ్యాధులకు దూరంగా బతికేందుకు తోడ్పడుతుంది. ఈ శాఖను ఆయుర్వేదంలో జర చికిత్స అంటారు. అంటే వృద్ధాప్య థెరపీ. దీనికి రసాయన అనే మరో పర్యాయపదం కూడా ఉన్నది. అంటే వ్యాధి నిరోధక, స్వయం సంరక్షక చర్యలు అని అర్ధం. ఆయుర్వేదం ప్రకారం 70 ఏళ్ళు దాటిన సంవత్సరానికి వృద్ధాప్యం ప్రారంభమవుతుంది. కానీ నలభై దాటినప్పటి నుంచే వృద్ధాప్య లక్షణాలు ప్రారంభం కావడం నేటి అనుభవం. శక్తి, బలం క్షీణించి, జీవితాన్ని చురుకుగా గడపలేకపోతారు. ఈ దశలో వ్యక్తిని అలసట, నిస్సత్తువ ఆవరిస్తాయి. భౌతిక, మానసిక కార్యకలాపాలు కుంటుపడతాయి. జ్ఞాపకశక్తి, మేధస్సు క్షీణించడం ప్రారంభమై వ్యాధులు త్వరగా ప్రభావితం చేస్తుంటాయి.

Happiesఆయుర్వేదం ప్రకారం రస, రక్త, మాసం, మేధస్‌, అస్థి, మజ్జ, శుక్ర ధాతులతో కూడినది మానవ శరీరం. శరీరంలో చోటు చేసుకునే మార్పుల వల్ల ఈ ధాతువులు క్షీణిస్తాయి. ఈ ధాతువులలో సారంతరగిపోవడంతో రోగనిరోధక శక్తి తగ్గి వ్యాధులు త్వరగా సంక్రమించే సున్నితమైన ఆరోగ్య పరిస్థితులు ఏర్పడతాయి. వృద్ధాప్యంలో ఈ ధాతువుల సామర్ధ్యాన్ని పెంచలేం కానీ వాటిని సంరక్షించి పునరుజ్జీవింపచేయవ చ్చు. రసాయన చికిత్స లాభాలను ఆయుర్వేద గ్రంథాలు సవివరంగా పే ర్కొంటాయి. జీవితాన్ని పొడిగించడం, జ్ఞాపకశక్తిని పెంచడం, ఇన్ఫెన్లు, వ్యాధులు రాకుండా నిరోధక శక్తిని, మనస్సును యవ్వన స్థితిలో ఉంచేం దుకు సాయపడడం, వ్యక్తి ఛాయతో పాటు గొంతును మెరుగుపరచడం ద్వారా సమాజంలో గౌరవనీయంగా జీవించేందుకు, సంపూర్ణ ఆరోగ్యా న్ని సాధించేందుకు ఈ ప్రత్యేక చికిత్స అభివర్ణిస్తుంది. ఆయుర్వేదం వృద్ధాప్య సమస్యలను గుర్తించడమే కాదు అటువంటివి సంభవించకుండా నిరోధించే చికిత్సలను రూపొందించింది.

వృద్ధాప్య సమస్యలు:
అశక్తత, నిస్సత్తువ, వ్యాధులు, మరణం పట్ల భయం అన్నవి వృద్ధాప్యంలో ప్రధానంగా కనుపించే సమస్యలు. వయోధికులలో కనుపించే ఇతర సమస్యలు-
కేంద్ర నరాల వ్యవస్థ, మెదడు: పక్షవాతం, సయాటికా, అల్జీమర్స్‌ వ్యాధి, పార్కిన్సన్స్‌ వ్యాధి, మూర్ఛ, న్యూరోసిస్‌, సైకోసిస్‌, మానసిక సమస్యలు, నిద్రలేమి.
గుండె, రక్త నాళాలు: ఆంజినా పెక్టోరిస్‌, హృదయదమని లోపాలు, హైపర్‌టెన్సివ్‌ గుండె జబ్బులు, గుండెపోటు, గుండెకు సంబంధించిన ఇతర సమస్యలే కాకుం డా జన్యుపరమైన, జీవక్రియా సంబంధ సమస్యలైన మైలాయిడ్‌ లుకేమియా.
కాలేయం, పిత్తాశయ సమస్యలు: తీవ్రమైన హెపటైటిస్‌, పిత్తాశయంలో రాళ్ళు, సిరోసిస్‌.
జీర్ణాశయ సమస్యలు: మలబద్ధకం, ఊబకాయం, చక్కెర వ్యాధి
ఊపిరితిత్తులు: బ్రాంకైటిస్‌, ఎంఫిసీమా, ఆయాసం వంటి సమస్యలు
కీళ్ళు: రుమెటాయిడ్‌ ఆర్థరైటిస్‌, ఆస్టియో ఆర్థరైటిస్‌, స్పాండిలైటిస్‌, ఆస్టియో పొరాసిస్‌, సొరియాటిక్‌ ఆర్థరైటిస్‌ వంటివి వచ్చే ప్రమాదం ఉంటుంది.
మూత్రవాహిక: పురుషులలో ప్రోస్ట్రేట్‌ గ్రంధి పెరగడం, నెఫ్రైటిస్‌, చక్కెర వ్యాధి వల్ల రీనల్‌ సమస్యలు రావడం వంటిపలు సమస్యలు వస్తాయి.
చర్మం, కండరాలు: సొరియాసిస్‌, హెర్పిస్‌, డెర్మటోసెస్‌, జుట్టు, గోళ్ళ వ్యాధులు, మోటార్‌ న్యూరాన్‌ వ్యాధివల్ల సంక్రమించే రోగాలు ఉంటాయి.
వినాళగ్రంధి (ఎండోక్రైన్‌ గ్లాండ్స్‌): హైపో, హైపర్‌ థైరాయిడిజమ్‌, నపుంశకత్వం, స్ర్తీ, పురుషులలో మెనోపాజ్‌ సిండ్రోమ్‌ తదితర సమస్యలు.
ఇంద్రియాలు : చత్వారం, గ్లకోమా, పాక్షిక లేదా పూర్తి చెవుడు, మెనీర్స్‌ సిండ్రోమ్‌, వెర్టిగో వంటివి సంభవిస్తాయి.
సులువైన చర్యల ద్వారా వృద్ధాప్యాన్ని, దానికి సంబంధించిన వ్యాధులను నిరోధిం చడం సాధ్యమని ఆయుర్వేదం చెప్తుంది. సరళమైన, నిరాడంబర జీవనమే దాని రహస్యం. ఆయుర్వేదం ప్రకారం ఆహారం, నిద్ర, బ్రహ్మచర్యాలే వ్యాధిరహిత జీవితాన్ని గడిపేందుకు మూలమైన స్తంభాలు. మితాహారం శరీర జీవసంబంధ ప్రక్రియను క్రమబద్ధం చేస్తుంది.

మితాహారం, నిరాడంబర జీవనశైలే వ్యాధి రహిత సుదీర్ఘ జీవితానికి మంత్రం. జీవనశైలి విషయంలో చేయాల్సినవి, చేయకూడనివి ఆయుర్వేదంలో నిర్దిష్టంగా పేర్కొన్నారు. అది ఒక ప్రత్యేకశాఖగా ఉంది.సంపూర్ణాహారాన్ని తీసుకొని, క్రమబద్ధమైన జీవితాన్ని గడుపుతూ తన మాటలలో, చేతలలో సమతులంగా ఉంటూ, కోరరానివి కోరకుండా, నిజాయితీగా, క్షమాబుద్ధితో పెద్దల ఎడల గౌరవంతో జీవించే వారికి ఎటువంటి వ్యాధులు సంక్రమించవు. పంచకర్మతో పాటుగా జీవన శైలిలో మార్పులతో పాటు అనేక ఆయుర్వేద మందుల తయారీని ఆయుర్వేద గ్రంథాలు వివరిస్తాయి.

