Sunday, December 19, 2010

డాన్స్‌ థెరపీ

tatjana
అనాదిగా వివిధ సంస్కృతుల్లో కథలు, వివిధ భావోద్రేకాలను ప్రదర్శించడానికి నాట్యం మాధ్యమంగా ఉంటూవస్తోంది. ఈనాడు ఈ సంస్కారవంతమైన కదలికల్ని చికిత్సగా కూడా వినియోగిస్తున్నారు. ఆందో ళన, కీళ్ళనొప్పులు, డిస్లెక్సియా వంటి రుగ్మత లను నయం చేయడానికి వివిధ నాట్య రూపా లను ఉపయోగిస్తున్నారు. ఏకాగ్రతను రెట్టిం చడానికి నాట్యం గొప్ప సాధనంగా రుజువ య్యింది. పార్కిన్సన్‌ వ్యాధిని ఎదుర్కోవడానికి కూడా దోహద పడుతుంది. నాట్య కదలికల చికిత్సకు (డాన్స్‌ మూవ్‌మెంట్‌ థెరపీ) గ్రూప్‌సెషన్లు, భారతీయ శాస్ర్తీయ, ఆధునిక, సమకాలిక నాట్య రూపాలను వినియోగిస్తున్నారు. వివిధ వ్యాధులను నయం చేయడానికి అన్ని వయసుల వారికి ఈ చికిత్స ఉపయోగపడు తోంది. డ్యాన్స్‌ థెరపీ వల్ల అనేక లాభాలు ఉన్నాయి. దీనిని ఎన్నో సంఘటనలు రుజువు చేస్తున్నాయి. ఇటీవలే ఓ ప్రమాదానికి లోనైన మితాలీ మోహన్‌ గురించి తెలుసు కుందాం... ఆమె చేయించు కునే ఫిజియోథెరపీలో భాగంగా డ్యాన్స్‌ థెరపీలో కూడా చేరమని చెప్పారు డాక్టర్లు. నాట్యం చేస్తున్న కాస్సేపూ మనం మన చింతల్ని మరిచిపోతాం. ఈ కళలో మనసు, శరీరం రెండిటికీ పని చెప్పాల్సివుంటుంది. మనం ఒక విధమైన తన్మయత్వంలోకి జారుకుంటాం. కథక్‌ నాట్యం నేర్పే పంతులమ్మ విజయశ్రీ చౌదరి ఈ అభిప్రా యంతో పూర్తిగా ఏకీభవిస్తోంది.


dance_therapy1 ఆటగా అనిపించినప్పటికీ నాట్యం ధ్యానంలో ఉచ్చస్థాయిని చేరుకోవడానికి సహాయపడు తుందని ఆమె అంటున్నారు. నృత్యం మంచి వ్యాయామం అంటున్నారామె. ఏ నృత్యం సౌకర్యవంతంగా ఉంటే ఆ నాట్యరూపాన్ని డ్యాన్స్‌ థెరపీకి వినియోగించవచ్చు. సమ కాలీన నాట్య భంగిమల్లో కొన్ని ఏకాగ్రత పెంచడానికి ఎక్కువ అల్లరిచేసే పిల్లలకు, డిస్లెక్సియాతో బాధపడుతున్న పిల్లలకు ఉపయోగపడతాయని సమకాలీన నాట్య శిక్షకుడు హృషికేష్‌ పవార్‌ అంటున్నారు. పార్కిన్‌సన్‌ వ్యాధితో బాధపడు తున్న రోండా చాకో డ్యాన్స్‌ థెరపీ అధ్భుతమైన ఫలితాలివ్వడంతో చాలా సంతోషంగా వున్నారు. అత్యంత సులువైన పని కూడా పార్కిన్సన్‌ వల్ల దెబ్బతింటుంది, ఆత్మవిశ్వాసం కోల్పోతాం, డ్యాన్స్‌ థెరపీ నాలాంటివారెందరో తమ దైనందిన రోజువారీ పనులు చేసుకోగలుగుతారు అంటున్నారు రోండా. ఆమె కదలికలు నిదానంగా ఉండ వచ్చు కానీ ఆత్మవిశ్వాసంతో పనిచేసుకుపో తున్నారు. సంతులనాన్ని, సరైన భంగిమ పొందడానికి భారతీయ శాస్ర్తీయ నాట్య రూపాలు సహాయపడతాయని ఇది మంచి చికిత్సా విధానమని ప్రముఖ ఎముకల డాక్ట రు డా.సత్యశీల్‌ నాయక్‌ అంటున్నారు. మరో ఎముకల డాక్టర్‌ సునీల్‌ కోరే కూడా ఈ అభిప్రా యంతో ఏకీభవిస్తున్నా రు.

ఎలాంటి కదలి కైనా శరీరానికి మంచిదని అనారోగ్యం చాలా వరకూ మానసికమైందని ఆయన అంటున్నారు. వారి ఉత్సాహాన్ని రేకెత్తించడానికి కూడా డ్యాన్స్‌ థెరపీ సహాయపడుతుంది. ఒక వ్యక్తి పాదాలు ఆడించడం కూడా ఓ విధమైన ఆక్యుప్రెషర్‌ థెరపీ అంటున్నారు చౌదరి. ఎంతో శక్తినిస్తుం ది మీరు గమనించినట్లయితే నర్తకీమణులు తమ వయసుకంటే చిన్నవారిగా కనిపిస్తారు. కనుక డ్యాన్స్‌ థెరపీ వల్ల శరీరానికి అనేక ఉపయోగాలు ఉన్నాయడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు.

భారత్‌- అమెరికాల్లో డ్యాన్స్‌ థెరపీ వైవిధ్యం...
dance_therapy భారతీయ, అమెరికా డ్యాన్స్‌ థెరపీల మధ్య చాలా తేడా ఉంది. అమెరికన్‌ డ్యాన్స్‌ థెరపీ అసోసి యేషన్‌లో వేయమంది సభ్యు లున్నారు. జైళ్ళలో, డి-ఎడిక్షన్‌ కేంద్రాల్లో, హాఫ్‌వేహోంలు (చికిత్సా కేంద్రాలు) ల్లో వీరు పనిచేస్తున్నారు. ఇండియాలో మనం ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాం. సుశిక్షితులైన థెరపిస్టులు స్వదేశానికి తిరిగివచ్చిన తర్వాత వారికి సరైన జీత భత్యాలు ఇవ్వడంలేదు. వారిసేవలకు సరైన గుర్తింపు రావడంలేదు. వారి సేవలెంతగానో అవసమైనప్పటికీ వారు మన వ్యవస్థతో నిరంతరం పోరాడుతున్నారు. బేజారై విదేశాలకు వెళ్ళిపోతున్నారు. అమెరికా లో వైద్యం దాదాపు ప్రైవేటు సైకోథెరపీ సెషన్‌లాగా జరుగుతుంది. సందర్శకులు కూడా ఒక దిక్కే కనిపించే అద్దం గుండా చూడవచ్చు. ఇండియాలో స్కూలుకు వచ్చే సందర్శకులు పార్కులోకి వచ్చినట్లు సరాసరి సెషన్‌లోకి నడిచివచ్చేస్తారు పైగా నాట్యం ఒక ప్రదర్శన కళ అన్న విషయం మన మెదళ్ళలో నాటుకుపోయింది. ఇండియాలో ఉన్న ఎన్నో శాస్ర్తీయ, జానపద నాట్య రూపాలు మన జనసముదాయంలో అంతర్భాగాలు.

Friday, December 17, 2010

వేధించే కాలినొప్పి... సయాటికా

సయాటికా.. ఈ సమస్య ఉన్న వారికి కండరాలు పట్టేసినట్లు ఉండటమే కాదు భరించలేని నొప్పి ఉంటుంది. దీనికి ఆధునిక వైద్య విధానంలో శస్త్రచికిత్స ఒకటే మార్గమని చెబుతారు. అయితే అది కూడా తాత్కాలిక ఉపశమనానికి మాత్రమే. కొంత కాలం తర్వాత ఈ నొప్పి మళ్లీ తిరగబెట్టే అవకాశం ఉంటుంది. కానీ ఆయుర్వేదంలో సయాటికాకు శాశ్వత పరిష్కారం ఉందంటున్నారు వైద్యులు.

శరీరంలో అతి పొడవైన నరం సయాటిక్. ఇది తొడల నుంచి మోకాళ్లు, పిక్కల ద్వారా అరికాళ్లు, కాలివేళ్ల దాకా వ్యాపించి ఉంటుంది. మన వెన్నులో ప్రతి రెండు వెన్నుపూసల మధ్య కొంత ఖాళీ ప్రదేశం, ఒక సయాటిక్ నరం, పూసలను బంధించి ఉంచే కొన్ని కండరాలు ఉంటాయి. మన దైనందిన పనుల్లోని కొన్ని లోపాల వల్ల కొందరిలో ఈ పూసలను బంధించి ఉంచే కండరాలు బలహీనమవుతాయి. ఫలితంగా పూసల మధ్య సహజంగా ఉండవలసిన ఖాళీ తగ్గిపోతుంది. దీనివల్ల పూసల మధ్య ఉండే సయాటికా
నరం ఒత్తిడికి లోనవుతుంది. దీనివల్ల ఆ నరం శరీరంలో ఎంత దూరం వెళితే అంత దూరం నొప్పి వస్తూనే ఉంటుంది. సయాటిక్ నరం ఒత్తిడికి గురి కావడం వల్ల వచ్చే సమస్య కావడం చేత దీనికి సయాటికా అన్న పేరు స్థిరపడింది. సయాటికాకు ఆయుర్వేద పరిభాషలో గృద్రసి వాతం అని పేరు.

లక్షణాలు
సయాటికా సమస్య ప్రారంభం కాగానే కనిపించే లక్షణం నొప్పి. ఆ తరువాత కొంత అసౌకర్యంగా ఉండటం, ఆ భాగంలో ఏదో కదిలినట్టు, చీమలు పాకినట్లు, పొడిచినట్లు అనిపిస్తుంది. తరువాత ఆ భాగమంతా మొద్దుబారినట్లుగా తయారవుతుంది. వంగడం క ష్టమవుతుంది. ఒకవేళ వంగినా మళ్లీ లేవబోతే చురుకుపెట్టినట్లు అవుతుంది.ఈ లక్షణాలు తొంటి నుంచి కాలి వేళ్ల దాకా ఎక్కడైనా కనిపించవచ్చు. ఈ సమస్య నాలుగు దశల్లో ఉంటుంది. మొదటి దశలో నడుము భాగంలో కండరాలు పట్టేసినట్లు అనిపిస్తుంది. రెండవ దశలో ఈ నొప్పి నడుము నుంచి పిరుదుల దాకా వెళుతుంది. ఈ దశలో కాస్త తైలమర్ధనం చేసుకున్నా నొప్పి తగ్గుతుంది. మూడవ దశలో నొప్పితో కాలంతా లాగుతున్నట్లు అనిపిస్తుంది. అలాగే పొడిచినట్లు, మొద్దుబారినట్లు కూడా అనిపిస్తుంది. నాలుగవ దశలో నొప్పి కాలంతా పాకడమే కాకుండా కదల్లేని పరిస్థితి ఏర్పడుతుంది.

