Showing posts with label మధు మేహం. Show all posts
Showing posts with label మధు మేహం. Show all posts

Tuesday, December 28, 2010

పంచదార కళ్లు * డయాబెటిస్ వల్ల కంటిపై పడే ప్రభావాలు, వాటి లక్షణాలు, నివారణ, చికిత్స

చక్కెర నోటికి తీపి గానీ... కళ్లకు మాత్రం చేదే. చక్కెర వ్యాధి ప్రభావం ఎంత చేదుగా ఉంటుందో తెలిసిన విషయమే. అన్ని అవయవాలపై దుష్ర్పభావం చూపించే ఆ వ్యాధికి కన్ను మినహాయింపేమీ కాదు. అన్ని అవయవాల్లాగే కన్ను కూడా డయాబెటిస్‌కు ప్రభావితమవుతుంది. చక్కెరను నియంత్రించుకోకపోతే అది డయాబెటిక్ రెటినోపతి అనే సమస్య మొదలు అనేక రుగ్మతలకు దారి తీయవచ్చు. వాటిని నిర్లక్ష్యం చేస్తే చూపునే కోల్పోవాల్సిన పరిస్థితికి దారితీయవచ్చు. అందుకే... చక్కెర వ్యాధి సూచనలు కనిపించగానే కంటిపై ఆ వ్యాధి ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా ఉండాలి. డయాబెటిస్ వల్ల కంటిపై పడే ప్రభావాలు, వాటి లక్షణాలు, నివారణ, చికిత్స లాంటి అనేక అంశాలను తెలుసుకోడానికే ఈ కథనం...

ప్రతి అవయవానికి పోషకాలు అందించే బాధ్యత రక్తానిది. ఈ రక్తం రక్తనాళాల్లో ప్రవహిస్తుంటుంది. ఈ నాళాల చివరన ఉండే అత్యంత సూక్ష్మమైన నాళాలను రక్తకేశనాళికలు (క్యాపిల్లరీస్) అంటారు. దీర్ఘకాలంగా రక్తంలో చక్కెర పాళ్లు ఎక్కువగా ఉండేవారిలో కేపిల్లరీస్ దెబ్బతింటాయి. రక్తంలో పెరిగే గ్లూకోజ్ పాళ్ల వల్ల ఈ రక్తనాళాల చివర్లలో అడ్డంకులు (బ్లాకేజ్) ఏర్పడవచ్చు. ఫలితంగా ఆ అవయవానికి రక్తం అందకపోవచ్చు. దాంతో ఆ అవయవం శాశ్వతంగా చచ్చుబడే ప్రమాదం ఉంది. కంటిలో ఉండే రక్తనాళాల చివరల్లోనూ ఇలాంటి బ్లాక్స్ రావడం సంభవిస్తే చూపు దెబ్బతినే అవకాశాలు ఉంటాయి.

డయాబెటిస్ వల్ల వచ్చే వ్యాధులివి...
డయాబెటిక్ రెటినోపతి

డయాబెటిక్ క్యాటరాక్ట్

గ్లకోమా నర్వ్ పాల్సీ ఆప్టిక్ న్యూరోపతి

కనురెప్పకు తరచూ వచ్చే ఇన్ఫెక్షన్

కనురెప్పలు వాలిపోవడం

కంటిలోపల ఉండే పొర కంజెంక్టివాకు వచ్చే ఇన్ఫెక్షన్లు

కార్నియాకు వచ్చే సమస్యలు.

డయాబెటిక్ రెటినోపతి... ఏదైనా వస్తువును చూసినప్పుడు దాని ప్రతిబింబం కంటిలోపల ఉండే ఒక తెరపై పడుతుంది. ఆ తెరపై పడే ప్రతిబింబం వల్లనే మనం చూడగలమన్నది తెలిసిందే. ఈ తెరనే ‘రెటీనా’ అంటారు. అన్ని అవయవాల్లాగే ఈ రెటీనాకు కూడా అత్యంత సూక్ష్మమైన నాళాల ద్వారా రక్తం సరఫరా అవుతుంటుంది. చక్కెర వ్యాధి వల్ల ఈ రక్తనాళాలు దెబ్బతిని రెటీనాకు రక్తం సరిగ్గా అందక చూపు దెబ్బతినే పరిస్థితిని ‘డయాబెటిక్ రెటినోపతి’ అంటారు. దీని వల్ల శాశ్వతంగా చూపు కోల్పోవాల్సిన పరిస్థితి రావచ్చు. ప్రపంచవ్యాప్తంగా అంధత్వానికి చాలా ఎక్కువగా ఉన్న కారణాల్లో ఇది ప్రధానమైనది.

 
‘డయాబెటిక్ రెటినోపతి’ ఎవరెవరిలో ఎక్కువ...
దీర్ఘకాలంగా చక్కెర వ్యాధి ఉన్నవారికి

చక్కెరను అదుపు చేసుకోకుండా నిర్లక్ష్యంగా ఉండేవారికి

డయాబెటిస్‌తో పాటు అధిక రక్తపోటు ఉన్నవారికి

డయాబెటిస్‌తో పాటు కొలెస్ట్రాల్ పాళ్లు, రక్తంలో కొవ్వుల పాళ్లు ఎక్కువగా ఉన్నవారికి

కిడ్నీ సమస్యలు ఉన్నవారికి

గుండె జబ్బులు ఉన్నవారికి

పొగతాగేవారికి... వీళ్లందరిలో డయాబెటిక్ రెటినోపతి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ.

గమనిక : షుగర్ పూర్తిగా నియంత్రణలో ఉన్నా రెటినోపతి వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి చక్కెర వ్యాధి ఉన్నవారు క్రమం తప్పకుండా కంటి వైద్యనిపుణులను తరచూ సంప్రదించడం అవసరం.