వృద్ధాప్య సంరక్షణలో ఉపయోగపడే మొక్కలు:
ఆముదం: ఆముదం విరేచనకారి అని అందరికీ తెలుసు.అయితే వృద్ధాప్య సమస్యలను నిరోధించడం, చికిత్స చేయడంలో ఈ మొక్కకున్న ఉపయోగాలు కొద్ది మందికే తెలుసు.
1. ఆముదం వేరును నాలుగు భాగాల నీళ్ళలో అది ఒక వంతు వచ్చే వరకు మరిగించి రోజూ తీసుకుంటే వృద్ధాప్యంలో వచ్చే వాత సంబంధ వ్యాధులను నిరోధించవచ్చు.
2. 8-10 ఆముదం గింజలను పొట్టుతీసి 200 మిల్లీలీటర్ల పాలు, 50 గ్రాముల బెల్లం వేసి మరిగించి, ప్రతి రోజూ సాయంత్రం ఈ పాయసాన్ని తీసుకుంటే వృద్ధాప్య సంబంధమైన ఆర్థరైటిస్‌ సమస్యలను నివారించవచ్చు.
3. గోధుమపిండిలో స్వచ్ఛమైన ఆముదాన్ని కలిపి చపాతీలు చేసుకొని తింటే డయాబెటిస్‌, ఆర్థరైటిస్‌ సమస్యలే కాక మలబద్ధకం కూడా తగ్గుతుంది.
తామరపువ్వు: వృద్ధులకు అత్యంత ఉత్తమమైన టానిక్‌ ఇది. అనేక ప్రాంతాలలో ప్రజలు అందుకే తామర కాడలను కూరలాగా చేసుకుంటారు. తామరాకును విస్తరిగా ఉపయోగిస్తారు. ఇది కణాలను సంరక్షిస్తుందని జపాన్‌లో చేసిన పరిశోధనలలో రుజువైంది. తామర రేకులు కొలస్ట్రాల్‌ను తగ్గించడమే కాక గుండె, మెదడుకు రక్తప్రసరణను మెరుగు పరుస్తాయి.
ఏలక్కాయి: వృద్ధాప్య సమస్యలకు సంబంధించిన అన్ని ఆయుర్వేద మందులలో దీనిని సాధారణంగా ఉపయోగిస్తారు. ఇది మంచి ఆంటాసిడే కాక వాయుహరి కూడా. జీర్ణక్రియను పెంచడమే కాక అసిడిటీ, కళ్ళె వంటి వ్యాధులలో ఉపశమనాన్ని ఇస్తుంది.
ఉసిరికాయ: ఆరోగ్యాన్ని పెంపొందించే, వయసును నిరోధించే మూలిక ఇది. కొలెస్ట్రాల్‌ వల్ల వచ్చే గుండె వ్యాధుల, రక్త ప్రసరణ సమస్యల బారి నుంచి కాపాడుతుంది. చలికాలంలో అవసరమైన కేలరీ డైట్‌ సప్లిమెంట్‌ను అందిస్తుంది.
తులసి: రోగనిరోధక శక్తిని పెంచడమే కాక చలికాలంలో వచ్చే జలుబు, దగ్గులను తగ్గిస్తుంది.
కరక్కాయ: ఆయుర్వేదం ప్రకారం వ్యాధులను, వృద్ధాప్యాన్ని నిరోధించడంలో అత్యున్నతమైన మందు ఇది. కరక్కాయపొడి మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. ఇది అన్ని వయసుల వారూ తీసుకోవచ్చు. అలాగే పైల్స్‌ వంటి వ్యాధులను తగ్గించడంలో ఇది గొప్పగా పని చేస్తుంది.
త్రిఫల: ప్రాచీన విజ్ఞానం ప్రకారం ఇది ఉత్తమమైన వయో నిరోధక చికిత్స. అయితే దీనిని వివిధ రుతువుల్లో వివిధ పదార్ధాలతో కలిపి తీసుకోవాలి.
1. వర్ష రుతువులో - సైంధవ లవణంతో కలిపి
2. శరత్‌ రుతువు - పంచదారతో కలిపి
3. హేమంత రుతువు - శొంఠితో కలిపి
4. శిశిర రుతువులో - పిప్పళ్ళతో కలిపి
5. వసంత రుతువు - తేనెతో కలిపి
6. గ్రీష్మ రుతువు - బెల్లంతో కలిపి
తానికాయ: ఇది త్రిఫలాలలో ఒకటి. దీనిని మలబద్ధకం, విపరీతమైన కొలెస్ట్రాల్‌ ఉన్నప్పుడు, లివర్‌, స్ల్పీన్‌ సమస్యల్లోనూ, కంటి వ్యాధులు, బాలనెరుపుకు ఉపయోగిస్తారు.
తిప్ప సత్తు:రోగనిరోధక శక్తిని కాపాడడంలో పెంచడంలో ఇది ప్రముఖమైనది. వాత తత్వం ఉన్నప్పుడు నెయ్యితో కలిపి, పిత్త తత్త్వంలో పటిక బెల్లం, కఫ తత్వం ఉన్నవారు తేనెతో కలిపి తీసుకోవాలి. గౌటీ ఆర్థరైటిస్‌లో ఆముదంతో కలిపి తీసుకోవాలి. మలబద్ధకం ఉన్నప్పుడు బెల్లంతో కలిపి, రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ ఉన్నప్పుడు అల్లం పొడితో కలిపి తీసుకోవాలి.
మండూక పర్ణి: దీనిని మందుగా కన్నా కూడా ఆహారంగా మన దేశంలో ఎక్కువగా తీసుకుంటారు. దీనికి ఒత్తిడిని తగ్గించే, జ్ఞాపక శక్తిని పెంచే లక్షణాలు ఉన్నాయి. అల్జిమీర్స్‌ వంటి వ్యాధులలో ఉపయుక్తం.
అతిమధురం: పిల్లలలో వచ్చే జలుబు, దగ్గులకు దీనిని చిట్కా వైద్యంగా వాడుతుంటారు. నోటి అల్సర్లకు ఇది మంచి మందు. వృద్ధాప్యంలో శ్వాసకోశ సమస్యలకు మంచి మందని చరకుడు అభిప్రాయపడ్డాడు.
గలిజేరు: ఇది గ్రామాలలో దొరికే మూలిక. దీనిని ఆహారంగా తీసుకోవచ్చు. దీనివేర్లలో పొటాషియం నైట్రేట్‌ అధికంగా ఉంటుంది. మూత్ర నాళ సంబంధ సమస్య, కొన్ని గుండె సంబంధ వ్యాధు చికిత్సలో ఉపయోగపడుతుంది.
పిప్పళ్ళు: ఇది జీర్ణప్రక్రియకు ఉపయోగపడుతుంది. ఆర్థ్రైటిస్‌, మలబద్ధకం వంటి వాటిలో ఉపశమనాన్ని ఇస్తుంది.
జీడి గింజలు: ఇది అత్యుత్తమ పునరుజ్జీవనిగా ఉపయోగపడుతుంది. దీనిలో కాన్స ర్‌ నిరోధక శక్తిని ఇటీవలి అధ్యయనాలు వెల్లడించాయి. టిష్యూల నిర్మాణంలో, వాటిని ఆరోగ్యంగా ఉంచడంలో ఉపయోగపడటం వల్ల దాని గింజలను వృద్ధాప్య సంబంధిత సమస్యలను నివారించేందుకు సూచిస్తారు.
వృద్ధాప్యంలో వచ్చే కీళ్ళ నొప్పులను తగ్గించేందుకు ఇంట్లోనే చేసుకుని వాడదగ్గ కషాయం:
మెంతులు: 100 గ్రా, జీలకర్ర : 50 గ్రా, మిరియాలు - 05 గ్రా
మూడింటిని కొద్ది నేతిలో వేయించి పొడి చేసుకొని ఉంచుకోవాలి. ఒక చెంచా పొడిని తీసుకొని ఒక గ్లాసు పాలలో వేసి దానిని కొద్ది సేపు మరగించి రోజుకు ఒకటి రెండు సార్లు తీసుకోవాలి. ఒక వారం రోజులలోనే తేడా కనుపిస్తుంది. ఉపశమనం కలిగే వర కూ ఎన్ని రోజులైనా దీనిని తీసుకోవచ్చు.

Friday, October 1, 2010

అసుర * మద్యం నిజానికి దురలవాటు మాత్రమే కాదు... ఒక మానసిక వ్యాధి కూడా.

కొందరు మద్యం తాగడాన్ని సురాపానం అని వ్యవహరిస్తారు. దేవతలు ఇదే తాగారంటూ వాదిస్తారు. మద్యం తాగడం వల్ల ఇంచుమించు తాము దేవతలమనే అనుకుంటారు. కాని... మద్యంతో మనిషి రాక్షసుడవుతాడు. తాను సురాపానం అనుకునేది అసురాపానం అని మరచిపోతాడు. మత్తు తలకెక్కి కిక్కు కిర్రెక్కిస్తే రాక్షసుడై కళ్లతో పాటు విచక్షణకు మూతల పడిపోయి నేరాలకూ పాల్పడతాడు. మెదడు మందగించి ప్రమాదాలకు తావిస్తాడు. ఒళ్లు తేలికైందని అనుకుంటాడు కాని... కైపులో పడిపోయి కుటుంబానికీ, సమాజానికీ బరువుతాడు. మద్యం నిజానికి దురలవాటు మాత్రమే కాదు... ఒక మానసిక వ్యాధి కూడా. ఆ వ్యాధి వల్ల వచ్చే దుష్పరిణామాలు, చేసే దురాగతాలూ అన్నీ ఇన్నీ కావు. అయితే సంకల్పం ఉంటే ఆ వ్యాధినీ తగ్గించుకోవచ్చు. అందరిలాగే ఆరోగ్యంగా ఉండవచ్చు. నూరేళ్లూ నిశ్చింతగా జీవించవచ్చు.

మద్యం తాగడం ఒక మానసిక జాడ్యం. దాన్ని అలవాటుగా పరిగణిస్తారు గాని నిజానికి అదొక వ్యాధి. మద్యం వల్ల భవిష్యత్తులో వైద్యపరంగా మున్ముందు చికిత్స కోసం చేయాల్సిన ఖర్చులూ ఎక్కువే. అందుకే దీన్ని సామాజికంగానే గాక వైద్యపరంగా సమస్యగానూ చూడాలి. కేవలం మద్యం మానడం వల్ల జీర్ణకోశ సమస్యలు, గుండెపోటు, నాడీ వ్యవస్థకు సంబంధించిన లోపాలు, పక్షవాతం వంటి అనేక రకాలైన సమస్యలను నివారించవచ్చు. దీన్ని మానేయాలని అనుకున్నవారికి ముందుగా దృఢనిశ్చయం ఉండాలి. ఆ నిశ్చయంతో సైకియాట్రిస్ట్‌లను కలిస్తే వారి ఆధ్వర్యంలో కొన్ని మందులు వాడటం ద్వారా ఆ అలవాటును పూర్తిగా తగ్గించడం సాధ్యమవుతుంది.

సరదాగా ఆరంభమైన ఒక తప్పనిసరి అలవాటుగా మారిపోతుంది. మొదట వారం కొన్ని రోజులు, తర్వాత ప్రతిరోజూ, తర్వాత రోజంతా తాగడం... ఇలా సాగుతూ ఉంటుంది. వీరిని నిద్ర లేవగానే ముందుగా గుర్తుకు వచ్చేది మద్యమే.

మోతాదు- లక్షణాలు
20 ఎం.ఎల్- కొంత ఉద్వేగం, హుషారు, కొద్దిపాటి దుడుకుతనం
80 ఎం.ఎల్- మరింతగా నియంత్రణ కోల్పోవడం, ఒళ్లు తూలడం, ఎక్కువగా మాట్లాడటం, ఏకాగ్రత లేకపోవడం.
200 ఎం.ఎల్- మాట ముద్దగా రావడం, ఒళ్లు అధికంగా తూలడం, కోపం, చిరాకు, తేలికగా దెబ్బలాడటం, అరవటం.
300 ఎం.ఎల్ - కోమాలాంటి స్థితి
400 ఎం.ఎల్- మృతి చెందే అవకాశాలు చాలా ఎక్కువ.

ప్రమాదాలు
మద్యం వల్ల వ్యక్తి విచక్షణ, అంచనావేసే శక్తిని కోల్పోతాడు. అది చురుకుదనాన్ని తగ్గిస్తుంది. వాహన ప్రమాదాల్లో దాదాపు 90 శాతం మద్యం తాగి డ్రైవ్ చేసినప్పుడు అయ్యేవే. మద్యం వల్ల ప్రమాద తీవ్రత ఎక్కువే కాకుండా, ప్రాణాపాయ అవకాశాలు కూడా ఎక్కువ. ఈ ప్రమాదాల్లో తలకు తీవ్రమైన గాయాల వల్ల ఒక్కోసారి బతికినా జీవితాంతం వైకల్యంతో జీవించాల్సి వచ్చే ప్రమాదం ఎక్కువ.