పడుకుని మరో పక్కకు తిరగబోతే బలంగా చురుకు పెట్టినట్లు అవుతుంది. వంగినా లేచినా ఇదే పరిస్థితి ఉంటుంది. సయాటికా సమస్య ఉన్న వివాహితుల్లో చాలా మందిలో అంగస్తంభన లోపాలు, శీఘ్రస్కలన సమస్యలు ఉంటాయి. సయాటికా సమస్యతో వచ్చిన వారికి ఈ సమస్య కూడా ఉంటే రెండింటికీ ఏకకాలంలో చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. ఎక్కువ కాలం ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే నపుంసకత్వానికి కూడా దారి తీయవచ్చు. సమస్య మరీ తీవ్రమైతే కొందరిలో రెండు కాళ్లూ చచ్చుబడిపోవచ్చు. ప్రమాదాల్లో కూడా కొందరిలో ఈ పరిణామాలు చోటుచేసుకుంటాయి. సమస్య మొదలైన మూడుమాసాల్లోపే వస్తే ఇది సులభంగా తగ్గిపోతుంది. కనీసం ఏడాదిలోపు తీసుకున్నా మంచి ఫలితాలే ఉంటాయి. మూడేళ్లు దాటాక చికిత్స తీసుకుంటే సమస్య పూర్తిస్థాయిలో తగ్గదు.

కారణాలు

సయాటికా రావడానికి అస్తవ్యస్తమైన జీవన శైలి ప్రధాన కారణం. ఆధునిక జీవన విధానానికి అలవాటు పడిన వారిలో కండరాలకు ఎక్కువగా శ్రమ ఉండదు. అరుదుగా ఎప్పుడైనా కాస్త ఎక్కువ బరువు ఎత్తడం, ఎక్కువ గంటలు నిలుచోవడం లేక కూర్చునే భంగిమలో తేడా వల్ల వెన్నుపాము అపక్రమానికి లోనయితే ఈ సమస్య తలెత్తుతుంది. రోజంతా కూర్చుని లేదా నిలుచుని ఉండే ఉద్యోగ, వ్యాపారాలు చేసే వారు, మరీ ఎత్తయిన హీల్స్ ధరించేవారు, బెల్ట్‌ను మరీ బిగుతుగా పెట్టుకునే వారు, వెయిట్ లిఫ్టింగ్ చేసేవారు, ఏదైనా ప్రమాదానికి గురయిన వారు సయాటికా సమస్యకు గురికావచ్చు.

అలాగే దీర్ఘకాలికంగా మధుమేహం, క్షయ, లైంగిక వ్యాధుల కారణంగా వ్యాధి నిరోధక శక్తి కోల్పోయినపుడు కూడా ఈ సమస్య తలెత్తే అవకాశం ఉంది. ఇవే కాకుండా బాల్యంలో తగిలిన దెబ్బల తాలూకు దుష్ప్రభావం శరీరంలో ఉండిపోతుంది. అది పెద్దయ్యాక ఎప్పుడో శరీరం బలహీనపడినప్పుడు సయాటికాగా బయటపడవచ్చు. ముఖ్యంగా రోజూ చేసే పనుల వల్ల కాకుండా హఠాత్తుగా ఏదైనా బరువైన పనిచేసినప్పుడు ఈ సమస్య రావచ్చు. ఇక స్త్రీలలో అయితే, గర్భంతో ఉన్నప్పుడు గానీ, ప్రసవ సమయంలో గానీ నడుము మీద పడే ఒత్తిడి వల్ల కూడా ఈ సమస్య రావచ్చు. కొంతమంది స్త్రీలలో రుతుక్రమం ఆగిపోయిన తరువాత కాల్షియం లోపాల వల్ల సయాటికా సమస్య రావచ్చు.

వైద్య చికిత్సలు

ఈ సమస్య నాలుగు దశల్లో ఉంటుంది. వీటిని డిస్కు బల్జ్, స్లిప్ డిస్క్, హెర్నియేటెడ్ డిస్క్, సీక్వెస్ట్రమ్ డిస్క్ అంటారు. మొదటి మూడు దశల్లో సమస్యను ఆయుర్వేద మందులతోనే పూర్తిగా తగ్గించవచ్చు. చికిత్సల తరువాత ఎంఆర్ఐ రిపోర్టు చూస్తే ఆ తేడా స్పష్టంగా కనిపిస్తుంది. చివరి దశ అయినటువంటి సీక్వెస్ట్రమ్‌లో మాత్రం శస్త్రచికిత్స అవసరమవుతుంది. సయాటికాకు ఆయుర్వేద వైద్యవిధానంలో పంచకర్మ చికిత్సలో భాగమైన మేరు చికిత్స బాగా పనిచేస్తుంది. ఆయుర్వేద మందులతో పాటు ఆహార నియమాలను పాటిస్తే ఫలితం బాగుంటుంది.

Wednesday, December 15, 2010

వివిధ రకాలుగా ఊపిరితిత్తుల వ్యాధులు

వాతావరణంలో ఉండే కాలుష్య పదార్థాలు మన శరీరంలోని వివిధ అవయవాలపై దుష్ర్పభావాలు చూపిస్తుంటాయి. చర్మం, కళ్లపైనే కాకుండా, ఊపిరితిత్తులపైన కూడా ఈ ప్రభావాలు ఉంటాయి. శ్వాస తీసుకున్నప్పుడు గాలిలో సూక్ష్మంగా ఉండే పదార్థాలు ఊపిరితిత్తులో చేరుతాయి. వీటిలో ఎక్కువ భాగం శ్వాస నాళాలలోని ద్రవ పదర్థాలలో చేరి కఫం ద్వారా బైటికి నెట్టివేయబడతాయి. వ్యాధి నిరోధక శక్తి కలిగించే ఐజి-ఎ యాంటిబాడీస్‌ శ్వాస నాళాలలో చేరే క్రిముల నుండి దేహాన్ని రక్షిస్తాయి. తెల్ల రక్తకణాలు కూడా దీనికి దోహదపడతాయి.

kidnyగాలిలో సూక్ష్మంగా ఉండే బ్యాక్టీరియా, వైరస్‌లతో పాటు ఫంగస్‌, దుమ్ము, ధూళి, పుప్పొడి లాంటి పదార్థాలు ఉంటాయి. వీటికి తోడు పరిశ్రమలు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో వివిధ రసాయన పదార్థాలు సల్ఫర్‌డై ఆకై్సడ్‌, హైడ్రోజన్‌ సలె్పైడ్‌, క్లోరిన్‌, నైట్రికి ఆకై్సడ్‌ తదితరాలు ఉంటాయి. ఇలాంటి రసాయన పదార్థాలు పీల్చినప్పుడు దగ్గు, కఫం, పిల్లికూతలు, ఛాతీ పట్టేయడం జరుగుతుంది. కొందరిలో కెమికల్‌ నీమోనైటిస్‌ అనే సమస్య వస్తుంది. కొందరిలో వాతావరణ మార్పులు జరుగుతు న్నప్పుడు వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు వస్తుంటాయి.

వీరిలో జలుబు, జ్వరం, ఒళ్లునొప్పులు, ఆకలి మందగించడం, తలపోటు వంటి లక్షణా లు ఉంటాయి.ఇలా సంవత్సరంలో రెండు,మూడు సార్లు వైరస్‌ ఇన్‌ఫెక్షన్లు రావచ్చు. రెస్పిరేటరీ సిన్నసషియల్‌ వైరస్‌, రైనోవైరస్‌, ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌ దీనికి కారణం, వ్యాధి నిరోధక శక్తి మందగించినప్పుడు ఇలాంటి వారిలో న్యూమెనియా కూడా రావచ్చు. దీనికి కమ్యూనిటీ ఆకై్వర్డ్‌ న్యూమోనియా అంటారు. దగ్గినపుడు, తుమ్మినపుడు శ్వాసనాళాలో నుండి వెలువడే గాలి తుంపరల వల్ల ఒకరినుండి మరొకరికి జబ్బులు వస్తాయి. క్షయవ్యాధి ఉన్నవారు దగ్గినప్పుడు వారిలో ఉండే టి.బి. బ్యాక్టీరియా గాలి తుం పర్ల ద్వారా ఇతరుల ఊపిరితిత్తులలోకి చేరుకుంటాయి. ఇవి వ్యాధి నిరోధక శక్తి వలన నిస్తేజమవుతాయి. కాబట్టి కొద్దిమందిలో మాత్రమే వ్యాధి ప్రబలే అవకాశం ఉంది.

ఈ వ్యాధి ఇతరులకు రాకుండా ఉండాలంటే దగ్గినప్పుడు మొహానికి అడ్డంగా రుమాలు ఉంచుకోవడం ఎంతైనా అవసరం. కొంతమందిలో గాలిలో ఉండే ఫంగస్‌, ఆస్పర్జిల్లస్‌, కాండిడా, పెన్సిల్లియమ్‌లు ఊపిరితిత్తు లోకి చేరి న్యూమోనియా, ఉబ్బసం, ఎక్స్‌ట్రిన్సిక్‌ ఎలెర్జిక్‌ అల్వియోలైటిస్‌ అనే వ్యాధులు కలుగచేస్తాయి. సాధరాణంగా వాడే యాంటిబయోటిక్స్‌ వలన న్యూమోనియా తగ్గినప్పుడు ఫంగస్‌ న్యూమోనియా ఉందేమోననే అనుమానం కలుగుతుంది. క్యాన్సర్‌ వ్యాధి ఉన్న వారిలోనే కాకుండా క్యాన్సర్‌ మందులు వాడుతున్న వారిలో కూడా ఇలాంటివి కనిపిస్తుంటాయి.

ఇతర వ్యాధుల చికిత్స కోసం ఆసుపత్రులలో అత్యధిక కాలం ఉన్న వారిలో వచ్చే న్యూమోనియాను హాస్పిటల్‌ ఆకై్వర్డ్‌ న్యూమోనియా అంటారు. ఆసుపత్రి వాతావరణంలో ఉండే బ్యాక్టీరియా సాధారణ వాతావరణంలో ఉండే బ్యాక్టీరియా కంటే భిన్నంగా ఉంటుంది. వీటిలో కెల్సియెల్లా, సూడోమోనాస్‌లు ముఖ్యమైనవి. శక్తివంతమైన యాంటిబయోటిక్స్‌ వాడాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఒక్కొక్కసారి జ్వరం తగ్గకుండా ఉంటుంది. న్యూమోనియా శరీరమంతా పాకి సెప్టిసీమియా వస్తుంది. మామూలుగా కొన్ని సూక్ష్మక్రిములు ముక్కు, గొంతులో జబ్బేమీ కలుగజేయకుండా ఉంటాయి. మత్తు పదార్థాలు సేవించే వారిలో నోటిలోని లాలాజలం, ఆహారంతో పాటు ఇవి స్వరపేటికను దాటి శ్వాస నాళాలలోకి ప్రవేశిస్తాయి.వీటి వల్ల బ్రాంకటైటిస్‌, యాస్పిరేషన్‌ న్యూమోనియా వస్తుంది.

JAMA_LungHealthఊపిరితిత్తుల వ్యాధులు శ్వాస ద్వారానే కాకుండా ఇతర కారణాల వలన కూడా రావచ్చు. కాలేయంలో చీము గడ్డలు ఏర్పడినప్పుడు వాటిలో ఉండే బ్యాక్టీరియా, అమీబా వంటి సూక్ష్బజీవులు డయాఫ్రంను దాటి ఊపిరితిత్తులలోకి చేరుకుంటాయి. న్యూమోనియా, హెపాటిక్‌ పల్మొనరీ అమీబియాసి వీటితో కలిగే వ్యాధులు. ఛాతిలో నీరు, చీము కూడా వస్తుంటుంది.కడుపులో నీరు, చీము ఇదే విధంగా డయాఫ్రంలో ఉండే చిన్న చిన్న రంధ్రాల ద్వారా ముఖ్యంగా కుడివైపున ఉన్న ఫ్లూరల్‌ కేవిటీలోకి చేరి ఫ్లూరల్‌ ఎఫ్యూజన్‌, ఎంపరుూమ వ్యాధులను కలుగజేస్తాయి.