తస్మాత్ జాగ్రత్త...
డయాబెటిక్ రెటినోపతితో బాధపడే వారిలో, చూపు కోల్పోయే వారిలో - తమకు ఈ దుష్ర్పభావం పడబోతుందన్న విషయం దాదాపు సగానికి మందికి పైగా తెలియనే తెలియదు. ఒక్కోసారి కంటికి చేసే సాధారణ (రొటీన్) పరీక్షల్లో ఈ విషయం బయటపడుతుంది. అందుకే డయాబెటిస్ ఉన్నవారు తరచూ కంటి పరీక్షలు చేయించుకుంటూ ఉండటం మంచిది.

డయాబెటిక్ రెటినోపతి కేసుల్లో ఏం జరుగుతుంది?
డయాబెటిస్ ఉన్నవారిలో కంటిలోని అత్యంత సూక్ష్మమైన రక్తనాళాల చివరలు ఉబ్బుతాయి. ఇలా రెటినాకు చెందిన రక్తనాళాల చివరలు ఉబ్బడాన్ని ‘మైక్రో అన్యూరిజమ్’ అంటారు. ఇవి ఉబ్బి ఉబ్బి ఒక్కోసారి చిట్లి రక్తస్రావం కావచ్చు. ఇలా రక్తస్రావం కావడాన్ని ‘డాట్ అండ్ బ్లాట్ హ్యామరేజ్’ అంటారు. కొన్నిసార్లు కంటిలోని ద్రవాలు లీక్ కావచ్చు. అలా జరిగితే దాన్ని ‘మాక్యులార్ ఎడిమా’ అంటారు. అప్పుడు రెటీనా నుంచి కొత్త రక్తనాళాలు ఆవిర్భవించవచ్చు. దీన్నే ప్రొలిఫిరేటివ్ డయాబెటిక్ రెటినోపతి అంటారు. ఇలా కొత్తరక్తనాళాలు పుట్టుకురావడమే కంటికి ప్రమాదకరం అవుతుంది.

నేత్రవైద్యులు ఇందుకోసం చేసే పరీక్షలివి
ఫండస్ ఎగ్జామినేషన్

ఫండస్ ఫ్లోరోసిన్ యాంజియోగ్రఫీ

ఓసీటీ (ఆప్టికల్ కొహెరెన్స్ టోమోగ్రఫీ)

అల్ట్రా సౌండ్ ‘బి’ స్కాన్

చికిత్స
డయాబెటిస్ రెటినోపతీకి అందుబాటులో ఉన్న చికిత్స ప్రక్రియలు
1. వైద్యపరంగా అందించే చికిత్స
2. లేజర్ ఫోటోకోయాగ్యులేషన్
3. శస్తచ్రికిత్స (విట్రెక్టమీ)

1. వైద్యపరంగా చేయాల్సిన చికిత్స:
రక్తంలోని గ్లూకోజ్‌ను నియంత్రించడానికి చికిత్స చేయాలి.

రక్తంలో కొవ్వులను నియంత్రించడానికి చికిత్స (కొలెస్ట్రాల్ తగ్గించడానికి)

యాంటీప్లేట్‌లెట్ ఏజెంట్స్ (రక్తం పలచబరచడానికి మందులు)

బీ కాంప్లెక్స్ ఔషధాలు ఇవ్వాలి.

3. శస్తచ్రికిత్స:
రెటినోపతి వల్ల వచ్చే దుష్ర్పభావాలు దీర్ఘకాలం పాటు కొనసాగుతూ ఉంటే అప్పుడు అక్కడ గడ్డకట్టిన రక్తాన్ని తొలగించడానికి విట్రెక్టమీ ఆపరేషన్ అవసరం కావచ్చు.

డయాబెటిక్ క్యాటరాక్ట్...
డయాబెటిస్‌తో శరీరంలోని జీవక్రియ (మెటబాలిజమ్) ల్లో మార్పుల వల్ల కొందరిలో కంటిలో త్వరగా క్యాటరాక్ట్ రావచ్చు. దీనివల్ల చూపు స్పష్టంగా కనిపించకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి వారిలో ఫ్యాకో ఎమల్సిఫికేషన్ వంటి ప్రక్రియలతో కంటి ముందు ఉంటే లెన్స్ మార్చి కృత్రిమ లెన్స్‌ను అమర్చాల్సి ఉంటుంది.

గ్లకోమా...
కంటిలో ఉండే ద్రవాలలో ఒత్తిడి పెరిగి అది కంటి నరం మీద పడటాన్ని గ్లకోమా అంటారు. ఈ ఒత్తిడి వల్ల క్రమంగా కంటిచూపు కోల్పోయే ప్రమాదం ఉంది. యాంటీ గ్లకోమా చుక్కల మందు కంట్లో వేయడం ద్వారా దీన్ని నివారించవచ్చు. అయితే దీన్ని జీవితకాలం వాడాల్సి ఉంటుంది. కొంతమందికి శస్తచ్రికిత్స ద్వారా కూడా గ్లకోమాను నయం చేసే అవకాశాలు ఉంటాయి.

ఆప్టిక్ న్యూరోపతి...
కంటిలో కనిపించే ప్రతిబింబాన్ని ‘ఆప్టిక్ నర్వ్’ మెదడుకు చేరవేయడం వల్లనే మనకు చూపు కనిపిస్తుంటుందన్న విషయం తెలిసిందే. కొన్నిసార్లు ఈ నరం దెబ్బతినడం వల్ల కంటి చూపు అకస్మాత్తుగా దెబ్బతింటుంది. ఈ నరం దెబ్బతిన్న విషయాన్ని ఫండస్ పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు. ఇలాంటి సందర్భాల్లో కంటి వైద్యులు, న్యూరోఫిజీషియన్ ఆధ్వర్యంలో చికిత్స ఇవ్వాల్సి ఉంటుంది.