ఇది ఒక వ్యాధి
మద్యం వ్యక్తి విచక్షణను కోల్పోయేలా చేస్తుంది. మద్యపానం ఒక నేరమో, పాపమో కాదు. అది ఒక వ్యాధి. మద్యపానం ఒక వ్యసనంగా మారడం, మొదడులోని రసాయనాల మార్పుల వలన సంభవిస్తుంది. ఈ మార్పులను వైద్యంతో, శాస్ర్తీయ పద్ధతులతో నయం చేయవచ్చు. మద్యానికి బానిసైలన వారిని ద్వేషించడం, దూషించడం చేయకుండా వారిని ఆదరించి తగిన చికిత్స ఇప్పించాలి.

ఆర్థికంగా...
మద్యం కోసం ఒక వ్యక్తి చేసే ఖర్చు రాను రాను పెరుగుతూ వస్తుంది. మద్యానికి బానిసైన వ్యక్తి ముందుగా తను సాధించే దానిలో అధికశాతం మద్యానికే హెచ్చిస్తాడు. తర్వాత మద్యపానం వలన కలిగే వ్యాధులకు చికిత్స కోసం ఖర్చుచేస్తాడు. దీని వల్ల తీవ్రమైన ఆర్థిక భారం పడుతుంది. ఫలితంగా ఇబ్బందులు తలెత్తుతాయి. మద్యపానం చేసిన వ్యక్తి సంఘంలో గౌరవం కోల్పోతాడు.

తిరిగి తాగే అవకాశాలు
* గతంలో మద్యం సేవించే సమయం ...
* గతంలో తనతో మద్యం సేవించిన స్నేహితులు కలిసినప్పుడు ...
* అధిక ఒత్తిడికి లోనైనప్పుడు ...

పై పరిస్థితులలో వ్యక్తి తన ప్రమేయం లేకుండానే తాగుతాడు. తన ప్రవర్తనపై నియంత్రణ ఉండదు. మోతాదును కూడా నియంత్రించుకోలేరు. ఈ పరిస్థితి మెదడులోని రసాయనిక మార్పుల వలన సంభవిస్తుంది. వైద్యం సాయంతో మాత్రమే దీని నుంచి బయటపడగలరు.

మానసిక మార్పులు
మద్యం ప్రభావం వల్ల జ్ఞాపకశక్తిని, గ్రాహణ శక్తిని, ఏకాగ్రతను, విచక్షణను కోల్పోతారు.

కొన్నిసార్లు తాగినప్పుడు చేసిన పనులు, మత్తు దిగాక గుర్తుండవు. దీనిని ఆల్కహాలిక్ బ్లాకౌట్స్ అంటారు.

మద్యం మెదడులోని రసాయనాల్లో మార్పును కలిగించి తీవ్రమైన భయం, ఎవరో హాని చేస్తారని అపనమ్మకం, ఆందోళన కలిగిస్తాయి.

జీవిత భాగస్వామికి ఇతరులతో అక్రమసంబంధం ఉందని నిరాధారంగా ఆరోపణలు చేయడం, నమ్మడం చేస్తుంటారు.

మనుషులు లేకుండా శబ్దాలు వినిపించడం, లేని ఆకారాలు కనిపించడం వంటి చిత్రమైన అనుభవాలు ఎదురవుతాయి. ఉదాహరణకు ఇంట్లో ఉన్నా, ఆఫీసులో ఉన్నట్లు ప్రవర్తన ఉంటుంది.

చేతులు, తలపై పురుగులు పాకుతున్న భావన వంటి లక్షణాలు కలుగుతాయి.

దీంతో తిరిగి మద్యాన్ని సేవిస్తారు.

ఒక్కసారిగా మానేస్తే!
మద్యానికి అలవాటు పడే వ్యక్తి మద్యం వ ల్ల కలిగే నష్టాలను తెలుసుకొని దానిని ఆపేయాలని ప్రయత్నించి, ఒక్కసారిగాఏ ఆపేస్తే...

గుండెదడ, ఆందోళన, నిద్రలేమి, చిరాకు, మద్యం సేవించాలని విపరీతమైన కోరిక, రక్తపోటులో హెచ్చుతగ్గులు, చేతులు, వేళ్లు వణకడం, మూర్ఛ, ఒక్కోసారి డిలెట్రియమ్ వంటి స్థితిలోకి వెళ్లడం మొదలైనవి సంభవిస్తాయి.

మద్యం వలన కలిగే కిక్కుకోసం ఒకప్పుడు తాగినా, తర్వాత ఈ లక్షణాలను తగ్గించుకోవడం కోసం మళ్లీ తాగుతారు. ఇలా కొంతకాలం తప్పనిసరి పరిస్థితులలో తాగవలసి వస్తుంది. దీంతో మద్యం పొందాలనే తపన తీవ్రమైపోతుంది. మద్యం పొందటమే లక్ష్యంగా మారి, మద్యం కోసం వ్యక్తి ఏ స్థాయికైనా దిగజారుతాడు.

తనపై తను నియంత్రణ కోల్పోతాడు. కొద్దిమొత్తంలో మాత్రమే మద్యం తీసుకుందామని భావించినా నియంత్రణ కోల్పోవడం వలన అధికంగా సేవిస్తాడు. తర్వాత పశ్చాత్తాపపడుతుంటారు.

కొన్ని రోజులకు మద్యానికి ఎంత బానిసగా మారుతారంటే, తమకు ఇష్టమైన అన్ని రకాల పనులను కూడా విడిచి ‘మద్యం సంపాదించడం ఎలా?’ అనే ఒక విషయం గురించే ఆలోచిస్తూ గడుపుతారు.

మద్యం ఎందుకు సేవిస్తారు?
 
ఈ ప్రశ్నని మద్యం సేవించేవారిని ప్రశ్నిస్తే వారిచ్చే సమాధానాలు...
*  పనిచేసి అలసిపోయి, విశ్రాంతి కోసం

*  చురుకుదనం, తెలివితేటలు, ధైర్యం పెంచుకోవడానికి, భావాలను వ్యక్తపరిచే ధైర్యం కోసం

*  బాధలను మరచిపోవడానికి

*  నలుగురితో కలిసి సరదా, కాలక్షేపం కోసం

*  పదిమందిలో గాని, బాస్ ముందుగానీ ధైర్యంగా మాట్లాడటం కోసం

*  ఆందోళన తగ్గించుకోవటం కోసం

*  తాగితే లైంగికశక్తి పెరుగుతుంది

*  సామాజిక సంబంధాలను పెంచుకోవచ్చనని

*  స్వేచ్ఛ కోసం, మద్యం వలన కలిగే కిక్కు కోసం

జీవితం చివరి క్షణం వరకూ ఉత్సాహం ఉండాలంటే ..... అంతే ఉల్లాసంగా బతకాలంటే మద్యం మానేయడమే .........

మద్యం తాగడం తాత్కాలికంగా హుషారు ఇవ్వవచ్చు. కానీ... జీవితం చివరి క్షణం వరకూ అదే ఉత్సాహం ఉండాలంటే... అంతే ఉల్లాసంగా బతకాలంటే మద్యం మానేయడమే మంచిది. అప్పటికి కలిగే సంతోషం కోసం తాగడం కావాలో... ఎప్పటికీ అదే ఆనందం కొనసాగాలో అన్న విషయాలు బేరీజు వేసుకుంటే మద్యం మానడం వల్లనే ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయని సులభంగానే అర్థమవుతుంది. మద్యంతో వచ్చే మానసిక మార్పులు, ఎంత మోతాదుతో ఎలాంటి పరిణామాలు వంటి విషయాలు వివరించాం. ఈ కథనంలో మద్యం ఎలా మానాలి, మానేశాక మళ్లీ ముట్టకుండా ఉండటం ఎలా అన్న వివరాలను అందిస్తున్నాం.

రాఘవకు నలభై ఏళ్లు. మంచి వ్యాపారం ఉంది. తల్లిదండ్రులు, భార్యా, ఇద్దరు పిల్లలు అతని కుటుంబం. రాఘవకు ఇరవై ఏళ్లుగా ‘తాగుడు’ అలవాటు ఉంది. ఆరోగ్యం బాగోలేకపోవడంతో చికిత్స తీసుకుంటున్నాడు. మూత్రపిండాలు దెబ్బతిన్నాయని, ఇక ముందు ఒక్క చుక్క మద్యం తాగినా బతకడం కష్టం అని వైద్యులు చెప్పారు. కొన్ని రోజుల తర్వాత ఆరోగ్యం కుదుటపడింది కదా! అనుకుని బలహీన క్షణంలో మద్యం తాగాడు. దాంతో ఆరోగ్యపరిస్థితి విషమించి రాఘవ చనిపోయాడు. ఆ కుటుంబం ఆధారాన్ని కోల్పోయింది.

పూర్ణచంద్రరావు వయసు 60 ఏళ్లు పైబడింది. అతని ఇద్దరు కొడుకులు అమెరికాలో స్థిరపడ్డారు. భార్య మరణించింది. చేసే పనులు, తన భావాలు పంచుకునే తోడు లేకపోవడంతో తాగుడుకి దగ్గరయ్యాడు. కొడుకులు అమెరికా రమ్మని ఒత్తిడి తెచ్చినా ఇష్టం లేదని చెప్పేశాడు. తాగితే తప్ప రోజు గడవని స్థితికి చేరుకున్న అతను, కొడుకులు ఎక్కడ తనను అమెరికా తీసుకెళ్లిపోతారో అని ఆత్మహత్య చేసుకున్నాడు.

వయసుకి, పరిస్థితులకు అతీతమైన ఈ వ్యాధి మనిషిని బలహీనుడిని చేస్తుంది. దిగువ, మధ్య, పై తరగతులు అన్న భేద భావం లేని ఈ అలవాటు నాశనం చేసే దిశల్లోనూ ఒకే విధంగా పనిచేస్తుంది. ఎంత వద్దనుకున్నా మళ్లీ మళ్లీ తన వైపుకు లాగే మద్యానికి జీవితాలను పణంగా పెట్టకుండా ఉండాలంటే అందరికీ ఈ విషయం పట్ల సంపూర్ణ అవగాహన ఉండాలి.