మూత్రపిండాలు, గర్భాశయానికి చెందిన ఇన్‌ఫెక్షన్లు రక్తం ద్వారా శ్వాసకోశాలకు చేరి ఆక్యూట్‌రెస్పిరేటరీ డిస్ట్రెస్‌ సిండ్రోమ్‌ అనే వ్యాధిని కలుగచేస్తాయి. సాధారణంగా ఇటువంటి ఇన్‌ఫెక్షన్లు గ్రామ్‌ నెగటివ్‌ బ్యాక్టీరియా, స్టెఫలోకాకస్‌ బ్యాక్టీరియాలకు సంబంధించినవై ఉంటాయి.చర్మంలో గానీ, శరీరంలోని ఏ ఇతర అవయంలలో కానీ ఇన్‌ఫెక్షన్‌ వచ్చినా అది సెప్టిక్‌ పదార్థాలుగా మారి రక్తం ద్వారా శ్వాసకోశాలకు చేరుతుంది. ఊపిరితిత్తులు ఇలా రక్తం ద్వారా వచ్చే క్రిములను, సెప్టిక్‌ ఎంబాలైలను ఫిల్టర్‌ చేస్తుంది. కనుక ఈ సూక్ష్మక్రిములు ఊపిరితిత్తులలో పేరుకుపోయి లంగ్‌ ఇన్‌ఫెక్షన్‌ను కలుగచేస్తాయి. రుమాటిక్‌ హార్ట్‌ డిసీజ్‌ ఉన్న వారిలో గుండెలోని కుడిభాగం కవాటాలు ఇన్‌ఫెక్టై తద్వారా శ్వాసకోశాల్లోకి ఈ ఇన్‌ఫెక్షన్‌ పల్మొనరీ ఆర్డరీ ద్వారా వ్యాపిస్తుంది.

కాలుష్యంతో ఆరోగ్యానికి ముప్పు...
రోజురోజుకీ జనాభా పెరగిపోతోంది. పరిశ్రమలు, వాహనాలతో కాలుష్యం మరింత ఎక్కువవుతోంది.పెరుగుతున్న కాలుష్య ప్రభావం మనమీద ఎంతగానో ఉంటోంది. రకరకాల రోగాలు ప్రబలుతున్నాయి. మనలో పెరుగుతున్న దురలవాట్ల ప్రభావం కూడా దీనికి తోడవుతుంది. ధూమపానం చేసే వాళ్ల ముక్కు, గొంతులలలో దురద, ఇన్‌ఫెక్షన్స్‌, ఆస్త్మాలాంటి వ్యాధులు రావచ్చు. పొగత్రాగేవాళ్లలో కొందరికి క్యాన్సర్‌ రావచ్చు. చిన్నప్పటి నుంచి పొగత్రాగే వాళ్లలో పాదాలకు రక్తప్రసరణ తగ్గి బర్జర్స్‌ డిసీజ్‌ రావచ్చు. ఈ వ్యాధిలో క్రమంగా వేళ్లు, పాదాలలోని సన్నని రక్తనాళాలు దెబ్బతిని, రక్త ప్రసరణ లేక గాంగ్రీన్‌ వస్తుంది. క్రమంగా కాళ్లని తీసి వేయాల్సిన పరిస్థితిరావచ్చు.

గర్భిణీ స్ర్తీలు పొగత్రాగనే కూడదు. పక్కనుండే వాళ్లు పొగత్రాగినా వారి ప్రభావం వీళ్ల మీద పడుతుంది.దీని వల్ల పుట్టిన పిల్లలో బరువు తక్కువ ఉంటుంది. నెలలు నిండకుండానే డెలివరీ రావచ్చు. కారణం లేకుండా పిల్లలు చనిపోవచ్చు. పొగత్రాగడం వల్ల త్రాగేవారికి అనారోగ్యం కలుగుతుంది. అంతేకాదు, వీళ్లు విడిచే పొగని పీల్చే చుట్టు ప్రక్కల వాళ్ల ఆరోగ్యం పాడవుతుంది కూడా. వాతావరణంలోకి పొగని విడిచిపెట్టే వాహనాలకు, వీళ్లకు తేడా ఉండదు. ముఖ్యంగా చంటి పిల్లల ముందు సిగరెట్‌ లాంటివి కాల్చడం మరీ ప్రమాదకరం. ఇలాంటి కలుషిత గాలి పీల్చడం వల్ల చిన్న పిల్లల్లో న్యుమోనియా, దగ్గు, ఆయాసం, పిల్లి కూతలలాంటివి వస్తాయి.

మనం పీల్చే ఇన్‌హేలర్స్‌లో క్లోరోఫ్లోరో కార్బన్స్‌ ఎక్కువగా ఉంటాయి. ఇవి క్రమంగా వాతావరణంలోకి ప్రవేశించి రేడియేషన్‌ దుష్ర్పభావాన్నుంచి మనల్ని కాపాడుతున్న ఓజోన్‌ పొరని దెబ్బతీస్తాయి. ఒజోన్‌ పొర దెబ్బతింటే ఫిల్టర్‌ కాకుండా సరాసరి వచ్చే అట్ట్రావయోలెట్‌ కిరణాల వ్లస్కిన్‌ క్యాన్సర్స్‌, కెటరాక్ట్‌ లాంటి వ్యాధులు రావచ్చు. ఎసి. ఫ్రిజ్‌లోనూ ఈ క్లోరో ఫ్లోరో కార్బన్‌లుంటాయి. పరిశ్రమలు కూడా విపరీతంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఇవి వదిలే కాలుష్యాల వల్ల రకరకాల రోగాలొస్తున్నాయి. ఉదాహరణకి కాటన్‌ ఇండస్ట్రీలో పనిచేసే వాల్లకి బైసినోసిస్‌, షుగర్‌కేర్‌ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్లకి బాగాసోసిస్‌, యాస్బెస్టాస్‌ కంపెనీలో పనిచేసే వాళ్లకి యాస్టెస్టోసిస్‌ అనారోగ్యాలు కలుగుతాయి.

ఇలాంటి వృత్తుల్లో పనిచేఏ వాళ్లు ముక్కుకు మాస్క్‌ని ధరించడంతో పాటు మిగతా జాగ్రత్తలూ తీసుకోవాలి.జాగ్రత్తలు తీసుకుంటే ఆ వ్యక్తులకు కొంత మేలు జరుగవచ్చు. గానీ వాతావరణ కాలుష్యం పెరుగుతుంది కదా.గాలిలో కలిసి ఉండే దుమ్ము, ధూళీ, గ్యాస్‌ పార్టికల్స్‌ సూర్యకిరణాలలలో కలసి రసాయనిక సంయోగం చెంది ఫొటోకెమికల్‌ సొల్యూషన్‌ ఉత్పత్తి అవుతుంది. సల్ఫర్‌ డయాకై్సడ్‌, క్లోరిన్‌ లాంటి వాయువులు వాతావరణంలో కలిసిపోయి ప్రజల ఆరోగ్యానికి తూట్లు పొడుస్తున్నాయి.

మనం ఎలా శ్వాసిస్తున్నాం...
మనం మామూలుగా గాలిని ముక్కు ద్వారా పీల్చుకుంటాం. శ్వాసతోనే మనం జీవిస్తాం. వాతావరణంలో తక్కువ తేమతో ఉండే చలిగాలి సరాసరి శ్వాసనాళాలలోకి వెళ్లకుండా ముక్కు ద్వారా వెచ్చగా అయి నీటి ఆవిరిని కూడా కలుపుకొని శ్వాసనాళాల్లోకి వెళ్తుంది. ముక్కు నుంచి నేసోఫారింక్స్‌, లారింక్స్‌ ఆ తరువాత ట్రేకియాలోకి వెళ్తుంది. ట్రేకియా చివరి భాగంలో శ్వాసనాళం రెండుగా చీలి ఉంటుంది. వీటిని బ్రాంకై అంటారు. ఇవి విడివిడిగా ఒక్కొక్క ఊపిరితిత్తులోకి వెళ్తాయి. క్రమంగా ఈ నాళంరెండుగా చీలుతూ ఊపిరితిత్తులను ఆక్రమిస్తాయి. రెండు మి.మీ.ల కంటే సన్నగా ఉండే శ్వాసనాళాలను స్మాల్‌ ఎయిర్‌వేస్‌ అంటారు.

ఊపిరితిత్తులలో ఈ శ్వాసనాళాల చివరి భాగాలు టెర్మినల్‌ బ్రాంకియోల్‌, రెస్పిరేటరీ బ్రాంకియోల్‌, ఆల్వియోలార్‌ డక్ట్స్‌లోకి చేరి అంతమవుతాయి. ఊపిరితిత్తులు రెండూ గొంతు దిగువ భాగాన ఛాతీ కుహరంలో ఒకదాని పక్కన మరొటి ఉంటాయి. ఈ రెండింటి మధ్య భాగంలో ఉండే ఖాళీ స్థలాన్ని మీడియస్టినమ్‌ అంటారు.. మీడియాస్టినమ్‌ మధ్య భాగంంలో గుండె, దాని నుంచి వచ్చే రక్తనాళాలు ఉంటాయి. ఒక్కొక్క ఊపిరితిత్తిని ఒక్కొక్క పొర ఆవరించి ఉంటుంది. ఊపిరితిత్తికి అతుక్కొని ఉండే పొరను విస్రల్‌ఫ్లూరా అంటారు. దాని పైభాగంలో ఉండే పొరని పెరైటల్‌ప్లూరా అంటారు. ఈ రెండు పొరల మధ్య ఉండే స్థలాన్ని ప్లూరల కేవిటీ అంటారు.

దీనిలో రక్తం నుంచి వచ్చే సీరమ్‌ సుమారు ఐదు నంచి పది మిల్లీ లీటర్లు ఉంటుంది.ఈ పొరల మధ్య నీరు, గాలి, ఇన్‌ఫెక్షన్‌ చేరితే అనారోగ్యానికి గురువుతాం.ఊపిరితిత్తులు పిరమిడ్‌ల ఆకారంలో ఉంటాయి.చిన్న ిపిల్లలు ఊదుకునే బెలూన్స్‌లా ఇవి చాలా మెత్తటి అవయవాలు. బ్రౌనిష్‌ రెడ్‌ రంగులో ఉంటాయి. కుడివైపు ఉండే ఊపిరితిత్తిలో మూడు, ఎడమవైపు ఉండే ఊపిరితిత్తిలో రెండు లోబ్స్‌ ఉంటాయి. అయితే కుడివైపు ఊపిరితిత్తిలో మూడు భాగాలున్నా సైజులో మాత్రం చిన్నగా ఉంటుంది.ఎడమ ఊపిరితిత్తి పరిమాణం 55 శాతం ఉంటే కుడి ఊపిరితితి ్తపరిమాణం 45 శాతం ఉంటుంది.                                                
shyam-dundar

డా బి.శ్యామ్‌సుందర్‌ రాజు,
పల్మొనాలజిస్ట్‌.
ఫోన్‌ నెం. 93940 18040

Tuesday, December 14, 2010

మగాడు * లైంగిక సమస్య *

పద్ధెనిమిదేళ్ల తరుణ్‌కి మనసులో గూడుకట్టుకుపోతోంది దిగులు. చదువు సాగడం లేదు. తనకు అంగస్తంభనలోపం వచ్చిందేమో అని భయం. ఆ దిగులుతో లేకపోతే... ఆ బెంగ నుంచి బయటకు వస్తే... టాప్ ర్యాంకు ఖాయం. నలభై ఏళ్ల శ్రీనివాస్‌కు ఒకటే బెంగ. భార్యకు ముఖం చూపించుకోలేకపోతున్నాడు. కారణం... పార్ట్‌నర్ దగ్గర వైఫల్యం. అరవై ఐదేళ్ల వెంకటేశ్వరరావుకు తీవ్ర నిస్పృహ. షుగర్ ఉందని చెప్పినా కలగనంతటి నిరాశ.  అందరిసమస్య ఒక్కటే... అంగస్తంభనవైఫల్యం! అందరి కోరికా ఒక్కటే... ‘మగాడు’ అనిపించుకోవడం. భయాలు తొలగి ‘మగాడు’ కావడం ఎలాగో, అదెంత సులభమో చెప్పేదే... ఈ కథనం.