చూపును దీర్ఘకాలం పదిలంగా కాపాడు కోవడం కోసం కంటి పరీక్షలు తరచూ చేయించడం అవసరం. డయాబెటిస్ ఉంటే అది మరింత అవసరమని గుర్తుంచుకోవాలి.

2. లేజర్ ఫోటోకోయాగ్యులేషన్
లేజర్ కిరణాల సహాయంతో చేయాల్సిన ఈ చికిత్స వల్ల కంటిలో రక్తస్రావాన్ని తగ్గించడం కొత్తగా ఏర్పడే రక్తనాళాలను నివారించడం సాధ్యమవుతుంది. ఈ చికిత్స ప్రక్రియలో కొన్నిసార్లు ఒకటి కంటే ఎక్కువ సార్లు ఈ చికిత్స చేయాల్సిన అవసరం రావచ్చు. ఒకసారి చికిత్స చేశాక జీవితకాలం పాటు క్రమం తప్పకుండా వైద్యపరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది.

ఎన్నాళ్లకోమారు..?
డయాబెటిస్ ఉన్నవారు ఏడాదికి ఒకసారి కంటి పరీక్షలు చేయించాలి.

డయాబెటిక్ రెటినోపతి ఉన్నవారు ప్రతి ఆర్నెల్లకు ఓ మారు పరీక్షలు చేయించాలి.

డయాబెటిక్ రెటినోపతి తీవ్రంగా ఉంటే ప్రతి మూడు నెలలకోమారు పరీక్షించుకోవాలి.

నివారణ...
డాక్టర్లు చెప్పినవిధంగా మంచి పోషకాలు, పీచుపదార్థాలు ఎక్కుడా ఉండే ఆహారాన్ని క్రమబద్ధంగా తీసుకోవడం.

ఆరోగ్యకరమైన జీవన శైలిని పాటించడం

వ్యాయామం

క్రమం తప్పకుండా రక్తంలో గ్లూకోజ్ పాళ్లను పరీక్షించుకుంటూ దాన్ని నియంత్రించుకోవడం

పొగతాగే అలవాటును పూర్తిగా మానివేయడం.

Thursday, November 11, 2010

మధుమేహం తియ్యటి శత్రువు.

మధుమేహం తియ్యటి శత్రువు. చాప కింద నీరులా చల్లగా మన ఒంట్లోకి చేరిపోతుంది. ఏమరుపాటుగా ఉంటే జీవితంలోని తీపిని దూరం చేసి చేదును మిగులుస్తుంది. ఈ స్వీట్ ఎనిమీ దరిదాపుల్లోకి రానేవద్దు అనుకునేవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పటికే ఈ ఎనిమీతో పోరాడుతున్న వారు దానిమీద పైచేయి సాధించాలంటే ఏం చేయాలి? వీటి మీద సమగ్ర వివరణే ఈ ముందు జాగ్రత్త.

ప్రాణాపాయం కలిగించే అంటువ్యాధుల్లో టి.బి అత్యంత ప్రమాదకరమైనది. అంటువ్యాధి కాని జబ్బుల్లో డయాబెటిస్ ప్రమాదకరమైనది. ఈ రెండు వ్యాధులు మన దేశంలో చాలా ఎక్కువ. డయాబెటిస్ వచ్చినవారిలో అందరూ అనుకునేటట్టుగా గుండె, కిడ్నీలు దెబ్బతినడం ప్రాణాపాయం అనుకుంటారు. కాని డయాబెటిస్ వచ్చినవారికి టి.బి లాంటి పెద్ద ఇన్ఫెక్షన్ల కారణంగానే ఎక్కువ మందిలో ప్రాణాపాయం సంభవిస్తుంది. ఈ విషయం మన దేశంలో ఎన్నో డయాబెటిస్ పరిశోధనల్లో వెల్లడైంది.

నేషనల్ అర్బన్ డయాబెటిస్ సర్వే 2001లో హైదరాబాద్, బెంగళూర్, ఢిల్లీ, ముంబయ్, మద్రాస్ నగరాలలో (5288 పురుషులు, 5929 స్ర్తీలపై) మధుమేహుల సంఖ్య ఎంతగా ఉందో తెలుసుకోవడానికి ఓ సర్వే నిర్వహించింది. మిగతా నగరాలతో పోల్చితే హైదరాబాద్‌లో పాతికేళ్లు దాటిన ప్రతి ఆరుగురిలో ఒకరికి మధుమేహం ఉన్నట్టుగా వెల్లడైంది. ఇక నలభై ఐదు నుంచి అరవై ఐదు ఏళ్ల మధ్య వయసు వారిలో 50శాతం మందికి ఈ వ్యాధి ఉందని తెలిసింది. పదేళ్లతో పోల్చి చూస్తే ఇప్పుడు ఈ సంఖ్య ఎంతగా పెరిగి ఉంటుందో ఊహించవచ్చు. మధుమేహం లేనివారు నాకు ఈ జబ్బు లేదు కదా! అని నిర్లక్ష్యంగా ఉండటానికి వీలు లేదు. ఎందుకంటే ఏ వయసులోనైనా, ఎవరికైనా ఈ జబ్బు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కారణాలు కనిపెట్టి, తగినంత శ్రద్ధ వహిస్తే ఈ సమస్య దరిచేరకుండా చూసుకోవచ్చు.