ఆల్కహాల్ అనానిమస్ అంటే...
1940 ముందు వరకు ‘తాగడం’ ఒక వ్యాధిగా గుర్తించలేదు. అమెరికాలోని డాక్టర్ బాబ్, బిజినెస్ మ్యాన్ బిల్ డబ్ల్యూ అనే ఇద్దరూ తాగుడు కారణంగా సర్వం కోల్పోయి చింతలో పడిపోయారు. వారు ఒక చోట కలిసి తమ దుస్థితికి చింతిస్తూ తమను బాగుపరుచుకోవడం కోసం ఏం చేయవచ్చు అని చర్చిస్తూ కూర్చున్నారట. ఆ చర్చ 24 గంటల పాటు సాగిందట. ఎప్పుడూ తాగుడు ధ్యాసలోనే ఉండే వారు ఓ రోజంతా తాగలేదు. మద్యం పట్ల ఉన్న సందేహాలను, సమస్యల గురించి చర్చించుకుంటే ఈ వ్యసనం నుంచి బయట పడటం సులభమే అని అర్థమైందట. తాము పడిన కష్టాలు చెప్పుకుంటుంటే తాగాలని అనిపించకపోవచ్చు. అలా పుట్టిందే ఈ ఆల్కహాలిక్ అనానిమస్ గ్రూపు. అలా ‘ఆల్కహాలిక్ అనానమస్’ పేరుతో ప్రపంచమంతటా సంస్థలు ఏర్పడ్డాయి. ఇలాంటి సంస్థలు అన్నిచోట్లా మద్యం దురలవాటు తగ్గించడానికి కృషి చేస్తున్నాయి.

మానేసినా...
తాగుబోతు తన బాల్యాన్ని, యవ్వనాన్ని, వయసుని ఆనందంగా అనుభవించలేడు. అలాగే తన పిల్లల బాల్యాన్ని, వారి అభివృద్ధిని కూడా చూసి ఆనందించే స్థితిలో ఉండడు. తన వ్యసనాన్ని గుర్తించి దాని నుంచి బయట పడాలనుకునే వారికి రిహాబిలిటేషన్ సెంటర్లు అందుబాటులో ఉన్నాయి. మనస్తత్వ నిపుణులు కౌన్సెలింగ్, కొన్ని ప్రత్యేకమైన మెడిసిన్స్‌ను ఇస్తారు. వాటిని వైద్యుల సూచనల మేరకు వాడుతూ ఉండాలి. అయితే మెడిసిన్స్, ఆల్కహాల్ ఏకకాలంలో తీసుకుంటే మాత్రం ఆరోగ్యానికి ప్రమాదం. సైకియాట్రిస్ట్ కౌన్సెలింగ్, మందులను పేషంట్ మానసిక స్థాయిని బట్టి ఇవ్వడం జరుగుతుంది. అలాగే డి-అడిక్షన్ సెంటర్‌లో కౌన్సెలింగ్ తీసుకొని బయటకు వెళ్లిన వ్యక్తి, తిరిగి వ్యసన పరుడిగా మారకుండా ఉండాలంటే తరచూ డి-అడిక్షన్ సెంటర్‌లకు వెళుతూ, అక్కడి మీటింగ్‌లలో పాలుపంచుకోవాలి. ఈ వ్యసనం వల్ల కలిగే నష్టాలను అవలోకించుకుంటూ కౌన్సెలింగ్ తీసుకుంటూ ఉండాలి.

పిల్లలు - మద్యం
‘జన్మతః వ్యాధిగా ‘తాగుడు’ వ్యసనాన్ని గుర్తించారు వైద్యులు. బిడ్డ ఎదిగిన కొద్దీ ఈ వ్యాధి లక్షణాలు బయట పడుతుంటాయి’ అంటున్నారు. దీనికి ఇంటి పరిస్థితులు, పరిసరాలు దోహదం చేస్తుంటాయి. అది ఎలా అంటే తల్లిదండ్రులకు చెప్పకుండానే స్కూల్‌కి డుమ్మా కొట్టడం, కాస్త ఎదిగాక కాలేజీ మానేసి సినిమాలకు, షికార్లకు వెళ్లడం జరుగుతుంటుంది. టీనేజ్ దశలో హార్మోన్ల వల్ల శరీరంలోనూ, మనస్తత్వంలోనూ మార్పులు వస్తుంటాయి. మొండిగా ప్రవర్తిస్తుంటారు. మూడీగా ఉంటాడు. సహనం ఉండదు. ఏ పనినీ సక్రమంగా చేయలేరు. తండ్రికి తాగే అలవాటు ఉంటే ‘నాన్న తాగుతున్నాడు కదా! నేను తాగితే తప్పేంటి’ అనుకుంటారు. దీంతో ఏ పని చేస్తున్నా ‘మద్యం’ తీసుకుంటే బాగుండు అనే ఆలోచన పుట్టుకొస్తుంటుంది. పిల్లవాడిలో చిన్ననాటి నుంచే మార్పు తీసుకురావాలంటే ఈ వ్యసనం పట్ల అవగాహన పేరెంట్స్‌లో తప్పక ఉండాలి.

ఆయుష్షు తగ్గించేస్తుంది
20 నుంచి 30 ఏళ్ల వయసులో-మద్యాన్ని సరదా కోసం తీసుకుంటారు. యుక్త వయసు కాబట్టి ఈ వయసులో శరీరం కూడా మద్యాన్ని భరిస్తుంది.

30 నుంచి 40 ఏళ్ల వయసు: రిలాక్సేషన్, కమ్యూనికేషన్ కోసం తప్పనిసరిగా తాగాలి అనుకుంటారు. ఈ వయసులో కూడా శరీరం మద్యాన్ని భరిస్తుంది.

40 ఏళ్ల వయసు నుంచి: మద్యం ఎంత తాగినా శరీరంలో అవయవాల పనితీరు మందగిస్తూ ఉంటుంది. మధుమేహం, హై బీపీ, లివర్, పాంక్రియాస్, కిడ్నీలు దెబ్బతినడం... లాంటి సమస్యలెన్నో వస్తుంటాయి. ఒక్కో ఆరోగ్య సమస్య బయట పడుతున్న కొద్దీ అప్పుడు తాము చేసిన తప్పేంటో తెలిసి వస్తుంది. తాగుడు ధ్యాసలో పడిపోయిన వ్యక్తి 50 ఏళ్ల వరకు కుటుంబాన్ని పట్టించుకోడు. దీని మూలంగా ఇంట్లో భార్యా బిడ్డలతోనూ, బంధువులతోనూ బాంధవ్యాలను పెంచుకోడు. తాగుడుకి విచ్చలవిడిగా డబ్బు కూడా ఖర్చు చేస్తుంటాడు కాబట్టి ఇటు ఆర్థికంగా, కుటుంబపరంగా, సామాజికపరంగా దెబ్బతిని ఉంటాడు.

కుటుంబం
ఇంట్లో ‘తాగే’ వారు ఉంటే ఆ విషయాన్ని బయటకు చెప్పుకోవడానికి సిగ్గు పడతారు. కాని ‘తాగే’ అలవాటున్న వారిలో మార్పు తేవడానికి కుటుంబసభ్యులు మొత్తం సహకరించాల్సి ఉంటుంది. మద్యానికి సంబంధించి అవగాహన ఇంట్లో అందరిలోనూ ఉండాలి. ఇది మందులతో చేసే చికిత్స కాదు, మానసిక చైతన్యంతోనే మార్పు తీసుకురావాలి. తాగిన వారిని తిట్టడం, కొట్టడం ద్వారా సమస్యకు పరిష్కారం లభించదు. ఎందుకంటే తాగేవారిలో మూర్ఖత్వం ఉంటుంది. వారు చేయదలచుకున్నది చేసి తీరాలన్న పట్టుదల ఉంటుంది. అందుకని కుటుంబసభ్యులు కూడా రీహాబిలిటేషన్ సెంటర్‌లో కౌన్సిలింగ్ తీసుకోవడం అవసరం.

మానడం ఇలా...
మొదటిసారి మద్యం తీసుకునేటప్పుడు ఒక పెగ్గుతో సరిపెట్టేస్తారు. ఫర్వాలేదు కదా అనే ఆలోచనతో మరోసారి రెండు పెగ్గులు, పోను పోను రోజూ కొంత మోతాదును పెంచుతూ పోతుంటారు. ఇలాంటప్పుడు ఇది ఒక వ్యాధి అని గుర్తించాలి. వ్యసనం ఉన్నవారిలో చాలా తక్కువ మంది మాత్రమే దీని నుంచి బయట పడాలి అనుకుంటారు. మిగతా వారిని మాత్రం వారి కుటుంబసభ్యులు, బంధుమిత్రులు తెలివిగా వ్యవహరించి ఈ వ్యసనం నుంచి బయటపడేలా చేయాలి. వ్యసనం ఉన్న వ్యక్తి 3-4 నెలల పాటు రిహాబిలిటేషన్ సెంటర్‌లోనే ఉండాలి. ‘ఎందుకు తాగుతున్నాను, మద్యం ముందు ఎందుకు బలహీనుడిగా మారాను’ అని ఎవరికి వారు తమ ‘ఆత్మకథ’ రాసుకోవాలి. రోజూ డైరీలో రాసుకోవడం వల్ల సమస్య ఎక్కడ ఉందో సమీక్షించుకోవడానికి వీలవుతుంది.

రిహాబిలిటేషన్ సెంటర్‌లో... ఉదయం 6 గం॥యోగా, 7 గం॥కాలకృత్యాలు, 8 గం॥అల్పాహారం, 9-10 గం॥ఆత్మపరిశీలన (ధ్యానం), 10 - 11 గం॥ఆల్కహాలిక్ థెరపీ సెషన్స్, స్నాక్స్ బ్రేక్. 1గం॥వరకు మద్యం పై అవగాహన చర్చలు. 1 గం॥భోజనం. 3 నుంచి 4 గం॥వరకు తమ ఆలోచనలను సెంటర్‌లో ఉన్న ఇతరులతో పంచుకోవడం. టీ బ్రేక్. ఆ తర్వాత రాత్రి 8 గం॥వరకు అవగాహన చర్చలు జరుగుతాయి.