అంగస్తంభన లోపాలు అందరిలోనూ సహజంగా కనిపించే సమస్య. 90 శాతం కేసుల్లో ఎలాంటి మందులు వాడనక్కర్లేకుండా... ఎలాంటి చికిత్స లేకుండానే తగ్గే సమస్య ఇది.

పురుషాంగం... నిర్మాణం : పురుషాంగంలో చర్మం కింద ప్రధానంగా మూడు విభాగాలు ఉంటాయి. లోపల్నించి చూస్తే ఒకటి మూత్రం రావడానికి మూత్రాశయం నుంచి వచ్చే ట్యూబ్. దీన్ని యురెథ్రా అంటారు. స్ఖలనం సమయంలో వీర్యం కూడా ఇందులోంచే వస్తుంది. ఇది పురుషాంగం మధ్యలో ఉంటుంది. దీనికి అటూ, ఇటూ రెండు వైపులా రెండు భాగాలుంటాయి. ఈ రెండిటినీ ‘కార్పోరా కావర్నోజా’ అంటారు. ఈ రెండు విభాగాల్లోకి రక్తనాళాల ద్వారా రక్తం వేగంగా ప్రవహిస్తుంది. ఇలా ప్రవహించిన రక్తం వెనక్కిపోకుండా సిరలు మూసుకుపోయి, పురుషాంగం స్తంభిస్తుంది.

టెస్టోస్టెరాన్... అంగస్తంభన : పురుషాంగం స్తంభన కోసం ఉపయోగపడే ఒకే ఒక హార్మోన్ టెస్టోస్టెరాన్. ఈ హార్మోన్ ప్రభావం వల్ల అంగం పెరుగుతుంది. అయితే ఇది కేవలం పిల్లలు మొదలుకొని యుక్తవయసు వరకే జరిగే ప్రక్రియ. టెస్టోస్టెరాన్ ఇంజెక్షన్ కేవలం చిన్నపిల్లల్లో సర్జరీ సమయంలో లేదా యుక్తవయసు దాటినవాళ్లలో క్రీమ్ లేదా పేస్ట్ లేదా ఇంజెక్షన్ ద్వారా ఇచ్చి చికిత్స చేస్తారు. అయితే... టెస్టోస్టెరాన్ తగ్గినవాళ్లలో ఇది ఎంత మోతాదులో తగ్గిందో ముందుగా తెలుసుకుని నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణలో మాత్రమే దీన్ని ఇవ్వాలి. ఇక యుక్తవయసుకు వచ్చిన వాళ్లలో ఈ హార్మోన్ అంత తేలికగా తగ్గదు. ఇక వృద్ధాప్యంలో వేర్వేరు సమస్యల కోసం రోజుకు 5 నుంచి 10 మాత్రలు వేసుకునేవారి సంఖ్య బాగా పెరుగుతోంది. వీటి వల్ల కూడా అంగస్తంభన తగ్గవచ్చు.

వీళ్లు కూడా గుండె పనిచేసే విధానం బాగానే ఉంటే...సిల్డినాఫిల్, వర్డినాఫిల్, టెడలాఫిల్ మందులు వాడవచ్చు. కాకపోతే వాళ్లతో కార్డియాలజీ ఫిట్‌నెస్ పరీక్ష తప్పనిసరిగా అవసరం. గుండెనొప్పికి నైట్రేట్స్ మందులు వాడేవారు సిల్డినాఫిల్ మందును వాడకూడదు. ఇలా మందులు వాడకూడని వారిలో, పనిచేయని వారికి రెండో దశ చికిత్సగా ఇంజెక్షన్ ఇస్తారు. పెపావరిన్, ప్రోస్టాగ్లాండిన్ అనే ఇంజెక్షన్‌లను అంగంలోకి ఇచ్చినప్పుడు అంగస్తంభన జరుగుతుంది. ఇలా జరుగుతోందా లేదా అన్నది తెలుసుకోడానికి పైప్ టెస్ట్ చేస్తారు. అంటే రోగికి యూరాలజిస్ట్ ఈ ఇంజెక్షన్‌ను అంగానికి ఇచ్చి 15 నిమిషాల తర్వాత అంగస్తంభన ఏ మేరకు అయ్యింది, రక్తం ఎంత వేగంగా పంపవుతోంది అన్న విషయాలను డాప్లర్ అల్ట్రాసౌండ్ పెనిస్ అనే పరీక్ష ద్వారా కనుక్కుంటారు.

ఇంజెక్షన్స్ కూడా పనిచేయకపోతే కొన్ని రకాల సర్జరీలు చేయాల్సి ఉంటుంది. ఇవి రెండు రకాలు. మొదటిది అంగాన్ని ఎప్పుడూ స్టిఫ్‌గా ఉంచుతుంది. రెండోదాంట్లో అవసరమైనప్పుడే అంగస్తంభన వచ్చేలా చేస్తారు. అయితే అంగస్తంభన లోపం ఉన్న వారిలో మందులు, ఇంజెక్షన్లు, మరే ప్రక్రియలు పనిచేయనప్పుడు, చిట్టచివరి ఆప్షన్‌గా మాత్రమే ఈ సర్జరీలు చేస్తారని గుర్తుంచుకోవాలి.

పొడవుపై అపోహలివి...
చాలామంది పురుషాంగం సైజ్ గురించి బాధపడుతుంటారు. చలికాలంలో, అంగస్తంభన జరగని సమయంలో అది చాలా చిన్నగా ఉందంటూ బాధపడుతుంటారు. సాధారణంగా అబ్బాయి పుట్టినప్పటినుంచి 20 ఏళ్ల వయసు వచ్చేవరకు మాత్రమే పురుషాంగం పెరుగుతుంది. 18 ఏళ్ల వయసు వచ్చాక ఎత్తు పెరగడం ఆగినట్లుగానే పురుషాంగం పెరుగుదల కూడా ఒక స్థాయికి చేరుతుంది. చాలా అరుదుగా ఎవరిలోనైనా హార్మోన్లలోపం విపరీతంగా ఉంటే వాళ్లలో అంగం చిన్నదిగా ఉండవచ్చు. కానీ... ఇలాంటి పరిస్థితి చాలా చాలా అరుదు.

పురుషాంగం సాధారణ పరిమాణం
గడ్డాలు, మీసాలు సాధారణంగా ఉండి, సెక్స్ ఆలోచనలు వచ్చినప్పుడు అంగస్తంభన కలుగుతుంటే అంగం సైజ్ గురించి ఆందోళన అక్కర్లేదు. సాధారణంగా అంగం 7 సెంటీమీటర్ల నుంచి 11 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. అంగస్తంభన జరిగినప్పుడు ఇది 11 సెంటీమీటర్ల నుంచి 17 సెంటీమీటర్ల వరకు పెరుగుతుంది. కాబట్టి పురుషాంగం ఈ సైజ్‌లో ఉంటే ఇక నిడివి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అయితే చాలామంది ఈ సైజ్ ఉన్నా తమది చాలా చిన్నగా ఉందని బాధపడుతున్నారు. ఈ సైజ్ ఉన్నట్లయితే అది నార్మల్ సైజ్ అని గుర్తించాలి.

ఎక్సర్‌సైజ్‌లతో స్తంభన సాధించవచ్చా?
ఎక్సర్‌సైజ్‌లతో అంగం నిడివిని పెంచడం అసాధ్యం. చాలామంది జెల్‌కింగ్ అనే ఎక్సర్‌సైజ్ ద్వారా అంగం పొడవును పెంచడం సాధ్యమేనని చెబుతుంటారు. జెల్‌కింగ్ ఎక్సర్‌సైజ్‌లో అంగాన్ని పైకీ, కిందకీ సాగదీస్తూ, వేడినీళ్లలో ఉంచడం వల్ల అంగం పొడవవుతుందని చెబుతుంటారు. పురుషాంగం నిర్మాణం గురించి తెలుసుకుంటే అక్కడ కండరం ఏదీ ఉండదనీ, సాధారణ ఎక్సర్‌సైజ్‌లో కండరం పెరిగినట్లు లేదా గట్టిపడేట్లుగా ఇక్కడ సాధ్యం కాదని తెలుస్తుంది.

నరాలు పైకి తేలి ఉంటే...
చాలామంది అంగం మీద కనిపించే నరాల (రక్తనాళాల) గురించి ఆందోళన పడుతుంటారు. అంగస్తంభన కలిగించే నరాలకు, వీటికి అస్సలు సంబంధం లేదు. నిజానికి అంగస్తంభన కలిగించే నరాలు బయటకు కనిపించవు. మనకు చర్మంపై నరాలు తేలి ఉండటం అన్నది బలహీనత కానట్లే... అంగం మీద నరాలు పెద్దగా కనిపించడం కూడా బలహీనత కాదు. అంగంపై కనిపించే నరాలు కేవలం పురుషాంగంపై ఉండే చర్మానికి రక్తప్రసరణకోసం ఉపయోగపడేవే. చేతులపై కనిపించే నరాలు వృద్ధాప్యాన్ని సూచించనట్లే... ఇలా కనిపించే నరాలు బలహీనతకు చిహ్నం కాదు.

కారణాలు
పుట్టుకతో హార్మోన్ లోపాలు ఉండటం.

పుట్టినప్పుడు రెండు వృషణాలు ఒకటి రెండు ఏళ్ల తర్వాత కూడా సంచిలోకి రాకపోతే అవి వృద్ధి చెందక టెస్టోస్టెరాన్ లోపం కలిగి అంగస్తంభనలోపాలు రావచ్చు.

సాధారణంగా యుక్తవయసులో వచ్చే అంగస్తంభనలోపాలు 99% మానసిక సమస్యలే. సరైన అవగాహన లేక - హస్తప్రయోగం వల్ల వచ్చే బలహీనత అని, భాగస్వామిని సంతృప్తిపరచలేకపోతామనే భయంతో, ఆత్మవిశ్వాసం లేక ఆత్మన్యూనతకు గురికావడం తప్పితే శారీరకంగా అంగంలో లోపం గాని, హార్మోన్లలోపం గాని చాలా చాలా అరుదు.

ఇక మధ్య వయసులో ఉన్నవాళ్లకు సెక్స్ రొటీన్‌గా మారి, వృత్తిపరంగా, ఆర్థికంగా రోజూ ఉండే మానసిక ఒత్తిళ్లు, పార్ట్‌నర్‌తో విభేదాలు... వీటివల్ల అంగస్తంభన తగ్గవచ్చు.

అతిగా సిగరెట్లు తాగడం, ఆల్కహాల్ మితిమీరి తీసుకోవడం, విపరీతంగా బరువు పెరగడంలాంటి కారణాలతోనూ, కొలెస్ట్రాల్ పెరిగి రక్తనాళాల్లో రక్తప్రసరణ సరిగా జరగక అంగస్తంభన లోపాలు రావచ్చు.

చేయాల్సినదేమిటి...
మానసిక కారణాలతో అంగస్తంభన లోపాలు వస్తే సెక్సువల్ కౌన్సెలింగ్ చేయడం ప్రధాన చికిత్స.

మధ్యవయసు వారికి లిపిడ్ ప్రొఫైల్, హార్మోన్ టెస్ట్‌లు, ఈసీజీ, టీఎంటీ వంటి పరీక్షలు ముందుగా చేయాల్సి ఉంటుంది. కౌన్సెలింగ్‌తో పాటు ఈ వయసులో వచ్చే ఆరోగ్య సమస్యలకు చికిత్స చేయాలి.


శారీరక, మానసిక ఒత్తిళ్లను చాలా తేలికగా తీసుకుని యోగా వంటి రిలాక్సేషన్ టెక్నిక్స్ అనుసరించాలి.


పార్ట్‌నర్ పట్ల ప్రేమగా ఉండాలి.