డయాబెటిస్ నివారణ కోసం ముందు జాగ్రత్తలు
1. పంటి జబ్బులు: పంటికి-మధుమేహానికి ఏమిటి లింకు? పంటి వ్యాధులు డయాబెటిస్‌కు ఎలా కారణం? అనేదానికి వైద్యపరంగా ఇంకా ఆధారాలు తెలియలేదు. అయితే కనెక్షన్ మాత్రం ఉంది. పంటి(పెరియోడాన్‌టైటిస్) వ్యాధుల బారినపడిన వారందరికీ మధుమేహం, గుండెజబ్బులు వచ్చే అవకాశం ఉంది. దంత సంబంధ వ్యాధులు ఉన్నవారిలో డెంటిస్ట్ చేత పళ్లను క్లీన్ చేయించిన తర్వాత టెస్టులు చేస్తే, డయాబెటిస్ రిస్క్ సగానికి సగం తగ్గినట్లుగా పరిశీలనలు చెబుతున్నాయి. అందుకే డయాబెటిస్ సమస్య రాకుండా ఉండాలంటే పంటి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి.

2. దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్లు: ఇన్ఫెక్షన్లు తరచూ బాధిస్తే మధుమేహం వస్తుంది. ముఖ్యంగా చర్మవ్యాధులైన ఫంగస్, గజ్జి, తామర వంటి వాటి వల్ల పాంక్రియాస్‌లోని బీటా కణాలు పాడైపోయి మధుమేహం వస్తుంది. సాధారణంగా శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గితే వైరల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువ దాడిచేస్తాయి. ఈ ఇన్ఫెక్షన్లు పిల్లల్లో ఎక్కువగా గమనిస్తుంటాం. అందుకని చర్మవ్యాధులు అంటే ఒంటిపై చిన్న చిన్న కురుపులు కనిపించినా డాక్టర్‌ని సంప్రదించి తగిన యాంటీబయాటిక్స్ వాడాలి.

ఎ) మూత్రసంబంధిత ఇన్ఫెక్షన్లు: జననేంద్రియాలకు సంబంధించిన శుభ్రత సరిగ్గా పాటించకపోవడం వల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు అధికంగా కనిపిస్తుంటాయి. పిల్లల్లో ఈ సమస్య మరీ ఎక్కువ. మగపిల్లల్లో అంగంపై తెల్లని పొడలా కనిపిస్తుంటుంది. నిర్లక్ష్యం చేస్తే మూత్రద్వారం సగం మూసుకుపోయే అవకాశం ఉంది. దీని వల్ల పదే పదే ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. ఆడపిల్లల్లో అయితే రజస్వల అయిన నాటి నుంచి శుభ్రతకు సంబంధించిన విషయాల పట్ల అవగాహన కల్పించాలి. లేదంటే వీరిలోనూ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చి, తద్వారా డయాబెటిస్‌కి దారితీసే అవకాశాలు ఎక్కువ.

బి) వైరల్ ఇన్ఫెక్షన్లు: చికెన్‌గున్యా, మలేరియా, టైఫాయిడ్... వంటి వైరల్ ఫీవర్ల మూలంగా ప్రతి ఏడాది ఎంతో మంది బాధపడుతున్నారు. వీటి నివారణకు డాక్టర్ సూచించిన యాంటీబయాటిక్స్ కోర్సు నిర్లక్ష్యం చేయకుండా తప్పనిసరిగా వాడాలి. ఎందుకంటే వీటి వల్ల పదే పదే బాధపడేవారిలో మధుమేహం వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి.

సి) నులిపురుగులు: ఆహారం ద్వారా పొట్టలోకి చేరిన బ్యాక్టీరియా, కడుపులో ఏర్పడే పురుగులు ఉదరకోశ సమస్యలకు కారణాలు అవుతుంటాయి. నులిపురుగుల సమస్య పిల్లల్లో ఎక్కువగా చూస్తుంటాం. నులిపురుగులకంటే ఆస్కారియాసిస్ అనే పురుగులు ఇంకా పెద్దగా ఉంటాయి. ఇవి పాంక్రియాస్ డక్ట్‌కు అడ్డం పడటంతో ఆ గ్రంథి నుంచి వెలువడే స్రావాలు ఆగిపోతాయి. ఫలితంగా డయాబెటిస్ వస్తుంది. అందుకని కడుపులో నులిపురుగులు ఉంటే ఎక్కువ రోజులు ఆగకుండా తగిన చికిత్స తీసుకోవాలి.

మానసిక ఒత్తిడి
ఈ మధ్యకాలంలో సామాజికంగా, వ్యక్తిగతంగా పనుల్లో తీవ్ర మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. స్ట్రెస్ హార్మోన్లు అన్నీ కూడా ఇన్సులిన్‌కు వ్యతిరేకంగా పనిచేస్తాయి. ఉదాహరణకు కార్టిజాల్స్, ఎడ్రిలిన్, థైరాక్సిన్, గ్రోత్‌హార్మోన్... లాంటివి. మనలో కోపం, బాధ, ఉద్వేగం, భయాలకు లోనైనప్పుడు గుండెదడ, మెదడు బండబారిపోవడం, బి.పి పెరగడం లేదా పడిపోవడం, తల భారంగా అనిపించడం వంటి పరిణామాలు సంభవిస్తాయి. ఈ ఒత్తిడి ఏదో ఒక రోజు కాకుండా, రోజూ ఎదుర్కుంటూ ఉంటే హార్మోన్ల పనితీరు మందగించి, ఒకవేళ ఇన్సులిన్ సరిగ్గా ఉత్పత్తి అయినా ఆ మోతాదు శరీరానికి సరిపోదు. ఫలితంగా డయాబెటిస్ వస్తుంది. దాదాపుగా డయాబెటిస్ రావడానికి 70 శాతం మానసిక ఒత్తిడే ప్రధాన కారణం. అందుకే మానసిక ఒత్తిడిని నియంత్రణలో ఉంచుకోవడం అవసరం. స్ట్రెస్‌ని మొదట్లోనే ఆధునికవైద్యపరంగా కాకుండా యోగా, మెడిటేషన్, లాఫింగ్, రిలాక్సేషన్ పద్ధతుల ద్వారా తగ్గించుకోవచ్చు.