Sunday, September 5, 2010

ఇంగువ * ఔషధ విలువలు

* ఇంగువ చాలా మందికి వంటల్లో వాడుకునే పదార్థాంగానే తెలుసు. అయితే దీనిలో ఔషధ విలువలు అనేకం ఉన్నాయి.
* దీనికి ఫెరులా ఫోటిడా అనే ల్యాటిన్ పేరు ఉంది. ఫోటిడా అంటే తీవ్రమైన వాసన కలిగినది అని అర్థం. మన దేశంలో కాశ్మీర్‌లో లభించే ఇంగువ పేరు ఫెరులా నార్తెక్స్. దీనిని ఇంగ్లీషులో ఆసాఫోటిడా అనీ, డెవిల్స్ డంగ్ అనీ అంటారు. సంస్కృతంలో హింగు అని పేరు.
* ఇంగువలో సల్ఫర్ యోగికాలు ఉంటాయి కనుక గాఢమైన వాసన వస్తుంటుంది. దీని వాసనలోని గాఢత ఉల్లిపాయ వాసనని మించి ఉంటుంది. దీనిని ఆహార పదార్థాల తయారీకి వాడుతుంటారు. అలాగే మసాలాల తయారీలో కూడా ఇది ప్రముఖ స్థానాన్ని ఆక్రమిస్తుంది.
* కాంథార్, ఆఫ్గనిస్తాన్, పర్షియా, ఇరాన్ వంటి దేశాలు దీనిని విశేష స్థాయిలో ఉత్పత్తిచేస్తాయి. అరేబియన్ వైద్యులు దీనికి విశేషమైన ప్రాచుర్యాన్ని కల్పించారు. మన దేశం విషయానికి వస్తే... కాశ్మీర్ ప్రాంతంలో ఇంగువ వృక్షాలు ఎక్కువగా పెరుగుతాయి.
* ఇంగువను ఆయుర్వేదంలో ఔషధంగా వాడతారు. చెట్టునుంచి సేకరించిన బంక లాంటి నిర్యాసానికి (ఓలియో గమ్ రెసిన్) ఔషధపు విలువుంటాయి. చెట్టు మిగతా భాగాల్లో అంతగా ఔషధపు విలువలు ఉండవు. ఔషధోపయోగాలకోసం సాధారణంగా ఇంగువను 125-500 మి.గ్రా. మోతాదులో వాడతారు.
* ఇంగువను నేరుగా కాకుండా శుద్ధిచేసి వాడుకుంటే దానిలోని ఉగ్రత్వం తగ్గుతుంది. ఇనుప మూకుడులో నెయ్యి వేసి నిప్పుల మీద వేడి చేయాలి. తరువాత దీనిలో ఇంగువను వేసి దోరగా వేయించాలి. చల్లారిన తరువాత ఔషధ కల్పనకు ఉపయోగించాలి.
* హింగ్వాష్టక, హింగుత్రిగుణ తైలం, రజఃప్రవర్తవీవటి వంటి ఔషధాలు ఇంగువ ప్రధాన ద్రవ్యంగా తయారవుతాయి.
* ఇంగువను సేకరించే విధానం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇంగువ చెట్టు చాలా పొడవుగా పెరుగుతుంది. దీనికి క్యారెట్ ఆకారాన్ని పోలిన వేర్లు ఉంటాయి. వేరు పైభాగంలో కత్తితో గాటుపెట్టి వదిలేస్తే నెమ్మదిగా నిర్యాసం సంచితమవుతుంది. ఇది గట్టిపడి పసుపుపచ్చని రంగు జిగురుగా మారుతుంది. దీనినే ‘ఇంగువ’ అంటారు. ఇలా సేకరించిన దానిని మట్టి మూకుడులోకి తీసుకొని తోలు సంచిలో ప్యాక్‌చేసి మార్కెట్‌కి తరలిస్తారు.
* ఇంగువ చాలా ఖరీదైనది కనుక సాధారణంగా కల్తీ కలుపుతుంటారు. తుమ్మజిగురు, బంగాళా దుంప ముక్కలు, ఇంగువ పట్ట కషాయంతో కలిపి ముద్దచేసి ఇంగువగా చెలామణి చేస్తుంటారు కనుక జాగ్రత్త పడాలి.
* అసలైన ఇంగువను గుర్తించడానికి కొన్ని పద్ధతులున్నాయి. ఉదాహరణకు అసలు సిసలైన ఇంగువను నీళ్లలో వేస్తే పూర్తిగా కరుగుతుంది. ఇంగువ కలిపిన నీళ్లన్నీ పాల మాదిరిగా తెల్లగా తయారవుతాయి. ఇంగువకు అగ్గిపుల్లతో గీసి మండిస్తే పూర్తిగా మండిపోతుంది.
* బ్రిటీష్ హెర్బల్ ఫార్మకోపియా, ప్రపంచ ఆరోగ్యసంస్థ విడుదల చేసిన మోనోగ్రాఫ్ ఫర్ హెర్బల్ మెడిసినల్ ప్లాంట్స్ వంటివి ఇంగువ ఔషధోపయోగాలను ప్రచురించాయి. దీర్ఘకాలపు బ్రాంకైటిస్, ఉబ్బసం, కోరింత దగ్గు, గొంతు బొంగురు, హిస్టీరియా, ఫ్లాస్టులెంట్ కోలిక్, (గ్యాస్‌తో కూడిన ఉదరశూల), మూర్ఛలు, ఆంత్రక్రిమి, డిస్పెస్పియా, క్రానిక్ గ్యాస్టైటిస్, ఇరిటబుల్ కోలాన్ తదితర వ్యాధుల్లో ఇంగువ ఉపయోగపడుతుంది. బాహ్యంగా ఇంగువను ఆనెలు, చర్మకీలల్లో ప్రయోగించవచ్చునని ఈ మోనోగ్రాఫ్స్ సూచించాయి. కాగా ఇంగువను వాడకూడని సందర్భాలు సైతం ఉన్నాయి. శరీరాంతర్గత రక్తస్రావాలు, గర్భధారణ సమయంలో వాడకూడదు (అబార్షన్ రిస్కు ఉంటుంది), స్తన్యపాన సమయంలో తల్లి వాడకూడదు. పసిపిల్లల్లో వాడకూడదు (మెథిమో గ్లోబినీమియా రిస్కు ఉంటుంది). యాంటి కోగులెంట్స్, త్రాంబోలైటిక్స్ వాడుతున్నప్పుడు ఇంగువను వాడకూడదు (రక్తస్రావం రిస్కు పెరుగుతుంది). రక్తస్రావ వ్యాధుల్లో ఇంగువను వాడకూడదు. పేగుల్లో ఇన్‌ఫ్లమేషన్ కారణంగా శోథ జనించినప్పుడు ఇంగువను వాడకూడదు. రక్త్భారం ఎక్కువ తక్కువల్లో ఇంగువను వైద్య సలహా లేకుండా వాడకూడదు.
 
ఆయుర్వేద గృహ చికిత్సలు

పిప్పి పన్ను
ఇంగువను కొద్దిగా వేయించి పిప్పి పన్ను మీద ఉంచితే నొప్పి తగ్గుతుంది.
బహిష్టు నొప్పి (మక్కలశూల)
ఇంగువను నేతిలో వేయించి తీసుకుంటే బహిష్టు నొప్పి తగ్గుతుంది.
మలేరియా జ్వరం
ఇంగువకు పాత నెయ్యి కలిపి గాఢంగా వాసన చూస్తే మలేరియాలో ఉపశమనం లభిస్తుంది.
ఇంగువకు సౌవర్చల లవణం కలిపి తీసుకుంటే కడుపునొప్పినుంచి ఉపశమనం లభిస్తుంది. శొంఠి కషాయానికి ఆముదం వేర్లు, బార్లి, పుష్కర మూలం, ఇంగువ కలిపి తీసుకున్న కడుపునొప్పి తగ్గుతుంది.
ఆకలి తగ్గటం (అగ్నిమాంద్యం)
ఇంగువ, త్రికటు (శొంఠి, పిప్పళ్లు, మిరియాలు), వాము, జీలకర్ర, నల్ల జీలకర్ర, సైంధవ లవణం ఈ ఎనిమిదింటినీ సమానంగా తీసుకొని పొడిచేసి వేడి నీళ్లతో తీసుకోవాలి. దీనిని హింగ్వాష్టక చూర్ణం అంటారు.
ఉన్మాదం
నెయ్యిలో ఇంగువ, ఇంగువ ఆకులు, కరక్కాయ, బ్రాహ్మీలను వేసి వేడిచేసి తీసుకోవాలి.
మద్యపానంలో మత్తు దిగడానికి
సౌవర్చల లవణానికి ఇంగువ, మిరియాలు కలిపి పుల్లని మజ్జిగతో తీసుకుంటే మద్యపానం తరువాత వచ్చే మత్తు దిగుతుంది.
చెవి నొప్పి
ఆవ నూనెకు ఇంగువ, శొంఠి కలిపి వేడిచేసి చెవిలో వేసుకుంటే చెవి నొప్పిలో ఉపశమనం లభిస్తుంది. లేదా హింగ్వాది తైలాన్ని కూడా వాడవచ్చు.
ఉదరంలో పెరుగుదలలు (గుల్మం)
హింగ్వాది చూర్ణం, హింగ్వాది గుటిక, హింగుత్రిగుణ తైలం వంటివి వాడాలి.
జీర్ణ వ్యవస్థ వ్యాధులు
గ్యాస్‌ని వెలువరింపచేసే తత్వం ఇంగువకు ఉంటుంది. గ్యాస్ నుంచి ఉపశమనాన్ని కలిగించే ఓషధుల్లో ఇది ముఖ్యమైన ఓషధి. ఆహారం జీర్ణం కాకపోవటం, కడుపునొప్పి వంటి సమస్యల్లో ఇంగువను ఉపయోగించవచ్చు. పొట్ట ఉబ్బరించి గ్యాస్‌తో నిండిపోయినప్పుడు ఇంగువను బాహ్య ప్రయోగంగా వాడి ప్రయోజనం పొందవచ్చు. ముందుగా ఇంగువను వేడినీళ్లలో కరిగించాలి. ఒక గుడ్డను ఈ నీళ్లలో తడిపి ఉదర కండరాలపై పరిచి కాపడం పెట్టుకోవాలి. గ్యాస్ మరీ తీవ్రంగా ఇబ్బంది పెడుతుంటే ఇంగువ కలిపిన నీళ్లను ఎనిమా మాదిరిగా తీసుకోవచ్చు.

- డా. చిరుమామిళ్ల మురళీమనోహర్

Thursday, August 26, 2010

మీ ఆరోగ్యం మీ'చేతి'లో!

వాకింగ్, యోగా, ధ్యానం.. ఏం చేయాలన్నా మీ 'చేతి'వేళ్లలోనే ఉంది. వేళ్లతో యోగా ఏమిటని తీసిపారేయకండి. చెట్టుకు జీవం వేర్లు ఎలాగో, మీ శరీరానికి వేళ్లు అలాగన్నమాట. మన దేహంలో ఎక్కడెక్కడి నుంచో మొదలయ్యే నరాలన్నీ వేళ్ల చివరి అంచుల దగ్గర ఆగిపోతాయి.