ఒకవేళ ఇవన్నీ పనిచేయకపోతే కొత్తగా పెళ్లయినవాళ్లు, మధ్యవయస్కుల్లో సిల్డినాఫిల్, వర్డినాఫిల్, టెడలాఫిల్ వంటి సెక్స్‌ను ప్రేరేపించే మందులు వాడవచ్చు. ఇవి చాలా సురక్షితం. ఇవి వాడటం వల్ల అడిక్షన్ వస్తుందని, వాడకపోతే మళ్లీ సెక్స్ పూర్తిగా తగ్గుతుందనే భయం అవసరం లేదు. కాకపోతే శారీరక, మానసిక ఆరోగ్యం పెంపొందించుకుని స్వాభావికంగా సెక్స్ చేయడమే చాలా మంచిది.


ఇక వృద్ధాప్యంలో వచ్చే సెక్స్ సమస్యలకు ప్రధానంగా శారీరక సమస్యలే కారణం. అంటే... షుగర్, బీపీ, దమ్ము, ఆయాసం వంటివి ప్రధాన కారణాలు. మన సమాజంలో 60 ఏళ్లు పైబడిన వాళ్లలో మహిళల్లో సెక్స్ కోరికలు సహజంగా తక్కువగా ఉండటం కూడా పురుషులకు ఇబ్బంది కలిగించవచ్చు. బీపీ ఎక్కువగా ఉన్నవాళ్లలో దాన్ని నియంత్రణలో ఉంచేందుకు వాడే చాలా మందులు అంగస్తంభనలోపాన్ని కలిగిస్తాయి. ఉదా: అటెన్‌లాల్ (బీటా బ్లాకర్) వంటి మందులు అంగస్తంభనను దెబ్బతీస్తాయి. అప్పుడు డాక్టర్లను సంప్రదించి బీపీ మందులు మార్చాల్సి వస్తుంది.

స్టెప్ వేయండి ...... స్లిమ్ అవ్వండి ....... * ' బాలీఫిట్ '.

సన్నబడాలంటే ఏం చేయాలని ఎవరినడిగినా బోలెడు సలహాలు ఇస్తారు. జిమ్ కెళ్లమని ఒకరు చెబితే తిండి తగ్గించమని ఒకరు చెబుతారు. అవన్నీ విని విని బోరు కొట్టేసి ఉన్నాయి అందరికీ. అందుకే అనూజ రాజేంద్ర కనిపెట్టిన కొత్త పద్ధతికి చాలా డిమాండ్ ఉంది. ఆ పద్ధతి పేరు 'బాలీఫిట్'. 'ఫిట్‌నెస్ త్రూ డ్యాన్స్'అనే నినాదంతో అనూజ ఈ వినూత్న పద్ధతిని అందరికీ పరిచయం చేశారు. బరువు తగ్గాలనుకునే వారితో ఆమె నాట్యం చేయిస్తుందన్నమాట. అమెరికాలో స్థిరపడ్డ ఈ ఆలోచన అనూజకి మూడేళ్ల కిత్రం వచ్చింది.

భరతనాట్యం, భాంగ్రా నృత్యాలు వచ్చిన అనూజ ఇప్పటికే చాలా దేశాల్లో నృత్య ప్రదర్శనలు ఇచ్చింది. కాని పెళ్లయి పిల్లలు పుట్టాక బాగా ఒళ్లు చేసింది. తను స్లిమ్‌గా అవ్వాలంటే మళ్లీ నాట్యం చేయాల్సిందేననుకుంది. ఒక్క ఏడాదిలోనే ఇరవైకిలోల బరువు తగ్గింది. ఈ విషయాన్ని గమనించిన చుట్టుపక్కలవారు తమకు కూడా నాట్యం నేర్పమని అడిగారు. అంతే 'నాట్యంతో బరువు తగ్గడమెలా' అని కొద్ది రోజులు స్టడీ చేసింది అనూజ. 2007లో అమెరికాలోని మిచిగాన్ పక్కనున్న ఆన్ ఆర్బర్‌లో తొలి శిక్షణా కేంద్రం ప్రారంభించింది. ఇందులో భారతీయుల కంటే ఎక్కువగా అమెరికన్లే చేరారు. మూడేళ్లు తిరిగేసరికి తీరిక లేనంత బిజీ అయిపోయింది అనూజ.

ఎలాంటి నాట్యం చేస్తారు...
భరతనాట్యం, భాంగ్రా, బాలీవుడ్ స్టెప్పులకు ఏరోబిక్స్ టిప్స్ కలిపితే బాలీఫిట్ అవుతుంది. ఒక నిమిషానికి 100 నుంచి 150 బీట్స్ ఉండి హోరెత్తింటే పాటల్ని ఎంపిక చేస్తారు. ఇందులో ఎక్కువగా రీమిక్సే ఉంటాయి. సరదాగా సాగే ఈ నాట్యంలో రకరకాల భంగిమలు ఉంటాయి. మూడు రకాల వ్యాయామాలు ఉండేలా దాన్ని తయారుచేశారు. బాలీఫిట్ కార్డియో, బాలీఫిట్ రిథమ్, బాలీఫిట్ టాట్స్. వీటికి కావాల్సిన స్టెప్పుల్ని ముందుగానే శిక్షకులు నేర్పిస్తారు. మ్యూజిక్‌లో వచ్చే బాణీలకు తగ్గట్టుగా డ్యాన్స్ చేస్తే సరిపోతుంది.

రోజూ ఉదయం పూట ఓ గంటసేపు ఈ బాలీఫిట్ చేస్తే ఒంట్లో కొవ్వుని ఇట్టే కరిగించేయొచ్చంటున్నారు అనూజ. విదేశాల్లో విజయవంతమైన తన ప్రయోగాన్ని ఆమె ఆ తర్వాత స్వదేశంలోనూ ప్రవేశపెట్టింది. ముంబై నగరంలో తను ఏర్పాటు చేసిన బాలీఫిట్ శిక్షణ కేంద్రాలకు కూడా యువత నుంచి మంచి స్పందనే వచ్చింది. బాలీఫిట్‌కి వెళుతున్న పెద్దవయసు వారు ఏమంటారంటే 'బాలీఫిట్ వల్ల ఒళ్లు తగ్గడమే కాదు మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది' అని.

ఎప్పటికైనా గొప్ప నటిని అవ్వాలనుకున్న అనూజ ఇప్పుడు బాలీఫిట్ సెలబ్రెటీగా ఎదిగిపోయింది. అమెరికా, కెనడా, ఇండియాలో బోలెడు బాలీఫిట్ తరగతులు నిర్వహించి అందరి మనసుల్ని గెలిచింది.' స్లిమ్‌గా అవ్వడం ఎలా' అని బెంగపడుతున్నవారి పాలిట దేవతగా మారిపోయింది. మనమందరం అనూజ దగ్గరికి వెళ్లలేం కాబట్టి ఇంట్లోనే ఒక మ్యూజిక్‌ప్లేయర్ ఆన్ చేసి రోజూ ఉదయం ఓ గంట డ్యాన్స్ ప్రాక్టీసు చేసి చూద్దాం.

'జిమ్ జిమ్మం' టోంది యువత


సమయం
ఉదయం ఐదున్నర నుంచి ఎనిమిది గంటల మధ్య
నగరాల్లో ఎక్కడ చూసినా ఎవరో ఒకరు 'వాకింగ్' లేదా 'జాగింగ్' చేస్తూ కనిపిస్తారు. కొందరు 'వ్యాయామాలు', మరికొందరు 'యోగాసనాలు' వేస్తూ కనిపిస్తుంటారు. కొందరు 'జిమ్' నుంచి, మరి కొంతమంది 'ఏరోబిక్స్' సెంటర్ల నుంచి బయటకొస్తూ కనిపిస్తుంటారు. ఇంకా జాగ్రత్తగా చూస్తే బయటకొచ్చే టైమ్ లేక బాల్కనీలోనో వరండాలో ఏదో ఒక వ్యాయామ భంగిమలో కనిపిస్తుంటారు.

సమయం
సాయంత్రం నాలుగున్నర గంటల తరవాత- సేమ్ సీన్ రిపీట్.
ఏదో ఒక నగరంలో కాదు దేశంలోని అన్ని చోట్లా ఇదే పరిస్థితి. ఎవరికీ తప్పని 'ఫిట్‌నెస్ మంత్ర' ఇది. ఆడ, మగ, చిన్నా పెద్దా తేడా లేకుండా ఫిట్‌నెస్ కోసం కొందరు 'పరుగులు' పెడుతుంటే, కొందరు 'బరువులు' మోస్తున్నారు. కొంతమంది 'ఆడు'తుంటే, కొంతమంది 'ధ్యానం'లో మునిగిపోతున్నారు. ఒక దశాబ్దం క్రితం మన ఫిట్‌నెస్ పరిశ్రమ పరిధి చాలా తక్కువ. ఫిట్‌నెస్ పట్ల మన వాళ్ల ఆలోచనా విధానం 'మోజు' నుంచి 'అవగాహన'కు చేరుకోవడమే ఈ రంగంలో సంభవించిన పెద్ద మార్పు అనుకోవచ్చు. ఆ మార్పే భారత ఫిట్‌నెస్ పరిశ్రమను విదేశీ కంపెనీలు సైతం కోట్ల పెట్టుబడులతో పరుగెత్తుకొచ్చే విస్తృత పరిశ్రమగా రూపొందించింది. ఆ 'పరిశ్రమ' గురించే ఈ వారం కవర్‌స్టోరీ.


మన దేశ యువత ఇప్పుడు ఫిట్‌నెస్ బాట పడుతోంది. ఆ బాటే అవకాశంగా విదేశీ ఫిట్‌నెస్ కంపెనీలు మన దేశంలో ప్రవేశిస్తున్నాయి. గత కొద్ది కాలంగా ఇండియాపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి. ఈ రెండేళ్లలో వెయ్యికి పైగా 'వ్యాయామ కేంద్రాలు' ఏర్పాటు చేశాయంటే వాటికి ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. మన దేశంలో ఫిట్‌నెస్ ఇండస్ట్రీ టర్నోవర్ ఏటా 40 శాతం పెరుగుతూ వస్తోంది. ఈ యేడాది అంచనా 2900 కోట్లకు పైమాటే! ఇక్కడ కనిపిస్తున్న ప్రధాన విదేశీ కంపెనీలు 'స్నాప్ ఫిట్‌నెస్ క్లబ్', 'గోల్డ్స్ జిమ్', 'ఫిట్‌నెస్ ఫస్ట్', '24 హవర్స్ ఫిట్‌నెస్', 'ఎనీటైమ్ ఫిట్‌నెస్', 'రీబాక్ ఫిట్‌నెస్ క్లబ్స్'. మొదటి మూడు టాప్‌టెన్ లిస్టులో ఉన్న కంపెనీలు. ఈ కంపెనీలకు 'ఫిట్‌నెస్ మ్యాగజైన్స్' కూడా మంచి రేటింగ్ ఇవ్వడంతో విస్తరణకు మరిన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. జీవనశైలిలో ఫిట్‌నెస్ కూడా ఒక భాగం అనే అవగాహన పెరుగుతుండడంతో జిమ్ సెంటర్‌లు నడుపుతున్న కంపెనీలు 'ఎనీటైమ్ జిమ్'లు, 'ఏసీ జిమ్'లంటూ కొత్త కొత్త పద్ధతులకు శ్రీకారం చుట్టాయి.

దేశవ్యాప్తంగా...