డయాబెటిస్ ఉన్నవాళ్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
మధుమేహం ఉన్నప్పుడు ఆహార నియమాలు పాటించడంతో పాటు ఇతరత్రా ఆరోగ్య విషయాల్లోనూ జాగ్రత్తలు తీసుకుంటే డయాబెటిస్‌ను నియంత్రణలో ఉంచుకోవచ్చు.
1. పంటి జబ్బులు: రక్తంలో గ్లూకోజ్ ఎక్కువ ఉన్నవారికి పంటిపై గారను శుభ్రపరిస్తే ఆ మరుసటి రోజుకి రక్తంలో గ్లూకోజ్ 50 శాతం తగ్గినట్టుగా చాలా సందర్భాల్లో తెలిసింది. మధుమేహం నియంత్రణలో ఉండాలంటే వీరు పంటి సంరక్షణ పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అలాగే మౌత్‌వాష్‌లను రోజుకు నాలుగైదు సార్లు ఉపయోగించాలి.

 
2. ఇన్ఫెక్షన్లు:
ఎ) చర్మవ్యాధులు: చర్మంపై చిన్న చిన్న పొక్కులు వంటివి సాధారణంగా వస్తుంటాయి. అలాగని వాటిని నిర్లక్ష్యం చేయవద్దు. ఇవి నయం కావడానికి తగిన యాంటీబయాటిక్స్‌ను వాడాలి. రోజూ షుగర్ మాత్రలు, ఇన్సులిన్ తీసుకునే వారు చర్మ వ్యాధులు రాకుండా జాగ్రత్తపడాలి.

బి) మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్లు: మూత్రం ఆగి ఆగి రావడం, విసర్జనలో మంట, దురద వంటివి చూసినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా తగిన చికిత్స తీసుకోవాలి.

3. శుభ్రత:
సాధారణంగా మన దేశంలో ఎక్కడికైనా ప్రయాణాలు చేసేటప్పుడు తప్ప, మామూలుగా చెప్పుల వాడకం చాలా తక్కువ. దీని వల్ల కాలిగోళ్లు, కాలివేళ్ల మధ్య, పగుళ్ల మధ్య మురికి చేరి ఒక్కోసారి శాశ్వతంగా ఉండిపోతుంటుంది. వీటి వల్ల రకరకాల ఇన్ఫెక్షన్లు వస్తాయి. ఆ సమయానికి నొప్పి, జ్వరం, మంట అనిపించకపోవచ్చు. కాని కాళ్లు, చేతుల అశుభ్రత మధుమేహానికి ప్రధాన కారణం. అందుకని ఒక టబ్‌లో కొద్దిగా యాంటిసెప్టిక్ లోషన్ కలిపిన నీటిలో ఉదయం, సాయంత్రం పాదాలు పది, పదిహేను నిమిషాలు ఉంచి, శుభ్రపరిచి, ఆ తర్వాత తేమ లేకుండా తుడుచుకోవాలి. కాటన్ సాక్స్ వాడుతూ, చెమట పట్టకుండా చూసుకుంటే ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. అలాగే ముక్కు, చెవులు, గొంతుకు సంబంధించిన ఇన్ఫెక్షన్లు వచ్చినప్పుడు తగిన యాంటీబయాటిక్స్ వాడాలి. కొందరికి తలపై మాడు నుంచి చుండ్రు రాలుతుంటుంది. దీనికీ తగిన మందులు వాడాలి.

మరిన్ని జాగ్రత్తలు: ఒత్తిడి తగ్గడానికి హార్ట్‌రేట్‌ను పెంచే ఫోన్, టీవీ.. వంటివి అతిగా వాడకూడదు.
లేట్‌గా నిద్రపోవడాలు, లేట్‌గా లేవడాలు చేయకూడదు. నిద్రకు కచ్చితమైన సమయం పాటించినవారిలో మధుమేహం నియంత్రణలో ఉంటుంది.
వేళకు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, రెగ్యులర్‌గా డాక్టర్‌చే చెకప్స్‌చేయిస్తూ, వారి సూచనలు పాటిస్తుంటే మధుమేహాన్ని పూర్తిగా అదుపులో ఉంచుకోవచ్చు.

ప్రొ॥ పి.వి.రావు
ఎండోక్రైనాలజిస్ట్,
నిమ్స్, హైదరాబాద్

Monday, October 4, 2010

డయాబెటిస్, అధిక రక్తపోటు నియంత్రణలో మాత్రల కంటే బీన్స్ బెటర్ .......

మీరు డయాబెటిస్, అధిక రక్తపోటుతో బాధపడుతున్నారా? వాటి నియంత్రణకు రోజూ మాత్రలు వేసుకుంటున్నారా? అయితే మీకు ఈ విషయం తెలియదన్నమాట. డయాబెటిస్‌ను, రక్తపోటును నియంత్రణలో ఉంచడంలో మాత్రల కంటే బీన్స్ నయమని వెల్లడయింది..