చేతికున్న అయిదువేళ్లు పంచభూతాలకు ప్రతీక. బొటనవేలు అగ్ని, చూపుడువేలు వాయువు, మధ్యవేలు ఆకాశం, ఉంగరపు వేలు భూమి, చిటికెన వేలు వరుణులను సూచిస్తాయి.

అందుకే, వేళ్ల చివరి అంచుల్లో జరిగే కదలిక మీ శరీరంలోని ప్రతి అవయవాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది అంటున్నారు యోగా నిపుణులు. ఇంకేం, మీరు ఇంట్లో ఉన్నా, ఆఫీసులో ఉన్నా, ఎంచక్కా రోజూ 5 నుంచి 15 నిమిషాలు మీ వేళ్లతో ఈ 'ముద్ర'లు వేసి ఆరోగ్యంగా ఉండండి.

జ్ఞాన ముద్ర (నాలెడ్జ్ సీల్)
బొటనవేలు, చూపుడువేలు కలిపి గట్టిగా వత్తాలి. మిగిలిన మూడు వేళ్లను నిటారుగా పెట్టుకోవాలి. ఈ ముద్ర పిట్యూటరీ గ్రంథిని ప్రేరేపిస్తుంది. మెదడును చురుగ్గా ఉంచుతుంది.

దీనివల్ల అధికరక్తపోటు తగ్గుతుంది. మైగ్రెయిన్ తలనొప్పికి ఉపశమనం లభిస్తుంది. క్రమం తప్పకుండా సాధనచేస్తే మానసిక గందరగోళం విడిపోయి, స్థిరమైన ఆలోచనలు సిద్ధిస్తాయి.





వాయు ముద్ర (విండ్ సీల్)
బొటనవేలును కొద్దిగా వాల్చి, చూపుడువేలును సున్నా ఆకారంలో మడవాలి.

ఈ ముద్ర వల్ల కండరాలు, కీళ్ల నొప్పులు తగ్గుతాయి.





శూన్య ముద్ర (జీరో సీల్)
మధ్యవేలుతో బొటనవేలును గట్టిగా బంధించాలి. మిగిలిన మూడు వేళ్లు నిటారుగా ఉంచాలి.
ఈ ముద్రతో ఎన్నో ఉపయోగాలున్నాయి.

చెవిపోటు తగ్గుతుంది. ఉన్నట్లుండి తలతిరగడాన్ని (వెట్రిగో) తగ్గిస్తుంది. థైరాయిడ్ సమస్యలను నయం చేస్తుంది.
రెండుమూడు రోజులు చేస్తే ఫలితం ఉండదు. రెగ్యులర్‌గా చేయాలి.



అపానా ముద్ర (డిసెండింగ్ ఎనర్జీ సీల్)
మధ్యవేలు, ఉంగరంవేలు రెండింటినీ బొటనవేలు చివరన తాకేలా చేయాలి. చిటికెనవేలు, చూపుడువేలు లాగిపెట్టాలి.
కలిసిన మూడువేళ్ల మధ్యా కాస్త ఒత్తిడి కలిగించాలి.

ప్రొస్టేట్, మెనోపాజ్ సమస్యలను ఇది బాగా తగ్గిస్తుంది.
శరీరంలోని విషతుల్య పదార్థాలను బయటికి విసర్జించేందుకు సహాయపడుతుంది .


అపనా వాయుముద్ర (డిసెండింగ్ విండ్ సీల్)
వాయుముద్రలాంటిదే ఇది. చిటికెన వేలు తప్ప మిగిలిన నాలుగువేళ్లను చివరి అంచులతో బంధించాలి.

ఈ ముద్ర హృద్రోగాల తీవ్రతను తగ్గిస్తుంది.
జీర్ణకోశ సంబంధ వ్యాధులు రాకుండా కాపాడుతుంది.




పృథ్వీ ముద్ర (ఎర్త్ సీల్)
ఉంగరం వేలు, బొటనవేలు అంచులను కలిపి.. ఒత్తిడి కలిగించాలి. మిగిలిన మూడువేళ్లు ఆకాశంవైపు చూస్తుండాలి.

ఈ ముద్ర మానసిక ఆందోళనను తగ్గిస్తుంది.

అధికబరువును తగ్గించడమే కాదు, భవిష్యత్తులో బరువు పెరగకుండా కూడా చూస్తుంది.



సూర్య ముద్ర (సన్ సీల్)
బొటనవేలు, ఉంగరంవేలు రెండూ మడవాలి. మిగిలిన మూడువేళ్లు నిటారుగా పెట్టుకోవాలి.

ఈ ముద్ర రెగ్యులర్‌గా చేస్తే, మానసిక నిగ్రహం పెరుగుతుంది.

అధిక ఒత్తిళ్ల వల్ల వచ్చే మధుమేహాన్ని నియంత్రిస్తుంది. కొలెస్ట్రాల్ పెరగకుండా కాపాడుతుంది.



శక్తి ముద్ర (విటల్ ఎనర్జీ సీల్)
చివరి రెండు వేళ్లను బొటనవేలితో కలపాలి. మిగిలిన రెండువేళ్లు ఒకదానికొకటి తాకుతూ ఉండాలి.

శక్తిముద్ర అన్నిటికంటే శక్తివంతమైనది. జీవన సామర్థ్యాన్ని పెంచుతుంది.
దృష్టిలోపాలను సరిచేస్తూనే కంటిచూపును మెరుగుపరుస్తుంది.



వరుణ ముద్ర (వాటర్ సీల్)
బొటనవేలు, చివరివేలు కలిపితే వరుణముద్ర. మిగిలిన మూడువేళ్లను ఒకదానికొకటి తాకకుండా కాస్త ఎడంగా ఉంచాలి.

ఈ ముద్ర వల్ల కిడ్నీల సామర్థ్యం పెరుగుతుంది.
ప్రొస్టేట్ సమస్యలు తొలగిపోతాయి. రాత్రిళ్లు పక్కతడిపే అలవాటు తగ్గిపోతుంది.



అందుకే ఏ రెండు వేళ్లనయినా కలపండి. మీ ఒంట్లో ఏదో ఒక భాగం ఆరోగ్యంగా ఉంటుంది. కేవలం ఈ ముద్రలు వేస్తూనే నిండు ఆరోగ్యంగా ఉంటామనుకోకండి.

పోషక విలువలున్న ఆహారం తీసుకుంటూ, చక్కటి వ్యాయామం చేస్తూ ఈ ముద్రలు వేస్తే ప్రయోజనం ఉంటుంది.

Tuesday, August 24, 2010

ఒత్తిడి నుండి ఉపశమనం

మానసిక ఒత్తిడిని అధిగమించడానికి కొన్ని రకాల ఆహారపదార్థాలు ఎంతగానో ఉపయోగపడుతాయని ఆరోగ్యనిపుణులు సూచిస్తున్నారు. మనం నిత్యం తీసుకునే ఆహారపదార్థాలకు భిన్నంగా శరీరానికి, మన సుకు ఒత్తిడినుంచి విముక్తి కలిగించడానికి పండ్లు, వ్యాయమాలు, సం గీతం వంటివి ఎంతగానో ఉపయోగపడుతాయని వారంటున్నారు.

కొబ్బరి : లేత కొబ్బరి నీటిని మించిన పానీయం మరొకటి లేదు. కోల్పో యిన సత్తువ తిరిగి పొందడానికి కొబ్బరి నీరు బాగా తోడ్పడుతుంది. ఆరోగ్య రక్షణలో కొమ్మరి బొండాం బాగా పనిచేస్తుంది. ప్రకృతిలో క్రిము లు లేని అతిశుభ్రమైన, ఉల్లాసాన్నిచ్చే పానీయం.. ఒక గ్రాము ఎండు కొబ్బరిలో 175 కాలరీల శక్తి ఉంటుంది. చక్కెరపదార్థాలు, ఖనిజలవణాలు, విటమిన్లతో సమృద్ధమైన కొబ్బరి నీరు ఎంత అలసటనైనా సరే ఇట్టే పోగొట్టేస్తుంది. రక్తశుద్ధిలో కొబ్బరి నీళ్ళ పాత్ర అమోఘం. ఒక్కమాటలో చెప్పాలంటే కొబ్బరినీరు గ్లాసుడు పాలకంటే కూడా పుష్టికరమైనవి. పైగా, ఇందులో తల్లిపాలలో ఉండే లారిక్‌ యాసిడ్‌ లాంటి సుగుణాలన్నీ కూడా కలగలిసి ఉన్నాయి.

ఆరెంజ్‌ : ఆరెంజ్‌లో అత్యధికంగా లభించే సి విటమిన్‌ వల్ల ఒత్తిడి ఫలితంగా ్రశమించే హార్మోన్ల ప్రభావాన్ని తగ్గించి మే లు చేకూరుతుందని ఆరోగ్యనిపుణులు అంటున్నారు.

చాక్లెట్‌ : వీటిలో సహజంగా ఉండే ఫెనిలెథిలమైన్‌ (పిఇఎ) ఎండార్ఫిన్‌ స్థాయిల్ని తొలగించి సహజ సిద్దమైన యాంటీ - డిప్రెెసెంట్‌గా పనిచేస్తుంది. ఇవి కాకుండా యాప్రికాట్‌లోని కెరోటిన్‌ ఒత్తిడిని తగ్గిస్తే, పెరుగులోని విటమిన్‌ బి నెర్వస్‌ నెస్‌ను తగ్గిస్తుంది. గోధుమలో ఉండే ఐరన్‌ మెదడుకు ఆక్సి జన్‌ను ఇచ్చి ఒత్తిడిని, టెన్షన్‌ను నివారిస్తుంది. ఒమెగా3 ఫ్యాటీయాసిడ్లు అత్యధికంగా లభించే చేపలు ఒత్తిడిని తగ్గి స్తాయి. పాలలోని ల్యాక్టోస్‌ మంచి నిద్రనిచ్చి మెదడును తాజాగా, చురు కుగా ఉంచేందుకు సహకరిస్తాయి.

doit-yourself-fruitబొప్పాయి : బొప్పాయిని చాలామంది తినడానికి ఇష్టపడరు కానీ దీనిలో అనేక ఆరోగ్యకరమైన పోషకాలు ఉంటాయి. దీనిలో ఉండే కెరోటిన్‌ విషతుల్యాల్ని తొలగిస్తుంది. దీనివల్ల శరీరం, మనస్సు తేలికపడి ఒత్తిడి ఇట్టే తగ్గిపోతుంది.