అమెరికాకు చెందిన 'స్నాప్ ఫిట్‌నెస్ క్లబ్' పదకొండు మిలియన్ డాలర్ల పెట్టుబడితో రెండేళ్ల క్రితం మనదేశంలో మొత్తం 250 వ్యాయామకేంద్రాలను ప్రారంభించాలనే ఆలోచనతో వచ్చింది. ఇప్పటికి యాభై ఐదు కేంద్రాలను ఏర్పాటు చేసుకుంది. దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబయి, హైద్రాబాద్, పూణె, నాగపూర్, జలంధర్, చంఢీగఢ్, అమృతసర్, లూధియానాలలో ఈ కంపెనీకి బ్రాంచీలు ఉన్నాయి. ఈ కంపెనీ చెప్పేమాట ఏమిటంటే... 'యూరప్, అమెరికా దేశాల కంటే ఇక్కడే వ్యాయామం పట్ల ఎక్కువ ఆసక్తి ప్రదర్శిస్తున్నారని, కనుక తాము తప్పకుండా వ్యాపారంలో విజయవంతం అవుతామని.'
అంతేకాదు వీళ్లు ప్రారంభించిన 'ఎనీటైమ్ ఫిట్‌నెస్ క్లబ్'లకు కూడా బాగానే ఆదరణ ఉంది. వివిధ షిఫ్టుల్లో పనిచేసే కార్పొరేట్ ఉద్యోగుల సౌకర్యార్థమే ఈ ఎనీ టైమ్ జిమ్‌లు. యు.ఎస్.కే చెందిన మరో ఫిట్‌నెస్ కంపెనీ 'గోల్డ్స్ జిమ్'. ఒక్క ముంబయిలోనే ఆ కంపెనీకి నలభై ఐదు వ్యాయామకేంద్రాలున్నాయి. 2002లో భారతదేశంలో ప్రవేశించి ప్రధాన నగరాలన్నింటిలోకి విస్తరించిన ఈ కంపెనీ రెండు నెలలకు ఒక జిమ్ చొప్పున బ్రాంచీలను పెంచుకుంటూ పోతోంది. వీటి తర్వాత స్నాప్ ఫిట్‌నెస్ కంపెనీ, 24 అవర్స్ ఫిట్‌నెస్ కంపెనీ ఇలా ఒక్కొక్కటీ మన దేశానికి వచ్చి నిలదొక్కుకున్నాయి.

ముంబయి, బెంగళూరులలో బ్రాంచీలను తెరిచిన మరో విదేశీ కంపెనీ 'ఫిట్‌నెస్ ఫస్ట్'. ఇది బ్రిటిష్ కంపెనీ. 'భారతదేశంలో అర్బన్ ప్రజల జీవన ప్రమాణస్థాయి పెరిగిందని, ఫిట్‌నెస్ కోసం కొంత మొత్తం వెచ్చించేందుకు వారు ముందుకొస్తున్నారని' అభిప్రాయ పడుతున్న ఈ కంపెనీ 2012 నాటికి దేశంలో 125 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు సమాయత్తం అవుతోంది. అప్పటి వరకు మరో 15 కేంద్రాలను తెరిచి మెంబర్‌షిప్‌ను ఇంకా పెంచుకునే యోచనలో ఉంది.

అత్యాధునిక సదుపాయాలు, అంతర్జాతీయ స్థాయి నిర్వహణతో ఇప్పటికే బాగా పాతుకుపోయిన ఈ జిమ్‌లలో నెలకు సగటున ఆరు వందల చొప్పున మెంబర్‌షిప్ పెరుగుతోంది. సంవత్సర సభ్యత్వం కోసం సగటున రూ. 14,000 వరకు చార్జ్ చేస్తున్నారు. నెలకయితే 1500 రూపాయల చొప్పున తీసుకుంటున్నారు. ఈ ఫిట్‌నెస్ సెంటర్లలో యోగా,ఏరోబిక్స్, ఇండోర్ సైక్లింగ్, పర్సనల్ ట్రెయినింగ్ (విదేశీ వ్యక్తిగత శిక్షకులతో), స్విమ్మింగ్‌పూల్స్, షవరింగ్ ఏరియాస్, డీవీడి లైబ్రరీ తదితర సదుపాయాలు ఉంటాయి.

దేశీయ కంపెనీ టాల్‌వాకర్


మన దేశం విషయానికొస్తే అతిపెద్ద జిమ్ నెట్‌వర్క్ ఉన్న సంస్థ 'టాల్‌వాకర్'. ఉదయపూర్, లూధియానా, నెరుల్(నవీ ముంబయి), హిమాయత్‌నగర్(హైద్రాబాద్), బెంగళూరు, హుబ్లీ, బెల్గాం, ఔరంగాబాద్ మొదలైన చోట్ల దీనికి వ్యాయామ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో వ్యక్తిగత శిక్షకుడు, డైటీషియన్, ఫిజియోథెరపిస్టు తప్పకుండా ఉంటారు. వారికి జీతాలు మొదలు మిషనరీ కొనుగోలు వరకు అన్నీ కలుపుకుని ఏడాదికి అన్ని సెంటర్ల నిర్వహణ వ్యయం సుమారు పదహారు కోట్ల రూపాయలు. అయినా 76 కేంద్రాల్లో సుమారు లక్ష మంది మెంబర్‌షిప్‌తో నడుస్తున్న ఈ కంపెనీకి వచ్చే లాభాలతో పోల్చితే ఆ 'ఖర్చు' చాలా తక్కువే.

ప్యాకేజీ ఆఫర్లు

విదేశీ ఫిట్‌నెస్ క్లబ్‌లు మన దేశంలో ప్రవేశించాక ఫిట్‌నెస్ రంగం స్థాయిలో చాలా మార్పులే వచ్చాయి. ఆకర్షణీయమైన ప్రకటనలు, అంతర్జాతీయ స్థాయి నిర్వహణను అన్ని కంపెనీలు అనుసరిస్తున్నాయి. ప్రత్యేక 'ప్యాకేజీలు', పండగలకు 'ఆఫర్లు' ఎక్కువయ్యాయి. దాంతో పాటు మెరుగైన మెషినరీ కోసం ఎంత సొమ్మయినా ఖర్చు చేసేలా స్థానిక కంపెనీలు తమ పద్ధతులను మార్చుకున్నాయి.
ఫిట్‌నెస్ ఇండస్ట్రీలో వచ్చిన మార్పుల్లో ప్రధానంగా చెప్పుకోవలసింది మెషినరీ మార్కెట్ గురించి. భారత్‌లో ఉన్న విదేశీ కంపెనీల ఎక్విప్‌మెంట్ అంతా దిగుమతి చేసుకున్నది కావడం వల్ల మన వాళ్లు కూడా అటుగా దృష్టి సారించారు. పేరున్న ఏ జిమ్‌ను చూసినా అంతా విదేశీ టెక్నాలజీయే. ఇండియా వస్తువుల మీద నమ్మకం లేక కాదుగాని విదేశీ మెషినరీ మీద మోజు పెరుగుతుండడం వల్లే అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా దేశాల నుంచి మెషనరీ దిగుమతి పెరిగిపోతోంది. సెలబ్రిటీ జిమ్‌లు, హోమ్ జిమ్‌లు కూడా ఈ మధ్య కాలంలో బాగా పెరిగిపోతున్నాయి. దాంతో మెషినరీ కొనుగోలు విశేష స్థాయిలో ఉంది. మన దేశంలో ఫిట్‌నెస్ మెషినరీ మార్కెట్ విలువ ఎంతో తెలుసా? 12.5 బిలియన్ రూపాయలు. అది రెండేళ్ల కిందటి మాట. మార్కెట్ విశ్లేషకుల ప్రకారం మరో రెండేళ్లలో అది ఐదింతలు పెరగనుంది.

పర్సనల్ ట్రెయినర్ ఉంటే బెటర్

అదే క్రమంలో వ్యక్తిగత శిక్షకులను నియమించుకునే పద్ధతి కూడా పెరిగింది. మూడునాలుగేళ్ల క్రితం కంటే ఇప్పుడు టీనేజ్ మొదలు యువత, సీనియర్ సిటిజన్స్ వరకు అందరూ వ్యక్తిగత శిక్షకులను ఆశ్రయించడం పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. ఢిల్లీ, ముంబయి, కలకత్తా, బెంగళూరులలో జిమ్‌కు వెళ్లేవారిలో దాదాపు సగం మంది వ్యక్తిగత శిక్షకులను నియమించుకుంటున్నారు. వారికి ఒక్కో సెషన్‌కు 250-500 వరకు ఫీజు చెల్లించాల్సి ఉన్నా వెనకాడడం లేదు. అంటే నెలకు ఐదు నుంచి ఇరవై వేల రూపాయలు. మంచి శరీరాకృతి కోసం యువత, అధిక బరువు వంటి సమస్యలతో మధ్యవయస్కులు, అనారోగ్య నివారణ కోసం రిటైరయిన ఉద్యోగులు... ఇలా ఎవరి కోణం వారిదే అయినా అందరి కామన్ ఎజెండా మాత్రం ఫిట్‌నెస్సే. షారూక్‌ఖాన్, అమీర్‌ఖాన్, ఐశ్వర్యారాయ్, కరీనాకపూర్ వంటి సెలిబ్రిటీలకు వ్యక్తిగత శిక్షకులుగా పనిచేసే వారికి ఒక్కో సెషనుకు పది వేల రూపాయలు చెల్లిస్తారని చెప్పుకుంటారు.

సర్టిఫికేట్ కోర్సులు

విదేశీ కంపెనీల రాక తర్వాత ఈ కేంద్రాల నిర్వహణ, ఫీజులు ఓ రేంజ్‌కు వెళ్లిపోయాయి. అయితే ఫిట్‌నెస్ ఇండస్ట్రీలో ఉపాధిని పెంచేందుకు ఇవి దోహదపడుతున్నాయి. ఇప్పుడు పెద్ద పెద్ద వ్యాయామ కేంద్రాలు వ్యక్తిగత శిక్షకులతో పాటు థెరపిస్టులు, డైటీషియన్‌లు ఇలా అనేకమందిని నియమించుకుంటున్నాయి. గోల్డ్స్ జిమ్ ఏకంగా 'జి.జి.యు.' (గోల్డ్స్ జిమ్ యూనివర్శిటీ) అని ఒక విశ్యవిద్యాలయాన్నే నడుపుతోంది. అందులో ఫిట్‌నెస్ రంగానికి సంబంధించిన ఏ సర్టిఫికెట్ కోర్సు చేసినా వారికి ఉపాధి ఖాయం. అది ఎంతోమందికి ఉద్యోగావకాశంగా కనిపిస్తోంది. గోల్డ్స్ జిమ్మే కాదు ఇప్పుడు దేశంలో పేరు పొందిన ఫిట్‌నెస్ కంపెనీలన్నీ 'ఫిట్‌నెస్ ఎడ్యుకేషన్ ఇన్సిట్యూట్'లుగా కూడా వ్యవహరిస్తున్నాయి.

మహిళలను లక్ష్యంగా చేసుకుని రీబాక్ కంపెనీ కూడా ఒక సర్టిఫికేట్ కోర్సును నేర్పిస్తోంది. 'నైక్ ఏరోబిక్స్' పేరుతో నడిచే ఆ కోర్సులో ఈ మధ్యే విద్యార్థుల సంఖ్య పెరగుతోందట. ఈ ఎడ్యుకేషన్ బ్రాంచ్‌లను కూడా మరిన్ని కేంద్రాలకు విస్తరించే యోచనలో ఉంది రీబాక్. చాలా నగరాల్లో ఇప్పటికీ (ఏరోబిక్స్ మినహా) మహిళా శిక్షకులు కొన్ని జిమ్ సెంటర్లలో మాత్రమే ఉన్నారు. గోల్డ్స్ జిమ్ కంపెనీకి కూడా ఇండియాలో ఇరవై మంది మాత్రమే మహిళా శిక్షకులు ఉన్నారట.