రోజూ బీన్స్ తీసుకోవడం వల్ల డయాబెటిస్, అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటాయని పరిశోధనల్లో తేలింది. పన్నెండు వారాల పాటు ఆరకప్పు ఉడికించిన బీన్స్ తీసుకున్న ఆరోగ్యవంతుల కొలెస్టరాల్ సైతం 8శాతం మేర తగ్గింది. ఫాస్టింగ్ గ్లూకోజ్ లెవెల్స్, ఇన్సులిన్ లెవెల్స్, ఎ1సి లెవెల్స్ పై బీన్స్ ప్రభావం చాలా ఉంటోంది.

బ్లడ్ షుగర్‌ను నియంత్రించడంలో వీటి పాత్ర చాలా ఎక్కువ. అంతేకాకుండా బీన్స్‌లో సాల్యుబుల్ ఫైబర్ పాళ్లు చాలా ఎక్కువ. కాబట్టి మీ మెనూలో బీన్స్ ఉండేలా చూసుకుని డయాబెటిస్‌కు, అధికరక్తపోటుకు చెక్‌పెట్టండి.

Thursday, September 9, 2010

బరువు తగ్గాలంటే

అందమైన, నాజూకైన శరీరాకృతి ప్రతి ఒక్క ఆడపిల్ల కోరుకుంటుంది. కోరిక ఉన్నంతమాత్రాన సరిపోదు. దానికీ కొన్ని పద్ధతులున్నాయి.. తేలికగా బరువు తగ్గాలనుకునే వారి కోసమే ఈ చిట్కాలు.


Slimబరువు తగ్గాలనుకునేవారికి సూర్య నమస్కారాలు చాలా చక్కని వ్యాయామం. సూర్య నమస్కారాల ద్వారా అనుకున్న సమయంలో అనుకున్నంత బరువు తగ్గవచ్చని నిపుణులు అంటున్నారు. పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయిన వారికి అబ్డామినల్‌ ఎక్సర్‌ సైజులు బాగా ఉపకరిస్తాయి. నిటారుగా నిల్చుని, మోకాళ్లు ఏ మాత్రం వంగకూడదు ఈ విధంగా ప్రతి రోజూ కనీసం పావుగంట అయినా చేసినట్లయితే పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును నెమ్మదిగా కరిగించవచ్చు.

నాట్యం క్యాలరీలను కరిగిస్తుది. ఇంట్లోనే టేప్‌ రికార్డర్‌ లేదా, డివిడిలు పెట్టుకుని ప్రతిరోజూ కనీసం 20 నిమిషాలు డ్యాన్స్‌ చేసినట్లయితే తక్కువ సమయంలో ఎక్కువ ఫలితాన్ని పొందవచ్చని నిపుణులు సూచి స్తున్నారు. అదే విధంగా ప్రతి రోజూ కొంత సేపు సైకిల్‌ తొక్కడం ద్వారా కూడా అధిక బరువును అదుపులో ఉంచుకోవచ్చని వారు అంటున్నారు.

నడక చాలా మంచిదని అందరికీ తెలిసిన విషయమే. అయినా భోజనం చేసిన వెంటనే బ్రిస్క్‌ వాక్‌ చేయకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భోజనం చేసిన వెంటనే బ్రిస్క్‌ వాకింగ్‌ చేయడం వలన గుండె మీద తీవ్ర ప్రభావం చూపుతుందని వారు అంటున్నారు. బ్రిస్క్‌ వాకింగ్‌ చేసేవారు భోజనానికి కనీసం అరగంట ముందే దాన్ని పూర్తి చేయాలని వారు సూచిస్తున్నారు. బరువు తగ్గాలనుకునే వారికి కూరగాయలు మంచి ఛాయిస్‌. మాంసాహారం జోలికి పోకుండా కూరగాయలు తీసుకుంటే తక్కువ సమయంలో ఎక్కువ లాభాన్ని పొందవచ్చు. నీరు తాగడం మంచిదే అయినా భోజనానికి ముందు లేదా, తరువాత మాత్రమే తాగాలి. రోజుకి కనీసం ఎనిమిది గ్లాసుల నీరు తాగడం తప్పనిసరి.

articleషుగర్‌ పేషెంట్లు మాత్రం వ్యాయామం చేసే సమయాన్ని ఎప్పుడు చేయాలి? అన్న విషయాలను నిపుణులను అడిగి వారి సలహా ప్రకారం చేయాలి. 40 సంవత్సరాలు దాటిన మహిళలు వ్యాయామం జోలికి పోకుండా యోగా ప్రాక్టీస్‌ చేస్తే మంచి ఫలితాన్ని పొందవచ్చు. మధ్యాహ్నం, రాత్రి భోజనం అయిన తరువాత గ్లాసు గోరువెచ్చని నీటిని తాగినట్లతే శరీరంలో పేరుకుపోయిన కొవ్వును క్రమేపీ కరిగించుకోవచ్చు. బరువు తగ్గాలనుకునేవారు ఉలవలను పప్పు లేదా చారు రూపంలో వారంలో కనీసం రెండు సార్లు తీసుకుంటే మంచి ఫలితాన్ని పొందవచ్చు. తక్కువ సమయంలో సన్నగా, నాజూకుగా తయారుకావాలనుకునే వారు బ్లాక్‌ కాఫీ తాగితే మంచిదని నిపుణులు అంటున్నారు.