బంగాళదుంప : జింక్‌, విటమిన్‌ సి పెరిగి రోగనిరోధక శక్తి ఇనుమడిం చి మనస్సును దృఢం గా, ఆరోగ్యంగా ఉంచుతుంది.

ఒత్తిడి మాయం కావాలంటే : బ్రిస్క్‌వాక్‌: జాగింగ్‌ వంటి ఏ వ్యాయా మం అయినా ఫీల్‌గుడ్‌ ఎండార్ఫిన్లను వి డుదల చేస్తుంది. వీటి తాలూకు ఫలితం దాదాపు 24 గం టల పాటు సాగుతుంది. అలానే బాగా ఇష్టపడే వ్యక్తి చేతిని పట్టుకుం టే కార్టిసాల్‌ అనే స్ట్రెస్‌ హార్మోన్‌ చాలా సులభంగా విడుదలవుతుంది. ఇది మనిషి మానసిక ఒత్తిడిని తగ్గించి వేస్తుంది.

సంగీతం, సినిమా : మెదడుపై సంగీతం మంద్రమైన ప్రభావాన్ని చూపుతుంది. నవ్వు కార్టిసాల్‌ స్థాయిల్ని తగ్గించి రోగనిరోధకశక్తిని పెంచడంలో తోడ్పడుతుంది. ప్రకృతిని వీక్షించడం ద్వారా ఏకాగ్రత పెరగడంతో పాటు పరిస్థితుల్ని సరైనా ఆలోచనతో ఎదుర్కోవడానికి, నాడీవ్యవస్థకు ప్రశాంతత చేకూర్చడానికి సహకరిస్తుందని ఆరోగ్యనిపుణులు స్పష్టం చేస్తున్నారు.

మేలు చేసే ఐస్‌ ముక్కలు


మేలు చేసే ఐస్‌ ముక్కలు
పిల్లలు ఐస్‌ ముక్కలన్నా...ఐస్‌ గడ్డలన్నా ఎంతగానో ఇష్టపడతారు. వాటితో వాళ్లు ఆనం దంగా ఆడుకుంటుంటారు. అవి శరీరానికి చల్లగా తగులుతుంటే పిల్లలు అదేపనిగా నోట్లో పెట్టుకుంటూ సరదాగా ఎంజాయ్‌ చేస్తుంటారు. కానీ అదేదో ప్రమాదం అన్నట్లు జలుబుచేసేస్తుందని చెప్పి తల్లులు పిల్లలను వారిస్తుంటారు. అరుుతే మంచు ముక్కలు మనకు తెలియకుండానే చాలా సహాయం చేస్తాయట...అదేంటో తెలుసుకోవాలంటే ఇది చదవండి....


సాదారణంగా సున్నా డిగ్రీల సెల్సియస్‌ వద్ద నీరు ఘనీభవించి మంచు ముక్కలా తయారవుతుందని మనం చిన్నప్పుడు సైన్స్‌ పాఠాల్లో చదువుకున్నాం. అదే ఫార్ములాను ఉపయోగిం చి డీప్‌ ఫ్రిజ్‌లో ఐస్‌ క్యూబ్‌ ఫ్రేమ్‌ బాక్స్‌లో నాలుగు పలకలుగా తయారు చేసుకునే విధంగా అందులో నీరు పోసి ఉంచితే అది గడ్డ కట్టి ఐస్‌ ముక్కలు తయారవుతాయి. వాటిని బయటకు తీసి కొన్ని రకాల రుగ్మతలకు వైద్యం చేయవచ్చునని నిపుణులు సూచిస్తున్నారు. దెబ్బలు తగిలినప్పుడు...ఒక్కోసారి ఆటల్లోగానీ, చిన్న చిన్న ప్రమాదాలలోగానీ బలంగా దెబ్బలు తగిలి కొందరికి రక్తం ఆగకుండా ధారాపాతంగా కారిపోతుంటుంది. అటువంటప్పుడు ఐస్‌ ముక్కలను మెత్తని గుడ్డలో చుట్టి ఆ భాగం తో దెబ్బ గట్టిగా తగిలిన ప్రాంతంలో నిదానంగా అదుముతు ంటే కొద్దిసేపటికి రక్తం కారడం తగ్గిపోతుంది.

cubesఒక్కోసారి రక్తం గూడు కట్టినట్లు అనిపించి మన శరీరంలో ఆ భాగమంతా తీవ్రంగా నొప్పి కలిగినా...ఇదే చికిత్సా విధానాన్ని కొనసాగించవచ్చును. దెబ్బల తాలూకు నొప్పి కూడా మెల్లిగా తగ్గిపోతుంది. ముక్కులో రక్తం కారితే..కొందరు పిల్లల్లో ముక్కు నుండి అదే పనిగా ధారాపాతంగా రక్తం కారిపోతుంటుంది. కర్చీఫ్‌ పెట్టినా...మరేది పెట్టినా అలా ధారలా కారుతుంటుంది. అలాంటప్పుడు ముక్కు రంధ్రం వద్ద ఐస్‌ ముక్కలతో అదిమిపెట్టి ఉంచితే రక్తం కారడం తగ్గుతుంది. ఆ తర్వాత కూడా ముక్కు చుట్టూ ఐస్‌ ముక్కలతో మెల్లిగా రాస్తూ ఉండాలి. బెణుకులకీ..ఒక్కోసారి రోడ్డుమీద మనం వెళుతుండగా...చూడకుండా గోతిలో పడి కాలు జారి పడిపోయే ప్రయత్నంలో పడిపోకుండా మన శరీరాన్ని ఏదో విధంగా ఆపు జేస్తాము. అయితే ఒక్కోసారి శరీరంలో ఏదో ఒక భాగం బెణికి తీవ్రంగా బాధిస్తుంటుంది. అలాంటప్పుడు ఇంటి వైద్యంగా ఈ ఐస్‌ ముక్కలను బెణికిన ప్రాంతంలో రాస్తే మంచి ఫలితం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. గొంతులో కిచ్‌కిచ్‌.. ఒక్కోసారి మనం ఎన్ని మందులు వాడి నా గొంతు గరగరలాడుతూ చాలా ఇబ్బంది కలిగిస్తుం టుంది.

julyమాట్లాడటానికి కూడా ఇబ్బంది పడుతుంటాము. అలాంటప్పు డు ఐస్‌ ముక్కలను గొంతులో వేసుకోకుండా గొంతు పైభాగంపై పూతలా రాస్తే గరగరలాడే గొంతు మళ్లీ శ్రావ్యతను సంతరించుకుంటుంది. గాయాలకు మందు..శరీరం కాలిపోయి నల్లగా కమిలిపోయినప్పుడు...అందుబాటులో ఉండే చవకైన చికిత్స ఐస్‌ముక్కల వైద్యం మాత్రమే. వెంటనే ఆ భాగంలో ఐస్‌ ముక్కలు వేసి మృదువుగా రుద్దాలి. కొంత ఫలితం ఉంటుంది. బాధ నుండి సత్వరమే ఉపశమనం కలుగుతుంది. కీళ్ల వ్యాధులకు...కొంత మందికి చిన్న వయసులోనే కీళ్లు , మోకాళ్లు నొప్పులు వస్తుంటాయి. అలాంటి వారికి ఐస్‌ ముక్కలను తీసుకుని నొప్పి ఉన్న ప్రాంతంలో రాస్తూ ఉండాలి. ఇలా చేస్తే కొన్నాళ్లకు కీళ్లనొప్పులు మటుమాయం అవుతాయి.

Saturday, August 21, 2010

గుండె గుట్టు తెలుసుకోండి

గుండె ఎలా పనిచేస్తుంది...
గుండె మన శరీరంలో అత్యంత ముఖ్యమైన భాగం. శరీరమంతటి నుంచి రక్తం గుండెకు వెళ్ళి, అక్కడ నుండి ఊపిరి తిత్తులకు వెళ్ళడం ద్వారా రక్తంలోని కార్బన్‌డై ఆకై్సడ్‌ బయటకు నెట్టివేయబడుతుంది.అలాగే ఆక్సిజన్‌ ఊపిరితిత్తులనుండి గుండెకు చేరి అక్కడినుండి రక్తంద్వారా ఆహార పదార్ధాలతో కలిసి శరీరంలోని అన్ని భాగాలకు వెళ్తుంది.ఏ భాగానికి రక్తం అందకపోయినా ఆ భాగం దెబ్బతింటుంది. అలా దెబ్బతినడాన్ని గాంగ్రిన్‌ అంటారు.

Heartఎందుకంటే ఆ ప్రాంతానికి రక్తం అందక పోవడంతో ఆహారం, ఆక్సిజన్‌ అందదు కదా! గుండె ముడుచుకుపోవడం ద్వారానే రక్తనాళాల ద్వారా ఇలా రక్తం శరీరమంతటికీ చేరుతుంది. కాబట్టి గుండె చేసే కార్యం చాలా గొప్పదే కదా! శరీరమంతటికి వెళ్ళే రక్తం గుండెద్వారా వెళ్తున్నా, గుండెకు ఎంత రక్తం తగ్గినా ఆ రక్తంలోంచి తీసుకోదు. తనకి రక్తం సరఫరా చేసే నాళాల నుంచి వచ్చే రక్తాన్నే గుండె పనిచేయడానికి తీసుకుంటుంది. అంటే గుండె ఎంత నిస్వార్ధంగా పనిచేస్తుందో గమనించారా ? అదే నిస్వార్ధ బుద్ధి ని, నిర్విరామ కృషిని మనం గుండె నుండి నేర్చుకోవాలి.

గుండె దెబ్బతినేందుకు కారణాలు...
గుండె దెబ్బతిన్నా గుండెకు రక్తం సరఫరా చేసే నాళాల్లో అడ్డంకులు ఏర్పడ్డా ఇతర రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడ్డా కూడా శరీరంలో రక్త ప్రసరణ దెబ్బతింటుంది. గుండె దెబ్బతిన్నా, ఏ ప్రాంతంలో రక్తనాళాలు దెబ్బతిన్నా కూడా మందులతో కాక పోతే శస్తచ్రికిత్సల ద్వారా సరిచేయవచ్చు. గుండెకు రక్తం సరఫరా చేసే కరోనరీ ఆర్టరీలో అడ్డంకులు ఏర్పడితే హార్ట్‌ ఎటాక్‌ (గుండెపోటు) వస్తుంది. మెదడుకు సరఫరా చేసే కెరోటిడ్‌ ఆర్టరీలో అడ్డంకులు ఏర్పడితే స్ట్రోక్‌ (పక్షవాతం) వస్తుంది. గుండె నిర్విరామంగా కొట్టు కోవాలంటే దాని గోడలు బలంగా ఉండాలి.