అన్ని కంపెనీల చూపూ ఈ రంగం మీదే

ఫిట్‌నెస్ ఇండస్ట్రీలో వ్యాపారావకాశాలు పెరుగుతుండడం గమనించి ఇతర రంగాలకు చెందిన కంపెనీలు కూడా ఈ రంగంలోకి ప్రవేశిస్తున్నాయి. అందుకు ఉదాహరణ ఈ మధ్యే ఎంట్రీ ఇచ్చిన 'ఎనీటైమ్ ఫిట్‌నెస్ క్లబ్'. సుమారు పదిహేను మిలియన్ డాలర్ల పెట్టుబడితో మన దేశంలో అడుగు పెట్టిందీ కంపెనీ. కంప్యూటర్లు తయారు చేసే టీజీఎస్ కంపెనీయే ఈ పేరుతో ఫిట్‌నెస్ రంగంలోకి ప్రవేశించింది. రీబాక్ కూడా అంతే! ప్రధానంగా క్రీడావస్తువులను తయారు చేసే కంపెనీ అది. ఏరోబిక్, జిమ్ సెంటర్లను నిర్వహిస్తుండమే కాకుండా ఇటీవల మెషినరీ తయారీని కూడా మొదలు పెట్టింది అది. రీబాక్ కంపెనీ చెప్తున్న లెక్కల ప్రకారం వాళ్లకు డెబ్బయి శాతం ఆదాయం ఫిట్‌నెస్ సెంటర్ల వల్లే వస్తోందట మిషనరీ అమ్మకాలు కలుపుకుని.

వీడియో ఫిట్‌నెస్

ఈ రంగంలో మరో కొత్త ట్రెండ్ డీవీడీ వర్క్ అవుట్స్. బిజీగా ఉండేవాళ్లకి, లేజీగా ఉండేవాళ్లకి ఫిట్‌నెస్ డీవీడీలు ఎంతగానో ఉపకరిస్తాయని ప్రకటనులు వెల్లువెత్తుతున్నాయి. రెండేళ్ల క్రితమే శిల్పాశెట్టి విడుదల చేసిన యోగా వీడియోలు సంచలనం సృష్టించాయి. ఆ తరవాత బిపాషా బసు, కరీనాకపూర్, షెర్లిన్‌చోప్రా, లారాదత్తాలు ఆ జాబితాలో చేరారు. వీళ్లందరి వర్క్ అవుట్ డీవీడీలు హాట్‌కేకుల్లా అమ్ముడయ్యాయి. కథానాయికలే కాదు హీరోలూ ఇదే దారిలో ఉన్నారు. జాన్ అబ్రహాం ఇప్పటికే ఒక 'వర్క్ అవుట్' చేయగా, హృతిక్‌రోషన్, సల్మాన్‌ఖాన్‌ల డీవీడీలు త్వరలోనే విడుదల కానున్నాయి. కత్రినా, ప్రియాంక చోప్రాలు కూడా అదే పనిలో ఉన్నారు. అందుకోసం ఈ స్టార్లంతా కోట్లలో పారితోషికం పుచ్చుకున్నట్టు బాలీవుడ్‌లో ప్రచారం జరగుతోంది. బాలీవుడ్ వర్క్ అవుట్స్‌కు ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతో క్రేజ్ ఉంది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న 'బాలీవుడ్', 'బాంబే డ్రీమ్స్', 'మసాలా బాంగ్రా', 'బాలీవుడ్ గ్రూవ్స్', 'ఇండియన్ డాన్స్ ఏరోబిక్స్', 'ఇండియన్ ఫోక్ డాన్స్' డీవీడీలు అమెరికా, యూరోప్ దేశాలలో నీరాజనాలు అందుకుంటున్నాయి.

యోగా...కాస్త వెరైటీగా

కొంచెం వెరైటీ కోరుకునే వారు మనసును, మెదడును అదుపులో ఉంచే యోగా, ధ్యానం వంటి ఆధ్యాత్మిక వ్యాయామానికి కూడా ఆకర్షితులవుతున్నారు. ఇప్పటికే సైఫ్ అలీఖాన్, అక్షయ్‌కుమార్, శిల్పాశెట్టి, దీపికా పదుకొనె, నేహా ధూపియా వంటి చాలామంది సెలబ్రిటీలు జిమ్ మానేసి యోగాసనాల వెంటపడ్డారు. ఆధునిక మానవుడు గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ మానసిక ఒత్తిడితో ఉంటున్నాడు కాబట్టి 'హౌ వుయ్ ఫీల్, నాట్ హౌ వుయ్ లుక్' అనేది కొత్త నినాదంగా మారుతోంది. ఆఫీసుల్లో, ఇళ్లల్లో పనులు చేసి శారీరకంగా అలిసిపోతున్న వాళ్లకి మళ్లీ జిమ్‌లో మిషనరీ వ్యాయామం చేస్తే అలసటే తప్ప శరీరానికి విశ్రాంతి ఎక్కడ దొరుకుతుందనేది కొంతమంది యోగా గురువుల ప్రశ్న. యోగా, ధ్యానం వంటి ఆధ్యాత్మిక వ్యాయామాల ద్వారా శరీరానికి కావల్సిన ఫిట్‌నెస్‌తో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుందని చెప్తున్నారు వాళ్లు. అయితే ఏ పరికరాలు అవసరం లేని యోగాను కూడా ఎవరూ చవకగా నేర్పించడానికి సిద్ధంగా లేరు. యోగా ఇష్టపడే వాళ్ల కోసం చాలా కంపెనీలు యోగా గురువులను అధిక మొత్తం చెల్లించి తమ ఫిట్‌నెస్ క్లబ్బులలో నియమించుకుంటున్నాయి. ఆకర్షణీయమైన జీతాలు ఊరిస్తుండడంతో ఎంతోమంది యోగా గురువులు కమర్షియల్ కెరీర్‌కు పునాదులు వేసుకుంటున్నారు.

అన్నీ ఫిట్‌నెస్ లోకే!

సగటు మనిషి 'బాడీ బిల్డర్'గా కండలు చూసుకుని మురిసిపోయే స్థాయి ఎప్పుడో దాటిపోయింది. సినిమాల ప్రభావంతోనే జిమ్ యావ మొదలైనప్పటికీ అది ఆరోగ్యానికి ఎంత అవసరమో అందరూ గుర్తించారు. ఈ యేడాది వ్యాయామ కేంద్రాలను ఆశ్రయిస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగిందని ఫిట్‌నెస్ సెంటర్లు నిర్వహిస్తున్న వివిధ కంపెనీలు ప్రకటించాయి. ప్రజల్లో వస్తున్న అవగాహనకు అనుగుణంగా వారిలో ఇంకా ఆసక్తిని పెంచి లాభాలు గడించేందుకు వ్యాయామాల్లో కూడా కొత్త కొత్త పద్ధతులు సృష్టిస్తున్నాయి పలు కంపెనీలు. అందుకోసం డాన్సులు, ఏరోబిక్స్‌లే కాకుండా 'స్పా' యోగాలను కూడా హెల్త్ అండ్ ఫిట్‌నెస్‌లో కలిపేశారు. అందుకే యోగా గురువులకు, కొరియోగ్రాఫర్లకు ఫిట్‌నెస్ సెంటర్లు నడిపే కంపెనీల నుంచి మంచి ఆఫర్లు వస్తున్నాయి.
ఫిట్‌నెస్ కోసం చేసే వ్యాయామం అయినా సరదాగా, ఆడుతూ పాడుతూ చేసేలా ఉండాలనేదే ఇప్పుడున్న కొత్త నియమం. అందులో భాగంగానే జాజ్, సల్సా, రుంబా...ఇలా కొన్ని ప్రత్యేక డాన్సులు కూడా ఫిట్‌నెస్‌లో కలిసిపోయాయి. అందుకే వయసుతో నిమిత్తం లేకుండా డాన్సు నేర్చుకుంటున్న వారితో శిక్షణా సంస్థలు నిండిపోతున్నాయి.

ఒళ్లు జిమ్మనాల్సిందే

భారతీయులు ఇప్పుడు 'సిక్స్‌ప్యాక్', 'ఎయిట్ ప్యాక్'లకు షేకవడం లేదు కాని 'ఫ్యామిలీ ప్యాక్' నుంచి దూరంగా ఉంటూ ఫిట్‌గా ఉండేందుకు మాత్రం ఆరాటపడుతున్నారు. ఒబేసిటీ, డయాబెటిస్ వంటి ఆరోగ్య సమస్యలు ఎక్కువైపోతుండడమే అందుకు ప్రధాన కారణం. గతంలో 'ఫిట్‌నెస్' అంటే మరోమాట లేదు జిమ్‌కు పరుగెత్తడం తప్ప. కాని ఇప్పుడు అలా కాదు ఆటలు, డాన్సులు, ఏరోబిక్స్, యోగా కూడా ఫిట్‌నెస్‌ను అందించే ప్రత్యామ్నాయాలుగా మారిపోయాయి. అందుకే నగరాల్లో ఎన్ని జిమ్ సెంటర్లు ఉన్నాయో, అన్ని డాన్సు సెంటర్లు, ఎన్ని ఏరోబిక్స్ సెంటర్లు ఉన్నాయో అన్ని యోగా కేంద్రాలూ దర్శనమిస్తాయి. నగర జీవితంలో ఐదు నిమిషాలు కూడా గట్టిగా నడవలేని పరిస్థితే ఉంది. ఆఫీసుల్లో కూర్చున్నచోటు నుంచి కదలకుండానే పనులు చేయాల్సి రావడం... రాకపోకలకు వాహనాలు ఉపయోగించక తప్పని స్థితి ఉండడంతో ఇంక శరీరాన్ని అన్ని రకాలుగా 'అదుపు'లో ఉంచుకోవాలంటే ఫిట్‌నెస్ కేంద్రాల్ని ఆశ్రయించక తప్పడం లేదు. సహజంగా ఒళ్లొంచే పరిస్థితులు వచ్చేదాకా ఈ ట్రెండ్ కొనసాగక తప్పదు.

హైద్రాబాద్ సంగతేంటి?