Saturday, September 4, 2010

‘బ్రౌన్ రైస్’... మీ ఛాయస్

‘వైట్ రైస్’ తినడంకంటే.. బ్రౌన్ రైస్ ఆరోగ్యానికి మంచిదట. ఓ స్టడీ ప్రకారం బ్రౌన్ రైస్ శరీరంలో షుగర్ తగ్గిస్తుంది.
బ్రౌన్ రైస్ అంటే ఏదో కాదు.. దంపుడు బియ్యమే.. రంగు గోధుమ వర్ణం ఉండటంవల్ల ‘బ్రౌన్ రైస్’ అంటారు.
రెండు లక్షల మంది అమెరికా వైద్యులు, నర్సులు 2 సంవత్సరాల పాటు ఈ బ్రౌన్ రైస్ ఆరగించి ‘బ్రేవ్’మని తేన్చి.. మా ఆరోగ్యాలన్నీ సలక్షణంగా ఉన్నాయ్... మీరు తినండి అని సైన్స్ జర్నల్స్‌లో రాసి మరీ క్లాస్ తీసుకుంటున్నారు.

‘వైట్ రైస్’ వారానికి ఐదుసార్లన్నా తినేవారిలో 17 శాతం షుగర్ వస్తుందట. అల్సర్స్ తగ్గిపోతాయి.
విటమిన్ బి కాంప్లెక్సు ఎక్కువ. థైమిన్, రైబోప్లేవిన్, సయనకోబాలమిన్ అనే విటమిన్లు వుంటాయి. ఇవి నరాల శక్తి పెరుగుదలనిస్తాయి. మలబద్ధకాన్ని తగ్గిస్తాయి.

బ్రౌన్ రైస్.. గ్రీన్ చట్నీ.. రెయిన్ బో కర్రీస్. వైట్ కర్డ్.. మీ ఆహారమిక కలర్‌ఫుల్.. ఆరోగ్యం ఫుల్..

-డా. కె.సంధ్యారాణి

Thursday, September 2, 2010

రుచి - ఆరోగ్యం

కేవలం మార్పు అనేది ఏ ఒక్క విషయానికో పరిమితం కాదు. ప్రతి నిమిషం.. ప్రతి క్షణం కూడా మారిపోతూనే వుంటాయి. ఇందులో కొన్ని మార్పులు మంచి పరిణామాలకు దారితీస్తే మరికొన్ని చెడు ప్రభావాలను చూపిస్తాయి. ఆహార విషయం కూడా అంతే. సమయాల్లో తేడాలు.. తినేతిండిలో మార్పులు.. రోజు రోజుకూ పెరిగిపోతున్న పాశ్చాత్య సంస్కృతి.. అనుకరించే విధానాలు అన్నీ ఆరోగ్యంపై చెడు ప్రభావాలకు దారి తీస్తున్నాయి. అనారోగ్యాల పాలు చేస్తున్నాయి. అప్పటికప్పుడు అది బాగానే వున్నా సమయం గడిచేకొద్దీ అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.


cup 
బయట దొరికే ఆహారం తక్కువ ధరతో...  చాలా సులువుగా లభిస్తుంది. ఇంట్లో కష్టపడి చేసుకునే వాటికన్నా వీటికి రుచి కాస్త ఎక్కువగానే అనిపిస్తుంది. బయట దొరికే ఆహారంలో ఫాస్ట్‌ఫుడ్స్‌ కాస్త ఎక్కువే ప్రాధాన్యతనే సంపాదించుకున్నాయి. ఈ ఫాస్ట్‌ ఫుడ్స్‌లో చాలా వరకు ఎక్కువగా ఫ్రై రూపంలోనే ఇష్టపడతారు. వీటిని రుచి కోసం కానివ్వండి.. లేదా ఇంకేదైనా సరే.. ఎక్కువగా వేయిస్తారు. ఇలా చేసే వాటిలో పైబర్‌ చాలా తక్కు వగా వుంటుంది. కాలరీస్‌ శాతం చాలా ఎక్కువగా వుంటుంది. అన్ని సందర్భాల్లోనూ ఇదే నిజం కాకపోవచ్చు. కొన్నిటి వల్ల శరీరానికి కావలసిన పోషకాలు కూడా దొరక వచ్చు. కానీ చాలా వరకు వీటి వల్ల నష్టమే ఎక్కువగా వుంటోంది.

ఎంత వరకు...
ఫాస్ట్‌ ఫుడ్‌ తీసుకోవడంలోనూ కొన్ని పరిధులు వుంటాయి. శరీరానికి శక్తిని ఇవ్వడానికి మాత్రమే ఆహారం ఒక మార్గంగా చూడాలి. ఆకలి లేకున్నా దొరికినది తినడం సరికాదు. దీని వల్ల అదనపు కేలరీస్‌ ఒంట్లో చేరి ఒబెసిటీకి దారితీయవచ్చు. స్నాక్స్‌ తీసుకునే సమయంలోనూ ఎంత తీసుకుంటున్నాం అన్నది మననంలో వుండాలి. అన్నిటినీ సమం చేసుకోవాలి. ఆరోగ్య నియమాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. స్నాక్స్‌ శరీరానికి కేవలం బలాన్ని ఇచ్చేవిగా వుండేలా ఎంచుకోవాలి.

అనారోగ్య సమస్యలు..
brad 
డయాబెటీస్‌తో బాధపడేవారు స్నాక్స్‌, ఫాస్ట్‌ ఫుడ్‌ పదార్థాలు తీసుకునే సమయంలో కాస్త ఆలోచించుకోవాలి. ముఖ్యంగా ఇన్సులిన్‌ తీసుకునే వారు మరింత జాగ్రత్తలు పాటించాలి. పైబర్‌ శాతం అధికంగా వుండి, ఫ్యాట్‌ తక్కువగా వుండే పదార్థాలను ఎంచుకోవాలి. కాంప్లెక్స్‌ కార్పొహైడ్రేట్స్‌ ఎక్కువగా వుండే ఓట్స్‌, కూరగాయలు ఎక్కువగా వుండేది కూడా ఫాస్ట్‌ ఫుడ్‌ల రూపంలో దొరుకుతున్నాయి. వాటిని కొంత వరకు తీసుకున్నా నష్టం ఏమీ వుండదు. దీనికితోడు పండ్లు కూడా ఆహారంలో చేర్చుకుంటే శరీరంలో రక్త క్రియలు అన్నీ అదుపులో వుండేలా అవి చేస్తాయి.