గుండె గోడలు నీరసిస్తే గుండె సరిగా కొట్టుకోలేక హార్ట్‌ ఫెయి ల్‌ అవుతుంది. పుట్టుకతోనే గుండె నిర్మాణంలో కొన్ని లోపాలు ఏర్పడవచ్చు. వీటిని కంజెనైటల్‌ హార్ట్‌ డిసీజెస్‌ అంటారు. వీటిని శస్త్ర చికిత్సలతో సరిచేయవచ్చు. కాబట్టి పుట్టగానే పిల్లల్లో గుండెలోపాలుంటే నిర్లక్ష్యం చేయక వైద్యులను కలవాలి. ఇది వంశ పారంపర్య అనారోగ్యం. సిగరెట్లు తాగడం, క్రొవ్వు పదార్ధాలను ఎక్కువగా తీసుకోవడం, వ్యాయామం లేకుండా ఉండటం, ఒత్తిడి ఎక్కువ కావడం లాంటి జీవన విధానాల వల్ల రక్తపోటు పెరుగుతుంది. దాంతో గుండె దెబ్బ తింటుంది. కాబట్టి జీవన విధానాన్ని మార్చుకోవాలి. గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.గుండె కవాటాల లోపం రావచ్చు, గుండె గోడలలో చిల్లులు ఏర్పడవచ్చు. ఇలా రకరకాల గుండె అనారోగ్యాలు కలుగవచ్చు.

భయపడక్కరలేదు...
గుండె శస్త్ర చికిత్సలనగానే ఛాతీలో ఎముకలు కత్తిరిస్తారు, గుండె కొట్టుకోవడాన్ని ఆపి, కృత్రిమ గుండెకు కలిపి శస్త్ర చికిత్సలు చేస్తారు. కోలుకోవడానికి చాలా కాలం పడుతుంది.చాలామందికి భయం ఉంటుంది.అది నాటి మాట. మరినేడు గుండెను ఆపకుం డా... బీటింగ్‌ హార్ట్‌మీదే శస్తచ్రికిత్సల్ని విజయవంతంగా నిర్వహిస్తు న్నారు. అదీ పెద్ద పెద్ద కోతలు లేకుండా ఒక సన్నటి కీహోల్‌ ద్వారా ఆపరేషన్‌ చేస్తున్నారు.గుండెకి శస్త్ర చికిత్సల్ని కీ హోల్‌ ద్వారా నిర్వహిస్తుండడంతో పెద్దకోతలు చేయాల్సిన పనిలేదు.చిన్న కోతలే కాబట్టి త్వరగా నయం అవుతుంది. రక్తస్రావం బాగా తక్కువ వుతుంది. నొప్పి తక్కువ .

హాస్పటల్‌లో ఉండే సమయం తక్కువ. ఖర్చూ తక్కువే. బైపాస్‌ సర్జరీ, కవాట మార్పిడి లాంటి శస్త్ర చికిత్సల్ని కీ హో ల్‌ ద్వారా గ్లోబల్‌ ఆసుపత్రిలో నయం చేస్తున్నాం. గుండె శస్త్ర చికి త్స లంటే ఇప్పుడు భయపడాల్సిన పని లేదు.బైపాస్‌ చేయడానికి రక్తనాళం కాలులోంచి తీసు కోవడానికి కుడా పెద్ద గాయం చేయనవసరం లేదు. చిన్న కోతతో ఇప్పుడు కాలులోంచి రక్తనాళాల్ని తీస్తున్నాం.

మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది...
గుండె అరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా అవసరం. అందుకు వంశపారంపర్యంగా వచ్చే వాటిని మనం ఏమీ చేయలేము కానీ, మన అలవాట్లను మాత్రం మానుకోగలం. అలా మానుకుంటూ కొత్త జీవన విధానాన్ని అలవర్చుకోవడం, గుండె ఆరో గ్యాన్ని కాపాడుకోవడం ముఖ్యం. ఇప్పుడు జీవన విధానం వల్ల యువతీ యువకుల్లో కూడా గుండె జబ్బులు వస్తున్నాయి.

చుట్టూ ఉన్న వాతావరణంతో పాటు మన పద్ధతులే దానికి కారణం. అందుకని మన జాగ్రత్తతో ఆరోగ్యాన్ని కాపాడు కుందాం. ఒక వేళ అనారోగ్యాలున్నా ప్రథమ దశలోనే గుర్తించాలి. అందుకు ఆరోగ్య అవ గాహనా సదస్సులు తోడ్పడ తాయి. వ్యాధిని ప్రథమ దశలోనే గుర్తిస్తే వెంటనే చికిత్స పొందవచ్చు. ఒకవేళ ఆలస్యంగా గుర్తించినా ఇప్పుడు భయ పడాల్సిన పనిలేదు. అన్నిరకాల చికిత్సలను ఇపుడు దిగ్వి జయంగా నిర్వహిస్తు న్నాం... కీ హోల్‌ లాంటి నూతన విధానాలూ అందు బాటు లో ఉన్నాయి. గుర్తించుకోండి.మీ గుండె ఆరోగ్యం మీచేతుల్లో ఉంది.

- డాక్టర్‌. ఆళ్ళ గోపాలకృష్ణ గోఖలే
గుండె శస్తచ్రికిత్సా నిపుణులు,
గ్లోబల్‌ హాస్పటల్స్‌,లకిడికాపూల్‌,
హైదరాబాద్‌-4, మొబైల్‌:98480 45810

Thursday, July 8, 2010

ఆనందమే.. అందం..!

అందం కోసం మహిళలు తరచూ రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. ఇందులో భాగంగా వారి ఆహారపు అలవాట్లలోనూ మార్పులు, చేర్పులూ చేసుకుంటుంటారు. అయినప్పటికీ తమ అందం మరింతగా పెరగాలని, ఇతరులు తమ అందాన్ని ప్రశంసించాలని కోరుకుంటారు. దీనికి వారు మంచి ఆహారం తీసుకోవడంతోపాటు ఆనందంగానూ వుండాలంటున్నారు సౌందర్య నిపుణులు. ఆరోగ్యంగా వుండాలంటే..

Happy-Womanఅందంగా వుండాలంటే ముందుగా ఆరోగ్యం గా వుండాలి. ఆరోగ్యంగా వుండేందుకు పోషక విలువలు కలిగిన ఆహారం తీసు వాల్సివుంటుంది. వీలైనంత వరకు నూనెతో కూడుకున్న ఆహారపదా ర్థాలకు దూరంగా వుండేందుకు ప్రయత్నించాలి. అలాగే ఆహారంలో రైస్‌తో చేసే పదార్థాలు తక్కువగా వుం డేలా చూసుకోవాలి. తీసుకునే ఆహా రంలో పోషక విలువలుండేలా చూసుకో వాలి. కార్పొహైడ్రేట్‌లు తక్కువగా ఉండే పదార్థాలను ఆహారంలో చేర్చుకోవాలి. ఆహారంలో ముఖ్యంగా పీచు పదార్థా లుండేలా చూసుకోవాలి. మాంసా హారు లైతే కోడిగుడ్డు లోని తెల్లసోన మాత్రమే తీసుకోవాలి. కోడి కూర, చేపలు తప్పనిసరిగా తీసుకోవ చ్చు. పొట్టేలు, మేమాంసం కు దూరంగా వుండటమే మంచిది.

సంతోషంగా వుండేందుకు..
ఆరోగ్యంగా వుండేందుకు ఆహారపు అలవాట్ల గురించి చెప్పుకున్నాం. కాని దీంతో పాటు అందంగా వుండేందుకు సంతోషంగానూ వుండాలి. సంతోషంగా వుండేందుకు ప్రశాంత వదనంతో ఉండేందుకు ప్రయత్నించాలి. మీ చుట్టుపక్కల వున్న వారి గురించి కూడా కాస్త పట్టించుకోవాలి. వారు సంతోషంగా వుంటే మీరు కూడా సంతోషంగా వుండగలరు. మీ కార్యాలయంలో లేదా మీ ఇంటి చుట్టుపక్కల వాళ్లతో వీలైనంత వరకు సరదాగా వుండేందుకు ప్రయత్నించాలి. సమస్యల్లో వున్న వారికి మీకు తోచిన సాయం చేసేందుకు ప్రయత్నించాలి.

సమస్యలు అనేవి ప్రతి ప్రాణికి వుంటాయి. కాని మనిషికి మరీ ఎక్కువగా వుంటాయి. ఇందులోనూ సంతోషంగా వుండేందుకు స్వతహాగా ప్రయత్నిస్తే సమస్యలు అనేవి దూరమయిపోతాయి. పైగా మానసికపరమైన ఒత్తిడి కూడా తగ్గిపోతుంది. ఎప్పుడైతే మానసికపరమైన ఒత్తిడి శరీరంలో ఉండదో అప్పుడు మీ అందం ద్విగుణీకృత మౌతుందంటున్నారు సౌందర్య, మానసిక నిపుణులు.

happy_womanఒత్తిడి తగ్గించుకునేందుకు..
బత్తిడిని నియంత్రించుకోవడానికి తరచూ స్పాకు వెళ్లండి. వీలైతే వారానికి ఒకసారి శరీరానికి మసాజ్‌ చేయించుకోవడానికి ప్రయత్నించొచ్చు. పగలంతా బాగా పనిచేసి అలసిపోయిన తర్వాత రాత్రి పడుకునే ముందు మీకు నచ్చిన సంగీతాన్ని వింటూ నిద్రకు ఉప్రకమించొచ్చు. దీంతో శరీరంలోని అలసటతోపాటు మానసికపరమైన ఒత్తిడి కూడా తగ్గి నిద్రబాగా పడుతుంది. వీలైతే కనీసం మూడు నెలలకు ఒక సారి పర్యాటక ప్రదేశాలకు వెళ్లేలా ప్లాన్‌ చేసుకోవాలి. పర్యాటక ప్రదేశాలకు వెళ్లడం వల్ల మీరు మరింత ఉత్సాహంగా తయారవ్వొచు. ఎప్పుడైతే ఉత్సాహంగా ఉల్లాసంగా వుంటారో అప్పుడు మీరు మరింత అందంగాకనబడే అవకాశాలు వున్నాయంటున్నారు నిపుణులు.