హైద్రాబాద్‌లో ఫిట్‌నెస్‌పై అవగాహన పెరుగుతున్నకొద్దీ వ్యాయామకేంద్రాల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతోంది. అందరికీ తెలిసిన గోల్డ్స్ జిమ్, లాటిట్యూడ్స్ ప్రో, ఫిట్‌బజ్, టాల్‌వాకర్, బాడీ అండ్ సోల్, స్నాప్ ఫిట్, దినాజ్ ఫిట్‌నెస్ స్టూడియో వంటివే కాకుండా కొత్తగా పాపులర్ అవుతున్న ఫిట్‌నెస్ వన్, బండాస్ బాడీఫ్లెక్స్ జిమ్, స్లిమ్‌జోన్, ఫిట్‌నెస్ వరల్డ్ జిమ్, పవర్‌పాయింట్ జిమ్... ఇలా లెక్కలేనన్ని వ్యాయామ కేంద్రాలు పట్టుకొస్తున్నాయి. చిన్నా చితకా జిమ్‌లు కలిపి వెయ్యికి పైగా ఉన్నాయి. కొందరిది బిజినెస్ అయితే కొందరికి అది ఉపాధి.
* కార్పొరేట్ జిమ్‌లలో నెల రోజుల మెంబర్‌షిప్ రూ. 5000, ఆరు నెలలకు 12000, సంవత్సరానికి 18000 వరకు ఉంది. అదే స్థానికంగా కొంచెం పేరున్న వాటిలో అయితే నెలకు 1200 రూపాయలు ఉండగా, చిన్న వాటిలో 125-400 మధ్య ఉంది.
* అయితే ఎనభై శాతం మంది రెండు నెలలకు మించి మెంబర్‌షిప్ కొనసాగించడం లేదు. అంటే మధ్యలో మానేసే వాళ్లే ఎక్కువ.
* కార్పొరేట్ ఉద్యోగుల సంఖ్య బాగానే ఉన్నా డ్రాపవుట్స్‌లో కూడా వాళ్లే ఎక్కువ.
* పెద్దవాళ్లు యోగా, జాగింగ్, వాకింగ్‌లతోనే సరిపెట్టుకుంటున్నారు.
* పూర్తిస్థాయి బాడీబిల్డర్‌గా పోటీల్లో పాల్గొనాలంటే కనీసం లక్ష రూపాయలు ఖర్చు పెట్టాల్సిందే. ఆసక్తి కలవారు అందుకూ వెనకాడడం లేదు.
* 'మిస్టర్ వరల్డ్' పోటీల్లో పాల్గొనాలనే ఆశతో, అది సాధ్యం కాకపోతే వ్యక్తిగత శిక్షకులుగానైనా ఉపాధి పొందవచ్చనే నమ్మకంతో నగర యువత ఫిట్‌నెస్ కెరీర్‌పై ఇప్పుడిప్పుడే దృష్టి పెడుతున్నారు.
ఇది నాణేనికి ఒకవైపు, మరోవైపు ఫిట్‌నెస్‌పై అత్యాశతో అనర్థాలు కొనితెచ్చుకుంటున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. సినిమా హీరోలనో, మరొకరినో చూసి త్వరగా కండలు పెంచాలనే అత్యాశతో 'డ్రగ్స్' తీసుకుని అనారోగ్యం పాలవుతున్నారు కొందరు. 'నిజం చెప్పాలంటే హైద్రాబాద్‌లో ఆరోగ్యం కోసమే జిమ్‌కు వచ్చే యువకుల సంఖ్య చాలా తక్కువ. ఐదారు నెలల్లోనే బాడీ బిల్డర్‌గా కనిపించాలని, సిక్స్ ప్యాక్ తెచ్చుకోవాలనే కోరికతో ఎక్కువ మంది వస్తుంటారు. విచ్చలవిడిగా ప్రచారంలో ఉన్న ఫిట్‌నెస్ డ్రగ్స్‌కు అలవాటు పడుతున్నారు. దానివల్ల భవిష్యత్‌లో కలిగే అనర్థాలేమిటో జిమ్ నిర్వాహకులు చెప్పడం లేదు. ఇక్కడ సగానికి పైగా జిమ్‌లు డ్రగ్స్‌ను ప్రోత్సహిస్తున్నాయి. ఎందుకంటే వాటికి వచ్చే ఆదాయంలో డెబ్బయి శాతం డ్రగ్స్ ద్వారానే' అని ఎనిమిది సంవత్సరాల నుంచి 'పవర్‌పాయింట్ జిమ్' నడుపుతున్న అచ్చగొని సతీష్ గౌడ్ అన్నారు.

* బి. మహేందర్

Tuesday, December 7, 2010

కండర పుష్టికి కావాలా తైలాలు?

సౌష్టవమైన ఆకృతిని, దృఢత్వాన్నీ కలిగించేవి కండరాలే. చర్మం లోపల సన్నని దారాల్లా ఉండడంతో మొదలు, శరీరంలోని అన్ని అవయవాల నిర్మాణం దాకా కండరాలే కీలక పాత్ర వహిస్తాయి. సిక్స్ ప్యాక్, ఎయిట్‌ప్యాక్ బాడీ బిల్డింగ్‌లోనూ ముఖ్య భూమిక కండరాలదే.కండరాలు బలహీనపడిన వ్యక్తి బక్కచిక్కిపోతాడు. చర్మం సైతం తన ప్రభను కోల్పోయి ముడుతలు పడుతుంది. పైగా ఏపనీ చేయలేని అశక్తత, నిరుత్సాహం వెంటాడతాయి. ఇదంతా సరైన పోషకాహారం తీసుకోకపోవడం వల్ల కావచ్చు.

లేదా రక్తహీనత, క్షయ, గ్రహణి (ఐబిఎస్), తరుచూ వచ్చే జ్వరాలు, దీర్ఘకాలిక వ్యాధుల వల్లనూ కావచ్చు. గర్భిణిగా ఉన్నప్పుడు ఏర్పడిన పోషకలోపాల కారణంగా పుట్టిన బలహీన శిశువు మొదలు, «వృద్ధుల దాకా అందరూ కండరాల సమస్యను ఎదుర్కొనే వారే. ఇలాంటి వారికి కొన్ని ప్రత్యేక తైలాలతో మర్ధన చికిత్స చేస్తే ఆరోగ్యంతో పాటు కండర పుష్టీ పెరుగుతుంది. రక్తప్రసరణా వ్యవస్థ బలపడి చర్మంతోపాటు శరీర అవయవాలన్నీ తమతమ కార్యకలాపాలను సవ్యంగా జరుపుకోగల్గుతాయి. ఫలితంగా ఆరోగ్యమూ కుదుటపడుతుంది.

చందన బలా లాక్షాది తైలం :
చందనం, బలామూలం, లాక్ష్యానిర్యాసం, ఉశీర అనే నాలుగు వనౌషదుల కషాయం కాచిపెట్టుకుని దీనికి తగినన్ని పాలు కూడా కలుపుతారు. ఈ మొత్తానికి నాలుగో వంతు నువ్వుల నూనె చేరుస్తారు. నూనెలో నాలుగోవంతు చందన చెక్క, వట్టివేర్లు, సోంపు, దేవదారు చెక్క, పసుపు, కోష్టు, మంజిష్టా, అగరు, సుగంధిపాల, అశ్వగంధ, బలామూలాలు, కస్తూరి పసుపు, మూర్వా, తుంగ ముస్తలు, ముల్లంగి, ఏలకులు, దాల్చిన, నాగకేసరాలు, రాస్నా, లాక్షా, అజమోద, చంపక, చోరపుష్టి మొదలగు వాటి చూర్ణాలను ముద్దగా చేసి పైన తెలిపిన కషాయం, పాలు, నూనెలు ఉన్న పాత్రలోకి చే ర్చి 'తైలపాక విధి' లో ఆయుర్వేద ఫార్మసిస్టులు తయారు చేస్తారు.

ఉపయోగాలు
|* స్త్రీలలో రక్తస్రావ లక్షణాలు ఉండే గర్భకోశ వ్యాధులు (మెనొరేజియా, మెట్రోరేజియా), రక్తస్కందన లోపాలు ఉండే హీమోఫిలియా, మెటికియల్ హెమరేజ్ వంటి సమస్యలకు ఈ తైలంతో మర్ధన చికిత్స చేయడం వల్ల ఉపశమనం లభిస్తుంది.

* దగ్గు, దమ్ము, క్షయ వంటి ఊపిరితిత్తుల వ్యాధులు ఉన్నవారికి ఛాతిపనైన, ముందూ వెనుక మర్ధన చేస్తే ఛాతీలో కండరరపట్లు పోయి కసమస్యలు తేలిగ్గా ఉపశ మిస్తూ ఔషధ చికిత్సలో సహకరిస్తాయి.

* ఒంటిపైన పొడిదురదలు లేదా మంటలు ఉన్నప్పుడు ఈ తైలంతో మర్ధన చేస్తే తక్షణమే ఉపవమనం లభిస్తుంది. * రక్తంలో హీమోగ్లోబిన్ తక్కువగా ఉన్నప్పుడు వచ్చే వాపులు గానీ, రక్తకణాల క్షీణతతో వచ్చే కామెర్ల జబ్బు ( హీమోలైటిక్ జాండిస్)లో గానీ, ఈ తైౖలాన్ని వాడుకోవచ్చు.

* తలపోటు, కళ్ల మంటలు ఉన్నప్పుడు తలకు మర్ధించుకోవచ్చు. * కాళ్లు, చేతులు పట్టేస్తున్నప్పుడు ( క్రాంప్స్) ఈ తైలంతో మర్ధనచేస్తే ఉపశమనమే కాకుండా సమస్యలు శాశ్వతంగా తగ్గిపోతాయి.
* తరుచూ వచ్చే కొన్ని దీర్ఘకాలిక జ్వరాలకు ఈ తైలంతో అభ్యంగనం చేస్తే శరీరం శక్తిని పుంజుకోవడంతో పాటు జ్వర సమస్యలు కూడా పూర్తిగా పోతాయి.
ఈ ప్రొటీన్, క్యాల్షియం లోపాలతో చిన్న పిల్లల్లో వచ్చే ' ఫక్కా'( రికెట్స్, మరాస్మస్, క్యాషియోర్కర్) వంటి వ్యాధులు, పుట్టుకతోనే వచ్చే మెదడు ఎదగకకుండా పోయే సెరిబ్రల్ పాల్సీ, మెంటల్ రిటార్డేషన్, మజిల్ డిస్ట్రోఫీ వ్యాధకులకు కూడా ఈ ఈ తైలంతో అభ్యంగనం చేస్తే ప్రయోజనం ఉంటుంది.
మహా మాష తైలం
అశ్వగంధ, శ ఠీ, దేవదారు, బలా, రాస్నా, ప్రసారణీ, కుష్ఠం, భారంగీ, విదారీకంద, పునర్నవా, శతావరీ, జీరక, హింగు, శతపుష్పీ, గోక్షురా, పిప్పలీ మూల, చిత్రక, సైందవ లవణం, జీవనీయ గణం వంటి వనౌషధుల చూర్ణకల్కం ఒక భాగం తీసుకుని దానికి నాలుగు రె ట్లు నూనె, నూనెకు నాలుగు రెట్లు మినుముల ( మాష) కషాయం, పాలు కలుపుతారు. ఆ తరువాత అన్నిటినీ ఒక పాత్రలో చేర్చి 'తైలపాక విధి' లో నువ్వుల నూనె మిగిలేట్లు కాచి తయారు చేస్తారు. ఆయుర్వేద ఫార్మసిస్టులు కొందరు కల్క భాగంలో కొంత మేక మాంసాన్ని కూడా కలుపుతారు.

ఉపయోగాలు
ఈ దీర్ఘకాలిక పక్షవాతాలు లేదా నరాల సంబంధ వ్యాదుల్లో కండరాలు, స్నాయువులు (లిగమెంట్లు ) బలహీనపడుతూ ఉంటాయి. వీరికి మహా మాష తైలంతో మర్ధన చేస్తే కండరాలు, స్నాయువులు తిరిగి పుష్టిగా తయారవుతాయి.
* మాటిమాటికీ మూర్ఛలు వచ్చే వారికి, దవడలు పట్టేసే వారికి ఈ తైల మర్ధన ఎంతో మేలు చేస్తుంది.
* అపబాహుక, విశ్వాచీ, ఖంజ, పంగుతా, అర్థితం వంటి నరాల జబ్బుల్లో కండరాలు ఎండిపోతుంటాయి. ఆ స్థితి రాకముందే ఈ తైలంతో మర్ధన చే స్తూ ఉంటే కుంటి, గూని, మూతివంకర, చేతివాతం వంటి సమస్యలు తొలగిపోతాయి.
* పురుషుల్లో ధాతుక్షయం, ప్రత్యేకించి శుక్రక్షయం కారణంగా సంతానం కలగనప్పుడు మహా మాష తైలంతో మర్ధన చేసుకోవడతో పాటు కడుపులోకి కూడా తీసుకుంటే ఫలితం ఉంటుంది.
సూచనలు:
పైన పేర్కొన్న వ్యాధులకు తైల మర్ధన ంతో మంచి ఫలితాలే ఉంటాయి. అయితే ఆయుర్వేద వైద్యుల పర్యవేక్షణ లో కడుపులోకి కొన్ని మందులు కూడా తీసుకున్నప్పుడు ఆ ఫలితాలు రెట్టింపుగా ఉంటాయి. ఇక ఈ వ్యాధులకు అల్లోపతి వైద్య చికి త్సలు తీసుకునే వారు కూడా మర్ధన కోసం మహామాష తైలాన్ని నిస్సంకోంచంగా వాడుకోవచ్చు.

డాక్టర్ చిలువేరు రవీందర్
అసిస్టెంట్ ప్రొఫెసర్,
డాక్టర్ బిఆర్‌కెఆర్ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల, హైదరాబాద్,
ఫోన్: 9848750720.