ఏం చేయాలి..
ఆకలి లేకుండా తినడం మాత్రం మార్చుకోవాలి. కొన్ని పదార్థాలు రుచి పరంగా ఎంత తిన్నా ఇంకా తినే విధం గా వుంటాయి. ఉదాహరణకు చిప్స్‌ వం టివి. వీటిని తీసుకునేప్పుడు ముందుగా ఎంపికలోనే మార్పుచేసుకోవాలి. ఇప్పుడు అనేక రకాల స్నాక్స్‌ మంచి చేసే విధంగా కూడా తయారవుతున్నాయి. కాస్త ధర ఎక్కువ అయినా అవి ఎంతో మేలు చేస్తాయి. కాబట్టి ఇటువంటి పదార్థాలను ఎంపిక చేసుకోవడం మంచిది. టివీ చూస్తూ, లేదా కబుర్లు చెప్పుకుంటూ తినేప్పుడు కాస్త జాగ్రత్త లు తీసుకోవాలి. లేకపోతే ఎక్కువగా తినే అవకాశం వుంటుంది.

Thursday, July 8, 2010

వ్యాయామంతో ఆరోగ్యం

ప్రతి రోజూ ఓ గంట లేదా అరగంట పాటు సేపు చేసే వ్యాయామం ఎన్నో రోగాలను దరి చేయనీయకుండా కాపాడుతుంది. చిన్న చిన్న వ్యాధుల నుండి, అసాధారణ వ్యాధుల వరకూ వ్యాయామం చేసే వారి దగ్గరకు రావా లంటే కాస్త జంకుతాయి. ఎందుకంటే వ్యాయామంతో శరీరంలోని ప్రతి అవ యవానికి ఎంతో లాభం చేకూరుతుంది. అది రోగాలను దూరంగా వుంచడంలో సాయపడుతుంది. వ్యాయామం వల్ల శరీరంలోని ఏ ఏ భాగానికి ఏవిధంగా మేలు జరుగుతుందో తెలుసుకుందాం.

గుండె :
yoga క్రమం తప్పకుండా చేసే వ్యాయామం హై బ్లడ్‌ ప్రెషర్‌ రాకుండా నిరో దిస్తుంది. లోబీపీ ఉన్న వారు దాన్ని సాధారణ స్థాయికి తెచ్చుకునేందుకు డాక్టర్‌ సలహా మేరకు వ్యాయామాన్ని ఆశ్రయించవచ్చు. అధి శాతం హై కొలెస్ట్రాల్‌ లెవల్స్‌ హృద్రోగాలకు, హార్ట్‌ ఎటాక్‌లకు మూలకారణంగా నిలు స్తాయి. క్రమం తప్పని వ్యాయామం ద్వారా వీటికి దూరంగా వుండొచ్చు. వ్యాయామం చేసే వారితో పోలిస్తే వ్యాయామం చేయని వారిలోనే గుండె సంబంధిత వ్యాధులకు ఎక్కువగా అవకాశం వుంటుంది.

ఎముకలకు బలం : వయస్సు పెరుగుతున్న కొద్దీ ఎముకలు బలహీనమ వుతాయి. ముఖ్యంగా మహిళల్లో మోనోపాజ్‌ దశ అనంతరం ఈ పరిణామం చోటు చేసుకుంటుంది. ఇతరత్రా కూడా శరీరం బలహీనం కావడం వంటి కారణాల వల్ల కింద పడి ఎముకలు విరగొట్టుకునే అవకాశం వుంటుంది. వ్యాయామం చేసే వారితో పోలిస్తే, వ్యాయామం చేయని వారిలోనే ఈ రక మైన ప్రమాదాలకు ఎక్కువగా అవకాశం ఉంది. క్రమం తప్పకుండా వ్యాయా మం చేయడం కండర పటుత్వాన్ని పెంచడమే కాకుండా ఎముకలు కాల్షి యాన్ని నిలిపి వుంచుకునేలా చేస్తుంది. శరీరం శక్తిని కోల్పోకుండా చూస్తుం ది. తద్వారా సాధారణ ప్రమాదాల బారిన పడే అవకాశాన్ని ఒక వేళ ప్రమాదా లకు గురైనా వాటి తీవ్రతనూ తగ్గిస్తుంది.

మధుమేహం :
మధుమేహంతో బాధపడేవారికి ఇచ్చే చికిత్స ఫలితం రోగుల స్థూల కాయం తదితర అంశాల కారణంగా ప్రభావితం అవుతుంది. ఈ నేప థ్యంలో చికిత్స తీసుకునే వారు బరువు తగ్గితే చికిత్స ప్రభావ పూరితంగా ఉండేందుకు తోడ్పడుతుంది. మైల్డ్‌ డయాబెటిస్‌ను మందు ద్వారా కన్నా కూడా ఆహారం, వ్యాయామం ద్వారా నియంత్రించుకోవడం సులభం.

క్యాన్సర్‌ :
శారీరకంగా చురుగ్గా ఉండని వారిలో పెద్దపేగు సంబంధిత క్యాన్సర్‌ వచ్చే అవకాశం అధికంగా వుంటుందని అధ్యయనాల్లో వెల్లడైంది. బ్రెస్ట్‌ క్యాన్సర్‌, లైంగిక అవయవాల సంబంధిత క్యాన్సర్లు క్రీడాకారిణులకు రావడం తక్కువే.